మావోయిస్టు మాజీ దళ కమాండర్ మృతి | maoist ex commander mahesh died in adilabad district | Sakshi
Sakshi News home page

మావోయిస్టు మాజీ దళ కమాండర్ మృతి

Aug 5 2015 3:57 PM | Updated on Oct 9 2018 2:47 PM

ఆదిలాబాద్ జిల్లా జైనూర్ గ్రామానికి చెందిన మాజీ దళ కమాండర్ గూడెం మహేష్ అలియాస్ హన్మంతరావు అనారోగ్యంతో బుధవారం మృతిచెందారు.

జైనూరు (ఆదిలాబాద్ జిల్లా):  ఆదిలాబాద్ జిల్లా జైనూర్ గ్రామానికి చెందిన మాజీ దళ కమాండర్ గూడెం మహేష్ అలియాస్ హన్మంతరావు అనారోగ్యంతో బుధవారం మృతిచెందారు. ఆయన 1995 నుంచి 2001 వరకూ మంగి గెరిల్లా దళంలో కమాండర్‌గా పనిచేశారు. 2001లో ప్రభుత్వానికి లొంగిపోయారు. అప్పటి నుంచి ఆయన స్థానికంగా ఉంటూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఆయన బుధవారం హఠాత్తుగా మృతిచెందారు.

Advertisement
 
Advertisement
Advertisement