-
సొగసు చూడతరమా...
గజ్వేల్ సిద్ధిపేట : గజ్వేల్ అంటే నేడు రాష్ట్రంలో అభివృద్ధికి నమూనా. ఇక్కడి నుంచి సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతం కావడంతో అభివృద్ధిలో దూసుకెళుతోంది. అభివృద్ధే కాదు... ఆరోగ్యం, ఆహ్లాదం కూడా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. సీఎం ఆదేశాల మేరకు ఇటీవల దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏకకాలంలో లక్షా116 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. గత 10 నెలల క్రితం రూ.10కోట్ల వ్యయంతో 292.5ఎకరాల్లో ప్రారంభించిన అర్బన్ పార్కు పనులు పూర్తి కావస్తున్నాయి. త్వరలోనే ఈ పార్కును అందుబాటులోకి తెచ్చేందుకు అటవీ శాఖ ముమ్మరంగా శ్రమిస్తోంది. రాష్ట్రంలో ముందెన్నడూ లేనివిధంగా వినూత్న తరహాలో ఈ పార్కులో రాశి వనం, నక్షత్ర వనాలతో పాటు యోగ, ధ్యాన మందిరాలు, ఆటస్థలాలు, సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ తదితర కొత్త హంగులను అద్దబోతున్నారు. అదే విధంగా అడవి జంతువుల బొమ్మలు, గజబోన్లతో కొత్త అందాలను సంతరించుకున్నది. నగరానికి ప్రత్యేక ఆకర్షణ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ ప్రాంత రూపురేఖలు మారుస్తానని శపథం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోగా... ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తున్నారు. ఇప్పటికే వందలాది కోట్లతో రింగు రోడ్డు, ఎడ్యుకేషన్ హబ్, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, డబుల్ బెడ్రూం మోడల్ కాలనీ, వంద పడకల ఆసుపత్రి, ఆడిటోరియం తదితర నిర్మాణాలతో గజ్వేల్ కొత్తరూపును సంతరించుకున్నది. మౌలిక వసతుల కల్పతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని, ఆహ్లాదానికి కూడా పెద్దపీట వేయాలని గట్టిగా విశ్వసించే ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పటికే పట్టణంలో ఇంటిగేట్రెడ్ ఆఫీస్ క్లాంపెక్స్ నిర్మాణం జరుగుతున్న ప్రదేశం పక్కన హెర్బల్ పార్క్ నిర్మాణానికి ఆదేశాలివ్వగా.. ఆ పార్కు నిర్మాణం కూడా పూర్తయ్యింది. కాకపోతే ఈ పార్కు విశాలంగా లేకపోవడం వల్ల పట్టణ ప్రజల అవసరాలకు సరిపోదని భావించి ‘అర్బన్ పార్కు’ నిర్మాణానికి ఆదేశాలిచ్చారు. ఈ మేరకు అటవీశాఖ మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్ అటవీ ప్రాంతంలో గత 10 నెలల క్రితం 292.5 ఎకరాల్లో పనులను సైతం ప్రారంభించింది. అటవీ ప్రాంతంతో కూడుకొని ఉన్న ఈ ప్రదేశంలో స్వచ్ఛమైన గాలి ఉండటమేగాకుండా పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఈ స్థలాన్ని ఎంపిక చేశారు. రాశి మొక్కలు, నక్షత్ర మొక్కలు... పార్కు అంటే చెట్లు, గార్డెనింగే కాకుండా వైవిధ్యంగా ఉండాలని సీఎం సంకల్పించారు. ఎక్కడా లేనివిధంగా ఇక్కడ నిర్మించబోతున్న అర్బన్ పార్కులో రాశి వనం నిర్మించారు. ఇందులో 12 రాశులకు సంబంధించిన చెట్లను నాటి సంరక్షిస్తారు. ఒక్కో రాశికి సంబంధించిన చెట్టు ఒక్కో విభాగంలో దిశలకనుగుణంగా, రాశిఫలాల ఆధారంగా పెంచుతారు. ఆయా రాశులకు సంబంధించిన వ్యక్తులు ఆ చెట్ల వద్దకు వెళ్లి ప్రదక్షిణలు చేయడమేగాకుండా రాశిఫలాల ఆధారంగా సాంప్రదాయబద్ధంగా చేయాల్సిన కార్యక్రమాలను నిర్వహించుకునే అవకాశం కల్పిస్తారు. నక్షత్ర వనం పేరిట మరో ప్రత్యేక నిర్మాణం సైతం ఇక్కడ జరుగుతున్నది. 27 నక్షత్రాలకు సంబంధించిన మొక్కలను ఇక్కడ పెంచుతారు. ఈ చెట్ల వద్ద కూడా ప్రజలు తమ నక్షత్రం ఆధారంగా చేయాల్సిన కార్యక్రమాలను జరుపుకునే వీలుంది. పార్కులో 3 చోట్ల మూడు గజబోన్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక గజబోను వాచ్టవర్గా వాడుకోనున్నారు. యోగ, వ్యాయామం కూడా.. ఈ పార్కులో స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ... యోగ, వ్యాయామం చేసుకునే వసతులను కల్పించనున్నారు. దీంతో పాటు నడకదారులు, సైక్లింగ్ ట్రాక్లను ఏర్పాటు చేస్తారు. వీటన్నింటికీ తోడుగా ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేయడానికి సైతం సంకల్పించారు. పార్కును సందర్శించే వారికోసం ఇక్కడ అన్ని రకాల వసతులను ఏర్పాటు చేయనున్నారు. క్యాంటీన్, బాత్రూమ్లు, టాయిలెట్లను నిర్మించనున్నారు. పార్కులో 9 కిలోమీటర్ల పొడవున సైక్లింగ్, వాకింగ్ చేసుకునేందుకు వీలుగా మట్టి రోడ్లను ఏర్పాటు చేశారు. అంతేగాకుండా 13 ఊట చెరువులు నిర్మించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఆగస్టు 1న చేపట్టిన లక్షా116 మొక్కలు నాటే కార్యక్రమంలో ఇందులో ఉన్న అటవీ ప్రాంతానికి మరింత వన్నె తెచ్చేందుకు 40వేల వేప, రావి, జువ్వి, మర్రి, ఇరికి తదితర అటవీ జాతి మొక్కలు నాటారు. పార్కు చుట్టూ నాలుగున్నర కిలోమీటర్ల ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం పూర్తి కాగా... మరో 3 కిలోమీటర్లు చేయాల్సి ఉంది. ముందు భాగంలో 1100 మీటర్ల ప్రహరీ నిర్మాణం జరిగింది. సహజత్వం ఉట్టిపడేలా బొమ్మలు ఈ పార్కులో ప్రతి నిర్మాణం సహజత్వం ఉట్టిపడేలా కర్రలు, చెట్లను తలపించే విధంగా కాంక్రీటు నిర్మాణాలు జరుగుతున్నాయి. పార్కు ముఖద్వారంలో ఏర్పాటు చేసిన ఎలుగుబంటి, చిరుతపులి, హైనా, జింక, తోడేలు, కోతులు తదితర అడవి జంతువుల బొమ్మలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దాదాపుగా పనులు పూర్తి కావస్తున్న ఈ పార్కును త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభింపజేయడానికి అటవీశాఖ సన్నాహాలు చేస్తోంది. అర్బన్ పార్కు గజ్వేల్కు వరం గజ్వేల్లో వినూత్న తరహాలో నిర్మించిన అర్బన్ పార్కు ఈ ప్రాంతానికి వరం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఈ పార్కును అందంగా తీర్చిదిద్దాం. త్వరలోనే పనులు పూర్తికానున్నాయి. ఇంకా ఈ పార్కులో ఏర్పాటు చేయాల్సిన వసతులపై ఆలోచన జరుగుతోంది. ఈ పార్కు ద్వారా పట్టణానికి కొత్త శోభ రావడమేగాకుండా ఆరోగ్యం, ఆహ్లాదం అందనుంది. – వెంకట రామారావు, గజ్వేల్ రేంజ్ అటవీ శాఖ అధికారి -
వాస్తవ నివేదిక లతో రండి
గజ్వేల్: గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 30న నిర్వహించనున్న సమీక్షకు అధికారులు వాస్తవ నివేదికలతో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా ఆదేశించారు. సీఎం సమీక్ష నేపథ్యంలో కలెక్టర్ రాహుల్ బొజ్జా, జేసీ శరత్, ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఓఎస్డీ హన్మంతరావులతో కలిసి గురువారం సాయంత్రం గజ్వేల్లోని లక్ష్మీ గార్డెన్స్లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు, నియోజకవర్గస్థాయి అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, గజ్వేల్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి శ్రమిస్తున్నారని, ఈ నేపథ్యంలో ఈ సమీక్ష సమావేశం ప్రతిష్టాత్మకమన్నారు. ముఖ్యమంత్రి ఆశయాలకనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ సందర్భంగా శాఖలవారీగా ప్రగతి, ప్రణాళికలపై సమీక్షించారు. చాలావరకు నివేదికలు వాస్తవాలను ప్రతిబింబించే విధంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే వీటిని సరి చేసి మరో నివేదిక రూపొందించాలని సూచించారు. ప్రధానంగా గజ్వేల్ వాటర్ గ్రిడ్, రోడ్లు, విద్యుత్ తదితర శాఖల తీరుపై చర్చించారు. విద్యుత్ సంబంధించిన సమీక్షలో కొత్తగా తూప్రాన్లో 220కేవీ సబ్స్టేషన్ను ప్రతిపాదించినట్లు ఎస్ఈ రాములు కలెక్టర్ వివరించి, ఇందుకోసం సేకరించిన పదెకరాల భూమిని తమకు స్వాధీనం చేయాలని కోరారు. స్పందించిన కలెక్టర్ వెంటనే తూప్రాన్ తహశీల్దార్కు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న మిగతా సబ్స్టేషన్ల స్థల సేకరణ ప్రక్రియను సైతం పూర్తి చేయాలని ఆయా మండలాల తహశీల్దార్లను ఆదేశించారు. అంతకుముందు జేసీ శరత్ గజ్వేల్లో రూ.10 కోట్లతో నిర్మించతలపెట్టిన ప్రభుత్వ కార్యాలయాల ఇంటిగ్రేటేడ్ కాంప్లెక్స్కు సంబంధించి స్థల సేకరణ, ప్రగతిపై గజ్వేల్ తహశీల్దార్ బాల్రెడ్డితో సమీక్షించారు. వెంటనే భవన నిర్మాణానికి అనువైన రెండెకరాల స్థలాన్ని సేకరించాలని ఆదేశించారు. సమావేశంలో డీఎఫ్ఓ సోనిబాల, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, జేడీఏ హుక్యా నాయక్, డీఆర్డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి, డీపీఓ ప్రభాకర్రెడ్డి, ఇరిగేషన్ శాఖ ఎస్ఈ సురేంద్ర, ఆర్డబ్ల్యూస్ ఎస్ఈ విజయప్రకాశ్, ఇరిగేషన్ ఈఈ ఆనంద్, ఆర్అండ్బీ ఈఈ బాల్నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైట్హౌస్కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె?
రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి
టీడీపీ కార్యకర్తల దాడి అంబటి స్ట్రాంగ్ కౌంటర్
పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు
పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్
మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
తప్పక చదవండి
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement