breaking news
ex service man
-
19న మాజీ సైనికుల సమావేశం
కర్నూలు(అర్బన్): అనంతపురంలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ స్టేడియంలో ఈ నెల 19న మాజీ సైనికుల సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి రాచయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి జిల్లాలోని మాజీ సైనికులు, వితంతువులపై ఆధారపడిన వారు తప్పక హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు జిల్లా సైనిక సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. -
భూవివాదంలో మాజీ సైనికుడిపై దాడి
కపిలేశ్వరపురం : భూ వివాదంలో ఈ నెల 11న మాజీ సైనికుడినిపై కొందరు దాడి చేశారు. మండలంలోని అద్దంకివారిలంక గ్రామ శివారు పల్లపులంకలో జరిగిన దాడిలో గాయపడిన మాజీ సైనికుడు మలకా లక్ష్మణరావు అమలాపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి నుంచి సమాచారం రాగానే తగిన చర్యలు తీసుకుంటామని అంగర ఎస్సై వాసా పెద్దిరాజు తెలిపారు. బాధితుడు లక్ష్మణరావు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం... లక్ష్మణరావుకు ప్రభుత్వం ఇచ్చిన భూమిలోకి ఈ నెల 11న వెళ్లగా బూరుగు సత్యనారాయణ, బూరుగు అర్జునరావు, కొత్తపల్లి దుర్గారావు, బూరుగు చిన్న, బూరుగు ఏసు, బూరుగు ప్రసాదు వచ్చి పొలంలోని సర్వే రాళ్ళను తొలగించి లక్ష్మణరావుపై దాడికి దిగారు. వివాదం నేపథ్యం ఇదీ... లక్ష్మణరావు సేవలను గుర్తించిన ప్రభుత్వం 1976లో పల్లపులంకలో 259/1 సర్వేలో ఐదు ఎకరాల భూమిని డి–పట్టాగా ఇచ్చింది. తర్వాతక్రమంలో ఆ భూమిని కొందరు ఆక్రమించి కొంతకాలంగా సాగు చేస్తున్నారు. దీంతో 1992లో తన భూమిని అప్పగించాలంటూ కోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం ప్రారంభించారు. 2014 సెప్టెంబర్లో అప్పటి జిల్లా కలెక్టరు నీతూకుమారిప్రసాద్ను కలిసి తన గోడును విన్నవించుకున్నారు. దీంతో 2016 జూలైలో సర్వే నిర్వహించగా ఆ సర్వే నంబరుతో మొత్తం 11.36 ఎకరాలున్నట్టు, అందులో ఐదు ఎకరాలు లక్ష్మణరావుకు చెందినదిగా నిర్ధారించారు. దీంతో లక్ష్మణరావు కొద్ది రోజుల క్రితం కొబ్బరిమొక్కలు వేసి భూమికి కంచెను ఏర్పాటు చేసుకున్నారు. వాటిని కొందరు తొలగించారు. అప్పటి నుంచి వివాదం రాజుకుంంది. ఈ నేపథ్యంలో 11న లక్ష్మణరావుపై దాడి జరిగింది. -
కలెక్టరేట్లో మాజీ సైనికోద్యోగి ఆత్మహత్యాయత్నం
కలెక్టరేట్ (మహబూబ్నగర్ జిల్లా) : ప్రభుత్వం తనకు కేటాయించిన స్థలం వివాదం పదేళ్లుగా పరిష్కారం కాకపోవడంతో మనస్తాపం చెందిన మాజీ సైనికోద్యోగి ఒకరు కలెక్టరేట్లో పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. సోమవారం కలెక్టరేట్కు చేరుకున్న అబ్రహాం(65) అనే మాజీ సైనికోద్యోగి గ్రీవెన్స్ డేలో పాల్గొన్నాడు. షాద్నగర్ మండలం కందిమల్ల గ్రామంలో తనకు కేటాయించిన స్థలాన్ని ఆ గ్రామస్తులు పదేళ్లుగా అడ్డుకుంటున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. పదేళ్లుగా పోరాటం చేస్తున్నా తనకు న్యాయం జరగకపోవడంతో కలెక్టరేట్లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే ఆయన్ని 108లో ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.