breaking news
GRT
-
జీఆర్టీ జ్యువెలర్స్ బంపర్ ఆఫర్
-
జీఆర్టీ జ్యువెలర్స్ వజ్రాల పండుగ
హైదరాబాద్: జీఆర్టీ జువెలర్స్ ‘డైమండ్ ఫెస్టివల్’ పేరుతో గొప్ప ఆఫర్ను ప్రకటించింది. ప్రత్యేకంగా చేతితో తీర్చిదిద్దిన అద్భుతమైన వజ్రాలు, అన్కట్ డైమండ్స్పై 25 శాతం వరకు తగ్గింపు అందిస్తుంది. ప్లాటినం ఆభరణాలపై కూడా ఆఫర్లు ఉన్నాయి. ‘కస్టమర్లందరికీ వజ్రాల కలను నిజం చేసుకునే అవకాశం కల్పించడమే ఈ డైమండ్ ఫెస్టివల్ ప్రధాన ఉద్దేశం. కావున వారంతా ఈ ఆఫర్ను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము’ అని జీఆర్టీ జ్యువెలర్స్ ఎండీ ఆనంద్ అనంత పద్మనాభన్ తెలిపారు. -
జీఆర్టీకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్
హైదరాబాద్: ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ జీఆర్టీ జువెలర్స్ తాజాగా అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత బరువైన (1.513 కేజీలు) జుంకీలను తయారు చేసినందుకు గానూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను కైవసం చేసుకుంది. బంగారు నగలు, వజ్రాభరణాలు సహా విస్తృత శ్రేణి ప్లాటినం, వెండి ఉత్పత్తులతో ఇప్పటికే కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకున్న తమకి తాజా గిన్నిస్ రికార్డ్ ఒక మైలురాయి లాంటిదని జీఆర్టీ జువెలర్స్ ఎండీ అనంతపద్మనాభన్ తెలిపారు. ‘గిన్నిస్ రికార్డ్ ఎంతో ప్రత్యేకమైనది. చాలా మంది దీన్ని కోరుకుంటారు. కానీ అందరికీ ఇది చేరువ కాదు. గిన్నిస్ రికార్డ్ సాధించిన వారి జాబితాలో మేం చేరడం గొప్ప విషయం. కస్టమర్లు మాత్రమే కాకుండా దేశం గర్వపడేలా మా వంతు కృషి అందించాం’ అని పేర్కొన్నారు.