-
ఇక జన్మలో చంద్రబాబు సీఎం కాలేడు: మంత్రి కొడాలి నాని
-
తప్పుడు కథనాలు రాయడమే ఎల్లో మీడియా పనిగా పెట్టుకుంది: కొడాలి నాని
-
అక్రమ కేసులకు అదరం... బెదరం
బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం రైతులను దెబ్బతీసే అధికార పార్టీ నేతలే టార్గెట్ అక్రమ కేసులకు భయపడేది లేదు ప్రభుత్వానికి వైఎస్సార్ సీపీ నేతల హెచ్చరిక విజయవాడ : ప్రజాందోళనలకు అండగా నిలబడటంతో పాటు రైతుల పక్షాన బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని)పై పోలీసు కేసుల నేపథ్యంలో ఆ పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు రెండు రోజులుగా సమావేశమై చర్చించారు. బుధ, గురు వారాల్లో కృష్ణా జిల్లా ఇన్చార్జి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లాలో పర్యటించారు. పేర్ని నానిని పరామర్శించారు. ఉద్యమానికి భరోసా ఇచ్చారు. అణచివేస్తే తిరుగుబాటు తప్పదు.. అణచివేత చర్యల ద్వారా పాలన ఎంతోకాలం సాగించలేరని, ప్రజల నుంచి వచ్చే తిరుగుబాటుకు వారే కారణమవుతారని నాయకులు హెచ్చరించారు. గురువారం మంత్రి కొల్లు రవీంద్ర బందరులోని ఆర్అండ్బీ బంగళాలో టీడీపీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి భూ సేకరణ నుంచి బుద్దాలపాలెం, బొర్రపోతుపాలెం గ్రామాలను మినహాయించనున్నట్లు చెప్పడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అందులో ఆంతర్యమేమిటని నేతలుప్రశ్నించారు. గ్రామాల మధ్య చిచ్చు.. గ్రామాల మధ్య చిచ్చుపెట్టే విధంగా మంత్రి కొల్లు వ్యవహార శైలి ఉందని నాయకులు అభిప్రాయపడ్డారు. పోర్టుకు 4800 ఎకరాలు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని రైతులు చెబుతున్నారని, పరిశ్రమల పేరుతో 30 వేల ఎకరాలు స్వాధీనం చేసుకోవడానికి వ్యతిరేకంగా పోరాటం చేయటాన్ని ఎవ్వరూ ఆపలేరనేది రైతుల పక్షాన వైఎస్సార్సీపీ నాయకులు ప్రకటించారు. కక్ష సాధింపు చర్యలు.. రైతుల పక్షాన పోరాటం చేస్తున్న వైఎస్సార్ నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపునకు పాల్పడుతుంటే, చట్టాన్ని రక్షించాల్సిన అధికారులు వారికి వంతపాడుతున్నారని ఆరోపిస్తుంచారు. కలెక్టర్ కూడా భూ సేకరణ చట్టాన్ని అమలు చేసే ప్రక్రియలో భాగంగా మంత్రి మాటలకు విలువిస్తున్నారని అభిప్రాయపడ్డారు. వర్షాలతో తీవ్ర నష్టం.. జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని, తెగిపోయిన రోడ్లు, చెరువులకు మరమ్మతులు వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని పార్టీ ఇన్చార్జి రామచంద్రారెడ్డి కోరారు. ఎమ్మెల్యేల ద్వారా ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యల గురించి వివరించాలని నిర్ణయించారు. పలు ప్రాంతాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు రామచంద్రారెడ్డి దృష్టికి పలువురు నాయకులు తీసుకొచ్చారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
ఇండియా కూటమితో విభేదాలు.. వెనక్కి తగ్గిన దీదీ
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తప్పక చదవండి
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement