-
‘లెక్క’లేని నిరుద్యోగులు!
సాక్షి, హైదరాబాద్: యువజనులు ఎక్కువ సంఖ్యలో ఉన్న మన రాష్ట్రంలో ఉపాధి ఎంతమందికి ఉంది.. నిరుద్యోగులు ఎంత మంది ఉన్నారన్న దానిపై ప్రభుత్వ శాఖలవద్ద స్పష్టమైన లెక్కలు లేవని తెలుస్తోంది. ముఖ్యంగా నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారనే దానిపై ప్రభుత్వ శాఖల్లో గందరగోళం నెలకొంది. ఉపాధి కల్పన, శిక్షణ విభాగం వద్ద గణాంకాలున్నప్పటికీ, వాటికీ వాస్తవ పరిస్థితులకు ఎక్కడా పొంతన కుదరడంలేదు. దీంతో ఉపాధి కల్పనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే దానిపై స్పష్టత కొరవడింది. అధికారిక లెక్కల్లో 9.26 లక్షలే.. సాధారణంగా నిరుద్యోగిగా ఉన్న ప్రతి వ్యక్తి ఉపాధి కల్పన కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకుంటారు. ప్రస్తుతం ఎంప్లాయిమెంట్ కార్డు పొందే వారి సంఖ్య భారీగా తగ్గింది. వివిధ కోర్సులు పూర్తి చేసిన వారిలో కనీసం పావువంతు కూడా ఈ కార్డులకోసం దరఖాస్తు చేసుకోవడంలేదు. ఉపాధి కల్పనలో ఈ కార్డుల ప్రాధాన్యం తగ్గిపోవడంతో అభ్యర్థులు వీటిపై దృష్టి సారించడం లేదు. ప్రస్తుతం ఉపాధి కల్పన శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 9,26,289 మంది నిరుద్యోగులున్నారు. వీరిలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దరఖాస్తు చేసుకున్న వారు 4,57,481. రాష్ట్రం ఏర్పాటై నాలుగేళ్లు కావస్తుండటంతో ఏటా సగటున లక్ష మంది అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. కార్డులు పొందిన వారిలో అత్యధికంగా పదోతరగతి పూర్తి చేసినవారు 3.28 లక్షలు ఉండగా, ఇంటర్మీడియెట్ చదివినవారు 1.71లక్షలు, గ్రాడ్యుయేట్లు 1.53లక్షలు ఉన్నారు. ఆన్లైన్లో కార్డులు.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల లెక్కలపై అంచనాల కోసం కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ విభాగం చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోంది. ఎంప్లాయిమెంట్ కార్డుల కోసం ఆన్లైన్ పద్ధతిని ప్రవేశపెట్టింది. ప్రత్యేకంగా వెబ్సైట్ రూపొందించి.. దాని ద్వారా దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టింది. ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్న ఈ ప్రక్రియకు తుదిమెరుగులు దిద్దుతున్నారు. త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేనున్నారు. ఆన్లైన్ దరఖాస్తు విధానంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు.. వారి అర్హతలు, వయసు తదితర పూర్తిస్థాయి సమాచారం లభిస్తుందని భావిస్తున్నారు. ఉపాధికల్పన శాఖ నిరుద్యోగులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లోపు కార్డును పొందే వీలు కల్పిస్తోంది. అదనపు కోర్సులు చేసిన తర్వాత దాన్ని అప్డేట్ చేసుకునే వీలుంటుంది. ఒక వ్యక్తికి ఒకే ఎంప్లాయిమెంట్ ఐడీ ఉండేలా ఉపాధి కల్పన శాఖ చర్యలు చేపట్టింది. కాగా, అభ్యర్థుల విద్యార్హతలు, నైపుణ్యం ఆధారంగా జాబ్మేళాలు నిర్వహించి ఉపాధి కల్పించేందుకు వీలుంటుంది. నేషనల్ పోర్టల్తో వివరాలన్నీ అనుసంధానం.. ఎంప్లాయిమెంట్ వెబ్సైట్ను అత్యాధునికంగా రూపొందించాం. ఇది కేవలం నిరుద్యోగ నమోదు ప్రక్రియకే పరిమితం కాదు. ఈ వెబ్సైట్ను నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్తో అనుసంధానం చేస్తాం. నిరుద్యోగుల నమోదు ప్రక్రియలో వారి మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీలను తీసుకుంటాం. కొత్తగా ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల్లో ఉపాధి అవకాశాలున్నప్పుడు అర్హతల ఆధారంగా ఆటోమేటిక్గా ఆయా అభ్యర్థులకు ఎస్సెమ్మెస్లు, ఈమెయిల్స్ వస్తాయి. స్థానికంగా ఉన్న పరిశ్రమలు, సంస్థలకు నియామకాల ప్రక్రియకు ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది. - కె.వై. నాయక్, సంచాలకుడు, కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ విభాగం -
జల మార్గానికి పోల‘వరం’
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల తమ బ తుకులు ఛిద్రం అవుతాయని ఆందోళన చెం దుతున్న ముంపు ప్రాంతాల ప్రజలకు అలాం టి బెంగ అవసరం లేదని.. ప్రాజెక్ట్ నిర్మిస్తే అక్కడి వారికి ప్రయోజనాలు చేకూరతాయని ప్రభుత్వరంగ సంస్థలు తేల్చారుు. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తరుుతే.. ఆదివాసీలకు.. ముం పు ప్రాంతాల్లోని ప్రజలకు వృత్తి, వ్యాపా రం, రవాణా రంగాలు అభివృద్ధి చెందుతాయ ని స్పష్టం చేస్తున్నారుు. అక్కడి ప్రజల జీవితా ల్లో వెలుగులు నిండుతాయని నిగ్గుతేల్చారుు. కుక్కునూరు : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే గోదావరి పై ఏర్పడే జలమార్గం వల్ల ముంపు ప్రాంతాల ప్రజలకు ప్ర యోజనాలు ఉన్నాయని ప్రభుత్వ రంగ సంస్థలు చెబుతున్నారుు. ప్రాజెక్టు వల్ల ఖమ్మం జిల్లా భద్రాచలం నుంచి రాజ మండ్రితోపాటు వివిధ పట్టణాలకు వెళ్లే దూరం తగ్గుతుందని పేర్కొంటున్నారుు. గత ఏడాది నోయిడాలోని ప్రభుత్వరంగ సంస్థ అరుున ఐడబ్ల్యూఏఐ (ఇన్ల్యాండ్ వాటర్వేస్ ఆథారిటీ ఆఫ్ ఇండియా), హైదరాబద్కు చెందిన ఐఐసీ (ఇంటలిజెన్స్ ఇన్ఫర్మేషన్ కన్వర్షన్) సంస్థలు గోదావరిపై సర్వే నిర్వహించాయి. వరదల సమయంలో తప్ప గోదావరిలో నీటిమట్టం తక్కువగా ఉంటుందని, నీటిలోతు వందమీటర్లు ఉంటేనే లాంచీ ప్రయా ణం సాధ్యమవుతుందని తేల్చారుు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే నదిలో నీటిలోతు పెరుగుతుందని, దానివల్ల జల రవాణా సాధ్యమవుతుందని స్పష్టం చేశారుు. రోడ్డు, రైలు మార్గంతో పోలిస్తే జల మార్గం ద్వారా రాజమండ్రికి వెళ్లే ప్రయూణికులు, యాత్రికులకు దూ రం, ఖర్చు, సమయం తగ్గుతాయి. భద్రాచలం, రాజమండ్రి మధ్యలో ఉన్న పేరంటాలపల్లి, పాపికొండలు వంటి పర్యాటక ప్రాంతాలను చూసే వీలు కలుగుతుంది. భద్రాచలం బ్రిడ్జి నుంచి రాజమండ్రి కాటన్ బ్యారేజీ వరకు గోదావరి నది పొడవు 157 కిలోమీటర్లు ఉండగా.. నది ఒడ్డు 171 కిలోమీటర్లు ఉందని సర్వే సంస్థలు నిర్థారించాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని పోచవరం, పాపికొండలు వద్ద 59 మీటర్లు, కచ్చులూరు వద్ద గోదావరిలో 60 మీటర్లు నీటిలోతు ఉండగా, కుక్కునూరు మండల పరిధిలోని వింజరం రేవులో ఆరు మీటర్లే లోతు ఉందని గుర్తించారుు. పోలవరం ప్రాజెక్టు పూర్తరుుతే నీటిలోతు సుమారు వందమీటర్లు ఉండవచ్చని సర్వే అధికారులు అంచనా వేశారు. భద్రాచలం నుంచి చింతూరు మీదుగా రాజమండ్రికి రోడ్డు మార్గంలో వెళ్లాలంటే 209 కిలోమీటర్ల దూరం ప్రయూణించాలి. భద్రాచలం నుంచి కుక్కునూరు మీదుగా రాజమండ్రికి 185 కిలోమీటర్ల దూరం ఉంది. జలమార్గం ద్వారా ఆ దూరం 157 కిలోమీటర్లకు తగ్గుతుంది. రాజ మండ్రి, కాకినాడ వెళ్లే ప్రయాణికులకు సమయం, ఖర్చు, దూరం కలసి వసా ్తరుు. జలరవాణా వ్యవస్థ ఏర్పాటైతే ముంపు మండలాలు అభివృద్ధి చెందుతారుు. ప్రజలకు ఉపాధి లభిస్తుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement