breaking news
Gokulcat
-
జంట పేలుళ్ల కేసులో నేడే తీర్పు
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ 2007లో హైదరాబాద్లోని గోకుల్చాట్, లుంబినీ పార్కులో జరిపిన జంట బాంబు పేలుళ్ల కేసులో సోమవారం తీర్పు వెలువడనుంది. గోకుల్చాట్, లుంబినీ పార్కులో పేలుళ్లతోపాటు దిల్సుఖ్నగర్లో దొరికిన పేలని బాంబుల కు సంబంధించి మొత్తం 3 కేసుల విచారణ ఈ నెల 7తో పూర్తయింది. చర్లపల్లి కేంద్ర కారాగారం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెజిగ్నేటెడ్ న్యాయస్థానంలో ఈ విచారణ సాగింది. ఈ కేసులో మొత్తం 8 మంది ఉగ్రవాదులను నిందితులుగా పేర్కొనగా అమీర్ రజాఖాన్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పరారీలో ఉన్నారు. మిగిలిన ఐదు గురు నిందితుల (అనీఖ్ షఫీఖ్ సయీద్, సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖా ష్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, మహ్మద్ తారీఖ్ అంజుమ్ ఎహసాన్)పై విచారణ జరిగింది. సోమవారం తీర్పు వెలువడనుండ టంతో పోలీసు విభాగం జైలు వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసింది. ఆక్టోపస్ కమాండోలను మోహరించింది. ఈ పేలుళ్లు జరిగి శనివారంతో 11 ఏళ్లు పూర్తయ్యాయి. ఇవే ‘తొలి–ఆఖరి’ కేసులు... పేలుళ్ల కేసులను తొలుత నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) బదిలీ చేశారు. పేలుళ్ల ఘటన తర్వాత నాటి ప్రభుత్వం ఉగ్ర వాదంపై పోరుకు ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ (ఆక్టోపస్) విభాగాన్ని ఏర్పాటు చేసి నిఘా, ఆపరేషన్స్, దర్యాప్తు బాధ్యతలు కల్పిస్తూ పోలీసుస్టేషన్ హోదా ఇచ్చింది. దీంతో సిట్ నుంచి ఈ 3 కేసులూ ఆక్టోపస్కు వెళ్లాయి. దీనిపై ఆక్టోపస్ అధికా రులు 2009లో 3 అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఇది జరిగిన ఏడాదికే ఆక్టోపస్ను కమాండో ఫోర్స్గా మార్చిన ప్రభుత్వం పోలీ సు స్టేషన్ హోదాను ఉగ్రవాద వ్యతిరేక విభాగమైన కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ) సెల్కు కట్టబెట్టింది. దీంతో ఈ కేసులు సీఐ సెల్కు బదిలీ అయ్యాయి. సీఐ సెల్కు భవిష్యత్తులో మరే ఇతర కేసు దర్యాప్తును అప్పగించకూడ దని నాడే నిర్ణయించారు. దీంతో ఆక్టోపస్, సీఐ సెల్ వింగ్స్ పర్యవేక్షించిన తొలి, ఆఖరి కేసులుగా ఈ మూడే రికార్డులకు ఎక్కాయి. -
యూరప్లో చిక్కిన జంట పేలుళ్ల నిందితుడు ఖాన్?
హుటాహుటిన వెళ్లిన భారత నిఘా వర్గాలు ఖాన్పై ఇంటర్పోల్ రెడ్కార్నర్ నోటీసు వారం క్రితమే అదుపులోకి హైదరాబాద్: హైదరాబాద్లోని గోకుల్చాట్, లుంబినీ పార్కుల్లో జరిగిన జంట పేలుళ్ల కేసులో వాంటెడ్గా ఉన్న ఉగ్రవాది మహ్మద్ అమీర్ రజా ఖాన్.. యూరప్ పోలీసులకు పట్టుబడినట్టు సమాచారం. 2005 ఆగస్టు 25న జరిగిన ఈ విధ్వంసంలో 42 మంది మృతి చెందారు. మరో వంద మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఈ కేసులో అమీర్ రజా ఖాన్ వాంటెడ్గా ఉన్నాడు. పాకిస్థాన్లో తలదాచుకున్న అమీర్పై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే వారం క్రితం యూరప్లో అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. దీనిపై సమాచారం అందుకున్న భారత నిఘా బృందం హుటాహుటిన బయలుదేరి వెళ్లింది. నేరమయ జీవితం..: కోల్కతాకు చెందిన అమీర్ రజా గుజరాత్లో మాఫియా కార్యకలాపాల ద్వారా నేరాల బాటపట్టాడు. 2001లో కోల్కతాకు చెందిన వ్యాపారవేత్త పార్థోను కిడ్నాప్ చేసి భారీగా డబ్బు వసూలు చేసినట్లు ఇతనిపై ఆరోపణలున్నాయి. ఏఆర్డీఎఫ్ సంస్థను స్థాపించిన అమీర్.. కొందరు యువతను సమీకరించి పోలీసులపై ప్రతీకారానికి పురిగొల్పాడు. నగదు కోసం బెదిరింపులు, కిడ్నాప్లు చేయడం ప్రారంభించాడు. 2002లో అఫ్తాబ్ అన్సారీతో కలిసి కోల్కతాలో ఉన్న అమెరికన్ సెంటర్పై దాడి చేశాడు. 2003లో రియాజ్ భత్కల్, సాదిక్ ఇష్రార్ షేక్లతో(గోకుల్చాట్, లుంబినీ పార్క్ పేలుళ్ల సూత్రధారులు) కలసి ఇండియన్ ముజాహిదీన్ను స్థాపించాడు. 2005లో హైదరాబాద్ జంట పేలుళ్లతో పాటు మరికొన్ని ఉగ్రవాద చర్యల్లోనూ అమీర్ పేరు వెలుగులోకి రావడంతో జాతీయ దర్యాప్తు సంస్థ మరికొన్ని కేసులను రెడ్కార్నర్ నోటీసులో జత చేసింది. ముంబై దాడుల తర్వాత భారత ప్రభుత్వం పాకిస్థాన్కు అందించిన మోస్ట్వాంటెడ్ జాబితాలోనూ అమీర్ పేరు ఉంది.