breaking news
enter for women
-
మసీదుల్లోకి మహిళల వ్యాజ్యం కొట్టివేత
న్యూఢిల్లీ: మసీదుల్లోకి మహిళలను అనుమతించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. పబ్లిసిటీ కోసమే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారన్న కేరళ హైకోర్టు వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లు తెలిపింది. ‘ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయడానికి అసలు మీరెవరు? ఇది మీపై ఎలా ప్రభావం చూపుతుంది? బాధిత వ్యక్తులను మా ముందుకు తీసుకురండి’అని పిటిషన్దారుడితో వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్ల సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం ఈ మేరకు వెల్లడించింది. మరోవైపు, ఆర్టికల్ 15 చిత్రంలో కుల విద్వేషాలు, పుకార్లను పెంచే అభ్యంతరకరమైన డైలాగులు ఉన్నందున సీబీఎఫ్సీ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) జారీ చేసిన సర్టిఫికెట్ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. -
మహిళలకు మాత్రమే..
అడవి కొలను (నిడమర్రు) : గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి ఉత్సవాలలో ఒక రోజును పూర్తిగా మహిళలకే కేటాయించడం ఇక్కడి ఆచారం. ప్రతి ఏడాది స్వామి వారి రథోత్సవం జరిగిన రోజున మహిళలకు ప్రత్యేకంగా తీర్థోత్సవం జరుగుతుంది. అదే విధంగా గురువారం రథోత్సవం జరిగింది. అనంతరం తీర్థంలో మహిళలకు అవసరమైన గృహోపకరణాలైన కత్తిపీట, కవ్వం, అట్లపెనం, మూకుళ్లు వంటి వంట సామగ్రి దుకాణాలతో పాటు, వస్త్ర దుకాణాలు, ఫ్యాన్సీ వస్తువుల దుకాణాలు, బొమ్మలు వంటి స్టాల్స్ను ఏర్పాటు చేశారు. వీటిని తిలకించేందుకు, కొనుగోలు చేసేందుకు ఈ రోజు కేవలం మహిళలనే అనుమతించడం ఇక్కడ అనాదిగా వస్తున్నఆచారం. మిఠాయి దుకాణాలు, మాంసం దుకాణాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవంలోకి పురుషులు ఎవ్వరూ అడుగు పెట్టరు. ఇతర గ్రామాల నుంచి వచ్చే మగవారిని తీర్థంలోకి రాకుండా ఉత్సవ కమిటీ సభ్యులు కాపలా కాస్తారు. ఈ ఆచారం పూర్వ నుంచి ఉందని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పోశింశెట్టి రామమూర్తి తెలిపారు. ఈ ఆచారం తెలుగు రాష్ట్రాల్లో కేవలం కడప జిల్లా పులివెందులలోనూ, మన జిల్లాలో అడవికొలను గ్రామంలో మాత్రమే ఉన్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. అర్ధరాత్రి 2 గంటల వరకూ మహిళలు వస్తువులు కొనుగోలు చేస్తారు. తర్వాత నుంచి గ్రామంలోని మగవారు తీర్థంలోకి వెళతారు. ఇక్కడ ఏర్పాటు చేసిన దుకాణాల్లో వేకువజాము వరుకూ కొనుగోళ్లు జరుగుతాయని వ్యాపారస్తులు తెలిపారు. ఈ రోజుకోసం ఏడాది నుంచి ఎదురు చూస్తామని మహిళలు పేర్కొన్నారు. మహిళల తీర్థం పూర్తయ్యేంత వరకు ప్రతిఏడాది సత్యహరిశ్చంద్ర నాటకం మాత్రమే మగవారు చూడటం కూడా ఇక్కడ ప్రత్యేకత.