breaking news
Family planning surgeries
-
వెసక్టమీ చేయించుకుంటే పురుషులు శక్తిహీనులవుతారా?
అరసవల్లి(శ్రీకాకుళం జిల్లా): వెసక్టమీ.. ఈ పేరు వింటేనే మగవారు పరుగులు తీస్తున్నారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల్లో భాగంగా చేసుకోవాల్సిన ఈ ఆపరేషన్లకు వెనకంజ వేస్తున్నారు. కేవలం అపోహలే దీనికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. వెసక్టమీ ఆపరేషన్ల గణాంకాలు పరిశీలిస్తే ఇదే విషయం తేటతెల్లమవుతోంది. వెసక్టమీకి తాము దూరమంటూ.. భారం బాధ్యతంతా ఇల్లాలిదే అన్నట్లుగా కొందరు ప్రదర్శిస్తున్న ధోరణి ఈ లెక్కలకు కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. దీంతో ఒకరిద్దరు పిల్లల్ని కనగానే ఆడవాళ్లకు ట్యుబెక్టమీ ఆపరేషన్లు చేయించేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో గత నాలుగున్నరేళ్లులో కేవలం 559 మంది పురుషులు మాత్రమే వెసక్టమీ ఆపరేషన్లు చేయించుకోవడం గమనార్హం. చదవండి: స్టార్టప్ కలలు కంటున్నారా.. ఈ స్కూల్ మీకోసమే..! సింగిల్ డిజిట్కే పరిమితం.. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకోవడంలో మగవారు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండేవారు. క్రమేణా వారిలో మార్పులు కనిపిస్తున్నాయి. ఈ ఆపరేషన్లు చేయించుకునే బాధ్యత మహిళలదే అన్న భావనలో ఉంటున్నారు. వంద మంది మహిళలు ట్యుబెక్టమీ ఆపరేషన్లు చేయించుకుంటుంటే.. వెసక్టమీ చేయించుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. ప్రభుత్వ లక్ష్యాలు వేలల్లో ఉంటే అమలు సింగిల్ డిజిట్లు దాటడం లేదు. ప్రస్తుత సమాజంలో దాదాపుగా విద్యావంతులు అన్నింట్లో అవగాహన కలిగిఉన్నప్పటికీ.. వెసక్టమీ వంటి ఆపరేషన్ల విషయంలో ముందుకు రావడం లేదు. పైగా ఇలాంటి వాటిపై ఎలాంటి చర్చలకు ఆస్కారమివ్వడం లేదు. ఎక్కడో భార్య ఆరోగ్య పరిస్థితి బాగోలేదంటేనే కొందరు భర్తలు వెసక్టమీలకు అంగీకరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అపోహలే కారణమా.. వెసక్టమీ చేయించుకుంటే పురుషుల శక్తిహీనులవుతారని, పనులు సమర్ధంగా చేయలేరన్న అపోహ చాలా మందిలో ఉంది. ♦భర్త కంటే తామే శస్త్రచికిత్సలు చేయించుకుంటామంటున్న మహిళలే అధికంగా ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. ♦ప్రస్తుతం ప్రసవానంతరం మహిళలే ట్యుబెక్టమీ చేయించుకోవడం రివాజుగా మారిపోయింది. ♦అపోహలు తొలగించేందుకు వైద్యారోగ్య శాఖ బుర్రకథలు, వీధి నాటకాల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా...ఫలితం మాత్రం కనబడడం లేదు. ♦మహిళలకు ట్యుబెక్టమీ చేయడం మేజర్ ఆపరేషన్ లాంటిదే అని వైద్యులు చెబుతున్నారు. అదే పురుషుల విషయంలో వెసక్టమీ మాత్రం చాలా సులువైన, సులభమైన ప్రక్రియ అని అంటున్నారు. ఎటువంటి కోతలు, కుట్లు అవసరం లేకుండానే సాంకేతిక పరిజ్ఞానంతో వెసక్టమీ ఆపరేషన్లు చేస్తున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో జిల్లా వైద్యారోగ్య శాఖ విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో నాలుగున్నరేళ్లుగా ఈ శస్త్రచికిత్సల లెక్కలు చూస్తే ఇదే విషయం స్పష్టమవుతుంది. తాజాగా 2022–23 (జూన్ నాటికి)లో వెసక్టమీ సర్జరీలు 654, ట్యుబెక్టమీ సర్జరీలు 12,430 వరకు లక్ష్యంగా నిర్ణయించగా ప్రస్తుత జూన్ నెలాఖరు నాటికి కేవలం ఆరు వెసక్టమీ, 840 ట్యుబెక్టమీ సర్జరీలు నమోదయ్యాయి. లక్ష్య శాతాలను పరిగణనలోకి తీసుకుంటే 3.67 శాతం వెసక్టమీ, 27.03 శాతం ట్యుబెక్టమీ లక్ష్యాలను మాత్రమే సాధించారు. అవగాహన కల్పిస్తున్నాం.. కుటుంబ నియంత్రణకు వీలుగా పురుషులకు వెసక్టమీ, మహిళలకు ట్యుబెక్టమీ ఆపరేషన్లు చేయించుకునేలా ఎప్పటికప్పుడు అవగాహన కలి్పస్తున్నాం. అయినప్పటికీ అపోహలతో పురుషులు ముందుకు రావడం లేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో సాధించిన లక్ష్య శాతం సింగిల్ డిజిట్కే పరిమితమవుతోంది. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎలాంటి అపోహలు లేకుండా వెసక్టమీకి పురుషులు సిద్ధం కావాలి. అన్ని పీహెచ్సీలు, ప్రభుత్వ వైద్యశాలల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేస్తాం. చాలా మంది వైద్యులు ఈ సర్జరీలపై దృష్టి సారించడం లేదన్నది వాస్తవం. – డాక్టర్ బి.మీనాక్షి, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి -
కు.ని. వైద్యుడి అరెస్ట్
జ్యుడీషియల్ దర్యాప్తునకు సీఎం ఆదేశం బిలాస్పూర్/ఐరాస: ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో నిర్లక్ష్యంగా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేసి 13 మంది మహిళల మృతికి కారణమైనవాడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ ఆర్కే గుప్తాను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఇందులో తన తప్పేం లేదని, ప్రభుత్వం సరఫరా చేసిన నాణ్యత లేని ఔషధాల కారణంగానే సర్జరీ అనంతర సమస్యలు తలెత్తి మరణాలు సంభవించాయని డాక్టర్ గుప్తా పేర్కొన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రమణ్సింగ్ గురువారం న్యాయవిచారణకు ఆదేశించారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రి నుంచి 16 మంది వైద్యుల బృందం గురువారం బిలాస్పూర్ బాధితులను పరీక్షించారు. కాగా నాణ్యత లేని ఔషధాలను సరఫరా చేసిన మహావర్ ఫార్మాకు చెందిన ఉత్పత్తి కేంద్రాన్ని అధికారులు సీజ్ చేశారు. మరోవైపుఘటనపై ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీమూన్ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఆ డాక్టర్కు అవార్డ్ కూడా..!
లక్ష శస్త్ర చికిత్సలు చేసినందుకు పురస్కారం బిలాస్పూర్ ఘటనలో 13కి చేరిన మృతుల సంఖ్య! రాయిపూర్/బిలాస్పూర్: చత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాస్పూర్లో 11 మంది మహిళల మృతికి కారణమైన కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహించిన డాక్టర్ ఆర్కే గుప్తా.. తన వృత్తి జీవితంలో ఒక లక్ష కు.ని ఆపరేషన్లు చేసినందుకు ఈ సంవత్సరం అవార్డ్ కూడా అందుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న సాక్షాత్తూ రాష్ట్ర ఆరోగ్యమంత్రి చేతుల మీదుగా ఆ డాక్టర్ పురస్కారం స్వీకరించారు. బిలాస్పూర్లో నవంబర్ 8న ఆయన 5 గంటల వ్యవధిలో 83 కు.ని ఆపరేషన్లు చేశారు. ఇది ఒకరోజులో చేయాల్సిన ఆపరేషన్ల సంఖ్య కన్నా రెండురెట్లు ఎక్కువ. ఆ సమయంలో ఆయనకు సహాయంగా ఒక్కరే ఉన్నారని, సర్జరీల సమయంలో పరిశుభ్రమైన పరికరాలు ఉపయోగించలేదని సమాచారం. అదీకాక, ఆపరేషన్లు నిర్వహించిన ఆసుపత్రిలోనూ సరైన సదుపాయాలు కూడా లేవు. ఒక్కో ఆపరేషన్కు ఆ డాక్టర్కు రూ. 100 లభిస్తాయి. మరో సంవత్సరంలో పదవీ విరమణ చేయనున్న డాక్టర్ గుప్తాపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితులకు ఎయిమ్స్ వైద్యుల పరీక్షలు చత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న దాదాపు 69 మంది మహిళలను బుధవారం ఢిల్లీ నుంచి వచ్చిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ వైద్యులు(ఎయిమ్స్) పరీక్షించారు. బాధితులకు సరైన చికిత్సనే అందుతోందని ఎయిమ్స్లో అనస్థీసియా ప్రొఫెసర్ డాక్టర్ అంజన్ ట్రిఖా తెలిపారు. కాగా, బిలాస్పూర్ ఘటనలో మరణించినవారి సంఖ్య బుధవారం నాటికి 13కి చేరిందని, సుమోటొగా స్వీకరించిన హైకోర్టు బిలాస్పూర్ ఘటనను బుధవారం చత్తీస్గఢ్ హైకోర్టు సుమోటొగా స్వీకరించింది. ఇలాంటివి తరచుగా ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నిస్తూ.. ఆ ఘటనపై 10 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.