-
27 నుంచి మరో 2 గ్యారంటీల అమలు
హుజూర్నగర్ (సూర్యాపేట)/ సింగరేణి(కొత్తగూడెం): కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఈనెల 27 నుంచి మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం నక్కగూడెం గ్రామంలో రూ 37.70 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పునరుద్ధరణ పనులకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో భట్టి మాట్లాడుతూ...ఈనెల 27 నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ పథకాలకు చేవెళ్లలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ శ్రీకారం చుడతారని చెప్పారు. త్వరలో రాష్ట్రంలోని మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని చెప్పారు. గిరిజనులకు పోడు పట్టాలు అందించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.సభ అనంతరం దొండపాడుకు వెళ్తూ మార్గమధ్యలో మిరపతోట వద్ద మంత్రులు కారు దిగి వెళ్లి కూలీలతో ముచ్చటించారు. ఆర్టీసీ బస్సులు ఎక్కుతున్నారా.. టికెట్ తీసుకుంటున్నారా అని మహిళలను అడిగారు. అందుకు వారు బదులిస్తూ ఉచితంగానే ప్రయాణిస్తున్నామని తెలిపారు. ఈ పొలం ఎవరిది, కూలీ ఎంత ఇస్తున్నారని వారు మహిళలను ఆరా తీశారు. నేడు సోలార్ ప్లాంట్ ప్రారంభం సింగరేణి సంస్థ కొత్తగూడెం ఏరియాలోని కొత్తగా నిర్మించిన సోలార్ విద్యుత్ ప్లాంట్ను భట్టి విక్ర మార్క, ఇతర మంత్రులు ఆదివారం ప్రారంభించనున్నారు. కొత్తగూడెం ఏరియాలో సింగరేణి సంస్థ ఇప్పటికే త్రీఇంక్లైన్లో 48 ఎకరాల్లో రూ.56.76 కోట్లతో 10.5 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్ నిర్మించింది. త్రీఇంక్లైన్, గరిమెళ్లపాడు ప్రాంతాల్లో 37 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. -
27నే మరో 2 గ్యారంటీలు
మేడారం గద్దెలపై సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఆసీనులు కావడంతో శుక్రవారం పోటెత్తిన భక్తజనం(ఇన్సెట్లో) సమ్మక్క గద్దె వద్ద మొక్కుతున్న సీఎం రేవంత్రెడ్డి రూ.500కే గ్యాస్ సిలిండర్, తెల్లరేషన్ కార్డున్న పేదవారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ గ్యారంటీలను 27న ప్రారంభిస్తాం. కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఇచ్చిన ప్రతి హామీ అమలుచేస్తాం. – ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సాక్షిప్రతినిధి, వరంగల్: ఆరు గ్యారంటీల అమలులో భాగంగా రూ.500లకే గ్యాస్ సిలిండర్, తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతీ పేదవారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను ఈనెల 27వ తేదీన ప్రారంభిస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధానకార్యదర్శి ప్రియాంకగాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆయన వెల్లడించారు. ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క–సారలమ్మలను సీఎం శుక్రవారం దర్శించుకున్నారు. తల్లులకు ఆయన నిలువెత్తు బంగారం (66 కిలోల బెల్లం), పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మేడారం మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. ప్రజాసమస్యలు పరిష్కరిస్తున్నామని, ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామని చెప్పారు. రూ.2లక్షల రుణమాఫీపై బ్యాంకులతో చర్చిస్తున్నామని, త్వరలోనే రైతులకు శుభవార్త చెబుతామన్నారు. అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే 25వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మార్చి 2న మరో 6వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఉద్యోగాలు ఇచ్చినా ఇవ్వలేదంటూ మామాఅల్లుడు, తండ్రీకొడుకు తమ ప్రభుత్వంపై గోబెల్స్లా అబద్ధపు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ దోపిడీపై బీజేపీ స్పందించలేదు కాళేశ్వరం ప్రాజెక్టులో దోపిడీ, అక్రమాలు, నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్టు చూపామని, కేసీఆర్ కళ్లు మూసుకొని ఫాంహౌస్లో ఉండటంతోనే ఏపీ సీఎం కృష్ణాజలాలు తరలించుకుపోయారని రేవంత్రెడ్డి విమర్శించారు. రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులతో కేసీఆర్ దివాలా తీయించారని ధ్వజమెత్తారు. కేసీఆర్ పదేళ్లుగా దోపిడీకి పాల్పడుతుంటే పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగిన చందంగా ఏనాడూ ప్రధాని నరేంద్రమోదీ అడ్డుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డపై తాము జ్యుడీషియల్ విచారణకు అనుమతి ఇచ్చిన తర్వాత దానిని సీబీఐకి అప్పగించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారని, పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు కేసీఆర్, కేటీఆర్, ఆ కుటుంబంపై కేసు పెట్టారా, సీబీఐ, ఈడీ, ఐటీ అన్నీ కేంద్రం దగ్గరే ఉన్నా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కేసీఆర్ దోపిడీలో వాటా కోసమే తప్ప దానిపై చర్యలు తీసుకోవాలనే ఆలోచన బీజేపీ నేతలకు లేదన్నారు. త్వరలోనే రిటైర్డ్ హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల ఆధ్వర్యంలో సాగే విచారణను బీఆర్ఎస్ నాయకులు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ నివేదికలు సిద్ధం చేస్తోందని, ఆ ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణ సమాజానికి స్వేచ్ఛ ఇచ్చాం గతంలో జర్నలిస్టులను సచివాలయంలోకి రానివ్వలేదని, ఇప్పుడు ప్రతీ చాంబర్కు వెళ్లే అవకాశం ఉందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. తనను, సీతక్కను గతంలో సచివాలయానికి వెళ్లనివ్వలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందరికీ సచివాలయానికి వెళ్లే స్వేచ్ఛ ఉందని, తెలంగాణ ప్రభుత్వం ఆ స్వేచ్ఛ ఇచ్చిందని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి నిరంతరం చేస్తామని, జాతర వచ్చినప్పుడే కాకుండా నిరంతరం మంత్రులు సీతక్క, కొండా సురేఖ సహాయంతో ఈ ప్రాంత అభివృద్ధిని తాను స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టేందుకు మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టింగుల్లో న్యాయం జరిగిందా లేదా అని ప్రభుత్వ ఉద్యోగులను అడగాలని ఆయన ప్రజలకు సూచించారు. గతంలో నెల చివర వరకు జీతాలు వచ్చేవికావని, మొదటి నెల నాలుగో తేదీన, రెండో నెలలో మొదటి తేదీన ఇవ్వడంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. మీడియా అకాడమీకి త్వరలో చైర్మన్ త్వరలోనే మీడియా అకాడమీకి చైర్మన్ను నియమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. తాము అధికారంలోకి వచ్చి వంద రోజులు కాలేదని, పదేళ్లు ఓపిక పట్టారని, త్వరలోనే జర్నలిస్టుల అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ప్రభుత్వాన్ని తేవడంతోనే జర్నలిస్టుల పని అయిపోలేదని కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టడానికి సహకరించాలని కోరారు. వాళ్ల ఇద్దరి (బీజేపీ–బీఆర్ఎస్నుఉద్దేశించి) సమన్వయం మీకు తెలుసని, ఉదయం, సాయంత్రం మాట్లాడుకుంటున్నారన్నారు. పది సీట్లు బీజేపీకి, ఏడు సీట్లు కేసీఆర్కు మాట్లాడుకొని ఎన్నికలకు రాబోతున్నారని, ఆ చీకటి ఒప్పందాన్ని మీడియా మిత్రులు తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు.చేవెళ్ల సభతో శ్రీకారం..: చేవెళ్లలో భారీ బహిరంగ సభను నిర్వహించి.. ఆ సభలోనే రూ.500కే గ్యా స్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గ్యారంటీలను ప్రియాంకా గాంధీ చేతుల మీదుగా ప్రారంభించను న్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లను శుక్రవారం ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, కలె క్టర్ శశాంక, ఇతర అధికారులు పరిశీలించారు. మేడారం సందర్శనకు మోదీ, అమిత్ షా రావాలి దక్షిణ కుంభమేళాలాంటి మేడారం మహాజాతరకు కోటిన్నర మంది భక్తులు వస్తున్నా కేంద్ర ప్రభుత్వం జాతీయ పండగగా గుర్తించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాము ఎన్నిసార్లు కోరినా అలా కుదరదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి అంటున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తర భారతం, దక్షిణ భారతం అనే వివక్ష చూపడం సరికాదని హితవు పలికారు. దక్షిణ భారతమనే కాదు ప్రపంచంలోనే సమ్మక్క–సారలమ్మ జాతరకు ఒక గుర్తింపు ఉందని, వారి వీరోచిత పోరాటానికి చరిత్ర పుటల్లో స్థానం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయొద్దని, ప్రధానమంత్రి వచ్చి దర్శించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ, ధనసరి సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్బాబు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు మామిడాల యశస్వినిరెడ్డి, గండ్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
TS: మరో రెండు గ్యారెంటీల అమలుకు ముహూర్తం ఫిక్స్
సాక్షి, హైదరాబాద్: మరో రెండు గ్యారెంటీల అమలుకు తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. గృహలక్ష్మీ, రూ.500కే సిలిండర్ పథకాలను ఈ నెల 27 లేదా 29న ప్రారంభించాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. అర్హులందరికీ లబ్ధి చేకూరేలా అధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. మార్చి నెల నుంచి 200 యూనిట్లు లోపు కరెంట్ వాడే వారికి జీరో బిల్లు వేయాలని ఆదేశించారు. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అర్హుల ఖాతాలో వేయాలా లేక ఏజెన్సీకి ఇవ్వాలా అనేదానిపై అధికారులు ఈజీ ప్రాసెస్ చేయాలని సూచించారు. సబ్సిడీ నిధులు వెంట వెంటనే చెల్లించే విధానం ఏర్పాట్లు చేయాలన్నారు. రేషన్ కార్డు, లేక ఇతర కారణాల వల్ల పథకాలకు దరఖాస్తు చేసుకోని వారికి మళ్లీ అవకాశం ఇస్తామని సీఎం పేర్కొన్నారు. ఇదీ చదవండి: కాంగ్రెస్లో రేవంత్ కొత్త పోకడలు! -
బఘెల్కు ‘బోనస్’ దక్కలేదు
ఛత్తీస్గఢ్లో అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. రెండు పారీ్టలూ అంతే పోటాపోటీగా సంక్షేమ, ప్రజాకర్షక పథకాలను ప్రకటించాయి. వరికి దేశంలోనే అత్యధికంగా అందిస్తూ వస్తున్న బోనస్ తమను గట్టెక్కించి అధికారాన్ని నిలబెడుతుందని ముఖ్యమంత్రి భూపేశ్ బఘెల్ పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. మోదీ హామీల పేరుతో బీజేపీ ప్రకటించిన పథకాలకే ప్రజలు జై కొట్టారు. ఎదురుదెబ్బ నేపథ్యంలో.. వరుసగా 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండటంతో ప్రజల్లో నెలకొన్న తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గట్టి దెబ్బ కొట్టింది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ వెంటనే సీఎం బఘెల్ పలు సంక్షేమ, ప్రజాకర్షక పథకాల అమలు ప్రారంభించారు. రైతులు, గిరిజనులు, పేదలను ఎవరినీ వదలకుండా అందరికీ సాయం అందేలా చూశారు. ముఖ్యంగా వరికి ఆయన అందిస్తున్న బోనస్ సూపర్ హిట్టయింది. మళ్లీ గెలిస్తే పథకాన్ని మరింత విస్తరిస్తామని కూడా కాంగ్రెస్ ప్రకటించింది. ఇది ఒక దశలో బీజేపీని బాగా కలవరపరిచింది. దీనికి తోడు భూమిలేని కార్మికులకు వార్షిక ఆర్థిక సాయం రూ.10,000కు పెంచుతామని, కేజీ టు పీజీ ఉచిత విద్య, 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ సహా పలు హామీలెన్నో కాంగ్రెస్ ఇచి్చంది. దాంతో ‘మోదీ గ్యారంటీలు’ పేరుతో బీజేపీ దూకుడుగా ఎన్నో పథకాలు ప్రకటించింది. క్వింటాకు రూ.3,100 చొప్పున ఎకరాకు 21 క్వాంటాళ్లను సేకరిస్తామని పేర్కొంది. ప్రతి వివాహితకూ ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం, పీఎం ఆవాస్ యోజన కింద 18 లక్షల ఇళ్ల నిర్మాణం, పేదలకు రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, కాలేజీ విద్యార్థులకు ప్రయాణ భత్యం, నిరుపేద కుటుంబంలో పుట్టే ఆడపిల్లకు రూ.1.5 లక్షలు తదితరాలెన్నో ప్రకటించింది. వీటికి తోడు ప్రధాని మోదీ రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలతో హోరెత్తించారు. డబుల్ ఇంజన్ సర్కారుకు చాన్సిస్తే అభివృద్ధి పథంలో పరుగులు తీయిస్తామని చెప్పుకొచ్చారు. ఇవన్నీ ప్రజలపై బాగా ప్రభావం చూపాయి. చివరికి బఘెల్ సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ కొత్త హామీల కంటే బీజేపీ ‘మోదీ గ్యారంటీ’ల వైపే ప్రజలు మొగ్గు చూపారు. ముంచిన ‘మహదేవ్’ ఆరోపణలు... మోదీ గ్యారంటీలకు తోడు, పోలింగ్ సమీపించిన వేళ సీఎం బఘెల్పై ముసురుకున్న బెట్టింగ్ యాప్ ముడుపుల ఆరోపణలు కాంగ్రెస్కు బాగా చేటు చేశాయి. ఈ ఉదంతంలో ఒక కొరియర్ను అరెస్టు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకటించడం, దుబాయ్కి చెందిన మహదేవ్ బెట్టింగ్ యాప్ నుంచి బఘెల్కు ఏకంగా రూ.508 కోట్ల మేరకు ముడుపులు అందించినట్టు అతడు చెప్పాడని పేర్కొనడం సంచలనం రేపింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
శ్వేతపత్రం విడుదల చేయాలి
♦ హామీల అమలుపై షబ్బీర్అలీ డిమాండ్ ♦ సర్కారు ఫిరాయింపులు, ఉప ఎన్నికలు, ఉత్సవాలు తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు, అమలైన కార్యక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు టి.జీవన్రెడ్డి, పొంగులేటి సుధాకర్రెడ్డిలతో కలసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలుచేసినట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం పూర్తిగా అబద్ధమన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో పార్టీ ఫిరాయింపులు, ఉప ఎన్నికలు, ఉత్సవాలు చేయడం తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా రాష్ర్ట అవతరణ ఉత్సవాల ఏర్పాట్లులో మునిగిపోయిందన్నారు. తీవ్రమైన కరువులో ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఉత్సవాల పేరిట కాలయాపన చేస్తున్నారని షబ్బీర్అలీ ఆరోపించారు. భౌగోళిక పరిస్థితులు, జనాభా, మౌలిక వసతులను పరిగణనలోకి తీసుకుని శాస్త్రీయంగా కొత్త జిల్లాలను ఏర్పాటుచేయాలని కోరారు. దీనికోసం అన్ని పార్టీలను, నిపుణులను సంప్రదించాలని సూచించారు. ఇళ్లకు నిధులేవీ?: జీవన్రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి నిధులు ఇవ్వకుండా ఎలా పూర్తిచేస్తారని సీఎల్పీ ఉపనాయకుడు జీవన్రెడ్డి ప్రశ్నించారు. ఒక ఇంటికి కేవలం రూ.5.40 లక్షలను కేటాయించారని, వీటితో పూర్తిచేయడం సాధ్యంకాదని అన్నారు. వచ్చే మార్చిలోగా 2 లక్షల ఇళ్లను నిర్మించి పాపాలను కడిగేసుకోవాలని సూచించారు. రహస్య ఎజెండా: పొంగులేటి ఆర్డీఎస్ విషయంలో రాష్ట్రాల మధ్య వివాదాలను పెంచడం వెనక టీఆర్ఎస్, టీడీపీల రహస్య ఎజెండా ఉందని పొంగులేటి సుధాకర్రెడ్డి ఆరోపించారు. నదీ జల వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోకుండా ఎందుకు జఠిలం చేస్తున్నారని ప్రశ్నించారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
IPL 2024: సన్రైజర్స్, లక్నో మ్యాచ్.. లంక యువ స్పిన్నర్ అరంగేట్రం
ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement