Galikuntu disease
-
గాలి కుంటు వ్యాధి
వేసవిలో పశువులు, గొర్రెలు, మేకలు, పందులు మొదలయిన చీలుగిట్టలుండే జంతువులకు సంక్రమించే వైరస్ వ్యాధుల్లో గాలికుంటు ముఖ్యమైనది. నోటికి, గిట్టలకు పుళ్లవుతాయి కాబట్టి ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ (ఎఫ్ఎండి) అంటారు. ఆప్తో వైరస్ ఈ వ్యాధిని కలిగిస్తుంది. ఇది సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమం. గాలి, ఇతర మార్గాల్లో ద్వారా వ్యాపిస్తుంది. మరణాల శాతం తక్కువైనప్పటికీ, పశువుల్లో ఉత్పాదక శక్తి తగ్గి రైతుకు తీవ్ర ఆర్థిక నష్టం కలుగుతుంది.టీకాలతో నివారణ ఉత్తమం→ గాలికుంటు వ్యాధికి చికిత్సలేదు. నివారణ మార్గాలపై శ్రద్ధ వహించాలి. గాలికుంటు వ్యాధి టీకాలు మొదటిసారి 2 నెలల వయసులో, బూస్టర్ డోసు ఒక నెల తర్వాత చేయించాలి. ప్రతి సంవత్సరానికి ఒకసారి క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి. → గాలికుంటు వ్యాధి నివారణకు 6 నెలలకోసారి కేంద్ర ప్రభుత్వ పశు సంవర్థక శాఖ ఉచితంగా టీకా వేస్తోంది. రైతులు సమీపంలోని ప్రభుత్వ పశు వైద్యుడ్ని సంప్రదించి పశువులకు టీకాలు వేయించుకొని ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి తోడ్పడాలి.→ వ్యాధిగ్రస్త పశువుల నోటి చొంగలో వైరస్ అధిక శాతం వుంటుంది. ఈ చొంగ పడిన మేత, దాణా, నీరు, మల మూత్రాదుల్లో సంవత్సరం వరకు వైరస్ దాగి వుంటుంది. అనుకూల పరిస్థితుల్లో తిరిగి వ్యాధిని కలిగిస్తుంది. అందువల్ల వ్యాధి సోకిన పశుశాలలను సోడియం హైడ్రాక్సైడ్, 2% ఫార్మాలిన్, 4% సోడియం కార్బోనేటు వంటి మందులతో శుభ్రం చేస్తే వైరస్ నశిస్తుంది. → ఆబోతుల, దున్నల వీర్యం ద్వారా కూడా ఈ వైరస్ వ్యాపిస్తుంది. 3 నెలల వరకు సంపర్కానికి నియోగించకూడదు. వ్యాధి సోకిన పశువుల పాలు దూడలు తాగకుండా చూడాలి. సంత నుంచి తెచ్చిన పశువుల్ని మూడు వారాలు విడిగా వుంచి, పరిశీలించి, టీకాలు వేయించిన తర్వాత ఆరోగ్యంగా వున్న పశువులతో కలువనివ్వాలి.గాలికుంటు వ్యాధి లక్షణాలు→ గాలికుంటు వ్యాధి లక్షణాలు గొర్రెలు, మేకల్లో కన్నా పశువుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. శరీర ఉష్ణోగ్రత 104– 106 డిగ్రీల సెల్షియస్ వరకు ఉంటుంది. → నోటిలో చర్మపు పొరలు, పళ్ల చిగుళ్లు, నాలుక, ముట్టె లోపలి ప్రాంతాల్లో బొబ్బలు పొక్కి, చితకటం వల్ల పశువులు మేత తినవు. నోటి నుంచి చొంగ, నురుగు విపరీతంగా కారుతుంది. → గిట్టల మధ్య, గిట్టపైన బొబ్బలు ఏర్పడి, చితికి పుళ్లవుతాయి. నొప్పి వల్ల పశువులు నడవలేక కుంటుతాయి. చను మొనలపై కూడా బొబ్బలు ఏర్పడి పొదుగు వాపు కనిపిస్తుంది. → వ్యాధి సోకిన పశువుల పాలు తాగి దూడలు మరణిస్తాయి. దుక్కిటి పశువులు పనులకు ఉపయోగపడవు. చూలి పశువులకు గర్భస్రావాలవుతాయి. → పశువులు రక్తహీనతకు గురై శ్వాస కష్టంగా పీల్చతూ, రొప్పుతూ, ఎండవేడికి తట్టుకోలేక నీరసించిపోతాయి. ఈ లక్షణాలన్నీ ఎక్కువగా సంకరజాతి పశువుల్లో కనిపిస్తాయి.