breaking news
heavy rain lashes
-
హైదరాబాద్ లో భారీ వర్షం
-
ఇది ప్రకృతి పొలికేక
ప్రకృతి కోపిస్తోంది. ఆకాశానికి హఠాత్తుగా చిల్లులు పడ్డాయనిపిస్తోంది. నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వంతెనలు విరిగిపడుతున్నాయి. ఆనకట్టలు గేట్లెత్తేస్తున్నాయి. అపారమైన ఆస్తి, ప్రాణనష్టం. కొద్ది రోజులుగా భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాఖండ్, కేరళల్లో పరిస్థితి ఇదే! అనేక ఆలయాలు, తీర్థయాత్రా స్థలాలతో ‘దేవభూమి’గా పేరుపడ్డది– ఉత్తరాఖండ్. నిత్యం పర్యాటకులతో ‘దేవతల సొంత గడ్డ’గా పేరొందింది–కేరళ. రెండు రాష్ట్రాల్లో తాజా ఉత్పాతాలు చూస్తుంటే దేవతగా కొలుచుకొనే ప్రకృతి మళ్ళీ మళ్ళీ ఏదో చెప్పదలుచుకుందని అనిపిస్తోంది. అభివృద్ధి పేరిట సహజ నీటి ప్రవాహానికి అడ్డుగా నిర్మాణాలు, కర్బన ఉద్గారాలతో పర్యావరణ హాని, ఫలితంగా అనూహ్య వాతావరణ మార్పులు– అన్నీ మన తప్పును ఎత్తిచూపుతున్నాయి. చార్ధామ్, శబరిమల యాత్రలకు బ్రేకులేస్తూ, హెచ్చరిస్తున్నాయి. మానవాళి పాపానికి ప్రకృతి శాపం అనిపిస్తున్నాయి. వర్షాకాలం దాదాపు ముగిసినా, అనేక ప్రాంతాలను ఇప్పటికీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వాతావరణం మారిపోతోంది. గత నెలాఖరుకే వెళ్ళిపోవాల్సిన నైరుతి ఋతుపవనాలు ఇంకా ఉన్నాయి. ఈ నెల మొదటే రావాల్సిన ఈశాన్య ఋతుపవనాలు ఇంకా రానేలేదు. ఆకస్మిక వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీ, కేరళ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్లలో ఇటీవల దంచికొట్టిన వర్షాలే అందుకు ఉదాహరణ. అక్టోబర్ 18న 24 గంటల్లో అనేక దశాబ్దాలుగా ఎన్నడూ లేనంత (87.9 మి.మీ) వర్షం ఢిల్లీలో కురవడం గమనార్హం. 1956 తర్వాత (అప్పట్లో 111 మి.మీ) ఢిల్లీలో ఒక్క రోజులో ఇంత వర్షం ఇదే ప్రథమం. ఒడిశాలోని బాలాసోర్, తమిళనాట కోయంబత్తూరుల్లోనూ ఈ వారం ఇలాంటి పరిస్థితే. సాధారణంగా మన దేశంలో పడమటి కనుమలు, ఈశాన్య, మధ్య భారతావనిలో అధికంగా వర్షాలు కురుస్తాయి. కానీ కొన్నేళ్ళుగా అతి తక్కువ సమయంలో అధిక వర్షపాతం, ఆకస్మిక భారీ వర్షాలు తరచూ సంభవిస్తున్నాయి. కేరళ సహా అనేక రాష్ట్రాల్లో వర్షాలు పడే తీరు మారింది. ఇది ఆలోచించాల్సిన విషయం. ఈ నెల 12 నుంచి ముంచెత్తుతున్న వాన, మెరుపు వరదల్లో కేరళలో 42 మంది, పర్వతప్రాంత ఉత్తరాఖండ్లో 52 మంది బలయ్యారు. కోట్లలో ఆస్తి నష్టం. సాధారణంగా అక్టోబర్ 1 – 19 మధ్య కేరళలో 192.7 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుంది. ఈశాన్య ఋతుపవనాల కాలమైన అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అంతా కలిపినా సగటున 491.6 మి.మీ. వర్షమే కురవడం ఆనవాయితీ. కానీ, ఈసారి కేవలం ఈ 19 రోజుల్లోనే 453.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. అంటే, మామూలు కన్నా 135 శాతం ఎక్కువ వర్షం కురిసిందన్న మాట. మూడు నెలల సీజన్ మొత్తంలో కురవాల్సినదానిలో 90 శాతం ఈ కొద్దిరోజుల్లో ఇప్పటికే కురిసేసింది. దీన్నిబట్టి వర్ష తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఈ కుండపోత ఇంతటితో ఆగేలా లేదు. రాగల రోజుల్లో పడమటి కనుమల్లో, తూర్పు కొండల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు తప్పవట. కేరళలోని మొత్తం 14 జిల్లాలకు గాను 11 జిల్లాలకు ఎల్లో ఎలర్ట్ ఇచ్చారు. ప్రభుత్వం అప్రమత్తమై, కొండ చరియలు విరిగిపడే ప్రమాదమున్న తూర్పు కొండల్లో జనావాసాలను ఖాళీ చేయిస్తోంది. ఈ శతాబ్దంలో ఎన్నడూ లేనంతటి వరదతో 2018లో కేరళలో కనీసం 400 మంది చనిపోయారు. పది లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అది ఇప్పటికీ మర్చిపోలేని విషాదం. వర్షజల ప్రవాహానికి 44 నదులున్నా, 2019లోనూ వరదలొచ్చిన చరిత్ర ఆ రాష్ట్రానిది. ఇక, ఈ జూలైలోనే ఉత్తరాదినీ, పశ్చిమ భారత తీరప్రాంతాలనూ వరదలు వణికించాయి. తరచూ ముంచెత్తుతున్న వరదలను సమర్థంగా ఎదుర్కోవడంలో సొంత వైఫల్యాలు వెక్కిరిస్తున్నాయి. నదీ పరివాహకాల్లో, పర్వతప్రాంతాల్లో నివాసం కేరళ, ఉత్తరాఖండ్ లాంటి చోట్ల ఎక్కువ. కేరళ ‘రూమ్ ఫర్ రివర్’ప్రాజెక్టును ఎప్పుడో ప్రకటించింది. వరద ముప్పున్న ప్రాంతాల్లోని ప్రజలకు రక్షణ కల్పిస్తూ, వరద నీటిని నిర్వహించే ఈ తరహా ప్రాజెక్టును నెదర్లాండ్స్ అమలు చేస్తోంది. 2019 మేలో ఆ దేశాన్ని సందర్శించిన కేరళ సీఎం అదే ఫక్కీలో చర్యలు చేపడతామన్నారు. ఆ ప్రాజెక్టునూ, ‘రీబిల్డ్ కేరళ’నూ అమలు చేయడంలో సర్కారు విఫలమైందని ప్రతిపక్షాల ఆరోపణ. వర్షాలు, వరదలు దేశానికి కొత్త కాదు. కానీ, ఇంత తరచుగా రావడం వెనుక మానవ తప్పిదాలు అనేకం. హిమాలయాల నుంచి పడమటి కనుమల దాకా ప్రభుత్వాల అభివృద్ధి నమూనాలే అసలు సమస్య. పర్యావరణ సంక్షోభంపై శాస్త్రీయసాక్ష్యాలను పట్టించుకోవడం లేదు. ప్రకృతికి హానికరంగా కొండలు, గుట్టల తవ్వకాలు, అడవుల నరికివేత, ఇష్టారాజ్యంగా రోడ్లు, జలవిద్యుత్కేంద్రాలు సహా అనేక నిర్మాణాలు పాలకుల తప్పులే. పడమటి కనుమల పరిరక్షణకు 2011లో మాధవ్ గాడ్గిల్ నివేదిక చేసిన సూచనల్ని పక్కన పడేశారు. గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గోవా, తమిళనాడుల మీదుగా లక్షా 30 వేల చదరపు కి.మీ.ల ప్రాంతాన్ని సున్నితమైన పర్యావరణ ప్రాంతంగా ప్రకటించాలని గాడ్గిల్ సిఫార్సు చేశారు. ఆరు రాష్ట్రాల్లో ఏ ఒక్కటీ ఒప్పుకోలేదు. తర్వాత 2013లో కె. కస్తూరి రంగన్ మునుపటి సిఫార్సుల తీవ్రతను తగ్గించి ఇచ్చిన సూచనలకూ అదే గతి. పర్యావరణ ఉత్పాతాలను నివారించాలంటే కొన్ని నిర్బంధాలు తప్పవని ప్రజలను చైతన్యపరచ లేదు. తాత్కాలిక రాజకీయ లబ్ధి కోసం జనం డిమాండ్లకు తలొగ్గారు. కేరళ లాంటి రాష్ట్రాలు దానికి ఇప్పుడు చెల్లిస్తున్న భారీ మూల్యమే ప్రస్తుత దుఃస్థితి. దేశంలో తాజా వరద బీభత్సం మరోసారి ప్రకృతి పెట్టిన పొలికేక. ఇప్పటికైనా పెనునిద్దర వదలకపోతే మనకే నష్టం! -
కర్నూలు జిల్లాలో భారీ వర్షం
-
చిత్తూరులో ముంచెత్తిన వర్షం
-
బెంగళూరులో బీభత్సం
సాక్షి, బెంగళూరు: ఐటీ నగరం బెంగళూరులో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కుండపోతగా కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. పలు లేఔట్లు నీటమునిగాయి. వందల ఇళ్లు, అపార్టుమెంట్ల సెల్లార్లలోకి వర్షపు నీరు ప్రవేశించింది. బెంగళూరు రూరల్ మాదనాయకనహళ్లిలో ఇంటి గోడ కూలి ఒక వ్యక్తి, కేఆర్ పురంలో ఇంట్లోకి నీళ్లు వచ్చి యూపీఎస్ షాక్ కొట్టడంతో ఒక మహిళ మరణించారు. చంద్ర లేఔట్లో ప్రహరీ కూలి ఐదు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అనేక చోట్ల వాన నీరు దిగ్బంధించడంతో ప్రజలు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. బెంగళూరులో మంగళవారం రాత్రి 11 గంటలకు ప్రారంభమైన వర్షం బుధవారం ఉదయం 5 గంటల వరకు ఏకదాటిగా కురిసింది. కోరమంగల, హెచ్ఎస్ఆర్.లేఔట్, జేపీ.నగర ఆరవపేజ్, కృష్ణరాజపురం తదితర ప్రాంతాల్లో వర్షంనీరు రోడ్లుపై నిలిచిపోవడంతో చెరువులను తలిపించాయి. ఆడుగోడిరోడ్డు, ఆర్మీస్కూల్ కంపౌండ్గోడ పై చెట్టుకూలింది. జేపీ.నగర ఐదవబ్లాక్ ఉన్న శోబా డిప్లోర్ అపార్టుమెంట్ గోడ కూలి రెండు ఇళ్ల మీద పడటంతో ఇంట్లో ఉన్న నలుగురు వ్యక్తులు బయటికి రాలేక బుధవారం ఉదయం వరకు నరకయాతన పడ్డారు. సమాచారం అందిన వెంటనే పాలికె సిబ్బంది జేసీబీ యంత్రంతో అక్కడికి చేరుకుని శిథిలాలను తొలగించి వారిని కాపాడారు. ఇంకా వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించడంతో బెంగళూరు వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. శాంతినగర బస్డిపో ముంపు జయనగర నేషనల్ కాలేజీ ప్రహరీగోడ పై చెట్టుకూలడంతో ప్రహరీగోడ కూలిపోయింది. శాంతినగర బస్డిపోలో మళ్లీ వర్షం నీరు చొరబడింది. గత నెలలో కురిసిన భారీ వర్షంతో డిపోలో నీరుచేరిన సందర్బంలో మంత్రి జార్జ్ సందర్శించి శాశ్వతపరిష్కారం కల్పిస్తామని హామీనిచ్చారు. కానీ మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి డిపోలో రెండు అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో బీఎంటీసీ సిబ్బంది తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. గిరినగర తగ్గుప్రాంతాల్లో ఇళ్లులోకి నీరుచేరడంతో ఆ ప్రాంత వాసులు రాత్రంతా జాగరణ చేశారు. హలసూరు, రాజరాజేశ్వరినగర, ఆవలహళ్లి, యశవంతపుర, హెబ్బాళ,బనశంకరి, మల్లేశ్వరం, అత్తిగుప్పె ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి జనం ఆందోళనకు గురయ్యారు. దొడ్డబిదరకల్లు చెరువుకట్ట తెగిపోవడంతో అన్నపూర్ణేశ్వరి నగర లేఔట్, ఆందానప్పలేఔట్ నీట మునిగాయి. కాగా, ఆర్కేపురం తదితర పలు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి వరద బాధితులను పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సీఎం, జార్జ్ ఏం చేస్తున్నారు? వర్షాలతో నగర ప్రజలు అల్లాడిపోతుంటే సీఎం సిద్దరామయ్య, నగరాభివృద్ది శాఖామంత్రి జార్జ్ ఏం చేస్తున్నారని కాంగ్రెస్ నేత సీఎం ఇబ్రహీం సహోదరి సీఎం జమీనా ప్రశ్నించారు. ఆమె ఇంట్లోకి వాననీరు చేరి రాత్రంతా జాగరణ చేశారు. ఇంట్లోని వస్తువులు నీటిలో మునిగాయి. రాత్రంతా జాగరణతో కోపోద్రిక్తురాలైన జమీనా ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మంత్రి జార్జ్ ఏమిచేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజలను పట్టించుకునే నాథుడేలేరని ధ్వజమెత్తారు. మేయర్, మంత్రుల పరిశీలన భారీ వర్షంతో దెబ్బతిన్న ప్రాంతాల్లో మేయర్ పద్మావతి, మంత్రులు కేజే.జార్జ్, ఎం.కృష్ణప్ప పర్యటించారు. చంద్రాలేఔట్లో గోడకూలి కారు, ఆటోలు దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించారు. -
భారీ వర్షాలతో నగరం అతలాకుతలం
-
పాదరక్షే...ప్రాణరక్ష
-
హైదరాబాద్లో పలుచోట్ల వర్షం
-
నీల్లూరు
-
తిండి లేదు.. గుక్కెడు నీళ్లూ లేవు
-
పుట్పాత్ పాలైన బతుకులు
-
వైఎస్ఆర్ జిల్లాలో భారీ వర్షాలు
వైఎస్ఆర్ కడప జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తుండటంతో ముద్దునూరు మండలం కలమలలలోని కృష్ణా నగర్వంక పొంగిపొర్లుతుంది. బుధవారం ఉదయం ఆ నీటి ప్రవాహంలో పడి ఓ మహిళ మృతి చెందింది. మరో మహిళ గల్లంతు అయింది. స్థానికులు గల్లంతు అయిన మహిళను రక్షించేందుకు శత విధాల ప్రయత్నించారు. అయితే నీటి ప్రవాహ ఉధృతి మరింత తీవ్రంగా ఉండటంతో స్థానికులు మిన్నకుండిపోయారు. అలాగే జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా చన్నమండం మండలం వరద పోటెత్తింది. దాంతో సన్నజాతి పశుసంపద దెబ్బతింది. అలాగే మాండవ్య నది వేగం ప్రవహిస్తుంది. రహదారులు ఎక్కికక్కడ తెగిపోయాయి. వీటితోపాటు శ్రీనివాస రిజర్వాయర్లో వరద నీరు భారీగా చేరింది.దాంతో సమీపంలోని లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. బద్వేలులో భారీ వర్షం కురుస్తుంది. లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఆ ప్రాంతంలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. అనంతపురం జిల్లాలో పుట్టపర్తిలో భారీ వర్షం కురిసింది. జిల్లాలోని చిత్రావతి నది పొంగి పొర్లుతుంది. కొత్తచెరువు మండలంలో భారీగా వర్షం కురిసింది. వంగపేరు నది ప్రవాహంలో పడి రైతు గల్లంతయ్యాడు. అదే జిల్లాలోని ధర్మవరంలో భారీ వర్షం నమోదు అయింది. తుంపర్తివాగులో మగ్గురు గ్రామస్తులు చిక్కుకున్నారు. తమను రక్షించాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారిని రక్షించేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.