breaking news
Fund Investments
-
ఈక్విటీ ఫండ్స్ పెట్టుబడుల్లో తగ్గిన జోరు
న్యూఢిల్లీ: మార్కెట్లలో ఆటుపోట్లు, అంతర్జాతీయ అనిశి్చతుల మధ్య ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల్లో జోరు తగ్గినట్టు కనిపిస్తోంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడుల రాక వరుసగా రెండో నెలలోనూ తగ్గుముఖం పట్టింది. సెప్టెంబర్ నెలలో నికరంగా రూ.30,421 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆగస్ట్లో వచ్చిన రూ.33,430 కోట్లతో పోల్చి చూస్తే 9 శాతం తగ్గాయి. ఈ ఏడాది జూలైలో వచ్చిన రూ.42,703 కోట్లు నెలవారీ ఆల్టైమ్ గరిష్ట పెట్టుబడులుగా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ఈ వివరాలను విడుదల చేసింది. వరుసగా 55వ నెలలోనూ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నికరంగా పెట్టుబడులను ఆకర్షించడం గమనార్హం. దీర్ఘకాలంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన పనితీరు చూపిస్తాయనే విషయంలో ఇన్వెస్టర్లలో విశ్వాసానికి ఇది నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈక్విటీ ఫండ్స్లోకి పెట్టుబడుల రాక తగ్గడం అన్నది సైక్లికల్ తప్ప (తాత్కాలికం) నిర్మాణాత్మకం కాదని మారి్నంగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ మేనేజర్ నేహల్ మెష్రామ్ పేర్కొన్నారు. పెట్టుబడులు మోస్తరు స్థాయికి పరిమితం కావడం వెనుక థీమ్యాటిక్ ఫండ్స్ నిధుల సమీకరణ తగ్గడమే కారణమని శామ్కో మ్యూచువల్ ఫండ్ సీఈవో విరాజ్ గాంధీ తెలిపారు. సిప్ రూపంలో రూ.29,361 కోట్లు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి సెప్టెంబర్ నెలలో రూ.29,361 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇన్వెస్టర్లు దీర్ఘకాల దృష్టితో పెట్టుబడులకు ప్రాధా న్యం ఇస్తున్నట్టు ఇది తెలియజేస్తోంది. ఆగస్ట్లో సిప్ పెట్టుబడులు రూ.28,265 కోట్లుగా ఉన్నాయి. సిప్ ఖాతాల సంఖ్య ఆగస్ట్ చివరికి ఉన్న 8.99 కోట్ల నుంచి 9.25 కోట్లకు చేరింది. ఒక ఇన్వెస్టర్కు ఒకటికి మించిన ఖాతాలు ఉండొచ్చు. ఒక పథకంలో పెట్టుబడిని ఒక ఖాతా (ఫోలియో) కింద పరిగణిస్తారు. సిప్ రూపంలోని మొత్తం నిర్వహణ ఆస్తుల విలువ రూ.15.52 లక్ష లకోట్లకు చేరింది. విభాగాల వారీగా.. → ఈక్విటీ ఫండ్స్ అన్నింటిలోకి ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ అత్యధికంగా రూ.7,029 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ఈ విభాగంలోకి పెట్టుబడులు బలంగా రావడం వరుసగా మూడో నెలలోనూ కనిపించింది. మార్కెట్ క్యాప్తో సంబంధం లేకుండా మెరుగైన పెట్టుబడుల అవకాశాలు ఎక్కడ ఉన్నా ఫ్లెక్సీక్యాప్ ఇన్వెస్ట్ చేస్తుంటాయి. → మిడ్క్యాప్ ఫండ్స్ రూ.5,085 కోట్లు, స్మాల్క్యాప్ ఫండ్స్ రూ.4,363 కోట్ల చొప్పున నికరంగా ఆకర్షించాయి. → లార్జ్క్యాప్ ఫండ్స్లోకి వచి్చన పెట్టుబడులు రూ.2,319 కోట్లుగా ఉన్నాయి. → సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్లోకి పెట్టుబడుల రాక రూ.1,220 కోట్లకు పరిమితమైంది. → పన్ను ఆదాకు ఉపకరించే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ నుంచి రూ.308 కోట్లు, డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ నుంచి రూ.168 కోట్లు చొప్పున బయటకు వెళ్లాయి. → హైబ్రిడ్ ఫండ్స్ రూ.2,014 కోట్లు, ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ రూ.1,747 కోట్లు, ఆర్బిట్రేజ్ ఫండ్స్ రూ.988 కోట్ల చొప్పున ఆకర్షించాయి. → డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి సెప్టెంబర్లో రూ.1.02 లక్షల కోట్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. ఆగస్ట్లో డెట్ ఫండ్స్ నుంచి ఉపసంహరణలు రూ.7,980 కోట్లుగానే ఉన్నాయి. దీంతో పోల్చితే ఉపసంహరణలు గణనీయంగా పెరిగాయి. → మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ సెప్టెంబర్ నెలలో రూ.43,146 కోట్ల పెట్టుబడులను కోల్పోయింది. పరిశ్రమ నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.75.61 లక్షల కోట్లకు చేరింది. ఆగస్ట్ చివరికి ఇది రూ.75.12 లక్షల కోట్లుగా ఉంది. గోల్డ్ ఫండ్స్కు డిమాండ్ బంగారం ధరలు ఇటీవలి కాలంలో స్థిరమైన ర్యాలీ చేస్తుండడం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. ఇందుకు నిదర్శనంగా సెప్టెంబర్లో రూ.8,363 కోట్ల పెట్టుబడులు గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్లోకి (గోల్డ్ ఈటీఎఫ్లు) వచ్చాయి. ఒక నెలలో అత్యధిక పెట్టుబడులు రాక ఇదే. ఆగస్ట్లో గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి వచి్చన పెట్టుబడులు రూ.2,190 కోట్లుగా ఉన్నాయి. దీంతో గోల్డ్ ఈటీఎఫ్ల నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ రూ.90,000 కోట్ల మార్క్ను చేరుకుంది. ‘‘బంగారం బలమైన ర్యాలీ చేయడం ఈ పెట్టుబడుల ధోరణికి కారణమని ఏంజెల్ వన్ ఏఎంసీ ఈడీ, సీఈవో హేమెన్ భాటియా తెలిపారు. సిల్వర్ (వెండి) ఈటీఎఫ్లు సైతం మెరిశాయి. ఇటీవలి కాలంలో వెండి ధరలు సైతం భారీగా పెరగడం చూస్తున్నాం. దీంతో సెప్టెంబర్లో సిల్వర్ ఈటీఎఫ్ల్లోకి రూ.5,342 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సిల్వర్ ఈటీఎఫ్ నిర్వహణ ఆస్తులు రూ.36,461 కోట్లకు చేరాయి. ఈక్విటీ, డెట్తోపాటు బంగారం వెండిలోనూ పెట్టుబడులు పెట్టే – మల్టీ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్లోకి రూ.4,982 కోట్లు వచ్చాయి. -
నిర్భయ నిధుల పరిస్థితేంటి?
న్యూఢిల్లీ: మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) ఆందోళన వ్యక్తం చేసింది. లైంగిక వేధింపుల కేసుల విషయంలో ఏ విధంగా స్పందిస్తున్నారు? నిర్భయ నిధుల వినియోగం ఎలా ఉంది? అనే వివరాలు కోరుతూ కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల(యూటీ) ప్రభుత్వాలకు సోమవారం నోటీసులు జారీ చేసింది. మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు పెరుగుతుండటంపై మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకున్న ఎన్హెచ్ఆర్సీ.. గత మూడేళ్లలో నిర్భయ నిధులను వినియోగించిన తీరును, ప్రస్తుతం ఆ నిధులు ఏ మేరకు ఉన్నాయనే విషయాన్ని తెలుపుతూ ఆరు వారాల్లోగా తమకు నివేదిక అందించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది. తమ పిల్లలో, ఇంట్లోని మహిళలో కనిపించడం లేదని, వారి ఆచూకీ తెలుసుకోవాలని ఎవరైనా పోలీస్ స్టేషన్కు వెళ్తే.. ఎవరితోనైనా వెళ్లిపోయిందేమోనన్న నిర్లక్ష్యపూరిత జవాబే ఎక్కువగా పోలీసుల నుంచి వస్తోందని ఎన్హెచ్ఆర్సీ వ్యాఖ్యానించింది. ఇలాంటి ఆలోచన తీరును మార్చుకోవాలని సూచించింది. ‘హైదరాబాద్లో వెటర్నరీ డాక్టర్ను నలుగురు రేప్చేసి, చంపేసి, మృతదేహాన్ని కాల్చేశారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదేమో’ అని ఎన్హెచ్ఆర్సీ అభిప్రాయపడింది. నిర్భయ నిధి సహా మహిళల రక్షణ కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయాలు, నిబంధనలను.. రాష్ట్రాలు, యూటీల్లో వాటి అమలును సమగ్ర నివేదిక రూపంలో తమకు అందించాలని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. కేంద్రం, రాష్ట్రాలు, యూటీలకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు -
చిన్న నగరాల్లో జోరుగా ‘సిప్’
మెట్రో కంటే మెట్రోయేతర నగరాల్లోనే అధికంగా ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ క్రిసిల్ తాజా నివేదిక వెల్లడి ముంబై: మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్) ఇన్వెస్ట్మెంట్స్కు సంబంధించి సిప్(సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్)లు చిన్న(మెట్రోయేతర) నగరాల్లోనే జోరుగా ఉన్నాయని రేటింగ్ సంస్థ క్రిసిల్ వెల్లడించింది. రిటైల్ ఇన్వెస్టర్లు సిప్ల ద్వారా జోరుగా పెట్టుబడులు పెడుతుండడం పెన్షన్ సొమ్ములను పలువురు మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేయడం, సంపద సృష్టికి మ్యూచువల్ ఫండ్ చక్కటి మార్గమన్న భావన ఇన్వెస్టర్లలో పెరుగుతోందని క్రిసిల్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అషు సుయాష్ పేర్కొన్నారు. దీంతో భవిష్యత్తులో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ జోరుగా వృద్ధి సాధించగలదని ఆమె పేర్కొన్నారు. టైర్ టూ, టైర్ త్రి నగరాల్లో రిటైర్మెంట్ ఆధారిత ఫండ్స్ మంచి వృద్ధిని సాధించగలవని ఆమె అంచనా వేస్తున్నారు. ఆర్థిక సంక్షోభం కారణంగా తగ్గిన రిటైల్ ఇన్వెస్టర్ల ఫోలియోలు గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో బాగా పెరిగాయని ఈ క్రిసిల్ తాజా నివేదిక పేర్కొంది. కొన్ని ముఖ్యాంశాలు... æచిన్న నగరాల నుంచి ఫండ్స్లో సిప్ల ద్వారా ఇన్వెస్ట్ చేసే రిటైల్ ఇన్వెస్ట్మెంట్స్ బాగా పెరిగాయి. ఎంఎఫ్ పరిశ్రమ ఆస్తులు రూ.20 లక్షల కోట్ల స్థాయికి చేరడానికి ఈ చిన్న నగరాల్లో సిప్ల జోరు పెరగడం కూడా ఒక కారణం. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో మెట్రో నగరాల్లో సిప్ ఇన్వెస్ట్మెంట్స్ 27% చొప్పున చక్రగతిన వృద్ధి చెందాయి. అదే చిన్న నగరాల్లో సిప్ ఇన్వెస్ట్మెంట్స్ 30% చక్రగతిన వృద్ధి చెందాయి. వ్యక్తిగత ఇన్వెస్టర్ల(రిటైల్, హైనెట్వర్త్ ఇండివిడ్యువల్స్–హెచ్ఎన్ఐ) ఇన్వెస్ట్మెంట్స్ విలువ చిన్న నగరాల్లో 35 శాతం వృద్ధి చెందగా, మెట్రో నగరాల్లో మాత్రం 28 శాతమే వృద్ధి చెందింది. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో రిటైల్ ఇన్వెస్టర్ల ఫోలియోల సంఖ్య బాగా పెరిగింది. ప్రస్తుతం వీటి సంఖ్య 5.23 కోట్లుగా ఉంది.