breaking news
gas based plant
-
Siddipet: తడి చెత్తతో సీఎన్జీ
సాక్షి, సిద్దిపేట: స్వచ్ఛతలో ఆదర్శంగా నిలుస్తున్న సిద్దిపేట మున్సిపాలిటీ మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. పర్యావరణానికి అనుకూలంగా ఉండేలా తడి చెత్తతో సీఎన్జీ (కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్) తయారు చేసే ప్లాంట్ను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా స్వచ్ఛబడిని ఏర్పాటు చేసి చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వారంలో నాలుగు రోజుల పాటు ఇంటింటికీ తిరుగుతూ తడి, పొడి, హానికరమైన చెత్తను సేకరిస్తున్నారు. ఇప్పటికే చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నా, అంచనాలకు మించి చెత్త రావడంతో బెంగళూరు తరహాలో సీఎన్జీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్రావు నిర్ణయించారు. మంత్రి ఆలోచన మేరకు మున్సిపల్ అధికారులు ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వ్యయం.. రూ.4.7 కోట్లు సిద్దిపేట రూరల్ మండలంలోని బుస్సాపూర్ డంపింగ్ యార్డులో రూ.4.7 కోట్ల వ్యయంతో ఈ ప్లాంట్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షెడ్ నిర్మాణం చివరి దశకు చేరింది. స్వచ్ఛ భారత్ నిధులతో ఈ ప్లాంట్ను నెలకొల్పుతున్నారు. ఈ మున్సిపాలిటీలో 39,616 కుటుంబాల్లో 1.46 లక్షల మంది ఉన్నారు. ఇక్కడ నిత్యం 25 టన్నుల తడి చెత్త సేకరిస్తున్నారు. ప్రాజెక్ట్ నమూనా చిత్రం గ్యాస్ తయారీ ఇలా ఇంటింటా సేకరించిన తడి చెత్తను తొలుత క్రషింగ్ చేస్తారు. అనంతరం దీనిని పైపు ద్వారా ఫ్రి డైజెస్టర్ అనే ట్యాంక్లోకి పంపిస్తారు. తర్వాత డైజెస్టర్ ట్యాంక్లోకి పంపించి మూడు రోజులు నిల్వ ఉంచుతారు. అక్కడి నుంచి 14 మీటర్ల వెడల్పు, 6 మీటర్ల ఎత్తు ఉన్న మరో ట్యాంక్లోకి ఇక్కడ తయారైన ద్రావణాన్ని పంపిస్తారు. అనంతరం ఆ ట్యాంక్లో మైక్రో ఆర్గాన్లను వేస్తారు. ఆ సమయంలో విడుదలయ్యే మిథేన్ గ్యాస్ నుంచి సీఎన్జీని వేరు చేసి సిలిండర్లలో నింపుతారు. నిర్వహణ బాధ్యత ప్రైవేటుకు గ్యాస్ ప్లాంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత కార్బన్ లైట్స్ ఇండియా ప్రైవేట్ కంపెనీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ మేరకు సిద్దిపేట మున్సిపాలిటీతో ఈ కంపెనీ ఒప్పందం చేసుకోనుంది. గ్యాస్ ఉత్పత్తి ద్వారా వచ్చే ఆదాయాన్ని 25 శాతం మున్సిపాలిటీ, 75 శాతం కంపెనీ తీసుకుంటాయి. ఆగస్టు చివరి వరకు పూర్తి ఆగస్టు చివరి నాటికి గ్యాస్ ప్లాంట్ నిర్మాణం పూర్తవు తుంది. అనంతరం ప్రైవేట్ కంపెనీకి నిర్వహణ బాధ్య తలు అప్పగిస్తాం. దాదాపు ఐదేళ్ల పాటు ఈ ఒప్పందం ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సిద్దిపేటలో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నాం. –రమణాచారి, మున్సిపల్ కమిషనర్, సిద్దిపేట -
గ్యాస్ ఆధారిత ప్లాంట్లు వద్దు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఇకపై గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి ప్లాంట్లు నెలకొల్పవద్దని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి ప్లాంట్లు గ్యాస్ లభ్యత లేక కుంటుపడ్డాయని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గురువారం లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, టీడీపీ ఎంపీ రవీంద్రబాబు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తొలుత ఎంపీ కొండా మాట్లాడుతూ ‘తెలంగాణలో విద్యుత్ కొరత ఉంది. అయితే పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్తో ఈ విషయంలో వివాదం ఉన్నప్పటికీ గత 20 ఏళ్లలో ఎప్పుడూ లేని రీతిలో ఏప్రిల్లో కరెంటు కోతలు లేవు. ఇందుకు కారణం రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఎక్స్ఛేంజీలో కరెంటు కొన్నది. ఈ విధానంలో అక్కడ ప్రతి 15 నిమిషాలకు ధర మారుతోంది. ఒక్కోసారి మేం యూనిట్కు రూ. 8 నుంచి 9 వరకు చెల్లిం చాల్సి వచ్చింది. అయితే ఇది ఆర్థిక భారంతో కూడుకున్నది. శంకరపల్లిలో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంటు కోసం 2000 సంవత్సరంలో 200 ఎకరాల భూమి సేకరించాం. కానీ ఇప్పటివరకు ప్లాంటు ఏర్పాటుకాలేదు’ అని అన్నారు. దీనికి పీయూష్ గోయల్ సమాధానమిస్తూ.. ‘తెలంగాణ ప్రజలకు నిరంతరాయ విద్యుత్ ఇస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించి తీరాలి. అన్ని రాష్ట్రాలు దీన్ని అవలంబించవచ్చు. దేశంలో అనేక రాష్ట్రాల్లో మిగులు విద్యుత్ ఉంది. విద్యుత్ ఎక్స్ఛేంజీలోగానీ, దీర్ఘకాలిక కొనుగోలు ఒప్పందాల ద్వారా గానీ దీనిని పొందవచ్చు. విద్యుత్ ఎక్స్ఛేంజీ విధానంలో యూనిట్కు రూ. 8 వెచ్చించామని సభ్యుడు చెబుతున్నారు. నేను నిన్న పవర్ గ్రిడ్ మాని టరింగ్ కార్యాలయంలో ఉన్నప్పుడు మధ్యాహ్నం 3.30 గంటలకు పవర్ ఎక్స్ఛేంజీ రేటు యూనిట్కు సున్నా ధర ఉంది. ఆ సమయం లో విద్యుత్ అవసరానికి మించి అందుబాటులో ఉంది. అందువల్ల దానిని ఉచితంగా ఇవ్వడం కంటే వేరే దారి లేదు. ఇక శంకరపల్లి విషయానికి వస్తే.. దేశంలో గ్యాస్ కొరత ఉంది. 14 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్లు ప్రస్తుతం గ్యాస్ కొరతతో పనిచేయ డంలేదు. రాష్ట్రాలు ఇకపై గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పవద్దని కోరుతున్నా. దానికి బదులు సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటుచేసుకోవాల’ని స్పష్టం చేశారు.