breaking news
Helplessness
-
నిస్సహాయతలోనూ.. దేవుని వైపే
పూర్వం ఊజు దేశంలో యోబు అనే యథార్థవంతుడున్నాడు. ఆయనకు భార్య, కుమారులు, కుమార్తెలు ఉన్నారు. పాడిపంటలు, సిరిసంపద గలవాడు. ఒకరోజు దేవదూతలు దేవుని సన్నిధికి వచ్చారు. ఆ సమయంలో అపవాది/సైతాను కూడా ప్రత్యక్షపరచుకున్నాడు. దేవదూతలు మొదట వెళ్ళి΄ోగా సైతానుతో భగవంతుడు– నీవు ఎక్కడినుండి వచ్చావు? భూలోకంలో దోషరహితుడు, ధర్మాత్ముడైన నా సేవకుడైన యోబు అనే భక్తుణ్ణి చూశావా? అని అడగ్గా, ‘నీ సేవకుడైన యోబును భూసంచారంలో చూశాను. అతడు నిస్వార్థంగా మిమ్మల్ని సేవిస్తున్నాడా? మీరనుగ్రహించిన సకల సంపద, సంతానం, ఆస్తిపాస్తులపై కంచె వేశారు కాబట్టే, మీయందు భయభక్తులు కలిగి వున్నాడు’ అన్నాడు సైతాను. అందుకు దేవుడు నీవు మాత్రం అతనిపై చేయివేయొద్దు. అతని సంపదకు కారణమైన భూమి, సంతోషభరితులైన సంతానం నీ స్వాధీనంలో ఉంచాను కనుక అతని సహనాన్ని పరీక్షించు కోవచ్చునని సెలవిచ్చాడు దేవుడు.అప్పుడు సైతాను, యోబు ఆస్తిపాస్తులను చూసే నాగలిని, ఎద్దులను, పొలము దున్నువాటినన్నిటినీ షబాయీయులు తోలుకొని΄ోయారని, వారు నీ సేవకులను కత్తితో పొడిచి చంపారని దూత వచ్చి చెప్పాడు. అతడి మాటలు పూర్తి కాకముందే వేరొకడు వచ్చి– ’అయ్యా! కుమార్లు, కుమార్తెలు, పెనుగాలికి ఇళ్లు కూలిపోయి చనిపోయారని చెప్పాడు. అప్పుడు యోబు పైకి లేచి నేలపై బోర్లాపడి దేవునికి దండం పెట్టి నేను దిగంబరిగానే నా తల్లిగర్భం నుండి వచ్చాను. ఆ విధంగానే వెళ్ళిపోతానన్నాడు. ఇంత సంభవించినా యోబు దేవుని దూషించలేదు... నేరం మోపలేదు.మరలా దేవదూతలు, సైతాను దేవుణ్ణి దర్శించడానికి వచ్చారు. మొదట దేవదూతలు వెళ్ళి΄ోయాక సైతానుతో ‘‘నీవు నాతో అనవసరంగా యోబును నాశనం చేయించినా అతనిప్పటికీ నైతికత విడవలేదని అనగా, సైతాను దేహం కా΄ాడు చర్మం, ్ర΄ాణం కాపాడు ఆత్మ వున్నదన్నాడు. అందుకు ప్రభువు అతనిప్రాణం జోలికి వెళ్ళవద్దన్నాడు.అంతట సైతాను దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయాడు. యోబుకు నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు వ్రణములతో నింపగా యోబు కురుపులను చిల్లపెంకుతో గోకుతున్నాడు. అంతట అతని భార్య – ‘‘నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్ము’’ అనెను. అందుకు యోబు – ‘‘మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు; మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా?’’ అంటూ... యోబు నోటి మాటతో నైనను పాపము చేయలేదు. తర్వాత మరొక రోజు తన ముగ్గురు మిత్రులు ఒకరి తర్వాత ఒకరు వచ్చి దూషించారు. యోబు సమయోచితమైన ప్రత్యుత్తరమిచ్చాడు. కానీ దేవుణ్ణి పల్లెత్తు మాట దూషించలేదు.ఒకానొకరోజు దేవుడు సుడిగాలిలో ప్రత్యక్షమై భక్త యోబుకు నష్టపోయిన దానికంటే అధికంగా సిరిసంపదలు, సంతానం, సంతోషం అనుగ్రహించాడు.దేవుడు సర్వశక్తిమంతుడు, న్యాయవంతుడు, దేవుని దృష్టిలో ఏ మనుష్యుడు నీతిమంతుడు కాడు. శ్రమ అనేది పాప ఫలితమేకాక ప్రాయశ్చిత్తం కూడాను. కష్టాలలో, నిస్సహాయతలో దేవుని వైపు తిరగడం మానవ విజ్ఞతకు సంకేతం.– కోట బిపిన్ చంద్రపాల్ -
ది ఛాలెంజ్!
ఒక్క అడుగు ముందుకు వేయాలంటేవంద మీమాంసలు వెనక్కులాగుతుంటాయి. ఒక సాహసం చేయాలంటే లక్ష భూతాలు అడ్డుపడుతుంటాయి. అలా అని... అడుగు వేయడం మానకూడదు. సాహసం చేయడం ఆపకూడదు. మరో జన్మలోకి తొంగి చూసి మన లోపాన్ని అర్థం చేసుకునేకన్నా ఈ జన్మలోనే మన భయాలను అర్థం చేసుకొని పోరాడితేనే జీవితం ఒక లక్ష్యం అవుతుంది. కష్టం ఒక ఛాలెంజ్ అవుతుంది. రాత్రి పది దాటింది. శేఖర్కి నిద్రపట్టడం లేదు. కిటికీలో నుంచి బయటకు చూస్తున్నాడు. బయట అంతా చీకటి. లోపలంతా చీకటి. తనలోనూ చీకటే. ‘నన్నెవరూ అర్థం చేసుకోరు. నాకెవరూ అండగా ఉండరు. అయినా ఈ అవిటివాడిని ఎవరు ప్రేమిస్తారు? చివరకు అమ్మ కూడా అన్నయ్యవైపే. నా గురించి ఆలోచించేదైతే ఇలా నన్ను ఒంటరిని చేసి వెళుతుందా!’ దుఃఖం పొగిలి పొగిలి వస్తోంది శేఖర్కి. కళ్ల నిండా నీళ్లు. ‘నేనే ఎందుకు ఇలా పుట్టాను. నా కన్నా ముందు పుట్టిన అన్నయ్య బానే ఉన్నాడు. నా తర్వాత పుట్టిన చెల్లీ ఆరోగ్యంగా ఉంది. నేనే ఎందుకిలా? నాకిలా అవడానికి అమ్మే కారణమట. అన్నయ్య పుట్టాక అప్పుడే పిల్లలు వద్దనుకొని ఏవో ముందులు వాడిందట అమ్మ. ఆ మందుల వల్లే నాకీ అవిటితనం వచ్చిందట. మేనత్త చెప్పిన మాటలు శేఖర్ చెవుల్లో గింగురుమంటున్నాయి. ‘పుట్టుకతోనే రెండు కాళ్లు చచ్చుపడిపోయి పుట్టాను. పాతికేళ్లు వచ్చినా ఇంకా చంటిపిల్లాడిలా పాకుతూనే ఉన్నాను. పాకుతూనే బాత్రూమ్కి వెళ్లాలి. పాకుతూనే పనులన్నీ చేసుకోవాలి. పాకుతూనే పదేళ్లపాటు బడికి వెళ్లాను. ఇక ఈ జీవితం అంతా ఇంతే. ఏం పనిచేయగలను? ఎలా బతకగలను? నడిచే అదృష్టం నాకు లేదా’.. ఆ ఆలోచనకు మళ్లీ దుఃఖం ఎగదన్నుకొచ్చింది. వెక్కివెక్కి ఏడుస్తూ రెండు చేతులతో ముఖం కప్పుకున్నాడు శేఖర్ వెలుగు నింపేవారెవ్వరు? ‘శేఖర్.. శేఖర్..’ అంటూ భుజం పట్టి ఊపేసరికి ఉలిక్కిపడి చూశాడు శేఖర్... ఈ టైమ్లో ఎవరా అని. లైట్ స్విచ్ వేస్తూ కనిపించాడు వెంకట్. మేనత్త కొడుకు వాడు. తన కన్నా ఏడాది చిన్న. గదిలో అప్పటి వరకు ఉన్న చీకటిని.. బల్బు తన వెలుతురుతో తరిమేసింది. ‘‘నువ్వొక్కడివే ఉన్నావని తెలిసి ఈ రాత్రి ఇక్కడే ఉండిపోదామని వచ్చాను బావా. ఏంటిలా... చీకటింట్లో.. తలుపు కూడా వేసుకోకుండా..’’ అన్నాడు వెంకట్... శేఖర్ మంచం పక్కనే కుర్చీ లాక్కుని కూర్చుంటూ. ‘‘నువ్వెందుకొచ్చావ్?! అవిటివాడిని. నేనుంటే ఎంత, పోతే ఎంత. భూమికి భారమే తప్ప నాలాంటివాడు ఎవరికి ఉపయోగం?’’ శేఖర్ గుండెలోని బాధంతా గొంతు దాటి వచ్చేస్తోంది.‘‘అదేంటి బావా అలా అంటావు. మా అందరికీ నువ్వంటే ఎంతో అభిమానం. నీకు నువ్వుగా కదల్లేకపోవచ్చు. కానీ, నీకున్న తెలివితేటలు మాలో ఎవరికున్నాయి..’’ వెంకట్ మాటలకు అడ్డుపడ్డాడు శేఖర్. ‘‘చాల్లే ఇన్నాళ్లూ చావలేక బతికున్నాను. ఇప్పుడు చస్తూ బతుకుతున్నాను. నేను అవిటివాడినని అన్నయ్యకు పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదట. వాడికి పుట్టే పిల్లలకూ నాలా అవిటితనం రావచ్చని భయపడుతున్నారట. నేనిలా ఉండటం వల్లే చెల్లికీ పెళ్లి కావడం లేదట. మంచి సంబంధాలు నామూలంగా చెడిపోయాయని అన్నయ్య నోటికొచ్చిన మాటల్లా అని వెళ్లిపోయాడు. నన్ను ఎప్పుడో వదిలించుకుని ఉంటే ఈ రోజు ఈ తిప్పలు వచ్చేవి కాదట. వాడు అన్నేసి మాటలు అంటుంటే అమ్మ, చెల్లి ఒక్కరైనా అడ్డుచెప్పలేదు రా! పైగా ‘ఏం చే యగలం, మన కర్మ’ అని ఏడుస్తూ కూర్చున్నారు. అంటే నేను ఇక్కడ ఉండకూడదనేగా వీళ్లంతా కోరుకునేది. ఇలా పుట్టడం నా తప్పా! నా మనసెంత గాయపడిందో అని కూడా చూడకుండా అన్నయ్యను సముదాయించి తీసుకురావడానికి వెళ్లారు ఇద్దరూ! నాన్నే ఉండి ఉంటే ఇలా జరిగేదా! అడుగు కూడా వేయలేని నేను ఏం పని చేయగలను. నాకు నిజంగా బతకాలని లేదురా. చచ్చేమార్గం చెప్పు’’ అని పెద్దగా ఏడ్చేశాడు శేఖర్! భారం ఎప్పటికి దిగుతుంది? శేఖర్ చిన్నతనంలోనే తండ్రి యాక్సిడెంట్లో చనిపోయాడు. ఉన్న కొద్దిపాటి పొలాన్ని ఆసరా చేసుకుని ముగ్గురు పిల్లలను తల్లి విమల సాకుతూ వచ్చింది. శేఖర్ని రోజూ తనే స్కూల్కి తీసుకెళ్లి, ఇంటికి తీసుకువచ్చేది. కాస్త పెద్దయ్యాక స్కూల్లో స్నేహితులే తీసుకెళ్లేవారు. కొన్నాళ్లకి తనే కాళ్లతో, చేతులతో పాక్కుంటూ స్కూల్కి అతికష్టంగా వెళ్లి వచ్చేవాడు. ఊళ్లో హై స్కూల్ వరకే ఉంది. ఎవరో ఒకరు దగ్గర లేకపోతే అవసరాలు తీర్చుకోవడానికే కష్టపడేవాడు. అందుకే విమల కొడుకును టౌన్కి పంపించలేదు. తర్వాత ఏం చేయాలో తోచక శేఖర్ని ఇంట్లోనే ఉంచింది. ఊళ్లో అందరూ శేఖర్ని జాలిగా చూసేవారు. ‘విమలమ్మా! ఎన్నాళ్లో నీకీ కష్టం’ అనేవారు! ఆమె మౌనంగా వినేది. మౌనంగా ఉండేది. మిగతా ఇద్దరు పిల్లలు పట్టణంలో ఉండి చదువుకున్నారు. ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరికీ పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. పెళ్లి అంటే కుటుంబం వివరాలన్నీ ఇరువైపుల వాళ్లు చూస్తారు. శేఖర్ని అవిటివాడిగా చూసినవాళ్లు ‘వీళ్ల కుటుంబంలో అవిటితనం ఉంది. పుట్టబోయే వాళ్లు కూడా అవిటితనంతో పుడితే..’ అనే అనుమానం వ్యక్తం చేసిన వాళ్లు ఈ సంబంధం వద్దన్నారు. దీంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఎవరి మనసులూ ప్రశాంతంగా లేవు. ‘వికల భావన’లకు థెరపీ ‘‘శేఖర్ మీ వేదన ఈ నాటిది కాదని అర్థం అవుతోంది. ఈ సమస్యను పరిష్కరించుకోవడం మీ చేతుల్లోనే ఉంది..’’కౌన్సెలర్ మాటలకు.. ‘‘నాకేం చేతనవుతుంది, కాలు కూడా కదపలేనివాడిని’’ అని నిస్సహాయంగా అన్నాడు శేఖర్.వెంకట్ బలవంతం మీద కౌన్సెలింగ్కి వచ్చాడు శేఖర్. ‘‘రిగ్రెషన్ థెరపీ మనలోని నిస్సహాయతను దూరం చేస్తుంది. జీవితాన్ని అర్థం చేసుకునే తత్త్వాన్ని పెంచుతుంది’’ అని చెప్పి శేఖర్ని వెంట తీసుకొచ్చాడు వెంకట్. పట్టణంలో ఉండి చదువుకున్న వెంకట్కి రిగ్రెషన్ థెరపీ గురించి తెలుసు. ధ్యానంలో అంతర్యానం శేఖర్ ప్రయాణం మొదలైంది. అది వర్తమానం నుంచి గతం వైపుగా పరుగులు తీయడం మొదలుపెట్టింది. బాల్యం నుంచీ ఎదురైన సమస్యలు, అందరూ చూసే జాలి చూపులను కళ్లు మూసుకొని మనోనేత్రంతో పరిశీలిస్తూ వెనక్కి వెనక్కి ప్రయాణిస్తున్నాడు. తన నిస్సహాయతకు కారణాలను అన్వేషిస్తున్నాడు. తల్లి గర్భం నుంచి గత జన్మలోకి అతని ప్రయాణం సాగింది. అక్కడ తనను తాను చూసుకున్నాడు. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న తనను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. తను ఆటలు ఆడుతున్నాడు. స్నేహితులతో, కుటుంబంతో కలిసి ఆనందంగా ఉన్నాడు. ఉన్నట్టుండి పెద్ద కుదుపు అకస్మాత్తుగా తన ఆప్త మిత్రుడు మర ణించాడు. ఈతకని మోట బావిలోకి దిగి శవమై తేలాడు. ఆ దృశ్యాన్ని తను తట్టుకోలేకపోతున్నాడు. ఎన్నో కష్టాల నుంచి తనను గట్టెక్కించాడు ఆ స్నేహితుడు. ఇప్పుడా స్నేహితుడు బావి గట్టున విగతజీవుడై ఉన్నాడు! ఇప్పుడు అతను లేడు. ఇక నా కష్టాలను తీర్చేవారు లేరు. నాకు అండగా ఉండేవారు లేరు. ఏ పనిచేద్దామన్నా చేతులు సహకరించడం లేదు. అడుగు వేద్దామన్నా కాలు ముందుకు పడటం లేదు. బాధ, భయం తొలుస్తూనే ఉన్నాయి. కొన్నాళ్లకు తను పక్షవాతం వచ్చి మంచం పట్టాడు. ఆ దిగులుతోనే మరణించాడు. ఆ దిగులుతోనే ఈ జన్మ తీసుకున్నాడు. పేరుకుపోయిన భయం, ఒంటరితనం.. అవే అవయవలోపానికి దారి తీసాయి..’ అని చెబుతున్న శేఖర్.. తనలో ఎక్కడ సమస్య ఉందో గమనించాడు. తనను ఎప్పుడూ ఎవరో ఒకరు దగ్గరుండి చూసుకోవాలనే ఆలోచనను కలిగి ఉండటాన్ని గమనించాడు. థెరపీ నుంచి బయటకు వచ్చాడు. నిస్సహాయితకు స్వస్తి వెంకట్ సాయంతోనే పట్టణంలోని హాస్టల్లో చేరాడు శేఖర్. తల్లి, అన్న, చెల్లెలు తమ పొరబాటును మన్నించి ఇంటికి రమ్మన్నారు. ‘‘అసలు మీమీద నాకెలాంటి కోపం లేదు. నేను నేనుగా ఎదగాలి. బయట ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుంటాను. నా స్వశక్తితో ఎదిగి ఆ తర్వాతే మిమ్మల్ని కలుస్తాను’’ అని వారికి నచ్చచెప్పి పంపాడు శేఖర్. ఐదేళ్ల సమయంలో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. ఆగిపోయిన చదువును దూరవిద్య ద్వారా పూర్తిచేశాడు. వీల్చైర్ వాలీబాల్ సాధన చేస్తూ పారాలింపిక్ గేమ్స్లో నేషనల్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్నాడు. బ్యాంకు పరీక్షలు రాసి, ఉద్యోగం సంపాదించుకున్నాడు. తల్లికి అండగా నిలిచాడు. అంగవైకల్యం తన తప్పు కాదని, ఆదర్శవంతమైన జీవనాన్ని దిద్దుకోకపోవడమే తప్పని తెలుసుకున్నాడు. లోపం ఉందని బాధపడకుండా ఉన్న అవయవాలను, చుట్టూ ఉన్న వనరులను ఉపయోగించుకుంటే జీవితాన్ని ఎంత అందంగా మలుచుకోవచ్చో తెలియజేస్తూ నలగురికి ఆదర్శంగా నిలిచాడు. అష్టవంకరలను అధిగమించిన అష్టావక్రుడు ఇతిహాసాలలో అష్టావక్రుడు జీవితం ఎంతో గొప్పగా కనిపిస్తుంది. మహర్షి ఏకపాదుడి కుమారుడు ఎనిమిది వంకరలు గల దేహంతో జన్మించాడు. అందుకే అతనికి అష్టావక్రుడు అని పేరు వచ్చింది. ఇతను పుట్టే సమయానికి తండ్రి జనకమహారాజు దగ్గర ఉన్న వందితో వాదించలేక ఓడిపోయి, జలబంధీగా ఉన్నాడు. అష్టావక్రుడు తన అంగవైకల్యం గురించి చింతించక వేదవిద్యలను అభ్యసించాడు. పన్నెండేళ్ల వయసులోనే తన వాదనతో వందిని ఓడించి బంధీగా ఉన్న తండ్రిని, మిగతావారిని విడిపించి తీసుకొచ్చిన ఘనుడు. ఆ విధంగా అష్టావక్రుని యశస్సు నలుదిశల వ్యాపించింది. బతికినన్నాళ్లూ ధర్మనిష్టకుడిగా, మహామునిగా ఖ్యాతి గడించాడు. వివాహం చేసుకొని పుత్ర పౌత్రులను పొందాడు. అష్టావక్రుడు జనకమహారాజుతో చేసిన వేదాంత చర్చయే అష్టావక్ర సంహితగా ప్రపంచానికి తెలిసింది. థెరపీతో ఉపయోగాలు ⇒ ఉన్న అవయవాలను సక్రమంగా ఉపయోగించుకోకపోవడమే అంగవైకల్యం అని తెలుస్తుంది. ⇒ పూర్ణంగా ఉన్నాను. పూర్ణంగా జీవిస్తున్నాను అనే భావన పెరుగుతుంది.. ⇒ ‘జీనియస్’ అంటే వంశపారంపర్యంగా జ్ఞానం ఉంటుంది అని కాదు. అన్నింటినీ పరిపూర్ణంగా వాడుకోవడంలో ముందుండేవాడు అని తెలుసుకుంటారు. ⇒ తమ శక్తిని సరైన దృక్కోణంలో చూసి వాడుకోవాలనే జ్ఞానం పెరుగుతుంది. ⇒ తమకు లేదని బాధపడటం కన్నా ఉన్న పనినే పరిపూర్ణంగా చేయగలిగితే అదే పూర్ణత్వానికి దారి తీస్తుందని అర్థమవుతుంది. అనుభవాల ప్రవాహం అర్థమైతే వైకల్యం దూరం అంగవైకల్యం ఉన్నవారు కుటుంబం, సమాజం తమను చిన్నచూపు చూస్తున్నాయన్న భావనలో ఉంటారు. సమాజంలోనూ ఇలాంటి దృష్టికోణం ఉంది. అలాగే అంగవైకల్యంతో బాధపడేవారు భగవంతుడు శిక్ష వేశాడనో, తను గర్భంలో ఉన్నప్పుడు తల్లి సరైన జాగ్రత్తలు తీసుకోలేదనో, వంశపారంపర్య లోపం అనో కుంగిపోతుంటారు. కానీ, తాము పాఠాన్ని నేర్చుకోవడం కోసమే ఈ జన్మ తీసుకున్నామని గ్రహించరు. అంగవైకల్యంతో బాధపడేవారికి రిగ్రెషన్ థెరపీ చేస్తే ‘గత జన్మలో యుద్ధంలో కానీ, జీవన ప్రయాణంలో కానీ తమకు కుడిభుజంగా ఉన్నటువంటి వ్యక్తులను కోల్పోయి ఆ బాధ, భయంతోనే జీవించినవారు అధికంగా ఉన్నారు. దీంతో తమ కుడి భుజం పోయిందనో, తాము నడవలేకపోతున్నామనో బతికినన్నాళ్లూ భయం భయంగా జీవించి ఉంటారు. మరణ సమయంలోనూ అదే భయంతో శరీరాన్ని విడిచి ఉంటారు. తిరిగి, గర్భంలో ప్రవేశించినప్పుడు కూడా ఆ భావన బలంగా ఉండటం వల్ల అలాగే ముడుచుకుపోతారు. దీంతో అవయవాల ఎదుగుదల సరిగ్గా ఉండదు. ‘నాకీ అవయవం లేదు’ అని బలంగా మస్కిస్తంలో ఉండటం వల్లే అంగవైకల్యానికి దారి తీస్తుంది. అనుభవాల ప్రవాహం అర్ధమైతే ఉన్న విభాగాలన్నీ సరిగ్గా వినియోగించుకోవచ్చు. – డా.హరికుమార్, జనరల్ సర్జన్, ఫ్యూచర్ థెరపిస్ట్, హైదరాబాద్ – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
సర్కారే నిస్సహాయత వ్యక్తంచేస్తే ఎలా?
కబ్జా భూముల్ని ఖాళీ చేయించకపోవడంపై హైకోర్టు అసంతృప్తి హైదరాబాద్: న్యాయస్థానాల ఉత్తర్వులను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిస్సహాయతను వ్యక్తం చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగ మౌలిక సూత్రాలు, న్యాయ పాలన ఆధారంగా నడిచే సమాజానికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎంత మాత్రం శుభసూచకం కాదని తేల్చి చెప్పింది. అరాచక శక్తుల ఆజ్ఞలకు లోబడి ప్రజా ప్రభుత్వాలు పని చేయరాదని హితవు పలికింది. బలహీన వర్గాలకు కేటాయించిన భూమిని ఆక్రమించుకుని నివాసం ఉంటున్న వారిని రాజకీయ పార్టీల ప్రతిఘటన కారణంగా ఖాళీ చేయించలేకపోతున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం నిస్సహాయత వ్యక్తం చేయడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కారణాలు ఏవైనా సరే తమ ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. ఆక్రమణదారులను ఖాళీ చేయించాలంటూ గతంలో తాము జారీ చేసిన ఆదేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పునఃసమీక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. 2007 ఆదేశాల పునఃసమీక్ష కోసం ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ చల్లా కోదండరామ్లతో కూడిన ధర్మాసనం గతవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా, కుత్బుల్లాపూర్ మండలం, సూరారం గ్రామంలోని సర్వే నంబర్ 107లో బలహీన వర్గాల సొసైటీకి ప్రభుత్వం కేటాయించిన భూమిని దాదాపు 2300 మంది ఆక్రమించుకుని నివాసం ఉంటున్నారని, ఈ విషయంలో తమకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు అమలు చేయడం లేదంటూ కె.ఆర్.భారతి, మరో 11 మంది 2000 సంవత్సరంలో హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను అప్పటి ప్రధాన న్యాయమూర్తి పిల్గా పరిగణించి విచారణ చేపట్టారు. ఆక్రమణదారులను రెండు నెలల్లో ఖాళీ చేయించి కోర్టుకు నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశిస్తూ 2007లో ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ నివేదికను కోర్టు ముందుంచారు. తాము ఆ భూమిని ఖాళీ చేయించడానికి వెళితే ఆక్రమణదారులు, రాజకీయ పార్టీలు కలసి తీవ్రంగా ప్రతిఘటించారని, శాంతిభద్రతల సమస్య తలెత్తకూడదనే ఉద్దేశంతో ఖాళీ చేయించే ప్రక్రియను నిలిపేశామని ఆ నివేదికలో పేర్కొన్నారు. పార్టీల తీరు కారణంగా చూపుతూ ధర్మాసనం ఉత్తర్వులను పునఃసమీక్షించాలంటూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. 2007 ఉత్తర్వుల తరువాత సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించామని, ఆక్రమణదారులు కూడా భూమిని పొందేందుకు అర్హులని అందులో తేలిందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ధర్మాసనానికి నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం, ప్రభుత్వం దాఖలు చేసిన ఈ పునఃసమీక్ష పిటిషన్లో ఎంత మాత్రం పస లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వం చెప్పిన కారణం తమను ఏ మాత్రం సంతృప్తిపరచలేదని స్పష్టం చేసింది.