-
మానకొండూరు: రసమయికి గట్టి పోటీనే!
ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఉన్నారు. డబుల్ బెడ్ రూం ఇచ్చే అంశంలో వెనుకడుగు, అలాగే 100 పడకల హాస్పిటల్ రాకపోవడం మైనస్ లుగా చెప్పవచ్చు. ► ఎస్సీలు 23శాతం ► బీసీలు 65 శాతం ► ఎస్టీలు 1 శాతం ► ఇతరులు 11 శాతం ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ నుండి: రసమయి బాలకిషన్ కాంగ్రెస్ పార్టీ నుండి: కవ్వంపెల్లి సత్యనారాయణ బీజేపీ పార్టీ నుండి: గడ్డం నాగరాజు దరువు ఎల్లన్న సొల్లు అజయ్ వర్మ కుమ్మరి శంకర్ బీఎస్పీ పార్టీ నుండి: నిషాణీ రామచంద్రం మాతంగి అశోక్ వీరందరూ బరిలో ఉండేందుకు సన్నద్ధం అవుతుండగా ప్రధాన పోటీలు మాత్రం రసమయి బాలకిషన్ (బిఆర్ఎస్), కవ్వంపెల్లి సత్యనారాయణ (కాంగ్రెస్), ఆరపెల్లి మోహన్ (బిఆర్ఎస్), ఓరుగంటి ఆనంద్ (బిఆర్ఎస్)గడ్డం నాగరాజు (బీజేపీ)దరువు ఎల్లన్న (బీజేపీ)ల మధ్య గట్టి పోటీ ఉంటదని తెలుస్తుంది. ఆయా పార్టీల నుండి ఇచ్చే టికెట్పై ఆధారపడి ఉంటుంది. -
ప్రాణం తీసిన రియల్ వ్యాపారం
సిరిసిల్లటౌన్: ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని మోసగించారని బీజేపీ దళిత మోర్చా మానకొండూరు నియోజకవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజుపై అభియోగాలు వెల్లువెత్తాయి. సిరిసిల్లకు చెందిన ఎనగందులు వెంకటేశం (56) అలియాస్ ‘భారతీయు డు’.. నాగరాజు ఇంటి ఎదుట ఆత్మహత్య చేసుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. బీజేపీ నుంచి మానకొండూరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన గడ్డం నాగరాజు స్వస్థలం సిరిసిల్ల. పట్టణంలోని శాంతినగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటేశంకు భూమి అమ్మకానికి ఒప్పుకున్నాడు. నాగరాజు రూ.45 లక్షలు అడ్వాన్స్గా తీసుకున్నాడు. ఏడాది గడిచినా రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నాడు. దీనితో శనివారం ఉదయం వెంకటేశం.. నాగరాజు ఇంటికి వెళ్లి గొడవ పడ్డాడు. అతని ఇంటి ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నాగరాజును పోలీసులు అరెస్టు చేయాలంటూ.. శవంతో బంధువులు ధర్నా చేశారు. డీఎస్పీ చంద్రశేఖర్ వచ్చి బలవంతంగా ఆందోళన విరమింపజేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. -
‘హద్దు’లేని అక్రమాలు
– విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్లు – ‘పురం’లో పెచ్చుమీరుతున్న రియల్టర్లు – మున్సిపల్ చైర్పర్సన్ భర్త ప్లాట్ల విక్రయాలు – ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి హిందూపురం అర్బన్ : మున్సిపాల్టీ స్థలాలను పర్యవేక్షిస్తూ, అక్రమ లేఅవుట్లను అదుపు చేసి ఆదాయాన్ని పెంపునకు కృషి చేయాల్సిన పాలకులే అక్రమాలకు పాల్పడుతుండడంతో ప్రభుత్వాదాయానికి భారీగా గండిపడుతోంది. రాజకీయ పలుకుబడితో రియల్టర్లు కూడా ఇష్టారాజ్యంగా అక్రమ లేఅవుట్లు వేసి, భారీ అక్రమాలకు పాల్పడుతున్నారు. హిందూపురం పట్టణంలోని నింకంపల్లి రోడ్డు పార్టు-1లో ఓ ప్రజాప్రతినిధి భర్త సుమారు 11.51 ఎకరాల్లో లేఅవుట్లు వేసి, ప్లాట్లు విక్రయిస్తున్నారు. వాస్తవంగా ఈ భూములను వ్యవసాయ భూమి నుంచి వాణిజ్య భూములుగా మార్చుకోవాలి. ఆ తర్వాత మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అప్రూవల్ పొంది, విక్రయించాలి. అయితే ఇవేవీ లేకుండా డాక్యుమెంట్ నం.7036/2011పైకి సర్వే నంబరు 238/1లో 2.13 ఎకరాలు, 241/1లో 2.05, డాక్యుమెంట్ నంబర్ 196/బీ4,/2012లో 242/2లో 0.85సెంట్లు, 243/2లో 0.97సెంట్లు, 243/1బీలో 1.10 ఎకరాలు, 238/1ఏలో 1.26 ఎకరాలు, 243/1లో 2 ఎకరాలు, 238/1లో 1.21 ఎకరాలు మొత్తం 11.51 ఎకరాల్లో అక్రమంగా ప్లాట్ల విక్రయాలు సాగిస్తున్నారు. ఇందులో రోడ్లు, కాల్వలు, ఇతర అవసరాలకు స్థలాలు వదిలితే మొత్తం 240 ప్లాట్లు వేసుకోవచ్చు. అయితే సుమారు 284 ప్లాట్లు వేశారు. దీంతో భవిష్యత్తులో కొనుగోలు చేసిన వారికి ఇబ్బందులు వచ్చే అవకాశమూ లేకపోలేదు. అలాగే పట్టణ నడిబొడ్డున çపులమతి రోడ్డు సమీపంలోని డీఆర్ కాలనీలో కూడా సర్వే నంబరు 482/1సీలో 2.94 ఎకరాల్లో అక్రమ లేఅవుట్లతో ప్లాట్లు విక్రయాలు, అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. లేఅవుట్ల నంబర్లతో ఫ్లెక్సీలు : మున్సిపాల్టీ అనుమతి లేకుండా వెంచర్లు వేసిన సర్వే నంబర్లను బహిరంగంగా ఫ్లెక్సీల్లో వేసిన వాటికి మున్సిపాల్టీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అందులో రెండు సర్వే నంబర్లు కనపరచలేదని మిగిలిన రియల్టర్లు విమర్శిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు రాజకీయ నాయకులకు కొమ్ముకాస్తూ కంటికి కనిపిస్తున్న వాటిని వదిలేసి ఇతరులను వేధిస్తున్నారన్న విమర్శలూ ఉన్నాయి. అనుమతులు తీసుకోవాలి ఇలా.. - మున్సిపాల్టీ, పంచాయతీల నుంచి అప్రూవల్స్ పొంది, సెస్ చెల్లించాలి. - లేఅవుట్ వేసే స్థలంలో ప్రభుత్వానికి 20 శాతం సెస్ రూపంలో చెల్లించి, ముందుగా మున్సిపాల్టీ టౌన్ప్లానింగ్ అధికారులతో అప్రూవల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. - వ్యవసాయ భూములైతే ఆర్డీఓకు దరఖాçస్తు చేసుకొని, సెస్ మొత్తాన్ని చెల్లించి కమర్షియల్ ల్యాండ్గా మార్చుకోవాలి. - అనంతరం పంచాయతీ, మున్సిపాల్టీ అధికారులకు దరఖాస్తు చేసుకొని వెంచర్లో మధ్యలోగానీ లేదా చివరి భాగంలో ప్రభుత్వ అవసరాల నిమిత్తం కొంత స్థలాన్ని కేటాయించి, మున్సిపాల్టీ పేరిట రిజిష్టర్ చేయాలి. - అలాగే రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలకు అవసరమైన నిర్దేశిత స్థలాలను వదిలేసి,ప్లాట్లు వేయాలి. - ఇన్ని చేస్తే భారీగా పన్ను చెల్లించడంతో పాటు ఆదాయం కూడా కోల్పోవాల్సి వస్తుందని, కొద్ది స్థలాన్ని కూడా వదలకుండా రియల్టర్లు అక్రమ లేఅవుట్ల ద్వారా ప్లాట్లు విక్రయాలు చేస్తున్నారు. నోటీసులు జారీ చేశాం అక్రమ లేఅవుట్లు, అనుమతులు లేని భవనాలను గుర్తించి ఇప్పటికే ఐదుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం. ఐదు భవనాలను కూల్చివేస్తున్నట్టు నోటీసులు కూడా జారీ చేశాం. త్వరలోనే వాటిపై చర్యలు తీసుకుంటాం. - విశ్వనాథ్, కమిషనర్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement