breaking news
essay writing. competition
-
వ్యాసరచన పోటీల్లో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభ
సాక్షి, హైదరాబాద్: మధుమేహ వ్యాధి ప్రబలడానికి కారణాలు, నివారణ చర్యలపై అవగాహన పెంచడానికి విజయవాడలోని వీజీఆర్ డయాబెటిక్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, శ్రీ చైతన్య స్కూల్ నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు భారీ సంఖ్యలో విజేతలుగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులకు నిర్వహించిన ఈ పోటీల్లో 40,358 మంది విద్యార్థులు పాల్గొనగా.. 2,295 మంది విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలోని సిద్ధార్ధ ఆడిటోరియంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో విజేతలను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. కార్యక్రమంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, వీజీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ కె.వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. విజేతలను శ్రీ చైతన్య విద్యాసంస్థల వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ బీఎస్ రావు అభినందించారు. -
రిజర్వ్ ఫారెస్ట్లో ప్లాస్టిక్ నిషేధం
సాక్షి, మన్ననూర్ (అచ్చంపేట) : అమ్రాబాద్ పులుల రక్షిత ప్రాంతం (కోర్ ఏరియా)లో ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధిస్తున్నామని వాటి స్థానంలో పేపర్, బట్ట సంచులను అందుబాటులో ఉంచుతున్నట్లు ఫీల్డ్ డైరెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం అటవీశాఖ ఈసీ సెంటర్ వద్ద డబ్లూడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. మానవ మనుగడతో పాటు జీవరాశులకు ముప్పు కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. వన్యప్రాణులకు అమ్రాబాద్ అభయారణ్యం దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగి ఉండటం గర్వకారణమని అన్నారు. ఈ క్రమంలో పర్యాటకులు, అటవీ సమీప గ్రామాల ప్రజలు ప్లాస్టిక్ను ఉపయోగించడం, పారబోయడంతో వాటిని తింటున్న వన్యప్రాణులు మృత్యవాతపడుతున్నాయని అన్నారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ డైరెక్టర్ ఫరీదా టంపల్ మాట్లాడుతూ శ్రీశైలం – హైదరాబాద్ ప్రధాన రహదారి వెంట అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించి వన్యప్రాణులను కాపాడాలన్నారు. ఈ ప్రాంతంలో పేవర్ కవర్ల తయారీ కోసం కుటీర పరిశ్రమను మరో నెల రోజుల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పేపర్ కవర్ల తయారీ కోసం చెంచు మహిళలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు. అడవులను, జంతుజాలాన్ని రక్షించుకోవాలని కళాకారుల ఇచ్చిన ప్రదర్శన, ఆట పాటలు ఆకట్టుకున్నాయి. యాత్రికులకు పేపర్ కవర్లు అందజేత అటవీశాఖ చెక్పోస్టు వద్ద డబ్ల్యూడబ్ల్యూఎఫ్, శ్రీనివాస ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీశైలం వెళ్లే యాత్రికులకు పేపర్ కవర్లు అందజేశారు. టోల్గేట్ రూ.20లకు అదనంగా రూ.5 వసూలు చేసి కవర్ అందిస్తున్నారు. దీంతోపాటు మరో రూ.25 అదనంగా వసూలు చేస్తున్నారు. మన్ననూర్ నుంచి దోమలపెంట వరకు ఎలాంటి చెత్త, వ్యర్థాలు ఉన్నా రోడ్డు పక్కన వేయకూడదు. కవర్లో వేసి దోమలపెంట చెక్పోస్టు వద్ద అటవీశాఖ సిబ్బందికి కవర్ అందించాలి. వారు రూ.25 తిరిగి ఇస్తారని అధికారులు తెలిపారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు పర్యావరణ రోజు సందర్భంగా అమ్రాబాద్, మన్ననూర్ రేంజ్ పరిధిలోని ఆయా పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో శ్రీనివాస ఛారిటబుల్ ట్రస్టు డైరెక్టర్ శ్రీనివాస్, డీఎఫ్ఓ జోజీ,ఎఫ్ఆర్ఓలు ప్రభాకర్, శ్రీదేవి ఎఫ్ఎస్ఓ రామాంజనేయులు సిబ్బంది బాబలి, వెంకటేశ్వర్లు, కనకయ్య, కళాకారులు మాడ్గుల నర్సింహ, లింగస్వామి, బీముడు, ఆయా చెంచుపెంటల మహిళలు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మికతతోనే శాంతిస్థాపన
ఇస్కాన్ వ్యాసరచన పోటీలు వన్టౌన్ : సమాజంలో ఆధ్యాత్మికతతోనే శాంతిస్థాపన సాధ్యమవుతుందని ఇస్కాన్ కృష్ణాజిల్లా కార్యనిర్వహకులు మురళీధర్నాథ్ దాస్ అన్నారు. ఇస్కాన్ వ్యవస్థాపకులు శ్రీల ప్రభుపాద జీవితంపై కృష్ణాజిల్లా వ్యాప్త వ్యాసరచన పోటీ పరీక్షా కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో ఆదివారం జరిగింది. సుమారు 250 మంది విద్యార్థులు హాజరయ్యారు. దాస్ మాట్లాడుతూ ఇస్కాన్ స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మానవ సమాజానికి ఆనందభరితమైన జీవితాన్ని, చక్కని ఆరోగ్యాన్ని ప్రశాంతమైన మనస్సును, అన్ని ఉన్నతమైన లక్షణాలను భగవత్ చైతన్యం ద్వారా అందించటానికి ఇస్కాన్ ప్రయత్నిస్తోందన్నారు. తొలుత జిల్లావ్యాపితంగా పరీక్షలను నిర్వహించి చివరిలో రాష్ట్ర వ్యాప్త పరీక్షను నిర్వహిస్తున్నామన్నారు. విజేతలకు జిల్లా స్థాయిలో పది వేలు, ఏడున్నర వెయ్యి, ఐదు వేలు, రాష్ట్ర స్థాయిలో లక్ష, రూ.75వేలు, రూ.50 వేలు చొప్పున నగదు బహుమతులను అందజేస్తామన్నారు. విజయవాడలోనే బహుమతి ప్రదానోత్సవం ఉంటుందని తెలిపారు.