breaking news
EPF Commissioner
-
నేటి నుంచి ఈపీఎఫ్వో ఆన్లైన్ సేవలు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) తమ చందాదారుల సౌకర్యార్థం శుక్రవారం నుంచి ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెస్తోంది. ఈ కొత్త విధానం ద్వారా చందాదారులు ఇకపై తమ ఖాతాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో తెలుసుకొనేందుకు వీలవుతుంది. ‘ఇప్పటివరకు వారి ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని ఏడాదికి ఒకసారి మాత్రమే సవరించేవాళ్లం. ఇకపై ఆన్లైన్లో ఎప్పటికప్పుడు ఖాతాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకోవచ్చు’ అని ఈపీఎఫ్వో సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ జలాన్ తెలిపారు. -
ఆన్లైన్లో పీఎఫ్ ఖాతాల వివరాలు
సాక్షి, హైదరాబాద్: ఇకనుంచి ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాల వివరాలను ఆన్లైన్లో చూసుకునే వెసులుబాటు కల్పించినట్లు హైదరాబాద్ ఈపీఎఫ్ కమిషనర్ పి.రాజశేఖరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. www.epfindia.com వెబ్సైట్లో ఈ వివరాలు లభిస్తాయన్నారు. ఈ సైట్లోని ఎస్టాబ్లిష్మెంట్ సెర్చ్ లో ఉద్యోగుల వివరాలు కూడా లభ్యమౌతాయన్నారు. నెలవారీగా ప్రతి ఉద్యోగి, యాజమాన్యాలు పీఎఫ్ ఖాతాల్లో జమచేసిన మొత్తాలు, పాస్బుక్లను ఈ సైట్లో డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ బకాయిలను ఆయా సంస్థల యజమానులు గడువులోగా చెల్లించాలని ఆయన స్పష్టంచేశారు. 1952 పీఎఫ్ చట్టం ప్రకారం ఉద్యోగుల వేతనం నుంచి కట్ చేసిన మొత్తం, యాజమాన్యం చెల్లించాల్సిన మొత్తాన్ని కలిపి నిర్ణీత గడువులోగా జమ చేయాల్సిన బాధ్యత సంబంధిత యాజమాన్యాలదేనన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు, ట్రేడ్యూనియన్లు, ఉద్యోగులు ఈ సేవల్ని వినియోగించుకోవాలని కోరారు.