breaking news
Grand celabrations
-
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ పాతికేళ్ల పండగలో మెరిసిన తారలు
-
హైలైఫ్ ఎగ్జిబిషన్లో మోడల్స్ సందడి
-
ఎల్లలు లేని ఇఫ్తార్ సంబరం
సాక్షి, బీచ్రోడ్డు (విశాఖ తూర్పు) : రంజాన్ పర్వదినం చేరువవుతున్న శుభతరుణాన.. భారీ ఎత్తున జరిగిన ఇఫ్తార్ ఆనందాతిశయానికి నెలవైంది. ఆధ్యాత్మిక భావన ఉప్పొంగిపోగా.. సౌభ్రాతృత్వం వెల్లువైంది. వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.హెచ్. ఫరూఖీ ఆధ్వర్యంలో ఎంవీపీ కాలనీలో ఆదివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ అద్భుతమనిపించింది. ఈ ఇఫ్తార్లో సుమారు 5 వేల మంది ముస్లిం సోదరులు పాల్గొని విందు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఇంత మందితో కలిసి ఇఫ్తార్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. పార్టీ కార్యకర్తలకైనా, ప్రజలకైనా ఎలాంటి సమస్య ఉన్నా పార్టీ కార్యాలయానికి వచ్చి వివరిస్తే వారిని అందుకుంటామని హామీ ఇచ్చారు. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే పార్లమెంట్లో మాట్లాడి వైద్యానికి అయ్యే ఖర్చు మంజూరయ్యేలా చేస్తానని హామీ ఇచ్చారు. మైనార్టీల అభివృద్ధి కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా పథకాలను ప్రవేశపెట్టారని, జగన్ సీఎం అయితే అదే తరహాలో పథకాలను అమలవుతాయని హామీ ఇచ్చారు. ముస్లిముల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ముస్లింలంతా రంజాన్ను సంతోషంగా చేసుకోవాలని కోరారు. ఇన్ని వేల మందికి ఇఫ్తార్ ఇచ్చిన ఫరూకీని అభినందించారు. కార్యక్రమంలో ముందు ముస్లిం సోదరులు పవిత్ర ప్రార్థనలు చేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్ర«ధాన కార్యదర్శులు గొల్ల బాబురావు, ప్రసాద్ రాజ్, కరణం ధర్మశ్రీ , పార్లీ నగర విభాగం అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్, సమన్వయకర్తలు వంశీకృష్ణ శ్రీనివాస్, గురువులు, రామకృష్ణ మూర్తి, తిప్పల నాగిరెడ్డి, ఉషాకిరణ్, చంద్రమౌళి, కొయ్య ప్రసాదరెడ్డి, నగర మైనార్టీ సెల్ అ«ధ్యక్షుడు షరీఫ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, రాష్ట్ర అదనపు కార్యదర్శులు రవిరెడ్డి, పక్కి దివాకర్, నాయకులు జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక చెఫ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇఫ్తార్ కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక చెఫ్స్ను తీసుకొని వచ్చారు. వీరు తమ పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శించి వహ్వా అనిపించారు. ఇఫ్తార్ జరిగిన ప్రదేశానికి వెలుపల కూడా హలీమ్ పంపిణీ చేశారు. -
భక్తిపారవశం..
తిరుపతి కల్చరల్ : శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవంలో భాగంగా భారతీయ విద్యాభవన్, శ్రీవేంకటేశ్వర విద్యాలయ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం తిరుపతిలో నిర్వహించిన రామానుజ శోభాయాత్ర భక్తిపారశంగా సాగింది. శ్రీగోవిందరాజస్వామి ఆలయం వద్ద శ్రీరామానుజ శోభాయాత్ర ఉత్సవ విగ్రహాలకు పెద్ద జీయర్స్వామి, చిన్న జీయర్స్వామి, శ్రీరామకృష్ణ మఠం కార్యదర్శి అనుపమానందజీ పూజలు చేశారు. అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు. పెద్దజీయర్ స్వామి మాట్లాడుతూ భారతీయ విద్యాభవన్ వారు సనాతన ధర్మాలను భావితరాలకు అందించడం అభినందనీయమన్నారు. భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణరాజు మాట్లాడుతూ భగవంతుని కృపతో భారతీయ విద్యాభవన్ అలిపిరి వద్ద ఉండడం ఆధ్యాత్మికంగా శక్తివంతమైందన్నారు. అనుమానందజీ మాట్లాడుతూ రామానుజాచార్యుల వెయ్యి ఏళ్ల జయంతిని తిరుపతిలోని భారతీయ విద్యాభవన్ వారు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. అనంతరం సత్యనారాయణరాజు, పెద్దజీయర్స్వామి, చిన్న జీయర్ స్వామి, అనుమానందజీలను ఘనంగా సత్కరించారు. శోభా యాత్ర గోవిందరాజస్వామి ఆలయం నుంచి కోదండరామాలయం మీదుగా వివేకానంద సర్కిల్, అక్కడి నుంచి అలిపిరి వరకు సాగింది. సుమారు 500 మంది పాల్గొని దివ్య ప్రబంధ పాశురాలను పఠిస్తూ యాత్రను సాగించారు. అలిపిరి వద్ద విద్యార్థులు సంక్షేప రామాయణ పారాయణం చేశారు. తిరుమల నంది, శ్రీరామానుజాచార్యుల వేషధారణలో విద్యార్థులు ప్రదర్శించిన నాటిక ఆకట్టుకుంది. భారతీయ విద్యాభవన్ వైస్ చైర్మన్ పీవీ.కృష్ణారెడ్డి, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టర్ బి.వెంగమ్మ, పి.సుదర్శనరాజు, సీహెచ్.గోవిందరాజు, విద్యా భవన్ కమిటీ సభ్యులు జగ్గారావు, ప్రిన్సిపాల్ ఇందిరా, వైస్ ప్రిన్సిపాల్ హైమావతి పాల్గొన్నారు.