breaking news
Haveri District
-
దైవ దర్శనానికి వెళ్లొస్తూ మృత్యుఒడికి 13 మంది..
బెంగళూరు, సాక్షి: కర్ణాటకలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హవేరి జిల్లా నేషనల్ హైవేపై ఆగి ఉన్న ట్రక్కును ఓ మినీవ్యాన్ కొట్టడంతో 13 మంది మృతి చెందారు. వీళ్లంతా ఒకే గ్రామానికి చెందిన వాళ్లని, దైవదర్శనానికి వెళ్లొస్తుండగా ఈ ఘోరం జరిగిందని పోలీసులు తెలిపారు.బ్యాడ్గి మండలం పుణేబెంగళూరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్రక్కును శుక్రవారం వేకువ జామున ఓ మినీ వ్యాన్ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వ్యానులోని 13 మంది అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన మరో నలుగురిని ఆస్పత్రికి తరలించారు. నిద్రమత్తు, అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. ప్రమాద తీవ్రతకు ట్రక్కులోకి మినీ వ్యాన్ దూసుకెళ్లింది. దీంతో అతికష్టం మీద మృతదేహాల్ని పోలీసులు బయటకు తీయగలిగారు. మృతులంతా శివమొగ్గ జిల్లా భద్రావతి మండలం ఎమ్మిహట్టి గ్రామస్తులుగా పోలీసులు నిర్ధారించారు. బెలగావి సవదత్తిలోని ఆలయానికి వెళ్లి వస్తుండగా గుండెనహళ్లి సమీపంలో శుక్రవారం పొద్దున నాలుగు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. -
భయపెడుతున్న కండ్లకలక, వేలల్లో కేసులు నమోదు!
బనశంకరి(బెంగళూరు): కరోనా మరణాల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిన హావేరి జిల్లా ప్రస్తుతం మద్రాస్ ఐ కండ్లకలక కేసుల్లోనూ మొదటిస్థానంలో నిలిచింది. 9901 మంది కండ్లకలక బారినపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 64,506 కండ్లకలక కేసులు వెలుగు చూడగా బీదర్ జిల్లా రెండోస్థానంలో నిలిచింది. మూడో స్థానంలో శివమొగ్గ ఉంది. కండ్లకలక బాధితులు హావేరి జిల్లా ఆసుపత్రిలో వేలాదిమంది చికిత్స తీసుకుంటున్నారు.కాగా ఇటీవల రైతుల ఆత్మహత్యల్లో కూడా భారీ చర్చకు దారితీసింది. రెండునెలల్లో 18 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. చదవండి: రూపాయికే ఇడ్లీ..ఆహా ఏమి రుచి -
పాలు ఇస్తున్న మేకపోతు
యశవంతపుర: మేకపోతు పాలు ఇస్తున్న విచిత్రం హావేరి జిల్లా హనగల్ తాలూకా నరేగల్ గ్రామంలో జరిగింది. చమన్ షావలి అనే గ్రామస్తుడు ఒక మేక పోతును సాకుతున్నారు. ఏడాదిన్నర వయస్సు ఉన్న ఈ మేకపోతు కొద్దిరోజులుగా పాలు ఇస్తోందని చెప్పాడు. చుట్టుపక్కలవారు మొదట నమ్మలేదు. దీంతో వారి ముందే పాలు పితకడంతో చూసినవారు ఆశ్చర్యపోయారు. కొన్నిసార్లు హార్మోన్లలో మార్పుల వల్ల ఇలా జరుగుతుందని పశువైద్యాధికారులు చెప్పారు. (చదవండి: కొడుకు పుట్టాడన్న సంతోషం.. అదే రోజు రాత్రి స్వీట్లు తీసుకొని..) -
ఆమె బీకాం, అతడు డిప్లొమా.. ఇద్దరూ ఉరేసుకున్నారు
సాక్షి, బనశంకరి: కలిసి జీవించడానికి పెద్దలు అడ్డుపడ్డారన్న ఆవేదనతో ప్రేమ జంట తనువు చాలించింది. హావేరి తాలూకా నాగనూరు గ్రామానికి చెందిన విద్యాశ్రీ గాలి (22), ఇర్షాద్ కుడచి (23) ఆత్మహత్య చేసుకున్నారు. మూడేళ్లుగా వీరులో ప్రేమలో మునిగి తేలుతున్నారు. విద్యాశ్రీ బీకాం చదువుతుండగా, ఇర్షాద్ కుడచి డిప్లొమా పూర్తిచేశాడు. ఇటీవల విద్యాశ్రీకి తల్లిదండ్రులు ఓ యువకునితో నిశ్చితార్థం చేశారు. ప్రేమకు దూరం కావడం ఎంతమాత్రం ఇష్టలేని విద్యాశ్రీ, ఇర్షాద్ కలిసి శనివారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: తోటి ఉద్యోగే ప్రేమిస్తున్నానంటూ వేధింపులు.. దీంతో ఆ మహిళ.. -
అదృశ్యమైన మేక.. ఎక్కడుందో తెలియక...
హుబ్లీ: మేకను పట్టండి.. పది వేల రూపాయలు పట్టుకెళ్లండి. ఇదేదో వాణిజ్య ప్రకటన అనుకోకండి. పశ్చిమబెంగాల్ లోని హవేరి జిల్లాలోని నెగలూర్ గ్రామస్థులు ఈ ప్రకటన చేశారు. దీంతో తప్పిపోయిన మేకకు పట్టుకునేందుకు గ్రామస్థులతో పాటు అందరూ గాలిస్తున్నారు. ఒక్క మేకకు పట్టుకునేందుకు పది వేలా అని ఆశ్చర్యపోకండి. దీని వెనుక చాలా కథ ఉంది. ఇది గ్రామంలోని మసీదుకు చెందినది. 11 ఏళ్ల క్రితం కొందరు భక్తులు దీన్ని మసీదుకు కానుకగా ఇచ్చారు. దీంతో ఈ మేకపై గ్రామస్థులకు అవాజ్యమైన భక్తి ఏర్పడింది. అన్ని పండుగలు, మత కార్యక్రమాల్లోనూ ఇది ప్రధాన ఆకర్షణ నిలిచేది. కొద్ది రోజుల క్రితం ఈ మేక అదృశ్యమైంది. దీని ఆచూకీ చేసిన గ్రామస్థులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక చేసేది లేక భారీ నజారానా ప్రకటించారు. తమ అభిమాన మేకను తెచ్చిన వారికి రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. మేక ఆచూకీ కోసం పోస్టర్లు కూడా పెట్టారు. ఈ మేకతో తమకు విడదీయలేని అనుబంధం ఉందని గ్రామస్థులు తెలిపారు. తామెంతో అభిమానంగా చూసుకునే మేక మాయమవడం తమను షాక్కు గురి చేసిందని అన్నారు. కావాలనే ఎవరో తమ మేకను ఎత్తుకు పోయారని వారు ఆరోపిస్తున్నారు. దయచేసి తమ మేకకు తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. మేక కోసం గ్రామస్థులు పడుతున్న తపన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. -
మొన్న పాలమూరులో.. నేడు కర్ణాటకలో అదే ఘోరం
* మరో వోల్వో బస్సు బుగ్గి.. డ్రైవర్ సహా ఏడుగురు సజీవ దహనం * వేగంగా వంతెన రెయిలింగ్ను ఢీకొట్టడమే ప్రమాదానికి కారణం * బెంగళూరు నుంచి ముంబై వెళ్తుండగా కునిమల్లహళ్లి వద్ద ఘటన * డీజిల్ ట్యాంక్ పగలడంతో అంటుకున్న మంటలు * మహబూబ్నగర్ ఘోర ప్రమాదం మరవకముందే మరో విషాదం * రెండు ఘటనల్లో 52 మంది సజీవ దహనం.. కళ్లు తెరవని ప్రభుత్వాలు * వోల్వో బస్సు అంటేనే హడలెత్తిపోతున్న ప్రయాణికులు * ప్రమాదాలకు కారణం అతి వేగమే.. ఈ బస్సుల వేగం 100 కి.మీ * మించకుండా ‘లాక్ సిస్టమ్’.. ఆ ‘లాక్’ తెరిచేస్తుండడంతో ప్రమాదాలు దావణగెరె, న్యూస్లైన్/సాక్షి, హైదరాబాద్/బెంగళూరు: మళ్లీ అదే ఘోరం.. అవే మంటలు.. అదే వోల్వో బస్సు.. పక్షం రోజులు తిరగకుండానే దారుణం.. మహబూబ్నగర్ జిల్లాలో కిందటి నెల 30న చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది సజీవ దహనమైన ఘటన కళ్లముందు కదలాడుతుండగానే కర్ణాటకలో అచ్చం అదే తరహాలో మరో బస్సు భస్మీపటలమైంది! ఏడుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. బుధవారం అర్ధరాత్రి సుమారు మూడు గంటల సమయంలో హావేరి జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో కునిమల్లహళ్లి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి ముంబై వెళ్తున్న ఈ బస్సు వరదా నదిపై నిర్మించిన బ్రిడ్జి రెయిలింగ్ను బలంగా ఢీకొనడంతో డీజిల్ ట్యాంకు పగిలి క్షణాల్లో మంటలు వ్యాపించాయి. బస్సులో మొత్తం ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ సహా 53 మంది ఉండగా.. అందులో ఓ డ్రైవర్తోపాటు ఆరుగురు మృతి చెందారు. మిగతావారు గాయాలతో బయటపడ్డారు. మహబూబ్నగర్ జిల్లాలో కాలిపోయింది జబ్బార్ ట్రావెల్స్కు చెందిన వోల్వో బస్సు కాగా.. ఇప్పుడు నేషనల్ ట్రావెల్స్కు చెందిన వోల్వో బస్సే కావడం గమనార్హం. బస్సులో 53 మంది: ప్రమాదానికి గురైన సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్తోపాటు ప్రయాణికుల్లో 43 మంది పురుషులు, ఆరుగురు మహిళలు, ఏడేళ్ల చిన్నారి.. మొత్తం 53 మంది ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరులోని ఎనిమిది పికప్ పాయింట్లలో ప్రయాణికులను ఎక్కించుకున్న ఈ బస్సు బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు బయలుదేరింది. గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు బస్సు ముంబై చేరుకోవాలి. బస్సు తుమకూరు దాటిన తర్వాత రెండో డ్రైవర్ స్టీరింగ్ను అందుకున్నారు. అయితే హవేరీ జిల్లాలోని కునిమల్లహళ్లి వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. మొదటి డ్రైవర్ సహా ఏడుగురు మరణించారు. 44 మంది గాయాలతో, ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. నయాజ్(అదనపు డ్రైవర్), రోహన్, జమీర్, సమీరాబాను - కలీం (దంపతులు), కైఫ్, అమాన్లు మృతి చెందినట్లు భావిస్తున్నారు. గందరగోళంగా ప్రయాణికుల జాబితా ఈ బస్సులో ప్రయాణించినవారు ఎవరెవరన్న విషయంపై గందరగోళం నెలకొంది. బెంగళూరులోని ఆ సంస్థ కార్యాలయంలో ఉన్న రిజర్వేషన్ చార్ట్లో ఉన్న పేర్లు.. ప్రమాదంలో గాయపడిన వారి పేర్లకు పొంతన (ఒకరి పేరుతో రిజర్వ్ చేసుకుని.. మరొకరు ఎక్కడం వల్ల) కుదరడం లేదు. ప్రమాదం నుంచి గాయాలతో బయట పడిన వారిలో షహద్ ఇబ్రహీం, జమాలుద్దీన్, సయ్యద్ షా షేర్వానీ, సోహన్ లాల్, ఉమత్ అహ్మద్, ప్రశాంత్ పాండే, జన్నత్, మసీ, వజీర్సాబ్, రాజన్ కుమార్, జేరారామ్ తేరా, ముస్రా కాటన్, మహ్మద్ వజీర్, సోనూ, అంబాత్, నరేష్ జైన్, అజయ్ కుమార్, గణేష్ గుప్తా, రంజిత్ కుమార్, సోలియా ఖాన్, విశ్రాంత్, గోకుల్ ఠాక్రే, మహ్మద్ జమీర్, అశ్విని కుమార్ జైన్, రియాజ్ కుమార్ నాయక్, మీరాచౌదరి, మనీఫ్, వజీం, గౌరవ్, మూవీ, ఇలియాజ్ఖాన్, షానా, పప్పు, దిలీప్కుమార్, శోభాలక్ష్మణ్, వరుణ్, మనోజ్కుమార్, నేహాల్, నాగేష్, సలీంఖాన్, మనోజ్పాటిల్, మహ్మద్ అస్మా, బ్రైట్, రేవణ సిద్ధయ్య ఉన్నారు. ఈ లెక్కన మతి చెందిన ఏడుగురితో పాటు డ్రైవర్లతో కలిపి బస్సులో 53 మంది ప్రయాణించినట్లు తెలుస్తోంది. ట్యాంకు పగిలి మంటలంటుకున్నాయి: ఎస్పీ బస్సు వేగంగా వచ్చి బ్రిడ్జి రెయిలింగ్ను ఢీ కొట్టడంతో డీజిల్ ట్యాంకు పగిలి మంటలు అంటుకున్నాయని అంచనాకు వచ్చినట్లు హావేరి ఎస్పీ ఎం. శశికుమార్ తెలిపారు. బస్సు రెయిలింగ్ను ఢీకొట్టాక 150 మీటర్ల దూరం దూసుకుపోయిందని, డ్రైవర్ బ్రేకులు వేయగానే మంటలు అంటుకున్నాయని అన్నారు. ముగ్గురు సంఘటనా స్థలంలోనే మరణించగా.. నలుగురు ఆస్పత్రికి తరలించే దారిలో మరణించారని తెలిపారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడని, క్లీనర్ గాయాలతో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రూ.లక్ష చొప్పున నష్ట పరిహారాన్ని ప్రకటించారు. కిమ్స్ మార్చురీలో మృతదేహాలు దుర్ఘటనలో మరణించిన వారి మృతదేహాలను హుబ్లీలోని కిమ్స్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ట్రావెల్ ఏజెన్సీ నుంచి ప్రయాణికుల సమాచారం సేకరించిన తర్వాత మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి సంబంధీకులకు అందజేస్తామని హవేరి కలెక్టర్ పాండురంగ నాయక్ తెలిపారు. సమగ్ర దర్యాప్తు జరుపుతామని తెలిపారు. మృతి చెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. సమీర్భాను, కలీం భార్యభర్తలు కాగా మహమ్మద్ కైఫ్(3)ను వారి కుమారుడిగా గుర్తించారు. అయితే మరో ఇద్దరు పిల్లలు కూడా వీరి కుమారులే కావచ్చని భావిస్తున్నారు. ఆ ఇద్దరి సమయస్ఫూర్తే అందర్ని కాపాడింది ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న ఇద్దరు యువకుల సమయస్ఫూర్తి వల్లే ప్రాణ నష్టం తగ్గింది. వారిలో ఒకరు ఢిల్లీకి చెందిన ప్రశాంత్ కాగా.. మరొకరు అఫ్తాబ్. బస్సు ప్రమాదానికి గురైన విషయం వెనువెంటనే గమనించిన ప్రశాంత్(25) అప్రమత్తమయ్యాడు. నిద్రలో ఉన్న తోటి ప్రయాణికులను కేకలు వేస్తూ మేల్కోలిపి బస్సు అద్దాలు పగులగొట్టి వారు బయటకు వెళ్లేందుకు సహకరించాడు. అదేసమయంలో అప్పటికే బస్సులో మెలకువగా ఉన్న అఫ్తాబ్ మంటలు వ్యాపించిన విషయాన్ని గమనించి, బస్సు పైభాగంలో గాలి కోసం అమర్చి ఉన్న చిన్నపాటి డోర్ను తెరిచి.. అందర్నీ అటు రావాల్సిందిగా సూచిస్తూ తాను బయటకొచ్చాడు. వెను వెంటనే 22 మంది అతడిని అనుసరించి బయటపడ్డారు. అయితే సజీవ దహనమైన వారిలో ఓ చిన్నారి ఉండడం అందరినీ కలిచి వేసింది. ప్రమాదాన్ని గుర్తించిన చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకునేలోపే బస్సు పూర్తిగా దగ్ధమైంది. దీంతో వారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. తగులబడుతున్న బస్సులో నుంచి ప్రయాణికులను కాపాడేందుకు ప్రాధాన్యతనిచ్చిన ప్రశాంత్, అఫ్తాబ్ను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హెచ్కే పాటిల్ ప్రశంసించారు. క్షణాల్లో జరిగిపోయింది ‘‘ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. నాకు నిద్ర పట్టకపోవడంతో మేలుకునే ఉన్నాను. ఇంతలోనే ఉన్నట్లుండి పెద్ద శబ్దం వచ్చింది. తేరుకునేలోపే బయట నుంచి మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా వేడి తగలడంతో తల్లడిల్లిపోయాం. నా వెనుక ఉన్న వ్యక్తి ఎవరో కిటికీ పగులగొట్టాడు. వెంటనే కిటికీలోంచి నా భార్యను బయటికి తోసేసి నేనూ దూకేశాను.’’ - రాజీవ్ కుమార్, ముంబై మేల్కొని ఉన్నాను కాబట్టే బతికాను.. ‘‘ఎందుకో ప్రమాదానికి కాస్త ముందే మెలకువ వచ్చింది. కర్టెన్ పక్కకు జరిపి విండోలోంచి బయటకు చూస్తున్నాను. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి బస్సు రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొని ఆగిపోయింది. ఆ వెంటనే క్షణాల్లో మంటలు వ్యాపించాయి. కిటికీ అద్దం పగులగొట్టడానికి ప్రయత్నించాను. కాలితో పలుమార్లు గట్టిగా తన్నినా పగలలేదు. పైకి చూడగానే కిటికీ కాస్త తెరుచుకుని కనిపించింది. గట్టిగా పైకి తోయడంతో మనిషి దూరేంత ఖాళీ ఏర్పడింది. ఇలా రండి అంటూ గట్టిగా అరిచి.. నేనూ బస్సు పైకి ఎక్కి ఆ వెంటనే కిందకు దూకాను. కాలు బెణికింది. నా వెనుకే చాలా మంది బస్సుపెకైక్కి.. ఆపై కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.’’ - ఆఫ్తాబ్, న్యూఢిల్లీ బచావ్.. బచావ్.. కేకలు ‘‘నిద్రలో ఉన్నాను. ఒక్కసారిగా గట్టిగా అరుపులు.. బచావ్.. బచావ్..(కాపాడండి.. కాపాడండి..) అంటూ గావు కేకలు వినిపించాయి. ఏం జరిగిందో అర్థం కాలేదు. బస్సు తగలబడిపోతోందని కేకలు వేస్తున్నారు. ఒకరిపై ఒకరు పడుతూ లేస్తున్నారు. ఎలా తప్పించుకోవాలో తెలియడం లేదు. ఓ యువకుడు బస్సు పైభాగంలో ఉన్న విండో ఓపెన్ చేసి పెకైక్కాడు. నేనూ అతన్ని అనుసరించి బయటపడ్డాను’’ - దిలీప్ షిండే, సతార, మహారాష్ట్ర -
కర్నాటక హవేరిలో ఘోర బస్సు ప్రమాదం
కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి ముంబై వెళుతున్న నేషనల్ ట్రావెల్కు చెందిన వోల్వో బస్సు ఈ తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో హవేరీ జిల్లాలోని కునిమల్లళ్లిలో ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. 25 మంది గాయపడ్డారు. వీరిని హుబ్లీలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 49 మంది ప్రయాణికులున్నారు.