breaking news
ex commander
-
‘నిందితులను చంపాలనే ఆలోచన రాలేదు’
న్యూఢిల్లీ: యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన నిర్భయ కేసును పర్యవేక్షించిన ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిందితులను చంపేయాలన్న ఆలోచన తమకు ఎప్పుడూ రాలేదని చెప్పారు. దిశపై గ్యాంగ్రేప్ చేసిన నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. నిర్భయ ఘటన జరిగినప్పటి పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉండేవని గుర్తు చేసుకున్నారు. డిసెంబర్ 16, 2012న నిర్భయపై గ్యాంగ్రేప్ జరిపి తీవ్రంగా గాయపరచడంతో ఆమె మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో దేశంలో పెద్దఎత్తున నిరసన వ్యక్తమైంది. ‘నిందితులను బాగా ఆకలిగా ఉన్న సింహాలకు వదిలేయండి. ప్రజలకు అప్పగించండి. అంటూ మాకు చాలా మెసేజ్లు వచ్చాయి. కానీ మేం చట్టాన్ని అనుసరించాం’ అని అన్నారు. ప్రతి ఎన్కౌంటర్ తర్వాత ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయని, ఇది ఒక ఉగ్రవాదిపైనో లేదా గ్యాంగ్స్టర్పైనో జరిగింది కాదని చెప్పారు. ఈ కేసుపై ప్రజల దృష్టి ఎక్కువగా ఉందన్నారు. -
మావోయిస్టు మాజీ దళ కమాండర్ మృతి
జైనూరు (ఆదిలాబాద్ జిల్లా): ఆదిలాబాద్ జిల్లా జైనూర్ గ్రామానికి చెందిన మాజీ దళ కమాండర్ గూడెం మహేష్ అలియాస్ హన్మంతరావు అనారోగ్యంతో బుధవారం మృతిచెందారు. ఆయన 1995 నుంచి 2001 వరకూ మంగి గెరిల్లా దళంలో కమాండర్గా పనిచేశారు. 2001లో ప్రభుత్వానికి లొంగిపోయారు. అప్పటి నుంచి ఆయన స్థానికంగా ఉంటూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఆయన బుధవారం హఠాత్తుగా మృతిచెందారు.