breaking news
gopaiah
-
జ్వరంతో ముగ్గురి మృతి
రామన్నపాలెం (వేంసూరు): రామన్నపాలెం గ్రామంలో ఒకే రోజున.. కేవలం గంటల వ్యవధిలోనే జ్వరంతో ముగ్గురు మృతిచెందారు. దీంతో, ఈ గ్రామస్తులు తీవ్ర భయూందోళనతో వణకుతున్నారు. గ్రామస్తులు తెలిపిన ప్రకారం... ఈ గ్రామానికి చెందిన రామినేని సత్యం(48) కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఆదివారం ఉదయం ఆరు గంటల సమయంలో నోటి నుంచి నురగతో మృతిచెందాడు.ఇతని మృతదేహాన్ని చూసేందుకు అదే వీధిలో ఉంటున్న అంగిడి గోపయ్య(55), బండి వెంకటేశ్వరరావు(45) వచ్చారు. అక్కడున్న వారితో కాసేపు ముచ్చటించి ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయూరు. ఆ తరువాత కొద్దిసేపటికి అంగిడి గోపయ్యకు ఒకేసారి జ్వరం పెరిగింది. తీవ్రంగా అస్వస్థుడైన అతనిని కుటుంబీకులు కృష్ణా జిల్లా తిరువూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తీసుకెళ్తుండగా మార్గమధ్యలో (11 గంటల సమయంలో) మృతిచెందాడు. వెంకటేశ్వరరావుది కూడా ఇదే పరిస్థితి. రామినేని సత్యం మృతదేహాన్ని చూసేందుకు వచ్చి అక్కడే కొద్దిసేపు ఉన్నాడు. ఆ తరువాత తన ఇంటికి వెళ్లిపోయూడు. కొద్దిసేపటి తరువాత జ్వరం పెరగడంతో తీవ్రంగా అస్వస్థుడయ్యూడు. కుటుంబీకులు తిరువూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అతడు అక్కడే మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మృతిచెందాడు. ఒకే వీధికి చెందిన ముగ్గురు వ్యక్తులు గంటల వ్యవధిలో మృతిచెందడంతో గ్రామస్తులు భయంతో వణుకుతున్నారు. ఈ గ్రామంలో మరికొందరు కూడా జ్వరంతో బాధపడుతున్నారు. మృతుల కుటుంబీకులను అధికారులు, ప్రజాప్రతినిధులు పరామర్శించారు. -
ఎన్నికల సరళిపై ‘ప్రత్యేక’ దృష్టి
తాండూరు, న్యూస్లైన్: ఎన్నికల దృష్ట్యా నగదు, మద్యం, ఇతర సామగ్రిల తరలింపును అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ రాజకుమారి పేర్కొన్నారు. మంగళవారం ఆమె తాండూరు మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శిం చారు. మున్సిపల్ ఎన్నికల అధికారి గోప య్య, డీఎస్పీ షేక ఇస్మాయిల్తో కలిసి ఓట్ల లెక్కింపు కేంద్రంతోపాటు ఈవీఎం లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు, ఇతర సామగ్రి, సిబ్బంది తరలింపు అంశాలపై ఎన్నికల అధికారితో సమీక్షించారు. 57 పోలింగ్ కేంద్రాల రూట్ మ్యాప్లను పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని ఎస్పీకి గోపయ్య వివరించారు. అనంతరం ఎస్పీ పాతతాండూరులోని సున్నితమైన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈసందర్భంగా డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. ఒక ఏఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లతో 12 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ టీంలు గ్రామాల్లో, ప్రధాన మార్గాల్లో తనిఖీలు నిర్వహిస్తాయన్నారు. నగదు, మద్యం, కానుకులు తదితరాలు అక్రమంగా తరలిస్తే స్వాధీనం చేసుకొని, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని వివరించారు. 12 ప్లయింగ్ స్క్వాడ్లను తనిఖీలకు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రూ.50వేలకు మించి నా, మించకపోయినా నగదు పట్టుబడితే దానికి ఎలాంటి రసీదులు చూపించని పక్షంలో స్వాధీనం చేసుకుంటామన్నారు. తనిఖీలను వీడియో చిత్రీకరణ చేయడం జరుగుతుందన్నారు. వచ్చే నాలుగు రో జుల్లో పోలీసు అధికారులంతా తమ పరి ధిలోని సున్నితమైన, అతి సున్నితమైన పోలింగ్ కేంద్రాలను సందర్శించి జాగ్రత్త చర్యలు చేపడతారన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ర్యాలీలు, ఊరేగింపులు, సభలు, మైక్లు ఏర్పాటు చేసుకోవాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. కేసుల విషయంలో సొంత డిక్లరేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుందన్నా రు. ఎన్నికల కమిషన్ అనుమతితో తాం డూరు అర్భన్కు త్వరలోనే సీఐ నియామకం చేస్తామన్నారు. ఇప్పటి వరకు ముడిమ్యాల, గౌతాపూర్లలో నిర్వహిం చిన తనిఖీల్లో రూ.5.5లక్షల నగదును సీజ్ చేశామన్నారు. ఎస్పీ వెంట సీఐ రవి, ఎస్ఐలు ప్రణయ్, నాగార్జున్ ఉన్నారు. ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి... పెద్దేముల్: ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఎస్పీ రాజకుమారి అన్నారు. మంగళవారం సాయంత్రం పెద్దేముల్ మండల సమీపంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టును ఆమె తనిఖీ చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సిబ్బందిని అదేశించారు. ఇప్పటి వరకు 250 మందిని బైండోవర్ చేసినట్లు చెప్పారు. 743 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా అందరూ సహకరించాలన్నారు. ఎన్నికల కోడ్ను ఎవరు ఉల్లంఘించినా కేసులు తప్పవన్నారు. అనంతరం ఎస్పీ తాండూరు-హైదరాబాద్ రహదారిపై మంబాపూర్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేశారు.