-
ఘాటెక్కిన పచ్చిమిర్చి
హైదరాబాద్: పచ్చిమిర్చి ధరలు మండిపోతున్నాయి. ప్రధాన మార్కెట్లో వారం రోజుల క్రితం కిలో రూ. 40–50 పలికితే.. తాజాగా రూ.100–120కి చేరింది. గుడిమల్కాపూర్ బోయిన్ల్లి మాదన్నపేట ఎల్బీనగర్ మార్కెట్లతో పాటు రైతు బజార్లకు సైతం సరఫరా బాగా తగ్గింది. శనివారం నగర మార్కెట్లకు కేవలం 900 క్వింటాళ్లు దిగుమతి అయింది. దీంతో నగర అవసరాలకు ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. తెలంగాణలో రంగారెడ్డి జిల్లాతో పాటు మెదక్లోనే అధికంగా పచ్చి మిర్చి పండిస్తున్నారు. ఏపీలోని అనంతపురం, కడప జిల్లాలో అత్యధికంగా మిర్చి పండిస్తున్నారు. నగర శివారు జిల్లాలతో పాటు తెలంగాణ జిల్లాల్లో పచ్చిమిర్చి దిగుబడి తగ్గడంతో నగర మార్కెట్ భారీగా దిగుమతులు పడిపోయాయి. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులతో టాన్స్పోర్టు ఖర్చు ఎక్కువైందని వ్యాపారులు చెప్పారు. మరో మూడు వారాల వరకూ.. తాజాగా శనివారం నగరానికి కేవలం 900 క్వింటాళ్ల పచ్చిమిర్చి మాత్రమే రావడంతో వ్యాపారులు ధరలు పెంచేశారు. మామూలు రోజుల్లో నిత్యం మార్కెట్లకు 2800–3000 క్వింటాళ్ల పచ్చిమిర్చి దిగుమతి అయ్యేదని హోల్సేల్ వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం దిగుమతులు తక్కువగా ఉండడంతో హోల్సేల్ మార్కెట్లో క్వింటాలుకు రూ. 800 నుంచి రూ.9,500కు విక్రయిస్తున్నారు. నగరంలో పచ్చిమిర్చి సరఫరా తగ్గిన దృష్ట్యా కర్ణాటకలోని బెల్గాం నుంచి కూడా పచ్చిమిర్చి దిగుమతి అవుతోంది. మరో రెండు మూడు వారాలు పరిస్థితి ఇలాగే ఉంటుందని అధికారులు తెలిపారు. మార్కెట్కు డిమాండ్ ప్రకారం సరఫరా కాకపోతే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మిర్చి సరఫరా తగ్గడంతో కొందరు చిల్లర వ్యాపారులు ధరలు మరింత పెంచేస్తున్నారు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో పచ్చిమిర్చి కిలో ధర రూ. 120 వరకు పలుకుతోంది. -
ఆ'క్యాష్' మిర్చి: రూటే సపరేటు.. కిలో రూ.120 నుంచి రూ.140
కారంలోనే కాదు.. లాభాల్లోనూ నాలుగు రెట్లు ఘాటు అధికం..ఆ మిర్చి. ఆ రకం వంగడానికి కార్పొరేట్ కంపెనీలే దాసోసం అన్నాయి. అందుకే ఆ మిర్చి రకం కాయలు అధిక ధరలు పలుకుతున్నాయి. ఫలితంగా కర్షకుడి ఇంట సిరులు పంట పండుతోంది. సాగుదారుకు అధిక క్యాష్ ఇస్తున్నదే.. ఆకాష్ మిర్చి వంగడం. దీనిపై ప్రత్యేక కథనం. గుర్రంకొండ: కొత్తరకం ఆకాష్ మిర్చి(డెమెన్ ఎఫ్–1) సాగు రైతులకు సిరులు కురిపిస్తోంది. ప్రస్తుతం కిలో మిర్చి మార్కెట్లో రూ.120 నుంచి రూ.140 వరకు ధర పలుకుతోంది. సాధారణ మిర్చితో పోల్చితే ఈ రకం మిర్చి నాలుగు రెట్లు అధికంగా కారం ఉంటుంది. బయట రాష్ట్రాల్లో ఈ రకం మిర్చికి అధికంగా డిమాండ్ ఉంది. సాధారణ మిర్చి కొమ్మకు కింది వైపు కాయగా ఆకాష్ మిర్చి కొమ్మకు పైభాగంలో ఆకాశాన్ని చూస్తుండటం వీటి ప్రత్యేకత. పంట సాగుతో రైతుకు నిలకడైన ఆదాయం వస్తుండడంతో గత మూడేళ్లుగా ఈ ప్రాంతం రైతులు మిర్చి పంట సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. కర్ణాటకలో కొత్త వంగడం: ఆకాష్ మిర్చి రకం విత్తనాలు మొదట కర్ణాటక రాష్ట్రంలో నాలుగేళ్ల కిందట కనుగొన్నారు. ఓ ప్రైవేట్ కంపెనీ వారు ఈ రకం విత్తనాలు ఉత్పత్తి చేసి, మార్కెట్లో విక్రయిస్తున్నారు. మూడేళ్లుగా అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె, పెద్దమండ్యం, గుర్రంకొండ మండలాల్లో రైతులు ఈ పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఎక్కువగా కారం ఉండడంతో ప్రముఖ కంపెనీలైన ఆశీర్వాద్, ఆచీ కంపెనీలు తాము తయారు చేసే కారం పొడుల్లో ఆకాష్ మిర్చిని ఎక్కువగా వినియోగస్తుండడంతో వీటికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఎకరా సాగుకు రూ. 1.50 లక్షలు ఖర్చు ఆకాష్ మిర్చి ఎకరం సాగుకు రూ.1.50 లక్షలు వరకు ఖర్చు అవుతుంది. సాధారణంగా ఈ ప్రాంతంలో రబీ సీజన్ అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ 10వ తేదీలోగా నారు నాటుకోవాలి. ఎకరం పొలానికి రూ.10 వేల మొక్కల నారు అవసరం. మార్కెట్లో 10 వేల మొక్కల నారుకు రూ.10 వేలు చెల్లించాలి. దుక్కి నుంచి మల్చింగ్, డ్రిప్ పైపులు, వారానికి రెండు సార్లు పురుగు నివారణ మందుల పిచికారీ, ఎరువులు తదితర అన్ని ఖర్చులు ఎకరాకు రూ. 1.50 లక్షలు వరకు అవుతాయి. ఎకరానికి సుమారు రూ.20 లక్షల ఆదాయం ప్రస్తుతం మార్కెట్లో కిలో మిర్చి రూ. 120 నుంచి రూ.130 వరకు ధరలు పలుకుతున్నాయి. ఈ సీజన్ అంతా సరాసరి రూ.80 నుంచి రూ.100 వరకు ధరలు తగ్గకుండా పలుకుతుంటాయి. దీంతో సాగు ఖర్చు పోను ఎకరానికి సరాసరి కనీసం రూ. 10 లక్షల నుంచి అత్యధికంగా రూ.20 లక్షల వరకు రైతులకు మిగులుతోంది. ఒక వేళ ధరలు లేక పోయినా ఎండుమిర్చి కింద వీటిని వాడుకున్న రైతులకు సాగు పెట్టుబడికి ఢోకా ఉండదు. నాలుగు రెట్లు అధిక కారం ఆకాష్ మిర్చి సాధారణ మిర్చి కంటే నాలుగు రెట్లు అధికంగా కారం ఉంటుంది. సా«ధారణ మిర్చి తొడిమి ఒక ఇంచి లోపు ఉండగా ఈ రకం మిర్చి తొడిమి రెండు నుంచి రెండున్నర అంగుళాల పొడవు ఉండడం విశేషం. సాధారణ మిర్చి నాలుగు కిలోలకు ఆకాష్మిర్చి ఒక కిలో సమానం అవుతుంది. దీంతో బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో వీటికి మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా హోటళ్లు, పీజీ హాస్టళ్లలో వీటిని ఎక్కువగా వినియోగిస్తుంటారు. మొక్కలో ఆకాశం వైపు చూస్తున్న మిరప కాయలు ఎకరానికి 10 నుంచి 20 టన్నుల దిగుబడి మొక్క నాటిన 80 నుంచి 90 రోజులకు పంట దిగుబడి ప్రారంభమవుతుంది. సాధారణంగా ఎకరం పంటకు అత్యల్పంగా 10 టన్నుల నుంచి అత్యధికంగా 20 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. సుమారు రెండు నుంచి మూడు నెలల వరకు కాయల దిగుబడి వస్తుంది. మంచి ఎరువులు వాడుతూ పంటను కాపాడుకుంటే అత్యధికంగా నాలుగు నెలల వరకు దిగుబడి వస్తుంది. లాభదాయక పంట ఆకాష్ మిర్చి మంచి లాభదాయక పంట. మిగిలిన పంటలతో పోల్చితే ఈ రకం మిర్చి సాగుతో ఎప్పుడు నష్టం ఉండదు. మార్కెట్లో సాధారణ ధరలు ఉన్నా కిలో రూ. 