GVK organization
-
‘108’ అక్రమాలపై విచారణ జరపాలి
ముషీరాబాద్: 108లో జీవీకే సంస్థ అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 108 ఉద్యోగుల సమ్మెపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కోదండరాం, 108 ఉద్యోగ సంఘాల అధ్యక్షులు మహేందర్రెడ్డి, అశోక్, తెలంగాణ ఉద్యోగ సంఘం నేతలు రాజేందర్, మామిడి నారాయణ, అబ్బాస్, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. కోదండరాం మాట్లాడుతూ..జీవీకే చేసుకున్న ఒప్పందం ప్రకారం ఒక్కో వాహనానికి లక్షా 20 వేల 265 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. 2014 -15 సంవత్సరానికి ప్రభుత్వం జీవీకేకు 3 కోట్ల 79 లక్షల 91 వేల 416 రూపాయలు చెల్లించిందన్నారు. అయితే 230 నుంచి 250 మాత్రమే 108 వాహనాలు రోడ్లపై తిప్పారని, మిగిలిన వాహనాలు ఎక్కడికి పోయాయని, వాటి ఖర్చును కూడా ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నారని ఆరోపించారు. ఏసీబీ విచారణ జరిపి, అక్రమాలు వెల్లడవుతున్న క్రమంలో కేసును తొక్కి పట్టే ప్రయత్నం జీవీకే చేస్తుందని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. న్యాయం జరగడం లేదు: విమలక్క దోమలగూడ : 108 ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 9 రోజులుగా జరుగుతున్న సమ్మెలో భాగంగా శుక్రవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ చైర్మన్ అరుణోదయ విమలక్క మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న తెలంగాణలోనూ మనకు న్యాయం జరగడం లేదన్నారు. తెలంగాణ 108 ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహేందర్రెడ్డి, అశోక్ తదితరులు పాల్గొని మాట్లాడారు. -
108 ఉద్యోగుల సమ్మె
- నిలిచిన అత్యవసర సేవలు - కదలని 32 వాహనాలు - ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులు ఆదిలాబాద్ టౌన్ : అపర సంజీవని 108 సేవలపై సమ్మె దెబ్బపడింది. ఈ నెల 7న జీవీకే సంస్థకు ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. చర్చలు విఫలం కావడంతో గురువారం నుంచి ఉద్యోగులు సమ్మె చేపట్టారు. అత్యవసర వైద్య సేవలకు ఉద్యోగులు దూరంగా ఉన్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 32 వాహనాలు రోడ్డెక్కలేదు. జిల్లాలో 155 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో ఈఎం టీలు 80 మంది, పెలైట్లు 75 మంది సమ్మెలో పాల్గొన్నారు. రోజు కనీసం 160 నుంచి 170 మం దిని ప్రమాదాల్లో గాయపడిన వారిని అత్యవసర వైద్యం కోసం వివిధ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. వీరు సమ్మె చేయడంతో బాధితులకు సమయానికి వైద్యం అందడం లేదు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని ఉద్యోగ సంఘం నాయకులు స్పష్టం చేస్తున్నారు. వైద్య శాఖ, 108 అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల 108 సేవల్లో ఖాళీగా ఉన్న పోస్టులకోసం ఇంట ర్వ్యూలు నిర్వహించారు. వారి ద్వారా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న ట్లు తెలుస్తోంది. 54 మంది పారామెడికల్ సిబ్బందిని నియమించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇటీవల ఇంటర్వ్యూలు జరిగాయని, వారితో విధు లు నిర్వర్తించేందుకు చర్యలు తీసుకుం టున్నామని జిల్లా అధికారి ఒకరు తెలిపారు. డిమాండ్లు ఇవీ.. - తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి. - ఉద్యోగ భద్రత కల్పించాలి. - కనీస వేతనాలు అమలు చేయాలి. - పనిగంటలు 12 గంటల నుంచి 8 గంటలకు తగ్గించాలి. - 108 వాహనాల నిర్వహణ ప్రభుత్వం తీసుకోవాలి. - తెలంగాణ ప్రభుత్వం వంద శాతం నిధులు కేటాయించాలి. - ఉద్యోగులకు ఉచిత బస్సు పాసు సౌకర్యం కల్పించాలి. - ఉద్యోగులు ఉన్నచోట మౌలిక సదుపాయాలు కల్పించాలి. - ఉద్యోగులను సొంత జిల్లాలకు బదిలీ చేయాలి. - ఉద్యోగులకు ప్రమాద బీమా రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి.