hijacking
-
Pak: సైన్యం విజయం ఉత్తదే
ఇస్లామాబాద్: జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేసిన మిలిటెంట్లందరినీ మట్టుబెట్టామంటూ పాకిస్తాన్ సైన్యం చేసిన ప్రకటనను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) గురువారం ఖండించింది. ఆపరేషన్ ఇంకా ముగియలేదని, సైన్యంపై కాల్పులు కొనసాగుతున్నాయని వెల్లడించింది. యుద్ధక్షేత్రంలో విజయం సాధించినట్లు సైన్యం చెప్పుకుంటోందని, అందులో ఎంతమాత్రం నిజంలేదని వివరించింది. తమ దాడిలో పాక్ భద్రతా బలగాలకు భారీగా నష్టం వాటిల్లినట్లు స్పష్టంచేసింది. ఇప్పటికే పాక్ సైనికులు చాలామంది మరణించారని పేర్కొంది. శత్రువుపై యుద్ధం ఆపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు బీఎల్ఏ ఒక ప్రకటన జారీ చేసింది. చాలామంది ప్రయాణికులు తమ అధీనంలోనే ఉన్నారని ప్రకటించింది. మంగళవారం 440 మంది ప్రయాణిలకులతో క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను బలూచిస్తాన్ మిలిటెంట్లు హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. 33 మంది మిలిటెంట్లను అంతం చేశామని, 21 మంది ప్రయాణికులు, నలుగురు భద్రతా సిబ్బంది మరణించారని, మిగిలిన ప్రయాణికులను క్షేమంగా విడిపించామని పాక్ సైన్యం బుధవారం వెల్లడించింది. అయితే, పాక్ సైన్యం తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని బీఎల్ఏ ఆరోపించింది. యుద్ధ నియమాలు, అంతర్జాతీయ నిబంధనలు దృష్టిలో పెట్టుకొని.. రైలులో ఉన్న కొందరు సైనికులను తామే వదిలేశామని వెల్లడించింది. సైన్యం తమపై పోరాటం చేయలేక సామాన్య బలూచ్ పౌరులను వేధిస్తోందని విమర్శించింది. జైళ్లలో ఉన్న తమ మిలిటెంట్లను వదిలిపెడితే రైలులో మిగిలి∙ఉన్న సైనికులు, ప్రయాణికుల విడుదల చేస్తామని బీఎల్ఏ ప్రతిపాదించింది. తమ మాట వినకపోతే జరగబోయే పరిణామాలకు పాక్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని తేల్చిచెప్పింది. బలూచిస్తాన్లో యుద్ధవాతావరణం నెలకొన్న ప్రాంతాలను సందర్శించేందుకు జర్నలిస్టులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. ఇక్కడి పరిస్థితులు ఏమిటో బాహ్య ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందని బీఎల్ఏ స్పష్టం చేసింది. -
ఆ బస్సు హైజాక్ కాలేదు : పోలీసులు
ఆగ్రా: ఉత్తరప్రదేశ్లోని ఓ ప్రైవేట్ బస్సు హైజాక్ కథ సుఖాంతమైంది. బస్సును అపహరించలేదని, బస్సుపై రుణం తీసుకున్న యజమాని ఈఎంఐని సకాలంలో చెల్లించకోవడంతో బస్సును తీసుకెళ్లినట్లు ఓ ఫైనాన్స్ కంపెనీ వెల్లడించింది. ప్రయాణికులను సురక్షితంగా వారి ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొంది. దీంతో ఆగ్రా పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఏం జరిగిందంటే.. ఆగ్రాలోని న్యూ సదరన్ బైపాస్ సమీపంలో బుధవారం వేకువజామున ఓ ప్రైవేట్ బస్సును గుర్తుతెలియని దుండగులు అపహరించినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బైపాస్ రోడ్ వద్ద బస్సుని ఆపిన దుండగులు మొదట బస్సు డ్రైవర్, హెల్పర్ను కిందకు దించేసి, ఆ తర్వాత బస్సును హైజాక్ చేసినట్లు తెలిసింది. ఆ బస్సు హర్యానాలోని గురుగ్రామ్ నుంచి మధ్యప్రదేశ్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. దుండగులు మొదటగా తాము ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగులమని చెప్పి బస్సు ఎక్కారని, తర్వాత డ్రైవర్, సహాయకుడిని బెదిరించి బస్సును అపహరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, అసలు విషయం బయటపడింది. బస్సుపై రుణం తీసుకున్న యజమాని ఈఎంఐలు చెల్లించకపోవడంతో బస్సును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని, ఫైనాన్స్ కంపెనీపై కేసులు నమోదు చేసినట్టు చెప్పిన పోలీసులు బస్సును ఝాన్సీకి తరలించారు. -
ఏడాదిలో ఎన్ని వెబ్ సైట్లు హైజాక్ అయ్యాయో తెలుసా?
దాదాపు 7 లక్షల వెబ్ సైట్లు ప్రమాదకరంలో ఉన్నాయా..? అవన్నీ హైజాకింగ్ కు గురయ్యాయా అంటే ..? అవుననే అంటున్నాయి గూగుల్ రికార్డ్స్. వెబ్ సెక్యురిటీని పెంచడం కోసం జరిపిన పరిశోధనలో ఈ వాస్తవాలు వెల్లడయ్యాయి. 2014 జూన్ నుంచి 2015 జూలై వరకు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, గూగుల్ సంయుక్తంగా ఈ పరిశోధన జరిపింది. రొటీన్ గా వేయికి పైగా వెబ్ సర్వర్ లకు దుండగులు హాని కల్గిస్తూ.. సమాచారాన్ని దొంగలిస్తున్నారని పరిశోధన తెలిపింది. ఒక్క ఏడాదిలోనే 7 లక్షల 60వేలకు పైగా వెబ్ సైట్లు హైజాక్ కు గురైన సంఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొంది. హానికరమైన యూఆర్ఎల్ లను గుర్తించినప్పుడు గూగుల్ సేఫ్ బ్రౌజింగ్ అలర్ట్ ల ద్వారా నెట్ వర్క్ నిర్వాహకులకు నోటిఫికేషన్లను అందిస్తుంది. దీంతో 50 శాతం వరకూ కేసులు నిరోధించగలిగారని గూగుల్ రిపోర్టు చెప్పింది. వెబ్ సైట్లపై జరుగుతున్న ఈ అటాక్ లో ఎక్కువగా ఇంగ్లీస్ వెబ్ సైట్లు ఉంటున్నాయని, తర్వాత స్థానాల్లో చైనీస్, జర్మన్, జపనీస్, రష్యన్ భాషా వెబ్ సైట్లు ఉన్నాయని గూగుల్ పరిశోధన చెప్పింది. -
హైజాక్ హెచ్చరిక.. విమానాశ్రయాలు అలర్ట్
న్యూఢిల్లీ: విమానాల హైజాక్కు కుట్ర జరగొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో దేశంలోని అన్ని ఎయిర్పోర్టుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన విమానాశ్రయాల్లో నిఘాను పెంచారు. ప్రయాణికులను, లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రయాణికులు విమానంలోకి ప్రవేశించిన తర్వాత కూడా లగేజీని జాగ్రత్తగా పరిశీలించాలని సిబ్బందికి సూచనలు చేశారు.