-
శెభాష్.. పోలీస్
ఖమ్మంఅర్బన్ : పోలీసులు శాంతి భద్రతలను కాపాడటమే కాదు నిండు ప్రాణాలను సైతం కాపాడుతారని నిరూపించారు రఘునాథపాలెం పోలీసు స్టేషన్లోని ఇద్దరు పోలీసులు. గుండె పోటుతో కొట్టుకుంటున్న ఓ రియల్ వ్యాపారికి ప్రాణ బిక్ష ఔదార్యాన్ని చాటారు. రియల్ వ్యాపారి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని రఘునాథపాలెం బైపాస్లోని ప్రగతి ఫ్రైడ్ గృహ సముదాయంలో బాదావత్ మన్యానాయక్ కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. మంగళవారం ఉదయం 8 గం.ల సమయంలో 100 కాల్కు గన్యానాయక్ భార్య ఫోన్ చేసి తన భర్తకు గుండె పోటు వచ్చి పడిపోయాడని, ప్రాణాపాయం ఉందని చెప్పింది. డ్యూటీలో ఉన్న బ్లూ కోర్టు కానిస్టేబుల్ జర్పల సురేష్, హెడ్ కానిస్టేబుల్ బి. వెంకటేశ్వర్లు వెంటనే తమ ద్విచక్ర వాహనంపై కాల్ వచ్చిన నివాసానికి క్షణాల్లో వెళ్లారు. అప్పటికే మన్యానాయక్ గుండె పోటు వచ్చి అపస్మారక స్థితిలో ఉన్నాడు. అక్కడ భార్య ఒక్కతే ఉంది. భర్తను పట్టుకొని రోదిస్తుంది. వెంటనే ఆ ఇద్దరు పోలీసులు తమకు తట్టిన ఆలోచనతో చాతిపై వత్తిడి చేసి ఊపిరి పీల్చుకొనే విధంగా ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న కారులో మన్యానాయక్ను ఎక్కించుకుని కానిస్టేబులే డ్రైవింగ్ చేసుకుంటూ ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంటనే డాక్టర్లు వైద్యం అందించారు. ఆసుపత్రికి సకాలంలో తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు తెలిపారు. తన భర్త ప్రాణాలు కాపాడటంలో దేవుడే ఆ ఇద్దరు పోలీసులను పంపించాడని, వారి సహాయాన్ని జీవితంలో మర్చిపోలేనని రోదిస్తూ పేర్కొంది. ఇద్దరు పోలీసులను వైద్యులు, తోటి పోలీసులు, మండల వాసులు అభినందించారు. పోలీసులు శాంతి భద్రతల రక్షణే కాదు.. సమయానుకూలంగా సమాజ సేవలోనూ తమవంతు కృషి చేస్తారని నిరూపించారు. నిండు ప్రాణం కాపాడినందుకు వారికి హ్యాట్యాఫ్. -
భార్య మృతిని తట్టుకోలేక భర్త కన్నుమూత
మనూర్ : భార్య మృతిని తట్టుకోలేక మనస్తాపానికి గురైన భర్త అకస్మాత్తుగా కన్నుమూయడంతో వారి నలుగురు పిల్లలు అనాథలయ్యారు. ఈ సంఘటన మెదక్ జిల్లా మనూర్ మండలం కర్సగుర్తి పంచాయతీ పరిధిలోని గంగారం తండాలో శనివారం వెలుగుచూసింది. తండాకు చెందిన మరునిబాయి అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో ఆమె భర్త దేవిదాస్(45) గుండెపోటుకు గురై మృతిచెందాడు. తల్లిదండ్రులిద్దరు మృతిచెందడంతో నలుగురు పిల్లలు అనాథలయ్యారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలవరంపై అమిత్ షాకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement