-
బల్దియా ఆవాజ్.. బడ్జెట్పే నజర్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. శుక్రవారం అన్ని డివిజన్లలో తుది ఓటర్ల జాబితాలు అందుబాటులో ఉంచుతున్న యంత్రాంగం ఆదివారం (15వ తేదీ) ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. నోటిఫికేషన్– పోలింగ్ మధ్య కనీసం రెండువారాల గడువు ఉండాలన్న నిబంధన నేపథ్యంలో డిసెంబర్ మొదటి వారంలో 6వ తేదీ లోపునే ఏదో ఒకరోజు పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. వాస్తవానికి 2021 ఫిబ్రవరి 10వ తేదీ వరకు ప్రస్తుత పాలకవర్గానికి గడువు ఉన్నా.. ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలా డిసెంబర్ మాసమే అనుకూలమని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. నగరంలో గురువారం నాటి పరిణామాలతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. జీహెచ్ఎంసీ పీఠాన్ని మళ్లీ రికార్డు మెజారిటీతో చేజిక్కుంచుకునే దిశగా అధికార టీఆర్ఎస్ వ్యూహం రూపొందిస్తుండగా, షహర్ హమారా.. మేయర్ హమారా నినాదంతో బీజేపీ దూకుడుగా వెళ్లేందుకు సిద్ధమవుతోంది. జీహెచ్ఎంసీ పీఠాన్ని ఎక్కువ కాలం తమ గుప్పిట్లో ఉంచుకున్న కాంగ్రెస్ పార్టీ మళ్లీ తన పట్టును తిరిగి సాధించుకునేందుకు ఎత్తులు వేయనుంది. ప్రతి ఎన్నికలో కీలకంగా మారిన ఎంఐఎం సైతం మేయర్ స్థానమే లక్ష్యంగా ముందుకు వెళ్లనుంది. గతంలో పలుమార్లు సొంతంగా, ఇతర పారీ్టలతో కలిసి మేయర్ పదవిని దక్కించుకున్న ఎంఐఎం ఈసారి సొంతంగా మరోసారి తమ జెండాను ఎగురవేసే లక్ష్యంతో ఉన్నట్లు సమాచారం. ఇతరులు.. మేల్కొనే లోపే.. ప్రస్తుత పాలవర్గం గడువు ఫిబ్రవరి వరకు ఉన్నా.. మూడు మాసాల ముందుగానే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నగరంలో ఓవైపు అభివృద్ధిని మరోవైపు సంక్షేమాన్ని సైతం పరుగులు పెట్టించింది. నగరంలో 150 డివిజన్లలో పోటీ చేసేందుకు సిట్టింగ్ కార్పొరేటర్లతో పాటు కొత్తవారితో కూడిన జాబితాలను సైతం సిద్ధం చేసి ఎన్నికలకు సిద్ధమైంది. ఎంఐఎం సైతం ఎన్నికల కార్యాచరణను ఇప్పటికే రూపొందించుకుంది. ఇక భారతీయ జనతా పార్టీ ఇటీవలీ దుబ్బాక ఎన్నిక విజయంతో మంచి ఊపు మీద ఉన్నా.. వార్డు, డివిజన్ స్థాయి కసరత్తును ఇంకా పూర్తి చేయలేదు. కాంగ్రెస్ సైతం మెజారిటీ డివిజన్లలో విజయానికి ఆశించిన రీతిలో ప్రణాళికలు రూపొందించలేదు. ప్రధాన పారీ్టలు బరిలోకి దిగే వరకు తాము ఎన్నికల అంశాన్నే పూర్తి చేసే దిశగా టీఆర్ఎస్ పావులు కదుపుతోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఒకరు ఒక వార్డు నుంచే.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక అభ్యర్ధి ఒక డివిజన్ (వార్డు) నుంచి మాత్రమే పోటీ చేసేందుకు అర్హులని జీహెచ్ఎంసీ కమిషనర్, ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఓటు హక్కు ఉన్న అభ్యర్ధి ఏ డివిజన్ నుంచైనా పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేయవచ్చన్నారు. ఒక అభ్యర్ధి రెండు మూడు డివిజన్ల నుంచి నామినేషన్ దాఖలు చేసినప్పటికీ, ఉపసంహరణ గడువు నాటికి ఒక్క డివిజన్కు మించి ఉండరాదని తెలిపారు. ఒకటి కంటే ఎక్కువ డివిజన్లలో ఉంటే, అన్నీ రద్దవుతాయన్నారు. పోటీ చేసేందుకు అర్హత ఉండదన్నారు. జీహెచ్ఎంసీలో ఓటర్లు ఇలా.. ► (మహిళలు)...35,46,731 ► (పురుషులు)...38,56,617 ► (ఇతరులు).. 669 ►(మొత్తం)...74,04,017 ► 150 (మొత్తం డివిజన్లు) ► 76 (మహిళా కార్పొరేటర్లు) ప్రస్తుతం పార్టీల వారీగా కార్పొరేటర్లు ► టీఆర్ఎస్ 99 ►ఎంఐఎం 44 ►బీజేపీ 04 ►కాంగ్రెస్ 02 ►టీడీపీ 01 సాక్షి, సిటీబ్యూరో: ఏటికేడాది అధికంగా ఉండే జీహెచ్ఎంసీ బడ్జెట్ రాబోయే (2021– 22) ఆరి్థక సంవత్సరానికి సంబంధించి తగ్గించారు. ప్రస్తుత ఆరి్థక సంవత్సరం బడ్జెట్ రూ.6,973.64 కోట్లు కాగా, కొత్త బడ్జెట్ను రూ.5,600 కోట్లకు కుదించారు. గత బడ్జెట్ను జీహెచ్ఎంసీ నిధులది.. ఇతర కార్పొరేషన్ల నుంచి వచ్చే నిధులది వేర్వేరుగా ‘ఎ’, ‘బి’లుగా ప్రకటించగా.. ఈసారి విభజన చూపకుండా ప్రతిపాదించారు. రూ.5,600 కోట్లతో గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ ముందుంచారు. జీహెచ్ఎంసీ నిధులకే సంబంధించి పరిశీలిస్తే మాత్రం ప్రస్తుతం నడుస్తున్న ఆరి్థక సంవత్సరానిది ప్రస్తుత ఆరి్థక సంవత్సర బడ్జెట్ రూ.5,380 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.2,226.23 కోట్లు ఖర్చయ్యాయి. బడ్జెట్లో అత్యధికంగా రూ.1582.51 కోట్లు రోడ్లు, పేవ్మెంట్లకే కేటాయించారు. ఆ తర్వాత ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కు, గ్రీన్ బడ్జెట్కు ఎక్కువగా కేటాయించారు. అంటే రోడ్లు, హరిత కార్యక్రమాలకు ప్రాధాన్యమిచ్చారు. ఇతర కార్పొరేషన్ల నుంచి వస్తాయనుకున్న నిధులు రాకపోవడంతో ఈసారి వాటిని చేర్చలేదని తెలుస్తోంది. అప్పులే గొప్పలు.. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయంలో ఆస్తిపన్ను అంచనా రూ.1,850 కోట్లు కాగా, అప్పులు రూ.1,224.51 కోట్లు. అసైన్డ్ రెవెన్యూ ఆదాయంగా రూ.652.10 కోట్లు ప్రతిపాదించారు. బీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి హైకోర్టు ఆదేశం అవసరం కావడంతో వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని పెద్దగా చూపలేదు. 2020– 21 ఆర్థిక సంవత్సరానికి జీహెచ్ఎంసీ నిధులకు సంబంధించిన రూ.5,380 కోట్ల బడ్జెట్ను రూ.5,500 కోట్లుగా సవరిస్తూ ప్రతిపాదించారు. కొత్త బడ్జెట్ (2021–22)ను డిసెంబర్ 10వ తేదీలోగా స్టాండింగ్ కమిటీ ఆమోదించి 15వ తేదీలోగా పాలకమండలి ముందు ఉంచాలి. 2021 జనవరి 10వ తేదీలోగా జనరల్ బాడీ సమావేశంలో సమీక్షించాలి. ఫిబ్రవరి 20వ తేదీలోగా కార్పొరేషన్ ఆమోదించాల్సి ఉంటుంది. అనంతరం 2021 మార్చి 7వ తేదీ వరకు ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదించాలి. ఎస్లాబ్లిష్మెంట్... 1226.91 నిర్వహణ ఖర్చులు... 905.30 ఇతర రెవెన్యూ ఖర్చులు... 281.79 రోడ్లు, పేవ్మెంట్లు.... 1582.51 భూమి, భూ అభివృద్ధి.... 445.19 వరద కాలువలు.... 170.00 గ్రీన్బడ్జెట్... 560.00 వాటర్ సప్లై, సివరేజీ... 131.87 ఇతర క్యాపిటల్ ఖర్చులు 296.43 -
ఎన్నికల కసరత్తు షురూ
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ సమాయత్తమవుతోంది. కరోనాతో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలా లేక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎం)ల ద్వారా నిర్వహించాలా.. అన్న అంశంపై అభిప్రాయం చెప్పాలని ప్రధాన రాజకీయ పక్షాలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సోమవారం లేఖలు రాశారు. ఈ నెలాఖరులోపు తమ అభిప్రాయాన్ని చెబితే.. మెజారిటీ అభిప్రాయం మేరకు ముందుకు వెళ్లనున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని ఎన్నికలు ఇప్పటి వరకు బ్యాలెట్ పద్ధతినే నిర్వహిస్తూ వచ్చారు. ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నందున పకడ్బందీ ఏర్పాట్ల మధ్య నిర్వహించే యోచనలో ఉన్నారు. ఈ ఎన్నికలను అధికార టీఆర్ఎస్తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎంలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలతో విడతల వారిగా సమావేశం నిర్వహించారు. మరోవైపు గ్రేటర్లో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష జరుపుతున్నారు. -
అసద్ను అరెస్టు చేయాలి
కాంగ్రెస్ డిమాండ్.. గాంధీభవన్ నుంచి డీజీపీ కార్యాలయం వరకు ర్యాలీ డీజీపీ కార్యాలయం ఎదుట ధర్నా సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి, శాసన మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీపై దాడి చేసిన ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ డీజీపీ కార్యాలయం ఎదుట టీపీసీసీ ధర్నాకు దిగింది. గాంధీభవన్ నుంచి డీజీపీ కార్యాలయం వరకు టీపీసీసీ నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాదయాత్రతో ర్యాలీని నిర్వహించారు. మంగళవారం పాతబస్తీలో ఉత్తమ్, షబ్బీర్పై దాడి నేపథ్యంలో ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, ఎమ్మెల్యేలు సంపత్కుమార్, రామ్మోహన్రెడ్డి తదితరులు గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడారు. దాడికి దిగిన అసదుద్దీన్ ఒవైసీని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పాదయాత్రగా గాంధీభవన్ నుంచి డీజీపీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఎంఐఎంకు, పోలీసులకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ ర్యాలీకి మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, అంజన్కుమార్ యాదవ్, దానం నాగేందర్ తదితరులు నేతృత్వం వహించారు. ర్యాలీ నాంపల్లి, పబ్లిక్ గార్డెన్స్, అసెంబ్లీ మీదుగా డీజీపీ కార్యాలయానికి చేరుకుంది. ఈలోగా ఉత్తమ్, షబ్బీర్ అలీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నేరుగా డీజీపీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. కాసేపటి తర్వాత రోడ్డుపై ధర్నా చేశారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్కుమార్ యాదవ్ తదితర ముఖ్య నేతలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. నగర పోలీసు సంయుక్త కమిషనర్ అంజన్కుమార్ టీపీసీసీ నేతలతో చర్చించారు. ఉత్తమ్కుమార్, షబ్బీర్ అలీపై దాడిచేసినవారిపై 24 గంటల్లోగా చర్యలు తీసుకుంటామని ఆయన డీజీపీ తరపున హామీ ఇచ్చారు. దీంతో టీపీసీసీ ధర్నాను విరమించింది. ఇది ప్రజాస్వామ్యమేనా?: జానా పాతబస్తీలో భయోత్పాత వాతావర ణం సృష్టించి రిగ్గింగ్ చేసేందుకు ఎంఐఎం కుట్ర పన్నిందని ప్రతిపక్ష నేత జానారెడ్డి ఆరోపించారు. పురానాపూల్ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థిని పోలింగ్ పర్యవేక్షించకుండా పోలీసులు నిర్బంధించడం ఎలా సమంజసమని ప్రశ్నించారు. దీనిపై స్పందించి పాతబస్తీకి వెళ్లిన ఉత్తమ్, షబ్బీర్ అలీపై ఎంఐఎం నేతలు దాడులకు దిగడం దారుణమన్నారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అంటూ జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ రోజున ఎంఐఎం బైక్ ర్యాలీకి అనుమతి ఎక్కడిదని ప్రశ్నించారు. దాడులు జరుగుతుంటే పోలీసులు చోద్యం చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఎన్నికలు నిర్వహించడం కంటే నామినేట్ చేసుకుంటే సరిపోయేదన్నారు. పురానాపూల్, మీర్చౌక్తోపాటు పాతబస్తీలోని 44 డివిజన్లలో రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు: భట్టి ఎంఐఎం నేతల ఆగడాలు మితిమీరిపోయినా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకోబోమని, తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తపోరాటం: ఉత్తమ్, షబ్బీర్ తమపై దాడికి దిగిన ఎంఐఎం నేతలపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తామని ఉత్తమ్కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ హెచ్చరించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement