breaking news
Galaxy J series
-
శాంసంగ్ గెలాక్సీ కొత్త స్మార్ట్ఫోన్లు
న్యూఢిల్లీ: సౌత్ కొరియా మొబైల్ మేకర్ శాంసంగ్ మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. గెలాక్సీ జె సిరీస్ ను విస్తరిస్తూ తాజాగా గెలాక్సీ జె2ఏస్, గెలాక్సీ జె1 4జీ స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. రూ. 10 వేల లోపు ఫోన్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. జె2 ఏస్ ధర ను రూ.8,490, గెలాక్సీ జె1 4జీ ధరను రూ. 6,890 కంపెనీ నిర్ణయించింది. అలాగే ఈ రెండు మోడల్స్ లో బ్రౌజింగ్ అనుభవంకోసం ఎస్ సెక్యూర్' 'ఎస్ పవర్ ప్లానింగ్' , అల్ట్రా డేటా సేవింగ్ మోడ్ ఫీచర్స్ అందించడం ప్రత్యేకత. సరసమైన ధరలకు 4జీ మొబైళ్లను వినియోగదారులకు అందించడం తమ లక్ష్యమని శాంసంగ్ ఇండియా(మొబైల్ బిజినెస్) ఉపాధ్యక్షుడు మను శర్మ పేర్కొన్నారు. జె2 ఏస్ 5 ఇంచెస్ స్క్రీన్ టర్బో స్పీడ్ టెక్నాలజీ 1.4గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ 1.5జీబీ ర్యామ్ 8 మెగా పిక్సల్ రియర్ కెమెరా 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా గెలాక్సీ జె1 4జీ 4.5 ఇంచెస్ స్క్రీన్ 1.3 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్ 1జీబీ ర్యామ్ 5 మెగా పిక్సల్ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా -
శామ్సంగ్ గెలాక్సీలో మరో రెండు ఫోన్లు
గెలాక్సీ జే2 2016@రూ.9,750 జే మ్యాక్స్@ రూ.13,400 బెంగళూరు: శామ్సంగ్ కంపెనీ గెలాక్సీ జే సిరీస్లో రెండు కొత్త ఫోన్లు-గెలాక్సీ జే2 2016, గెలాక్సీ జే మ్యాక్స్లను మార్కెట్లోకి తెచ్చింది. 2015లో అందుబాటులోకి తెచ్చిన గెలాక్సీ జే2 ఫోన్కు కొనసాగింపుగా గెలాక్సీ జే2 2016ను అందిస్తున్నామని, ఈ స్మార్ట్ఫోన్ ధర రూ.9,750 అని శామ్సంగ్ తెలిపింది. ప్రస్తుతం భారత్లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్ఫోన్ ఈ గెలాక్సీ జే2యేనని పేర్కొంది. పూర్తి స్థాయిలో వినోదం కావాలనుకునే వారి కోసం గెలాక్సీ జే మ్యాక్స్ను అందిస్తున్నామని, ధర రూ.13,400 అని వివరించింది. రేపటి(ఈ నెల 10న) నుంచి గెలాక్సీ జే2 2016ను, ఈ నెల చివరి నుంచి గెలాక్సీ జే మ్యాక్స్ ఫోన్ల విక్రయాలను ప్రారంభిస్తామని పేర్కొంది. గెలాక్సీ జే మ్యాక్స్లో 7 అంగుళాల డబ్ల్యూఎక్స్జీఏ డిస్ప్లే, వేగంగా డౌన్లోడ్ చేసుకోవడానికి, స్ట్రీమింగ్ కోసం 4జీ వీఓఎల్టీఈ కనెక్టివిటీ వంటి ఫీచర్లున్నాయని వివరించింది. రూ.4,500 విలువైన డేటా ఆఫర్ ఉచితం... గెలాక్సీ జే2 2016లో టర్బో స్పీడ్ టెక్నాలజీ, స్మార్ట్ గ్లో(నెక్స్ జనరేషన్ ఎల్ఈడీ నోటిఫికేషన్ సిస్టమ్) వంటి ప్రత్యేకతలున్నాయని శామ్సంగ్ కంపెనీ పేర్కొంది. గెలాక్సీ జే2 2016 స్మార్ట్ఫోన్లు నలుపు, బంగారం, వెండి రంగుల్లో లభ్యమవుతాయని తెలిపింది ప్రమోషనల్ ఆఫర్గా ఎయిర్టెల్ ప్రీ పెయిడ్ వినియోగదారులకు రూ.4,500 విలువైన ఆరు నెలల డబుల్ డేటా ఆఫర్ను ఉచితంగా అందిస్తున్నామని పేర్కొంది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో ఓఎస్పై పనిచేసే గెలాక్సీ జే2 2016 స్మార్ట్ఫోన్లో ఆల్ట్రా డేటా సేవింగ్, ఎస్ బైక్ మోడ్, 5 అంగుళాల సూపర్ అమెలెడ్ డిస్ప్లే, 1.5 గిగా హెర్ట్స్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1.5 జీబీ ర్యామ్, 8 జీబీ ఇన్బిల్డ్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్పాండబుల్ మెమొరీ, డ్యుయల్ సిమ్, ఎల్ఈడీ ఫ్లాష్తో కూడిన 8-మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2600 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించింది.. డౌన్లోడ్ స్పీడ్ 150 ఎంబీపీఎస్ అని, అప్లోడ్ స్పీడ్ 50 ఎంబీపీఎస్ అని శామ్సంగ్ పేర్కొంది.