లక్షణాలకు అనుగుణంగా చికిత్స→ వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుంచి వేరు చేసి, సత్వర చికిత్స చేయించాలి. వైరస్వ్యాధి కాబట్టి మందులు పనిచేయవు. వ్యాధి లక్షణాలకు అనుగుణంగా చికిత్స చేయాలి. → నోటిలోని పుండ్లను పొటాషియం పర్మాంగనేటు కలిపిన నీళ్లతో శభ్రం చేసి, వాటికి బోరోగ్లిజరిన్, యాంటి సెంప్టిక్ ఆయింట్మెంటు పూయాలి. కాలి పుండ్లకు జింక్ ఆక్సైడ్, లొరాక్సిన్, హిమాక్స్ వంటి ఆయింట్మెంట్ పూయాలి. → ఈగలు వాలకుండా వేపనూనె, లినమెంట్ వంటి వాటిని వాడాలి. అలాగే నోటిలోని చిగుర్లు, పుండ్ల పొరలు అభివృద్ధికి విటమిన్–సి కలిగివుండే పౌడర్ ఆప్తోకేర్ వంటి వాటిని వాడాలి. → బాక్టీరియా సోకకుండా యాంటిబయోటిక్ మందులు 3–5 రోజులు వాడాలి. ఉపశమనం కోసం మెలోక్షికమ్ మందులు వాడాలి. అలాగే విటమిన్లు, బి–కాంప్లెక్స్లతో కూడిన టానిక్లను ఇచ్చి వ్యాధి నిరోధక శక్తిని పెంచాలి. → జావ/జొన్న అన్నం, చిటికెడు ఉప్పు, బెల్లం కలిపి ప్రతి రోజు తాగించటం ద్వారా బలహీనపడకుండా జాగ్రత్త వహించాలి. పశువు బాగా నీరసిస్తే గ్లూకోజ్ రక్తంలోకి ఇవ్వాల్సి వుంటుంది.గృహ వైద్యం→ పటిక లేదా వెలిగారమును కలిపిన నీటితో నోటి పుళ్ళు, కాలి పుండ్లను కడగాలి. పావు కిలో రాగులు, పావు కిలో పెసలు ఉడకబెట్టి, 250 గ్రాములు నువ్వుల నూనెలో బాగా పిసికి.. రోజుకు 2 సార్లు తినిపించాలి. కాళ్ళకు నువ్వుల నూనె కడియం వేయాలి.→ జ్వరం తగ్గటానికి సురేకారం 20 గ్రాములు, ఉప్పు 30 గ్రాములు, నేలవేము 30 గ్రాములు, బెల్లం 120 గ్రాములు, అర లీటరు వేడి నీళ్ళలో కలిపి రోజుకు 2 సార్లు తాగించాలి.హెూమియో చికిత్స→ వ్యాధి ప్రబలిన ప్రాంతంలో పశువులకు మెర్క్ సోల్ 200 గానీ, కాల్ బైక్రోమికమ్ 200 గానీ, సిఫిలినం 200 గానీ ఏదో ఒకదాన్ని వాడితే వ్యాధి సోకకుండా పశువులను కాపాడుకోవచ్చు. 10 మాత్రలు చొప్పున ప్రతి రోజూ ఒకసారి తినిపిస్తే వ్యాధినిరోధకంగా పనిచేస్తుంది. → వ్యాధి సోకితే అది తగ్గటానికి.. మెర్క్ సోల్ 200 లేదా కాల్ బైక్రోమికమ్ 200 లేదా సిఫిలినం 200 లేదా ఎకినేసియా 200 లేదా బోరాక్స్ 200 లేదా కాలి క్లోరాటం 200.. వీటిలో ఏదైనా ఒక మందును 10 మాత్రలు చొప్పున రోజుకు 2 సార్లు దొన తినిపించాలి.→ నోరు పుళ్ళు పడినపుడు బోరాక్స్ లేదా హైడ్రాస్టిస్ లేదా హైడ్రాస్టినమ్ మ్యూరియటికం లేదా ఎకినేసియా ‘క్యూ’.. వీటిలో ఏదైనా ఒక మందు మదర్ టింక్చర్ను 1 మి.లీ.ను 10 మి.లీ. నీటిలో కలిపి నోటి పుళ్ళు కడగాలి. → డెక్కెల మధ్య పుళ్ళకు ఎకినేసియా లేక కాలెండ్యుల మదర్ టింక్చర్ను సమపాళ్ళలో కొబ్బరి నూనెలో గాని వ్యాసలైన్లో గానీ కలిపి రాయాలి.→ జ్వర తీవ్రత వుంటే హెపార్ సల్ఫ్ 1ఎం లేదా రుస్టాక్స్ 1ఎం మందును 10 మాత్రలు చొప్పున రోజుకు 2 సార్లు తినిపించాలి.– డాక్టర్ జి. రాంబాబు, పశువైధ్యాధికారి, కడప.మొబైల్: 94945 88885 -
టీకాలు వేయించండి
– పశువ్యాధి నిర్ధారణ కేంద్రం ఏడీ రామచంద్ర అనంతపురం అగ్రికల్చర్ : గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం మరో 11 రోజులు గడువు పొడిగించినందున పశువులు, ఎద్దులకు టీకాలు వేయించుకోవాలని స్థానిక పశువ్యాధి నిర్ధారణ కేంద్రం (అనిమల్ డిసీసెస్ డయాగ్నస్టిక్ ల్యాబ్–ఏడీడీఎల్) సహాయ సంచాలకులు డాక్టర్ ఎన్.రామచంద్ర తెలిపారు. గత నెల 20న ప్రారంభమైన ఫ్రూట్ అండ్ మౌత్ డిసీసెస్– ఎఫ్ఎండీ) టీకాల కార్యక్రమం 19న (నేడు) ముగియాల్సివుండగా మరో 11 రోజులు అంటే నెలాఖరు వరకు పొడిగించినట్లు తెలిపారు. ఇంకా పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేయించని రైతులు ఎక్కడికక్కడ పశువైద్యులు, ఇతర పారావెటర్నరీ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. వ్యాధి వ్యాపించిన తర్వాత చికిత్స చేయించడం కన్నా ముందస్తు చర్యలతో సమర్థంగా నివారించుకోవచ్చని తెలిపారు. గాలికుంటు లక్షణాలు వైరస్ వల్ల సోకే అంటువ్యాధి కావడంతో మరణాలు తక్కువైనా ఆవులు, గేదెల్లో పాల ఉత్పత్తులు తగ్గిపోవడం, ఎద్దులు బలహీనంగా తయారై పనిచేసే సామర్థ్యం తగ్గిపోతుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగానూ, బలహీనంగా ఉండే యుక్తవయస్సు పశువుల్లో వ్యాధి వేగంగా వ్యాపిస్తుంది. 104 నుంచి 106 డిగ్రీల జ్వరం ఉంటుంది. గిట్టల మధ్య పుండ్లు ఏర్పడుతాయి. నోటిలోపల, నాలుక మీద, ముట్టె లోపల భాగంలో బొబ్బలు ఏర్పడుతాయి. 24 గంటల్లోగా చిక్కిపోయి అల్సర్కు గురవుతాయి. మేత మేయవు. చొంగ కారుస్తాయి. గిట్టల మధ్య పుండ్ల కారణంగా సరిగా నడవలేవు. గర్భంతో ఉన్న పశువులు ఆబార్షన్కు గురవుతాయి. ఒక్కోసారి పొదుగుపై కూడా బొబ్బలు రావడం వల్ల పొదుగువాపు వ్యాధి వస్తుంది. బ్యాక్టీరియా చేరి చీము వస్తుంది. చీము కారడం వల్ల ఇతరత్రా రోగాలు వ్యాపించే అవకాశం ఉంటుంది. అలాగే చీముపై ఈగలు వాలి గుడ్లు పెట్టడం, వాటి నుంచి వచ్చిన లార్వాలు కండరాలకు చేరి మాంసాన్ని తినడం వల్ల పెద్ద పెద్ద గాయాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. వ్యాధి సోకిన పశువుల పాలను తాగడం వల్ల దూడలు మరణిస్తాయి. ఇలా నివారించుకోవాలి వ్యాధి సోకిన పశువులను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో గిట్టలు, పుండ్లను శుభ్రం చేయాలి. బోరోగ్లిజరిన్ పూత పూయాలి. ఈగలు వాలకుండా వేపనూనె, నిమ్లెంట్, లారాజెంట్ లాంటి మందులు వాడాలి. పశువైద్యాధికారి సిఫారసు మేరకు యాంటీబయాటిక్ మందులు తాపించాలి. వ్యాధి సోకిన పశువులకు రోజూ 50 గ్రాములు అయొడైజ్డ్ ఉప్పు దాణాతో ఇస్తే కొంత ఉపశమనం. అలాగే 30 గ్రాములు ఎముకలపొడి పచ్చిమేతతో కలిసి రోజూ ఇస్తే త్వరగా కోలుకుంటాయి. పశుశాఖ ద్వారా ఉచితంగా వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలి. -
విజృంభిస్తున్న గాలికుంటు వ్యాధి
2,185 పశువులు మృత్యువాత = 19 జిల్లాల్లోని 1,368 గ్రామాల్లో వ్యాధి లక్షణాలు = మొద్దు నిద్ర వీడని ప్రభుత్వం = పశు సంవర్ధక శాఖలో సిబ్బంది కొరత = పాడి రైతులు లబోదిబో = తొలుత చింతామణి తాలూకాలో వ్యాధి గుర్తింపు = రైతుల్లో అవగాహన లేమి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్న గాలికుంటు వ్యాధి పశు సంపదను కబళిస్తోంది. పోలియో చుక్కల్లాగా దీనికీ వ్యాధి నిరోధక చుక్కలున్నప్పటికీ పశు సంవర్ధక శాఖలో సిబ్బంది కొరత వల్ల ఈ కార్యక్రమం చురుకుగా సాగడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పశు వైద్య కేంద్రాలున్నప్పటికీ వైద్యులు, కంపౌండర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 2,500 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. దీంతో ప్రభుత్వం వ్యాధి తీవ్రత లేని జిల్లాల సిబ్బందిని వ్యాధి పీడిత జిల్లాలకు తరలించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో చాలా ఏళ్లుగా గాలికుంటు వ్యాధి లక్షణాలు లేవు. 2010 నుంచి చుక్కల మందుల ద్వారా దీనిని అదుపులో ఉంచుతూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ వ్యాధి వ్యాపించి ఉండవచ్చని పశు సంవర్ధక శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. తొలుత చిక్కబళ్లాపురం జిల్లా చింతామణిలో ఈ వ్యాధి బయటపడింది. తర్వాత కోలారు జిల్లా నుంచి 19 జిల్లాల్లోని 1,368 గ్రామాలకు వ్యాపించింది. సెప్టెంబరు ఒకటి నుంచి ఇప్పటి దాకా సుమారు 17,500 పశువులకు వ్యాధి సోకింది. వీటిలో 2,185 మరణించాయి. దాదాపు 20 రోజులుగా దీనిపై పత్రికల్లో పుంఖాను పంఖాలుగా కథనాలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం మొద్దు నిద్ర పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మూడు రోజుల కిందట పశు సంవర్ధక శాఖ మంత్రి టీబీ. జయచంద్ర దీనిపై అధికారులతో సమీక్షించి, నిపుణల కమిటీని నియమించారు. రోగానికి మూల కారణాలను తెలుసుకుని, పరిష్కార మార్గాలను సూచిస్తూ నివేదికను సమర్పించాల్సిందిగా కమిటీ సభ్యులను కోరారు. రైతుల్లో అవగాహనా రాహిత్యం వ్యాధి పీడిత పశువులకు ఏ విధంగా చికిత్సలు చేయించాలనే అవగాహన రైతుల్లో కొరవడింది. వ్యాధి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో పశువుల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి యుద్ధ ప్రాతిపదికన చుక్కల మందులు వేయించాలి. ఈ చుక్క లమందును కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తోంది. రాష్ట్రం పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మరో వైపు చుక్కల మందు వేయిస్తే పాల దిగుబడి తగ్గిపోతుందని రైతుల్లో తప్పుడు అభిప్రాయం ఉంది. చుక్కల మందు వేసిన తర్వాత రెండు రోజుల పాటు పశువులకు జ్వరం వస్తుంది. దాని వల్ల ఆహారం తీసుకోవు. దరిమిలా పాల దిగుబడి తగ్గిపోతుంది. ఈ కారణం వల్ల చాలా మంది రైతులు మందు వేయించడానికి ముందుకు రాకుండా, ఆఖరికి పశు సంపదనే పోగొట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు చిక్కబళ్లాపురం జిల్లాలో 215, రామనగరలో 664, కోలారులో 512, మండ్యలో 325, తుమకూరు, చామరాజ నగర జిల్లాల్లో చెరో 50, బెంగళూరు నగరంలో 94 పశువులు మృత్యు వాత పడ్డాయి. రోగ లక్షణాలు పశువుల నోటి నుంచి జొల్లు కారడం. నోరు, నాలుక, దవడలపై పుండ్లు ఏర్పడడం. కాలి గిట్టల మధ్య పుండ్లు రావడం. మేతను నిరాకరించడం. పాల దిగుబడి తగ్గడం. దీనిని నివారించడానికి వ్యాధి పీడిత పశువులను వేరుగా ఉంచాలి. వెంటనే చుక్కల మందు వేయించాలి. వ్యాధి పీడిత పశువుకు వేసిన గడ్డిని ఇతర పశువులకు వేయకూడదు. వాటికి ప్రత్యేక పాత్రల్లోనే కుడితి లేదా నీరు ఇవ్వాలి. వ్యాధి నివారణకు నోటిలోని పుండ్లను గ్లిసరిన్తో శుభ్రం చేయాలి. రోజూ యాంటీ బయాటిక్ ఇంజెక్షన్లు ఇవ్వాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్నే ఇవ్వాలి. ముఖ్యంగా అరటి పండ్లు, రాగి అంబలి ఇస్తూ ఉండాలి.