breaking news
on the field
-
ఫుట్బాల్లో ఏదైనా సాధ్యమే
ఆటైనా, జీవితమైనా ఊహించని మలుపులు సహజం. ఇపుడు అలాంటిదే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు స్పెయిన్ జట్టులో జరిగింది. మెగా ఈవెంట్కు కేవలం ఒక్క రోజు ముందు స్పెయిన్ జట్టు తమ కోచ్ లొపెటెగోను తప్పించింది. నాకు తెలిసి టోర్నీకి ముందు ఇలాంటి నిర్ణయం ఏ జట్టు తీసుకోదు. ఇది సమీకరణాలను మార్చ గలదు. అర్జెంటీనా, ఐస్లాండ్ జట్ల మధ్య జరిగే ప్రారంభ మ్యాచ్ కంటే ముందు స్పెయిన్, పోర్చుగల్ మ్యాచ్పై నేను దృష్టి పెట్టాను. అసలు ఈ మ్యాచ్ ఎలా సాగుతుందో అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నాను. కొత్త కోచ్ ఫెర్నాండో హియెర్రో, స్పెయిన్ ఆటగాళ్లు తమ తొలి మ్యాచ్లో ఏ మేరకు రాణిస్తారో చూడాలి. నా వరకైతే ఇది క్లిష్టమైందే కానీ... ఫుట్బాల్లో అసాధ్యమైంది మాత్రం కాదు. ఎందుకంటే స్పెయిన్ ఆటగాళ్లంతా ప్రొఫెషనల్సే. వాళ్లకు వాళ్లమీదున్న బాధ్యతలేంటో బాగా తెలుసు. ఇతరత్రా (కోచ్కు ఉద్వాసన) ఆఫ్ ది ఫీల్డ్ వ్యవహారాలేవీ ఆన్ ద ఫీల్డ్లో కనిపించకుండా జాగ్రత్తగా ఆడగలరు. సాధారణ పరిస్థితుల్లో అయితే అటాకింగ్ స్పెయిన్కు, రక్షణాత్మక పోర్చుగల్ మధ్య రసవత్తర పోరు తప్పదు. స్పెయిన్ కొత్త కోచ్ ఫెర్నాండో కూడా ప్రత్యర్థి జట్టులో క్రిస్టియానో రొనాల్డో ఉన్నప్పటికీ తమ అటాకింగ్నే నమ్ముకుంటాడనిపిస్తుంది. రెండేళ్ల క్రితం యూరో (2016) సమరంలో ఎదురైన పోటీనే ఇక్కడ ఉంటుందని నేను ఆశిస్తున్నా. అయితే పోర్చుగల్ ఆరంభంలో ఎదురుదాడికి దిగి గోల్స్ సాధించడం ద్వారా మ్యాచ్పై పట్టు సాధించాలని చూడొచ్చు. రొనాల్డో ఎంతటి ప్రమాదకారో స్పెయిన్కు బాగా తెలుసు. ఫీల్డ్లో అతనికి ఏ మాత్రం చాన్స్ ఇచ్చినా... స్పెయిన్ మిడ్ఫీల్డ్, డిఫెన్స్లపై ఒత్తిడి పెరగడం ఖాయం. కాబట్టి స్పెయిన్ ఇక్కడ క్రమశిక్షణతో అడుగేయాల్సి ఉంటుంది -
జాతీయస్థాయి ఇన్స్పైర్లో జిల్లా విదార్థి ప్రతిభ
విద్యారణ్యపురి : న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో బుధవారం వరకు మూడు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి ఇన్స్పై ర్లో వరంగల్కు చెందిన విద్యార్థిని పూజిత ప్రతిభ కనబరిచారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇటీవల తెలంగాణ రాష్ట్రస్థాయి ఇన్స్పై ర్ వరంగల్లో జరిగిన విషయం విదితమే. ఈ సందర్భంగా పది జిల్లాల నుంచి 35 ఎగ్జిబిట్లను జాతీయ స్థాయికి ఎంపిక చేయగా, ఇందులో జిల్లాకు చెందిన ఆరు ఎగ్జిబిట్లు ఉన్నాయి. వీటిని న్యూఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి ఇన్స్పైర్లో ప్రదర్శించగా, వరంగల్లోని సిటీ హైస్కూల్ విద్యార్థిని పూజిత సురక్షిత రైల్వే క్రాసింగ్ ఎగ్జిబిట్ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రతీ రాష్ట్రం నుంచి ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేసి మొదటి, ద్వితీయ బహుమతులు అందజేశారు. వీరిలో పూజిత ఇన్స్పైర్ ముగింపు సభలో మొదటి బహుమతిని ప్రముఖ శాస్త్రవేత్తల నుంచి అందుకుందని జిల్లా సైన్స్కేంద్రం అధికారి సిహెచ్ కేశవరావు బుధవారం సాయంత్రం వెల్లడించారు.