breaking news
Graduate And Teacher
-
చంద్రబాబుకు షాక్!
-
టీడీపీకి ఎదురుదెబ్బ
సాక్షి ప్రతినిధి, అనంతపురం/చిత్తూరు/విశాఖపట్నం: ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం ఐదు స్థానాల్లో ఎన్నికలు జరగ్గా నాలుగు చోట్ల పరాజయాన్ని మూటగట్టుకుంది. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గంలో పీడీఎఫ్ అభ్యర్థి విఠపు బాలసుబ్రహ్మణం గెలుపొందారు. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ స్థానంలో పీడీఎఫ్ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి విజయం సాధించారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకర్గంలో వైఎస్సార్సీపీ మద్దతిచ్చిన పీడీఎఫ్ అభ్యర్థి యండపల్లి శ్రీనివాసులురెడ్డి జయకేతనం ఎగురవేశారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్రెడ్డి ముందంజలో ఉన్నారు. ఆయన విజయం దాదాపు ఖాయమైనట్లేనని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో మాత్రం టీడీపీ మద్దతిచ్చిన బీజేపీ అభ్యర్థి మాధవ్ ప్రస్తుతం ఓట్ల లెక్కింపులో ముందంజలో కొనసాగుతున్నారు. విజయం ముంగిట గోపాల్రెడ్డి పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి గోపాల్రెడ్డి స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఆయన తన సమీప ప్రత్యర్థి, టీడీపీ కేజే రెడ్డిపై 12,677 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయితే, విజయానికి అవసరమైన ‘మ్యాజిక్ ఫిగర్’ గోపాల్ రెడ్డికి రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలో 1,55,711 ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్య త ఓట్ల ఆరు రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఆయనకు 53,714 ఓట్లు లభించాయి. కేజే రెడ్డికి 41,037, గేయానంద్కు 32,810 ఓట్లు పోలయ్యాయి. పోలైన మొత్తం ఓట్లలో చెల్లని ఓట్లను మినహాయిస్తే మిగిలిన 1,35,772 ఓట్లలో 67,887 ఓట్లను ‘మ్యాజిక్ ఫిగర్’గా నిర్ధారించారు. ఈ సంఖ్యకు గోపాల్రెడ్డి 14,173 ఓట్ల దూరంలో ఉన్నారు. దీంతో విజయానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ను చేరుకునేందుకు గోపాల్ రెడ్డికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బుధవారం తుదిఫలితం వెలువడనుంది. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా యండపల్లి తూర్పు రాయలసీమ (చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు) పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో పీడీఎఫ్ అభ్యర్థి యండపల్లి శ్రీనివాసులురెడ్డి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిపై ఆయన గెలుపొందారు. వైఎస్సార్సీపీ మద్దతు పలకడంతో యండపల్లి విజయం సునాయాసమైంది. చిత్తూరు జిల్లాకు చెందిన యండపల్లి మొదటగా 2011లో పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించి రెండోసారి ఎమ్మెల్సీగా నెగ్గారు. ఆయన 3,500 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. విజయానికి చేరువలో మాధవ్ ఉత్తరాంధ్ర (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలు) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పీవీఎన్ మాధవ్ ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపులోనూ ఆధిక్యత కనబరుస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్తో కలిపి 1,08,945 ఓట్లు పోలవగా వాటిలో మాధవ్కు 42,863 తొలి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. పీడీఎఫ్ అభ్యర్థి అవధానుల అజయ్శర్మకు 37,818 ఓట్లు లభించాయి. పోలైన ఓట్లలో చెల్లని ఓట్లు 11,519, నోటా ఓట్లు 430 మినహాయించి మిగిలిన 97,426 ఓట్లకుగాను 48,714 ఓట్లను కోటా ఓట్లుగా నిర్ధారించారు. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో పీడీఎఫ్ అభ్యర్థి శర్మపై 5,045 ఓట్ల మెజారిటీ వచ్చినప్పటికీ మాధవ్ కోటా ఓట్లను సాధించలేకపోయారు. దీంతో ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపును చేపట్టారు. బుధవారం తుది ఫలితం వెలువడనుంది. -
బాబుకు షాక్!
⇔ దిమ్మతిరిగే తీర్పునిచ్చిన టీచర్లు, గ్రాడ్యుయేట్లు ⇔ ప్రజాక్షేత్రంలో టీడీపీ పతనం ♦ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దారుణ పరాజయం ♦ 5 స్థానాలకుగాను నాలుగింట ఓటమి ♦ అధికార పార్టీని నిర్ద్వంద్వంగా తిరస్కరించిన ఓటర్లు ♦ సీఎం చంద్రబాబు సొంత జిల్లాలోనే మట్టికరిచిన తెలుగుదేశం పార్టీ ♦ రిగ్గింగ్తో సహా ఎన్ని కుతంత్రాలు పన్నినా దక్కని విజయం ♦ ప్రత్యక్ష ఎన్నికలంటేనే వణుకుతున్న చంద్రబాబు నాయుడు ♦ ఎన్నికలు జరగని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో వాయిదాకు యత్నాలు ♦ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించలేని దుస్థితి ♦ జగన్ సవాల్ స్వీకరించలేక వెనుకంజ సాక్షి, అమరావతి : స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల్లో రూ.కోట్ల కొద్దీ డబ్బు వెదజల్లి... బేరసారాలు, బెదిరింపులు, శిబిరాలతో వక్రమార్గాన గెలుపొందిన అధికార తెలుగుదేశం పార్టీకి ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు కోలుకోలేని షాక్ ఇచ్చారు. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో టీడీపీని మట్టికరిపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ అక్రమ మార్గంలో గెలుపొందడానికి ఆ పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలను జనం గట్టిగా తిప్పికొట్టారు. 2 ఉపాధ్యాయ, 3 పట్టభద్రుల శాసన మండలి స్థానాలకు జరిగిన ఎన్నికల్లో నాలుగింటిలో అధికార పార్టీని ప్రజలు తిరస్కరించారు. 9 జిల్లాలు.. లక్షలాది మంది ఓటర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సొంత జిల్లా చిత్తూరులో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు రెండింటిలోనూ టీడీపీ పరాజయం పాలైంది. తూర్పు రాయలసీమ పట్టభద్రుల స్థానంలో టీడీపీ అభ్యర్థి ఓడిపోగా, పశ్చిమ రాయలసీమ స్థానంలో ఓటమి అంచున నిలిచారు. ఉత్తరాంధ్ర (విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం) స్థానంలో ఆ పార్టీ బలపరిచిన బీజేపీ అభ్యర్థి పీడీఎఫ్ అభ్యర్థిపై స్వల్ప మెజారిటీలో ఉన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు వైఎస్సార్, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వరకే పరిమితం కాగా ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికలు అలా కాదు. 9 జిల్లాల్లో లక్షలాది మంది ఓటర్లతో కూడుకొని ఉన్నది. 5 ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసన మండలి స్థానాల ఎన్నికలు అనంతపురం, వైఎస్సార్, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో జరిగాయి. నాలుగు జిల్లాలు మినహా రాష్ట్రమంతా ఈ ఎన్నికల్లో పాలుపంచుకుంది. విచ్చలవిడిగా టీడీపీ అక్రమాలు ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అధికార పార్టీ నేతలు బరితెగించారు. విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డారు. షరా మామూలుగానే రూ.కోట్లు వెదజల్లారు. అంతేకాకుండా రిగ్గింగ్కూ పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్వయంగా ఆయా జిల్లాల నేతలతో టెలికాన్ఫరెన్స్లు నిర్వహించారు. గెలుపు కోసం వ్యూహరచన చేశారు. అక్రమాలను ప్రోత్సహించారు. ఇన్ని చేసినా ఓటర్లు టీడీపీని కంగుతినిపించారు. బాబు సొంత జిల్లాలో టీడీపీకి చెంపపెట్టు సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీని ప్రజలు తిరస్కరించారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కూడిన తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) అభ్యర్థి విఠపు బాలసుబ్రహ్మణ్యం చేతిలో టీడీపీ అభ్యర్థి వాసుదేవనాయుడు మట్టికరిచారు. అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాలతో కూడిన పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ స్థానంలో పీడీఎఫ్ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి చేతిలో సిట్టింగ్ ఎమ్మెల్సీ అయిన టీడీపీ అభ్యర్థి బచ్చల పుల్లయ్య దారుణంగా ఓటమి పాలయ్యారు. ఇక పశ్చిమ రాయలసీమ(కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలు) పట్టభద్రుల స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్రెడ్డి 12,677 ఓట్ల మెజారిటీతో విజయం దిశగా దూసుకుపోతుండగా టీడీపీ అభ్యర్థి కేజే రెడ్డి రెండో స్థానంలో చతికిలపడ్డారు. సీఎం సొంత జిల్లా చిత్తూరుతో కూడిన తూర్పు రాయలసీమ (చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల) పట్టభద్రుల స్థానంలో వైఎస్సార్సీపీ మద్దతిచ్చిన పీడీఎఫ్ అభ్యర్థి యండపల్లి శ్రీనివాసులురెడ్డి 3,500 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ద్వితీయ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దారుణ పరాజయంపై టీడీపీ వర్గాల్లో చర్చ సీఎం సొంత జిల్లాలోనే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఓటమి పాలవ్వడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నిరాశ నిస్పృహలు అలముకున్నాయి. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ.కోట్లు గుమ్మరించి ప్రత్యర్థి ఓటర్లను కొనుగోలు చేసి గెలిచినందుకు సంబరాలు చేసుకున్న టీడీపీ నేతలు మంగళవారం నోరు మెదపలేకపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సమయం వరకు సభలోకి రాకుండా తన గదికే పరిమితమైపోయారు. కొద్దిసేపటికి సభలోకి వచ్చినా రుసరుసలాడుతూ ప్రతిపక్షంపై అకారణంగా విరుచుకుపడ్డారు. మరోవైపు అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం చర్చకు దారితీసింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బుతో గెలిచినపపటికీ, విద్యావంతులైన పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం ప్రజల్లో పార్టీ పట్ల వెల్లువెత్తుతున్న వ్యతిరేకతకు నిదర్శనమని స్వయంగా మంత్రులే అంగీకరిస్తున్నారు. ‘‘మా పని అయిపోయింది. ఇది ఆరంభం మాత్రమే. ఇక ఏ ఎన్నికలు జరిగినా ఇలాంటి ఫలితాలు తప్పవు. ఇది గమనించే మా అధినేత ఎన్నికలంటేనే భయపడుతున్నారు. ఎన్నికలు జరగని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు జరగాల్సిన ఎన్నికలను కూడా ఏదో ఒక సాకు చూపించి, నిలిపివేయించే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచి టీడీపీలో చేరిన 21 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించి, ఎన్నికలకు సిద్ధపడాలంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విసిరిన సవాల్ను చంద్రబాబు స్వీకరించకుండా దాటవేయడానికి కూడా ఇదే కారణం’’ ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రి ఒకరు విశ్లేషించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అత్యల్ప మెజారిటీ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన మూడు జిల్లాల్లో వైఎస్సార్సీపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అప్రజాస్వామికంగా తన అభ్యర్థులను బరిలోకి దింపింది. రూ.కోట్లు ఖర్చు చేసి, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను తనవైపు తిప్పుకొని ఏకంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే శిబిరాలు నడిపించింది. ఇన్ని అక్రమాలకు పాల్పడినా ఈ ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన మెజారిటీ అత్యల్పమే కావడం గమనార్హం. వైఎస్సార్సీపీ, టీడీపీకి మ«ధ్య ఓట్ల వ్యత్యాసం అతి తక్కువే. నెల్లూరులో కేవలం 87, కర్నూలులో 62, వైఎస్సార్ జిల్లాలో 38 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. 2017 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల వివరాలు జిల్లా పోలైన ఓట్లు చెల్లని ఓట్లు టీడీపీ అభ్యర్థికి వైఎస్సార్సీపీ అభ్యర్థికి మెజారిటీ నెల్లూరు 851 8 465 378 87 కర్నూలు 1,077 11 564 502 62 వైఎస్సార్ 839 8 434 396 38 2014 స్థానిక సంస్థల ఎన్నికల్లో బలాబలాలు జిల్లా వైఎస్సార్సీపీ టీడీపీ నెల్లూరు 435 340 కర్నూలు 531 454 వైఎస్సార్ 521 303