-
అందుకే బాబును చెప్పులేసి తరిమికొట్టబోయారు..
సాక్షి, విజయవాడ : గత అయిదేళ్ల పాలనలో రాజధాని పేరుతో ఏ కట్టడం నిర్మించని చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని అమరావతిలో పర్యటిస్తున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను గాలికి వదిలేసిన బాబు ఇప్పుడు నేల గుర్తొచ్చి ముద్దులు పెడుతున్నాడని విమర్శించారు. రాజధానిలో బాబు దిష్టిబొమ్మను దహనం చంద్రబాబు ఇన్నాళ్లు గ్రాఫిక్స్ను ముద్దు పెట్టుకొని కౌగిలించుకున్నాడని, అధికారం పోయాక ప్రజలు గూబ గుయ్యమనించారని ఎద్దేవా చేశారు. రైతులను మోసం చేసినందుకు ఈ రోజు చెప్పులేసి తరిమి కొట్టారని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నిష్ట దరిద్రుడని, అందుకే రాజధానిలో మూడు నియోజకవర్గాల్లో ప్రజలు ఓడించారని విమర్శించారు. రైతులు, దళితుల నుంచి భూములు కొట్టేసిన గుండాలు, రౌడీలతో వచ్చి చంద్రబాబు రాజధానిలో తిరుగుతున్నారని మంత్రి మండిపడ్డారు. కాగా చంద్రబాబు పర్యటనను నిరసిస్తూ రాజధాని ప్రాంత రైతులు నిరసన తెలిపారు. ఆయన పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. చంద్రబాబు రావొద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చదవండి: చంద్రబాబుకు నిరసన ఫ్లెక్సీలు స్వాగతం -
పరిహారం కోసం రైతుల ధర్నా
గని గ్రామంలో సోలార్ పనుల అడ్డగింత పోలీసులతో వాగ్వాదం గని(గడివేముల): మండల పరిధిలోని గని గ్రామ పొలిమేరలో జరుగుతున్న ఆల్ట్రా మెగా సోలార్ పార్కు పనులను రైతులు మంగళవారం అడ్డుకున్నారు. నష్టపరిహారం ఇచ్చేంత వరకు ఎలాంటి పనులు సాగనివ్వమని బైఠాయించారు. అధికారులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. రైతులు పెద్దఎత్తున బైఠాయించడంతో పోలసులు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రైతుల, అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిహారం ఇవ్వకుండా పనులు చేపట్టడం ఎంతవరకు న్యాయమని ఈ సందర్భంగా బాధిత రైతులు ప్రశ్నించారు. గని గ్రామ పొలిమేరలో దాదాపు 3 వేల ఎకరాలు ఈ సోలార్ పార్కు నిర్మాణం కొరకు భూములు అవసరం ఉందని, ఇటీవల రెవెన్యూ అధికారులు సర్వేలు నిర్వహించారని చెప్పారు. పనులు మాత్రం వేగవంతం చేస్తున్నారని, పరిహారం చెల్లింపును పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సాఫ్ట్ బ్యాంకు ఎనర్జీ రెండు కంపెనీల ద్వారా పనులు చేయిస్తున్నారని, 200 మెగా వాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పనులను మహేంద్ర కంపెనీ, 150 మెగా వాట్ల సామర్థ్యం కలిగిన పనులను స్టేర్లింగ్ అండ్ విల్సన్ కంపెనీ నిర్వహిస్తుందని రైతులు వివరించారు. కంపెనీ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ వద్ద డబ్బు డిపాజిట్ చేశామని చెప్పడం అన్యాయమని, పరిహారం చెల్లిస్తేనే పనులు సాగనిస్తామని తేల్చి చెప్పారు. 346.84 ఎకరాల డీకేటీ పట్టా సాగు భూములు ఉన్నాయని, 1347.66 ఎకరాల డీకేటీ భూములను బీడు భూములుగా రెవెన్యూ అధికారులు రికార్డుల్లో చూపుతున్నారని, 435.90 ఎకరాల సొంత పట్టా భూములు ఉన్నాయని, అందరికీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. భూ సమస్యలతో పెండింగ్లో ఉన్న 268 మంది రైతులలో ఈనెల 21వ తేదీ 64 మంది రైతులు ఆధారాలతో జిల్లా జాయింట్ కలెక్టర్ వద్ద విచారణలో పాల్గొనాలని నోటీసులను అందిస్తున్నామని గడివేముల తహసీల్దార్ రామసుబ్బయ్య రైతులకు వివరించారు. సాగు, బీడు భూముల రైతులతోపాటు ఏడో విడత భూ పంపిణీ లబ్ధి పొందిన రైతులకు నష్టపరిహారం వెంటనే అందించాలని బాధితులు డిమాండ్ చేశారు. దీంతో తహసీల్దార్ రామసుబ్బయ్య మాట్లాడుతూ బీడు భూముల రైతులు కోర్టుకు వెళ్లారని, కోర్టు ఆదేశాల ప్రకారం ముందుకు సాగుతామని చెప్పారు. ఉన్నతాధికారులు నిర్ణయిస్తారన్నారు. ప్రస్తుతం రైతులు సంయమనం పాటించి కాస్త గడువు ఇవ్వాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నంద్యాల ఆర్డీఓ సుధాకర్రెడ్డి, పాణ్యం సీఐ పార్థసారథిరెడ్డి, నందివర్గం ఎస్ఐ, గడివేముల పోలీస్ సిబ్బంది, ఆర్ఐ శ్రావణ్కుమార్, రెవెన్యూ సిబ్బంది, వీఆర్ఓలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement