breaking news
Guru Sai Dutt
-
పురుషుల సింగిల్స్ సెమీస్లో గురుసాయిదత్
హైదరాబాద్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాళ్లు గురుసాయిదత్, సమీర్ వర్మ సెమీఫైనల్కు చేరారు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో గురుసాయిదత్ 13–21, 22–20, 21–11తో లిమ్ చి వింగ్ (మలేసియా)పై; సమీర్ 16–21, 26–24, 21–7తో ప్రతుల్ జోషి (భారత్)పై నెగ్గారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీకృష్ణప్రియ 12–21, 12–21తో యో జియా మిన్ (సింగపూర్) చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంట 22–20, 14–21, 21–17తో యోంగ్ మింగ్ నోక్–ఎన్జీ సాజ్ యావు (హాంకాంగ్) జోడీపై గెలిచింది. -
క్వార్టర్స్లో శ్రీకృష్ణప్రియ, గురుసాయిదత్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) టూర్ సూపర్–100 హైదరాబాద్ ఓపెన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్లు కుదరవల్లి శ్రీకృష్ణప్రియ, గురుసాయిదత్ క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. మిక్స్డ్ డబుల్స్లో టాప్సీడ్ సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీ కూడా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండోరౌండ్లో ఐదో సీడ్ శ్రీకృష్ణ ప్రియ 21–15, 21–18తో నున్టకర్న్ ఎమ్సార్డ్ (థాయ్లాండ్)పై గెలుపొందింది. మరో మ్యాచ్లో రసిక రాజే (భారత్) 21–19, 21–16తో చెంగ్ యింగ్ మయ్ (హాంకాంగ్)ను ఓడించి క్వార్టర్స్కు చేరుకుంది. పురుషుల విభాగంలో సమీర్ వర్మ, ప్రతుల్ జోషి, గురుసాయిదత్ క్వార్టర్స్లో అడుగుపెట్టారు. పురుషుల సింగిల్స్ మూడోరౌండ్ మ్యాచ్ల్లో టాప్ సీడ్ సమీర్వర్మ (భారత్) 21–14, 21–9తో కెవిన్ అరోకియా వాల్టేర్ (భారత్)పై, గురుసాయిదత్ 21–14, 21–13తో డేనియల్ ఫరీద్ (భారత్)పై గెలుపొందగా... ఐదోసీడ్ సౌరభ్ వర్మ 21–14, 13–21, 19–21తో ప్రతుల్ జోషి చేతిలో పోరాడి ఓడిపోయాడు. మరో మ్యాచ్లో చిరాగ్ సేన్ 16–21, 18–21తో అబ్దుల్ (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్లు సాత్విక్ సాయిరాజ్, సిక్కిరెడ్డి తమ భాగస్వాములతో కలిసి క్వార్టర్స్కు చేరుకున్నారు. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా ద్వయం 21–10, 22–20తో యెంగ్ షింగ్ చోయ్– ఫాన్ కా యాన్ (హాంకాంగ్) జోడీపై నెగ్గి క్వార్టర్స్ చేరుకుంది. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో టాప్సీడ్ సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–13, 21–17తో బగాస్ మౌలానా–ప్రెంకీ విజయ పుత్ర (ఇండోనేసియా) జోడీపై, కోన తరుణ్ (భారత్)–లిమ్ ఖిమ్ వా (మలేసియా) జంట 21–23, 24–22, 22–20తో సుపక్ జోమ్కో–వచిరవిట్ సోథాన్ (థాయ్లాండ్) జోడీలపై నెగ్గి క్వార్టర్స్కు చేరుకున్నాయి. ఇతర మ్యాచ్ల్లో గారగ కృష్ణ ప్రసాద్–ధ్రువ్ కపిల జంట 16–21, 18–21తో నాలుగో సీడ్ అరుణ్ జార్జ్–సన్యం శుక్లా జోడీ చేతిలో, విష్ణువర్ధన్ గౌడ్–పొదిలె శ్రీకృష్ణ సాయికుమార్ జంట 10–21, 15–21తో అక్బర్ బింటాంగ్–మోహ్ రిజా పహ్లెవి (ఇండోనేసియా) జోడీ చేతిలో పరాజయం పాలయ్యాయి. మహిళల డబుల్స్ విభాగంలో జక్కంపూడి మేఘన–పూర్విషా రామ్ జంట 21–17, 21–9తో కావ్య గుప్తా–ఖుషి గుప్తా జోడీపై నెగ్గి రెండోరౌండ్లో అడుగుపెట్టింది. -
మెయిన్ ‘డ్రా’కు గురుసాయిదత్
ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ సిడ్నీ: రియో ఒలింపిక్స్ ముందు జరుగుతున్న చివరి సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో హైదరాబాద్ ప్లేయర్ ఆర్.ఎం.వి. గురుసాయిదత్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి మ్యాచ్లో గురుసాయిదత్ 21-7, 21-14తో ఫారిమన్ (ఆస్ట్రేలియా)పై... రెండో మ్యాచ్లో 21-16, 21-12తో జియాన్ చియాంగ్ (మలేసియా)పై గెలిచాడు. బుధవారం మెయిన్ ‘డ్రా’ మ్యాచ్లు మొదలవుతాయి. భారత్ తరఫున మహిళల సింగిల్స్లో సైనా నెహ్వాల్, పీవీ సింధు, తన్వీ లాడ్... పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ బరిలో ఉన్నారు. బుధవారం జరిగే మ్యాచ్ల్లో లాయ్ (ఆస్ట్రేలియా)తో సైనా; మిన్ (దక్షిణ కొరియా)తో సింధు; టిఫానీ (ఆస్ట్రేలియా)తో తన్వీ లాడ్... అంగుస్ (హాంకాంగ్)తో శ్రీకాంత్; హు యున్ (హాంకాంగ్)తో గురుసాయిదత్; ముస్తఫా (ఇండోనేసియా)తో సమీర్ వర్మ తలపడతారు.