breaking news
Freedom Day
-
వేడుకలపై పోలీసుల డేగకన్ను
సాక్షి, సిటీబ్యూరో: గోల్కొండ కోటలో సోమవారం పంద్రాగస్టు వేడుకలు జరుగనున్న నేపథ్యంలో ఆ ప్రాంతంపై పోలీసులు డేగకన్ను వేశారు. కోటతో పాటు చుట్టపక్కల ప్రాంతాలు, రహదారుల పర్యవేక్షణకు నగర పోలీసు విభాగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆయా మార్గంలో ఇప్పటికే ఉన్న ట్రాఫిక్, కమ్యూనిటీ సీసీ కెమెరాలకు తోడు తాత్కాలిక ప్రాతిపదికన అదనపు కెమెరాలు ఏర్పాటు చేసింది. గోల్కొండ కోటలో అణువణువూ రికార్డు అయ్యేలా చర్యలు తీసుకుంది. మొత్తం 120 అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన పోలీసులు వీటినీ బషీర్బాగ్లోని పోలీసు కమిషనరేట్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)కు అనుసంధానించింది. దీంతో పాటు స్థానిక పోలీసుస్టేషన్, గోల్కొండ కోట వద్ద ఉన్న కంట్రోల్ రూమ్లోనూ దృశ్యాలను చూసేలా ఏర్పాటు చేశారు. కోటతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ అనుకోని సవాళ్లు ఎదురైతే వ్యూహాత్మకంగా ఎదుర్కోవడానికి ఈ ని«ఘా ఉపకరించనుంది. సీసీసీలో ఉండే మ్యాప్ల ద్వారా గోల్కొండ కోటకు చుట్టుపక్కల మార్గాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఇక్కడి అధికారులు అవసరానికి తగ్గట్టు స్థానిక పోలీసుల్ని అప్రమత్తం చేయడంతో పాటు అదనపు బలగాలను మోహరిస్తారు. ఈ తాత్కాలిక సీసీ కెమెరాల పని తీరుపై సీసీసీ అధికారులు ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించి సంతృప్తి వ్యక్తం చేశారు. పంద్రాగస్టు వేడుకలు జరిగే గోల్కొండ కోటతో పాటు గవర్నర్ అధికార నివాసమైన రాజ్భవన్కు నగర పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షించడానికి ఆదివారం నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి ఉన్నతాధికారులతో కలిసి కోటను, రాజ్భవన్ను సందర్శించి అవసరమైన మార్పు చేర్పులు సూచించారు. కోటకు వచ్చే సందర్శకులు తవు వెంట హ్యాండ్ బ్యాగ్లు, కెమెరాలు, టిఫిన్ బాక్సులు, వాటర్బాటిళ్లు తదితర వస్తువులు తీసుకురావడం నిషేధించారు. అత్యవసరమై ఎవరైనా తీసుకువచ్చినా... కచ్చితంగా సోదా చేస్తారు. నగర వ్యాప్తంగా తనిఖీలు... నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో నగర వ్యాప్తంగా నిఘా, గస్తీ వుువ్మురం చేశారు. అడుగడుగునా నాకాబందీ, తనిఖీలు నిర్వహిస్తున్నారు. జనసవుర్థ ప్రాంతాలతో పాటు బస్సులు, రైళ్లల్లోనూ పోలీసులు సోదాలు చేస్తున్నారు. లాడ్జీలు, అనువూనిత ప్రాంతాలపై డేగకన్ను వేశారు. నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వుఫ్టీ పోలీసులను మోహరించారు. గోల్కొండ కోటలోకి దారితీసే ప్రతి ద్వారం దగ్గరా డోర్ఫ్రేమ్, మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసి తనిఖీ చేయనున్నారు. గోల్కొండ కోట చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు వేడుకలు చూడటానికి వచ్చే ప్రముఖులు, సాధారణ ప్రజలకు వేర్వేరుగా ప్రవేశ మార్గాలు, పార్కింగ్స్ కేటాయించారు. -
నగరానికి పంద్రాగస్టు శోభ
సాక్షి, సిటీబ్యూరో: గోల్కొండ కోటను క్రీస్తుశకం 945 – 970 మధ్య కాలంలో కాకతీయులు నిర్మించినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. ప్రతాపరుద్రుడి కాలంలో కేవలం మట్టితోనే ఈ కోటను నిర్మించి ఉంటారని భావిస్తున్నారు. 10వ శతాబ్దంలో కుతుబ్షాహి పాలకులు దీన్ని మళ్లీ నిర్మించారు. 1518–1543లో సుల్తాన్ కులీ కుతుబ్షా ముల్క్, 1543 – 1550 మధ్య జంషీర్ కులీకుతుబ్ షా, 1550 – 1580 వరకు పాలించిన ఇబ్రహీం కుతుబ్షాలు మట్టి నిర్మాణం అలాగే ఉంటే దండయాత్ర చేసే రాజుల ఫిరంగి గుళ్లకు కోట బీటలు వారుతుందనే ఉద్దేశంతో భారీ నిర్మాణాన్ని సరికొత్త పద్ధతిలో చేపట్టారు. దేశంలోని ఇతర కోటలైన దౌల్తాబాద్, రాజస్థాన్ కోటల కంటే మరింత పటిష్టంగా దీనిని నిర్మించారు. అందుకే ఔరంగజేబు ఈ కోటను జయించలేక అక్కడ కాపలాదారుడిగా ఉన్న అబ్ధుల్లాఖాన్ను లోబర్చుకుని కోటలోకి చొరపడ్డాడని చరిత్ర చెప్తోంది. వారు అక్కడ కాలుపెట్టిన తర్వాత ఈ కోటకు ‘మహ్మద్ నగర్’ అనిపేరు పెట్టి అక్కడ తొలి నగరాన్ని తీర్చిదిద్దాడు. అదే క్రమంగా హైదరాబాద్గా అభివృద్ధి చెందినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. కోటలో అన్ని మతాల వారు, వర్గాల వారు కలిసిమెలిసి జీవించారు. అక్కడ ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు, పచ్చిక ప్రార్థనా మందిరాలు, మసీదులు, రాజభవనాలు నిర్మించారు. కుతుబ్ షాహీల రాజధాని కేంద్రంలో జనాభా సంఖ్య నానాటికీ పెరుగుతుండటంలో ఇబ్రహీం కుతుబ్ షా మూసీనదికి దక్షిణాన హైదరాబాద్ నగర్ విస్తరణకు 1591లో శంకుస్థాపన చేశారు. అలా మహానగరం విస్తరించింది. కోటలోని చెప్పుకోదగ్గ పది ప్రత్యేకతలు ఉన్నాయి. కందక నిర్మాణం, కోటగోడలు, సిగ్నలింగ్ వ్యవస్థ, కాగజ్ బురుజు, అక్కన్న మాదన్న ప్యాలెస్, హెలిపెంట్ ట్రీ, సింహ ద్వారాలు, కటోరా హౌస్, ప్రభుత్వం ఉద్యాన వనాలు, కోహినూర్ కీ కహానీలు చూపరులను కట్టిపడేస్తున్నాయి 22 కళారూపాలు... 650 మంది కళాకారులు... గోల్కొండ కోటలో ఆగస్టు 15న జరిగే మువ్వన్నెల జెండా పండుగ సందర్భంగా దాదాపు 650 మంది కళాకారులు 22 వివిధ కళారూపాలను భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శించనున్నారు. గతేడాది కళాకారుల ప్రదర్శనను అంతర్జాతీయ పత్రికలు ఆకాశానికి ఎత్తేస్తు కథనాలు రాశాయి. అంత అద్భుతంగా కళా ప్రదర్శనలు జరిగాయి. ఈసారి భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని 22 కళారూపాల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. రాజన్న డోలు, ఒగ్గుడోలు, గుస్సాడీ, కొమ్ముకోయ, డప్పులు, పేర్ని, నగర కళ పేర్ని– బాజా, ఖాంద్రా(పంజాబీ), రాజస్థానీ, గుజరాతీ దాండియా, కథక్, ముజ్రా లాంటి కళారూపాల ప్రదర్శనలు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సరిగ్గా ఉదయం 15న ఉదయం 8.30కి ప్రదర్శనలు ప్రారంభం అవుతాయి. 9.30కి ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోటలోకి ప్రవేశించగానే 650 మంది కళాకారులు ఒకేసారి ప్రదర్శనలు ఇస్తూ స్వాగతం పలుకుతారు. అంతేకాకుండా హుస్సేన్ సాగర్లోని జాతీయ జెండా వద్ద 100 మంది కళాకారులు స్వాతంత్య్ర సంగ్రామానికి సంబంధించిన థీమ్ సాంగ్కి కళాప్రదర్శన ఇస్తారు. చిన్న వయసులోనే సూక్ష్మచిత్ర కళలో పేరుగాంచిన నిజామాబాద్ జిల్లా గుమ్మిరియాల గ్రామానికి చెందిన రామోజు మారుతిని ప్రభుత్వం ప్రశంసా పత్రం, జ్ఞాపిక, శాలువతో సత్కరించనుంది.