70 వరకు ధర పలుకుతుంది. మంచి డిమాండ్ ఉంటే కిలో రూ.120 నుంచి రూ.140 వరకు ధర పలుకుతుంది. – జయమ్మ, మహిళా రైతు, దిగువ పల్లె మూడేళ్లుగా సాగు చేస్తున్నా ఆకాష్ మిర్చి పంటను మూడేళ్లుగా సాగు చేస్తున్నా. ఎకరానికి రూ. 1.20 లక్షల నుంచి రూ. 1.50 లక్షల వరకు ఖర్చు వస్తుంది. అయితే ఎప్పుడూ నష్టాలు రాలేదు. అన్ని సార్లు పెట్టుబడి పోను లాభాలే వచ్చాయి. – చెంగల్రాయులు, రైతు, కొత్తపల్లె ఇక్కడి వాతావరణం అనువైంది కొత్త రకం ఆకాష్ మిర్చి పడమటి మండలాల వాతావరణానికి అనువైంది.మార్కెట్లో ఈ రకం మిర్చికి మంచి గిట్టుబాటు ధరలున్నాయి. దీంతో నిలకడైన ఆదాయం ఉన్న ఈ పంట రైతులకు మంచి ఆదాయం తెచ్చిపెడుతోంది. – శైలజ, ఉద్యానవనశాఖాధికారి, వాల్మీకిపురం క్లస్టర్ -
ఇంటిప్స్
క్యారట్ పైభాగాన్ని కోసేసి గాలి దూరని కవర్లో పెట్టి ఫ్రిజ్లో పెడితే ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి.క్యారట్ వండేటప్పుడు నాలుగైదు చుక్కల నిమ్మరసం కలిపితే రంగు ఆకర్షణీయంగా ఉంటుంది.అరటిపండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే నల్లని కవర్లో పెట్టి ఫ్రిజ్లో ఉంచితే వారం రోజులైనా తాజాగా ఉంటాయి. పచ్చిమిరపకాయలు తరిగిన తర్వాత వేళ్ళ మంట తగ్గాలంటే చల్లటి పాలలో కొద్దిగా చక్కెర వేసి అందులో వేళ్లను ముంచాలి. -
ఇంటిప్స్
పచ్చిమిర్చి కట్ చేసేటప్పుడు చేతులకు కొంచెం ఆయిల్ రాసుకుంటే చేతులు మండకుండా ఉంటాయి. వంటగదిలో అలోవెరా మొక్కను పెట్టుకుంటే మంచిది. చిన్న చిన్న గాయాలు తగిలినపుడు అలోవెరా ఆకును తెంపి ఆ జెల్ను గాయమైన చోట రుద్దితే ఉపశమనం కలుగుతుంది. -
...ఇట్లు గారెలు
రోజూ మబ్బుపడుతోంది సాయంత్రానికి నాలుగు చినుకులు పడనే పడతాయి పిల్లలు ఇంటికొచ్చేటప్పటికి ఏం చేస్తే బావుంటుంది? నానపోయండి... రుబ్బండి... నూనెలో వేయండి! మేము రెడీ!! మినపగారె కావలసినవి మినప్పప్పు - రెండు కప్పులు ఉల్లిపాయ ముక్కలు- అర కప్పు పచ్చిమిర్చి- రెండు (తరగాలి) అల్లం- అంగుళం ముక్క (సన్నగా తరగాలి) ఉప్పు - తగినంత నూనె - వేయించడానికి సరిపడినంత తయారీ: మినప్పప్పును కడిగి కనీసం నాలుగు గంటల సేపు నానబెట్టాలి. నీటిని మితంగా వేస్తూ రుబ్బాలి. ఇందులో ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం కలపాలి. బాణలిలో నూనె కాగిన తర్వాత పై మిశ్రమాన్ని గారెల్లా చేసి నూనెలో వేయాలి. రెండు వైపులా దోరగా కాలిన తర్వాత తీసి వేడిగా వడ్డించాలి. గమనిక: గారెకు మధ్యలో చిల్లు పెడితే పిండి మొత్తం సమంగా కాలుతుంది. చిల్లు లేకపోతే కొన్నిసార్లు మధ్యలో పిండి పచ్చిగా ఉంటుంది. సగ్గుబియ్యం గారెలు కావలసినవి సగ్గుబియ్యం- ఒకటిన్నర కప్పు ఉడికించిన బంగాళదుంపలు- మూడు (తొక్క తీసి చిదమాలి) వేయించిన వేరుశనగపప్పు - ఒక కప్పు (పలుకుగా పొడి చేసుకోవాలి) పచ్చిమిర్చి- మూడు (సన్నగా తరగాలి) కొత్తిమీర తరుగు- రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం - ఒక టేబుల్స్పూన్ ఉప్పు - తగినంత; నూనె - వేయించడానికి సరిపడినంత తయారీ: సగ్గుబియ్యాన్ని రెండు గంటల సేపు నానబెట్టి నీటిని వడపోయాలి. సగ్గుబియ్యం, ఉడికించి చిదిమిన బంగాళదుంప, వేరుశనగపప్పు పొడి, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు కలపాలి. బాణలిలో నూనె పోసి కాగిన తర్వాత పై మిశ్రమాన్ని గారెల్లా వత్తి నూనెలో రెండు వైపులా కాల్చాలి. క్యాబేజ్ గారెలు కావలసినవి: పచ్చి శనగపప్పు- అర కప్పు మినప్పప్పు - అర కప్పు క్యాబేజ్ తరుగు - రెండు కప్పులు పచ్చిమిర్చి- రెండు (తరగాలి) అల్లం - అంగుళం ముక్క (సన్నగా తరగాలి) కొత్తిమీర తరుగు - అర కప్పు కరివేపాకు - రెండు రెమ్మలు సోంఫు, జీలకర్ర - ఒక్కోటి అర టీ స్పూన్ మిరియాలు - అర టీ స్పూన్ ఇంగువ - చిటికెడు; ఉప్పు - తగినంత వెల్లుల్లి - రెండు రేకలు (తరగాలి) నూనె - వేయించడానికి సరిపడినంత తయారీ: మినప్పప్పు, శనగపప్పును కడిగి రాత్రంతా నానబెట్టాలి లేదా కనీసం ఐదు గంటల సేపు నాననివ్వాలి. నీటిని వంపేసి పప్పులలో మిరియాలు, సోంఫు, జీలకర్ర, ఇంగువ, ఉప్పు వేసి తక్కువ నీటిని వేస్తూ గట్టిగా రుబ్బాలి. ఈ మిశ్రమంలో క్యాబేజ్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి వేసి బాగా కలపాలి. బాణలిలో నూనె పోసి కాగిన తర్వాత పై మిశ్రమాన్ని గారెల్లా వత్తి నూనెలో వేయాలి. రెండు వైపులా దోరగా కాలిన తర్వాత తీసి వేడిగా వడ్డించాలి. మొక్కజొన్న గారెలు కావలసినవి: మొక్కజొన్న గింజలు- 150 గ్రా (పచ్చివి) పచ్చి శనగ పప్పు - 50 గ్రా (గంట సేపు నానబెట్టాలి) పచ్చిమిర్చి తరుగు - టీస్పూన్, ఉల్లిపాయ ముక్కలు-కప్పు అల్లం - అంగుళం ముక్క (సన్నగా తరగాలి) జీలకర్ర - అర టీ స్పూన్; ఉప్పు- తగినంత కొత్తిమీర తరుగు - ఒక టేబుల్ స్పూన్ నూనె - వేయించడానికి సరిపడినంత తయారీ: మొక్కజొన్న గింజలు, శనగపప్పు కలిపి కాస్త పలుకుగా రుబ్బాలి. పిండిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపాలి. బాణలిలో నూనె వేడి చేసి పై మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని అరచేతిలో ఉంచి గారెల ఆకారంలో వత్తి నూనెలో వేయాలి. రెండు వైపులా దోరగా కాలిన తర్వాత తీసి వేడిగా వడ్డించాలి. దీనికి కొబ్బరి కారం లేదా చికెన్ కర్రీ చక్కటి కాంబినేషన్. గమనిక: పిండిలో నీరు ఎక్కువై మరీ జారుడుగా ఉంటే కార్న్ఫ్లోర్ కలుపుకోవాలి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement