breaking news
Girl Child Protection Scheme
-
నేషనల్ గర్ల్ చైల్డ్ డే: ఒక్క చిరునవ్వు... కోటి కాంతులు
అమ్మకు ఆరోగ్యం బాగోలేకపోతే.. కూతురు అమ్మకు అమ్మ అవుతుంది. నాన్న మనసుకు కష్టం కలిగితే.. కూతురు చేయి ఓదార్పు అవుతుంది. ఈ పదేళ్లలో ప్రభుత్వాలు, ప్రజలలోనూ బాలికలకు సంబంధించిన సమస్యలపై శ్రద్ధ పెరిగింది. ప్రపంచ వేదికపై బాలికలు తమ గళాన్ని వినిపించడానికి మరిన్ని అవకాశాలు పెరిగాయి. అయినప్పటికీ, బాలికల హక్కులపై అవగాహన పరిమితంగానే ఉంది. బాలికలు తమ సామర్థ్యాన్ని నెరవేర్చుకోవడానికి సమాజంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు వారి అడుగులకు మరింత ఊతాన్ని ఇవ్వాల్సిన తరుణమిది. ‘నేషనల్ గర్ల్ చైల్డ్ డే’ సందర్భంగా ఈ విషయంపై దృష్టి సారిద్దాం.. ‘కూతుళ్ళే మన భవిష్యత్తు’ అనే మాటని మన ప్రధాని నరేంద్రమోదీ వివిధ సందర్భాలలో చెప్పడం పదే పదే విన్నాం. వివిధ రంగాలలో మహిళల విజయాలను గుర్తిస్తున్నాం. ఆడపిల్లల సాధికారతకు కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం. అయినా ‘ఆమె’ పురోగతి కి కుటుంబం, సమాజం చేయాల్సిన కృషి ఎంతో ఉంది. కుటుంబంలో స్కీమ్స్ ఒకప్పుడు కూతురు ఇంటి గుండె మీద కుంపటి. ఇప్పుడు కుటుంబ సమస్యలను ఓ దరిచేర్చగల చుక్కాని. అందుకే పుట్టేది ఆడపిల్లైనా, మగపిల్లవాడైనా ‘సరే’ అనే దిశకు కుటుంబం చేరుకుందనే చెప్పాలి. కానీ, ‘ఆమె’ పెరుగుదలలో ఇంటి నుంచే ఎన్నో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అందుకు తల్లితండ్రులే అమ్మాయిలను ప్రోత్సహించడానికి స్కీమ్స్ పెడుతుండాలి. ఆమె కలలకు, ఆశయాలకు మద్దతునివ్వాలి. ఎలాంటి సమస్య అయినా ‘పరువు’ అనే భయంతో కాకుండా బలమైన వెన్నుగా నిలవాలి. డిజిటల్ జనరేషన్, అవర్ జనరేషన్ ఈ నినాదం ఇప్పుడు బాలికలకు అత్యవసరమైనది. డిజటల్ యుగంలో ‘ఆమె’కు వాటి వినియోగంలోనూ పూర్తి అవగాహన అవసరం. ఇప్పటికే అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలు డిజిటల్ పరికరాల వాడకంలో వెనకంజలో ఉన్నట్టు ప్రపంచవ్యాప్త అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. డిజిటల్ మాధ్యమం ద్వారా అమ్మాయిలను ప్రభావంతంగా మార్చే మానవ ఆసక్తి కథనాలు, బ్లాగ్లు, వీడియోలు, రీసోర్సింగ్ చేసే స్ఫూర్తిదాయకమైన నెట్వర్క్లు, సంస్థల గురించి తెలుసుకునే అవకాశాలను కల్పించాలి. చట్టం.. హక్కులు సమాజంలో ధైర్యంగా, శక్తిమంతంగా ఎదిగేందుకు ఆమె చుట్టూ ఉన్న రక్షణ, న్యాయ వ్యవస్థల గురించి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు కుటుంబంతోపాటు ఉపాధ్యాయుల పాత్ర ముఖ్యమైనది. నాయకత్వాన్ని పెంచుదాం అవగాహన ‘ఆమె’కు అవకాశాలను విస్తృతం చేస్తుంది. నాయకత్వాన్ని ఎంచుకునేలా ఎదగాలంటే .. ► మన ప్రాంతంలోని అమ్మాయిలను వెనక్కి నెట్టివేసే అంశాల గురించి అవగాహన పెంపొందించడంలో, వాటిని పరిష్కరించడంలో ముందుండాలి. ► బాలికలకు అందాల్సిన సేవలను మరింతగా బలోపేతం చేయాలి. ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా వారి నాయకత్వం, చర్యలు, ప్రభావాన్ని సమష్టిగా విస్తరింపజేయాలి. ► ప్రపంచవ్యాప్తంగా బాలికలు లింగ అసమానత, వివక్షకు గురవుతున్నారనేది వాస్తవం. ఇవి బాలికలను ప్రతిచోటా వెనకడుగు వేయిస్తున్నాయి. అందుకే లైంగిక వేధింపులు, హింస, అసమానతలు, హక్కుల గురించి అవగాహన కల్పించడంలో వెనకంజ వేయకూడదు. ► విద్య, ఆరోగ్యం, పోషకాహార ప్రాముఖ్యతలను తెలియజేయడమే కాదు వాటిని అందించడంలోనూ ముందంజలో ఉండాలి. ► అమ్మాయిలు తమలోని ప్రతిభను కనబరచడమే కాకుండా పూర్తి స్వేచ్ఛతో జీవించే అవకాశాన్ని కల్పించాలి. ► చాలా ప్రాంతాలలో అమ్మాయిలను త్వరగా పెళ్లి చేసుకోమని బలవంతం చేయడం లేదు. అయినా, ఎలాంటి హింస జరిగినా ఆడపిల్లలకు తమ గొంతు వినిపించే హక్కు ఉంది. ఈ విషయాన్ని వారికి తప్పక తెలియజేయాలి. ► రోల్ మోడల్స్గా ఉన్నవారిని బాలికలకు పరిచయం చేయిస్తూ ఉండాలి. బాలికా నాయకత్వం పట్ల ప్రజలలో అవగాహనను పెంచాలి. ► అలజడులు, వలసలు, ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో సామాజిక సహాయ సేవలను పొందుతున్నప్పుడు బాలికలు అనుభవించే అసమానతలను పరిష్కరించడానికి అధికారులు, విధాన నిర్ణేతలు మరింత గా దృష్టి సారించాలి. ఒక ఆడపిల్ల తన స్వచ్ఛమైన చిరునవ్వుతో ఇంటిని ప్రకాశవంతం చేస్తుంది. జీవితాన్ని ఎలా గడపాలో నేర్పేది ఆమె. కుటుంబంలో ప్రతి ఒక్కరినీ ప్రేమలో పడేలా చేసే స్వచ్ఛమైన ఆత్మ. కాబట్టి ప్రతి ఇంటినీ తన నిస్వార్థ ప్రేమతో, ప్రకాశంతమైన కాంతితో నింపే ఆమె భవిష్యత్తును ఉజ్వలం చేద్దాం. సమాజంలో సమానమైన అవకాశాలను కల్పించడానికి ప్రయత్నిద్దాం. -
జీసీపీఎస్ బాండ్లు అందేనా...?
విజయనగరం ఫోర్ట్, న్యూస్లైన్: బాలిక సంరక్షణ పథకా(గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్)నికి సంబంధించిన బాండ్ల కోసం వేలాదిగా లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ఈ పథకానికి ప్రభుత్వం మంగళం పాడినప్పటికీ దానికి గతంలో మంజూరైన వారికి మాత్రం ఇంతవరకు బాండ్లు అందజేయలేదు. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. బాండ్లు వస్తాయో లేదో తెలియక సతమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏడాదికాలంగా 3,236 మంది లబ్ధిదారులు బాండ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులు వారిని భారంగా భావించకుండా ప్రోత్సహిం చాలనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు బాలికా సంరక్షణ పథకా(జీసీపీఎస్)న్ని ప్రవేశ పెట్టారు ఈ పథకం కింద ఒక ఆడపిల్లతో కుటుంబ సంక్షేమ శస్త్ర చికిత్స చేయించుకున్న వారికి రూ లక్ష, ఇద్దరు ఆడపిల్లలతో కుటుంబ సంక్షేమ శస్త్రచికి త్స చేయించుకున్న వారికి రూ 60 వేలు చొప్పున ప్రోత్సాహకంగా అందజేస్తారు. పథకం కింద ఎంపిక చేసిన లబ్ధిదారులకు 20 ఏళ్ల వయస్సు నిండిన తర్వాత సొమ్ము అందేలా బాండ్లను ఎల్ఐసీ అందజేస్తుంది.దీని కోసం ప్రభుత్వం ఎల్ఐసీకి ప్రీమియం సొమ్మును విడుదల చేయాలి. అయితే కిరణ్ సర్కార్ ప్రీమియం సొమ్మును విడుదల చేయడంలో తాత్సారం చేయడంతో బాండ్లను ఎల్ఐసీ సకాలంలో జారీ చేయడం లేదు. ఫలితంగా లబ్ధిదారులు ఏడాది కాలంగా బాండ్ల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. 2011-12 సంవత్సరానికి సంబంధించి జిల్లాకు జీసీపీఎస్ పథకానికి ఒక ఆడపిల్ల ఉన్నవారు కింద 52 మంది, ఇద్దరు ఆడపిల్లలున్నవారు 3,084 మంది ఎంపికయ్యారు. వీరంతా బాండ్లకోసం ఎదు రు చూస్తున్నారు. ఈ ఏడాది కిరణ్ సర్కార్ జీసీపీఎస్కు మంగళం పాడి బంగారుతల్లి పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టింది. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. కొత్త పథకం ప్రవేశ పెట్టడం వల్ల పాత పథకం కింద ఎంపికైన వారికి బాండ్లు అందజేస్తారా లేదా బాండ్లకు కూడా మంగళం పాడతారా అని లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నా రు. ఇదే విషయాన్ని ఐసీడీఎస్ పీడీ టీవీ.శ్రీనివాస్ వద్ద ‘న్యూస్లైన్’ ప్రస్తావించగా ఎల్ఐసీ నుంచి బాండ్లు ఇంకా రాలేదన్నారు. అవి వచ్చిన వెంటనే లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు.