-
33లక్షల మంది బాలల్లో పౌష్టికాహార లోపం
న్యూఢిల్లీ: దేశంలోని చిన్నారుల్లో 33 లక్షల మంది పౌష్టికాహారలోపంతో బాధపడుతుండగా అందులో దాదాపు సగం మందిలో ఈ సమస్య తీవ్రంగా ఉందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. పిల్లల్లో పౌష్టికాహారలోపం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, బిహార్, గుజరాత్ అగ్రస్థానంలో ఉన్నట్లు సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ సమాధానం ఇచ్చింది. కోవిడ్ మహమ్మారి పేద కుటుంబాల్లోని పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారం సమస్యను మరింత తీవ్రతరం చేసిందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2021 అక్టోబర్ 14వ తేదీనాటికి దేశంలో 17.76 లక్షల మంది చిన్నారులు తీవ్ర పౌష్టికాహారలోపంతోనూ, 15.46 లక్షల మంది చిన్నారులు మధ్యస్త పోషకాహార లోపంతోనూ బాధపడుతున్నట్లు అంచనా వేసింది. ఈ గణాంకాలు ప్రభుత్వం ప్రారంభించిన ‘పోషణ్ ట్రాకర్’యాప్లో నమోదై ఉన్నాయి. ఈ గణాంకాలను నేరుగా అంగన్వాడీ సిబ్బంది నమోదు చేసినవి కావడం గమనార్హం. 2020 గణాంకాలతో పోలిస్తే తీవ్ర పౌష్టికాహారలోపం ఉన్న ఆరు నెలల నుంచి ఆరేళ్లలోపు వయస్సున్న చిన్నారుల సంఖ్యలో ఏడాది కాలంలోనే 91% పెరుగుదల నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. ఎత్తుకు తగిన బరువు లేకపోవడం, మొహం, పొట్ట తదితర భాగాలు ఉబ్బినట్లు ఉండటం తదితర లక్షణాల ఆధారంగా తీవ్ర, మధ్యస్త పౌష్టికాహారలోపంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచిస్తోంది. ఈ లక్షణాలున్న పిల్లలు త్వరగా అనారోగ్యం పాలయ్యేందుకు అవకాశం ఉంది. తీవ్ర పోషకాహార లోపంతో ఉన్న చిన్నారులు ఆరోగ్యవంతులతో పోలిస్తే మృత్యువాత పడేందుకు 9 రెట్లు ఎక్కువ అవకాశాలుంటాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 6.16 లక్షల మంది చిన్నారుల్లో పౌష్టికాహారలోపంతో బాధపడుతుండగా, వీరిలో 4.58 లక్షల మంది తీవ్రమైన, 1.57 లక్షల మంది మధ్యస్తమైన పౌష్టికాహారలోపంతో ఉన్నట్లు గుర్తించారు. కోవిడ్ మహమ్మారి దాదాపు అన్ని సామాజిక–ఆర్థిక సూచికలపైనా వ్యతిరేక ప్రభావం చూపిందని చైల్ రైట్స్ అండ్ యు(క్రై) సీఈవో పూజా మార్వాహ అన్నారు. గత దశాబ్ద కాలంపాటు సాధించిన పురోగతి కోవిడ్తో తుడిచి పెట్టుకుపోయిందని చెప్పారు. కోవిడ్ ఆంక్షల కారణంగా దీర్ఘకాలంపాటు అంగన్వాడీ కేంద్రాలను, స్కూళ్లలో మధ్యాహ్నభోజన పథకాన్ని నిలిపివేయడం పేద బాలలపై అన్ని రకాలుగా తీవ్ర ప్రభావం చూపిందన్నారు. కాగా, 2011 జనగణన ప్రకారం దేశంలో 46 కోట్ల మంది చిన్నారులున్నారు. -
గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలేవీ
చల్లపల్లి : ‘గుర్తింపులేని పాఠశాలలు నిర్వహిస్తే లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తాం’.. విద్యాశాఖ గతంలో ఇచ్చిన ప్రకటన ఇది. ఈ మేరకు జీవో కూడా ఇచ్చింది. ‘లక్ష రూపాయల జరిమానా తర్వాత కూడా తరగతులు నిర్వహిస్తే రోజుకు రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తాం’.. ఇది జిల్లా విద్యాశాఖాధికారి ఇటీవల చేసిన హెచ్చరిక. గుర్తింపు లేని పాఠశాలలపై అధికారులు, ప్రభుత్వం ప్రకటనలు, జీవోలు ప్రచారానికే పరిమితమవుతున్నాయి. ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు. గుర్తింపులేని పాఠశాలలు జిల్లాలో 145 ఉన్నా.. వాటిలో అడ్మిషన్లు శరవేగంగా జరిగిపోతున్నా.. వాటిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు చొరవ చూపడం లేదు. జిల్లాలో 2012లో 300 గుర్తింపులేని పాఠశాలలు ఉండగా, గత ఏడాది 170కి తగ్గాయి. ఈ ఏడాది 145 ఉన్నాయి. అధికారులు కూడా గుర్తింపులేని పాఠశాలల జాబితాను ప్రకటించారు. అయినా వాటిలో విద్యార్థులు చేరకుండా చర్యలు తీసుకోకపోవడం, పాఠశాలను సీజ్ చేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ప్రచారానికే పరిమితం... గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాల్సిన జిల్లా అధికారులు ప్రచార కార్యక్రమాలకే పరిమితమవుతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇలాంటి పాఠశాలలను గుర్తించి వాటిలో విద్యార్థులు చేరకుండా చర్యలు తీసుకోవడంతో పాటు వాటిని సీజ్ చేస్తున్నారు. గుర్తింపులేని పాఠశాలలను 24 గంటల్లో సీజ్ చేయాలని కడప జిల్లా కలెక్టర్ శశిధర్ గురువారం ఆదేశించారు. మరికొన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు ఇలాంటి ఆదేశాలనే ఇచ్చి అమలు చేస్తున్నారు. మన జిల్లాలో మాత్రం ఇలాంటి పాఠశాలల జాబితాను కరపత్రాల రూపంలో ముద్రించి అవగాహన కార్యక్రమాలకే పరిమితమవుతున్నారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పేరుమోసిన కార్పొరేట్ పాఠశాలలకు సైతం గుర్తింపు లేకపోవడం గమనార్హం. అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. జరిమానాలు ఏమయ్యాయి? గుర్తింపులేని పాఠశాలలు నిర్వహిస్తే లక్ష రూపాయల వరకు జరిమానా విధించాలని విద్యాశాఖ గతంలో నిర్ణయించింది. అయినా ఆ పాఠశాలలు తరగతులు నిర్వహిస్తే రోజుకు రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తామని గతంలో డీఈవో ఆర్భాటంగా ప్రకటించారు. గుర్తింపులేని పాఠశాలలు గత వారం రోజుల నుంచి తరగతులు నిర్వహిస్తుండటం, అడ్మిషన్లు తీసుకోవడం చేస్తున్నా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement