breaking news
mahesh died
-
మావోయిస్టు మాజీ దళ కమాండర్ మృతి
జైనూరు (ఆదిలాబాద్ జిల్లా): ఆదిలాబాద్ జిల్లా జైనూర్ గ్రామానికి చెందిన మాజీ దళ కమాండర్ గూడెం మహేష్ అలియాస్ హన్మంతరావు అనారోగ్యంతో బుధవారం మృతిచెందారు. ఆయన 1995 నుంచి 2001 వరకూ మంగి గెరిల్లా దళంలో కమాండర్గా పనిచేశారు. 2001లో ప్రభుత్వానికి లొంగిపోయారు. అప్పటి నుంచి ఆయన స్థానికంగా ఉంటూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఆయన బుధవారం హఠాత్తుగా మృతిచెందారు. -
కొత్త కారు ముచ్చట తీరనే లేదు..
ఏలూరు: ఓ ఆటో డ్రైవర్ కొత్తగా కొనుకున్న కారు ముచ్చట తీరనే లేదు. అంతలోనే మృత్యువు కారు ప్రమాదం రూపంలో అతడి ప్రాణాలను మింగేసింది. ఏలూరుకు చెందిన మహేశ్ ఇటీవలే కొనుగోలు చేసిన కారులో పని నిమిత్తం వేరే ప్రాంతానికి బయలుదేరాడు. అతివేగంగా వెళుతున్న ఆ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రూరల్ మండలం పాలగూడెం వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. మహేశ్ అక్కడికక్కడే మృతి చెందగా, కారులో ఉన్న మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారును వేగంగా నడపడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.