breaking news
Fake appointment
-
ఉద్యోగం పేరుతో మోసం
నెల్లూరు(క్రైమ్): ఉద్యోగం ఇప్పిస్తానని ఓ ఏఆర్ కానిస్టేబుల్ నగదు తీసుకుని మోసం చేశాడని చింతల రాగయ్య, పద్మ, పద్మాకర్ అనే వ్యక్తులు ఎస్పీ ఐశ్వర్యరస్తోగికి ఫిర్యాదు చేశారు. సోమవారం వారు నెల్లూరులోని పోలీసు కార్యాలయంలో ఎస్పీని కలిశారు. బాధితుల కథనం మేరకు.. ఇందుకూరుపేట మండలం సోమరాజుపల్లికి చెందిన రాగయ్య, పద్మలు దంపతుల కొడుకు పద్మాకర్. అతను ఇంటర్ పూర్తిచేశాడు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో చదువు మానివేసి తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేందుకు పనులకు వెళ్లసాగాడు. తమలాగే కుమారుడు కష్టపడకూడదని, ఏదైనా ఉద్యోగం వస్తే బతుకులు మారతాయని తల్లిదండ్రులు భావించారు. ఈ క్రమంలో వారిని సమీప బంధువు కానిస్టేబుల్ శివాజీ కలిశాడు. పద్మాకర్కు పోలీసు శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఇందుకోసం రూ.4 లక్షలకుపైగా అవుతుందని బంధువులు కాబట్టి రూ.3.50 లక్షలు చెల్లిస్తే సరిపోతుందని చెప్పాడు. తలకు మించిన భారమైనా కొడుకు భవిష్యత్ కోసం అప్పులు చేసి నాలుగు విడతలుగా రూ.3.50 లక్షలు చెల్లించినట్లుగా రాగయ్య చెబుతున్నాడు. కానిస్టేబుల్ అనుమానం రాకుండా ఉండేందుకు పద్మాకర్ను ఎస్పీ కార్యాలయంలోని ఎస్పీ, ఏఎస్సీ చాంబర్ల వద్దకు తీసుకెళ్లి అధికారులు మీటింగ్లో ఉన్నారని చెప్పేవాడు. నగదు ఇచ్చినా ఉద్యోగం రాకపోవడంతో బాధిత కుటుంబసభ్యులు కానిస్టేబుల్ను నిలదీశారు. దీంతో అతను ఏకంగా అప్పటి ఎస్పీ విశాల్గున్నీ, డీజీపీ సంతకాలతో నకిలీ అపాయింట్మెంట్ లెటర్ను రాగయ్య ఇంటికి పంపాడు. అందులో నెల్లూరు పోలీసు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ పోస్టు వచ్చినట్లు, జీతం రూ.15 నుంచి 20 వేల వరకు ఉంటుందని, 8 నెలల్లోగా ఉద్యోగంలో చేరాలని ఉంది. తాను చెప్పినప్పుడు లెటర్ను పోలీసు కార్యాలయంలో ఇచ్చి ఉద్యోగంలో చేరాలని కానిస్టేబుల్ చెప్పినట్లు రాగయ్య, పద్మాకర్ తెలిపారు. నెలల తరబడి వేచిచూసినా కానిస్టేబుల్ సరైన సమాధానం చెప్పకపోవడం, తిప్పించుకుంటూ ఉండడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన పూర్తిస్థాయిలో విచారించి నివేదిక సమర్పించాలని నగర డీఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణను ఆదేశించారు. తమను మోసం చేసిన కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలని రాగయ్య, పద్మ దంపతులు కోరుతున్నారు. -
ప్రభుత్వ ఉద్యోగాల పేరిట మోసం
- నకిలీ ఆర్డర్లు జారీ చేసిన ముఠా - రూ.2.50 కోట్లు టోకరా.. బెల్లంపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఓ ముఠా నిరుద్యోగులకు టోకరా వేసింది. సుమారు రూ.2.50 కోట్ల వరకు వసూలు చేసి అపారుుంట్మెంట్ ఆర్డర్లూ జారీ చేసింది. తీరా ఆ అపారుుంట్మెంట్లు నకిలీవని తేలడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. కరీంనగర్ జిల్లా రామగుండంకు చెందిన ఓ వ్యక్తి మరికొంత మందిని పోగు చేసుకొని కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ నిరుద్యోగులకు ఉద్యోగాల ఎర వేసి మోసం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆయా జిల్లాల్లో సుమారు 50 మంది నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో నిరుద్యోగి నుంచి కనిష్టంగా రూ.6 లక్షల నుంచి గరిష్టంగా రూ.12 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ముఠా సభ్యులు ఏమాత్రం అనుమానం రాకుండా ఎస్బీఐ, ఎస్బీహె చ్ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయించుకోవడం గమనార్హం. నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు.. డబ్బులిచ్చిన తర్వాత ఏళ్ల తరబడి ఉద్యోగం కల్పించకపోవడంతో నిరుద్యోగులు ఒత్తిడి తేవడంతో కొందరికి నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లను అందజేశారు. రైల్వేలో జూనియర్ అసిస్టెంట్గా, టీసీగా ఉద్యోగం వచ్చినట్లు నకిలీ ఆర్డర్లను అందించారు. వరంగల్ జిల్లాకు చెందిన కొంతమందిని సికింద్రాబాద్ రైల్ నిలయంకు తీసుకెళ్లి అక్కడ ముందస్తుగా కొంత మంది అనుయాయులను ఏర్పాటు చేసుకుని ఫేక్ ఇంటర్వ్యూలు కూడా నిర్వహించినట్లు సమాచారం. పరారీలో ముఠా.. ఈ ముఠా ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. గోదావరిఖనిలో కొంత కాలంపాటు నివసించిన ముఠా నాయకుడు ప్రస్తుతం హైదరాబాద్కు మకాం మార్చినట్లు తెలుస్తోంది. ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి రూ.లక్షలు వసూలు చేసి మోసం చేసిన నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు బెల్లంపల్లి వన్టౌన్ ఎస్హెచ్వో ఎల్.రఘు తెలిపారు.