-
బ్రాండ్ సిరిసిల్ల కావాలి
సిరిసిల్ల/తంగళ్లపల్లి: దేశంలోనే సిరిసిల్ల వస్త్రాలకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా నాణ్యత, నవ్యతతో వస్త్రాలను ఉత్పత్తి చేయాలని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్టైల్ పార్కులో రూ.14.50 కోట్ల వ్యయంతో చేపట్టిన సెంట్రల్ లైటింగ్, శిక్షణ కేంద్రం, పరిపాలనా భవనం, క్యాంటీన్ భవనాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సిరిసిల్లకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నడూలేని విధంగా సిరిసిల్ల నేతన్నలు ఉత్పత్తి చేసిన వస్త్రాలను రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ కానుకగా ఆడపడచులకు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. సిరిసిల్ల బ్రాండ్ ఇమేజ్ ఉండేలా ఆధునికతను సంతరించుకునేలా వస్త్రాలు తయారు చేయాలని మంత్రి కోరారు. నేత కార్మికులు ఆత్మగౌరవంతో జీవించే విధంగా వేతనాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇస్తోందన్నారు. దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కును వరంగల్లో ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. సిరిసిల్ల మహిళలకు ఉపాధి కల్పించేందుకు రెడీమేడ్ వస్త్రాల తయారీ కేంద్రాన్ని (అపెరల్ పార్కు) ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత నేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగు పడ్డాయని, ఈ విషయాన్ని ఏ నేత కార్మికుడిని అడిగినా చెబుతాడని కేటీఆర్ పేర్కొన్నారు. పవర్లూమ్ పరిశ్రమకు 50 శాతం విద్యుత్ సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు, జౌళి రంగానికి చేయూత అందించాలని కేంద్ర మంత్రికి లేఖ రాశామన్నారు. కార్యక్రమంలో జౌళి శాఖ డైరెక్టర్ శైలజారామయ్యర్, కలెక్టర్ డి.కృష్ణభాస్కర్ పాల్గొన్నారు. మంత్రి పర్యటనలో పలువురి నిరసన కేటీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో వెంకటేశ్ టెక్స్టైల్స్ యజమాని దొంతుల నరహరి వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపాడు. పరిశ్రమలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశాడు. తమ సమస్యలను విన్నవించేందుకు వచ్చిన ఉపాధి హామీ ఫీల్డు అసిస్టెంట్లను, పలువురు రైతులను పోలీసులు అరెస్టు చేశారు మంత్రి తంగళ్లపల్లిలో కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమానికి మీడియాను అనుమతించక పోవడంతో పలువురు జర్నలిస్టులు నిరసన తెలిపారు. -
ఘరోసా
కడుపున మోస్తున్నప్పుడే కాదు, కన్న తర్వాత కూడా బిడ్డను కడుపులో పెట్టుకునే పెంచుతుంది తల్లి! నవమాసాలూ ఎంత భద్రంగా పొదవి పట్టుకుంటుందో.. కౌమారంలో అంతకు మించిన జాగ్రత్తతో కనురెప్పల మధ్య పెట్టుకుంటుంది. అయినప్పటికీ జరగరానిది జరిగితే? బిడ్డకెంత బాధో తల్లికీ అంతే వేదన. ఆ గాయం నుంచి ఊరటను కలిగించి న్యాయం జరిగేలా సాయం అందించే ఇల్లే.. ‘భరోసా’. ఆత్మ స్థైర్యాన్ని పెంచే ఘరోసా. ‘‘రెండేళ్ల కిందట.. ఒకరోజు రాత్రి ఎనిమిదిన్నరకు అనుకుంటా..‘అమ్మా.. ఓనర్ తాత పిలుస్తున్నాడు..’’ అంటూ పైన అంతస్తులో ఉండే మా ఇంటి ఓనర్ వాళ్లింటికి వెళ్లింది పాప. పదిహేను నిమిషాలైనా కిందకి రాలేదు. ఎక్కడినుంచో ఏడుపు వినిపించింది. తర్వాత గమనిస్తే మా పాప ఏడుపే అని అర్థమై.. గబగబా పైకి వెళ్లాను. వీధి గుమ్మం గడియ వేసి ఉంది. ఆ గుమ్మం పక్కనే ఉన్న కిటికీ అద్దమొకటి పగిలిపోయి ఉంది. పాపను పిలుస్తూ అందులోంచి చూశా. లోపలి బెడ్రూమ్ కనపడుతోంది. నా గొంతు వినేసరికి మా పాప ఏడుస్తూనే అరిచేసింది ‘‘మమ్మీ ..’’ అంటూ! నేనూ గట్టిగా అరుస్తూ మళ్లీ తలుపు దబాదబా బాదా. పాప పరిగెత్తుకుంటూ లోపల్నించి వచ్చి తలుపు తీసింది. 57 ఏళ్ల మా ఓనర్ దాదాపు న్యూడ్గా ఉన్నాడు.. ఏడేళ్ల మా పాపను..’’ చెప్పలేక రెండు చేతుల్లో తల దాచుకొని ఏడ్చేసింది ఆ అమ్మ.ఆ వార్డ్ కౌన్సిలర్ అయిన ఆ ఇంటి ఓనర్ భార్య తన పలుకుబడితో తన భర్త నిర్దోషని, ఆ పాప తల్లే తన ఇంట్లో వెండి సామాను, డబ్బులు దొంగిలించిందని తప్పుడు కేసులు పెట్టింది. బ్లాక్మెయిల్, వేధింపులకూ గురిచేసింది. అయినా అవన్నీ వీగిపోయి.. ఆ ఓనర్ చేసిన తప్పు రుజువై పదేళ్ల జైలు శిక్ష పడింది.ఓ జంటకు పాప పుట్టింది. ఆ చంటిపిల్లకు మూడోనెల రాగానే ‘‘పాపకు నేనే స్నానం చేయిస్తాను’’ అంటూ భర్తే స్నానం చేయించడం మొదలుపెట్టాడు. అలా బిడ్డకు రెండేళ్ల వయసు వచ్చేదాకా అతనే స్నానం చేయించాడు. ఒకరోజు తల్లి స్నానం చేయిస్తుంటే.. ‘‘అమ్మా.. స్నానం చేయించేటప్పుడు నాన్న ఇలా చేస్తాడు.. నువ్వు చేయట్లేదు’’ అని వచ్చీరాని మాటల్తో పాప చెబుతుంటే హతాశురాలైంది తల్లి. ‘‘బాధ్యతల్లో పాలుపంచుకుంటున్న అతణ్ణి ఇన్నిరోజులు మంచి భర్తగా భావించా కానీ అతని మనసులో ఉన్న రోతను గమనించలేకపోయానే’’ అని గుండె పగిలేలా ఏడ్చింది. భర్త మీద కేసు పెట్టింది. అతని నేరం రుజువు చేయడానికి నానాకష్టాలు పడ్డది. అలాంటి తండ్రికి బిడ్డ పట్ల విజిటింగ్ హక్కు ఇవ్వకూడదని కోర్ట్లో ఒక పోరాటమే చేసింది. ‘‘ఈపాటికల్లా పాల ప్యాకెట్లు వేసేసి పిల్లాడు ఇంటికి రావాల్నే.. ఇంకా రాలేదేంటి?’’ అనుకుంటూ పదకొండేళ్ల కొడుకును వెదుక్కుంటూ వెళ్లాడు తండ్రి. దార్లోనే కనిపించాడు కొడుకు పైజామా అంతా రక్తసిక్తమై. అది చూసిన ఆ తండ్రి గుండె ఆగినంత పనైంది. ‘‘ఏమైంది బేటా..’’ అని తండ్రి అడిగేలోపే.. వణుక్కుంటూ ‘‘ఫలానా వీధిలో ఉండే అంకుల్ లోపలికి పిలిచి..’’ అంటూ జరిగిన దారుణం చెప్పాడు.దేవుడా..! అయినా ఇప్పుడెందుకు ఇవన్నీ ఏకరువు పెట్టారు? మన చుట్టూ జరుగుతున్న దారుణాల గురించి చెప్పడానికి వారం, వర్జ్యం, సందర్భం కావాలా? ఈ నేరాలు తెలిస్తేనే కదా.. మన పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరిని ఎంతలా గమనించాలి అన్న సత్యాలు బోధపడేవి! కరెక్ట్ ..ఇలాంటి అవగాహన, చైతన్యం కల్పించే కార్యక్రమాన్నే నిన్న హైదరాబాద్లో చేపట్టింది ‘‘భరోసా సెంటర్’’. ఈ కార్యక్రమంలో బాధితులు పంచుకున్న వెతలే అవి. తెలంగాణ పోలీస్ సహకారం, ఆడపిల్లల రక్షణకోసం పనిచేస్తున్న ‘తరుణి’ స్వచ్ఛంద సంస్థ టెక్నికల్ సపోర్ట్తో నడుస్తున్నదే ‘భరోసా’. బాలల మీద జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడానికి, దానికోసం ఉన్న చట్టాల గురించి తెలియజేయడానికి, జరిగిన నేరానికి సంబంధించి హెల్ప్లైన్, కేసు నమోదు చేయడం నుంచి తీర్పు వరకు సమస్తం ఒకేచోట అందించడానికి ఏర్పడిందే ‘భరోసా’. లైంగిక వేధింపులు, లైంగిక దాడికి గురైన పిల్లలు.. పోలీసులు, కేసులు, కోర్టులు, నిందితుల గుర్తింపు.. మొదలైన ప్రక్రియలో మానసికంగా మరింత నలిగిపోయే ప్రమాదం ఉంది.పోలీస్ యూనిఫామ్, గంభీరమైన కోర్ట్ హాలు, తికమక పెట్టే డిఫెన్స్ వాదన, నిందితుడి చూపులు, ఆసుపత్రికి వెళ్లడాలు వంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా.. ఇంటిలాంటి వాతావరణంలో అమరుస్తోంది భరోసా. ఇందులో పిల్లలకు సైకలాజికల్ కౌన్సెలింగ్ కూడా ఉంటుంది ఆ ట్రామా నుంచి బయటపడేందుకు. న్యాయవిచారణలో సహకరించేందుకు. కోర్ట్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు నిందితుడు పిల్లలకు కనిపించకుండా ఉండే ఏర్పాటూ ఉంటుంది. అవసరమైన పిల్లలకు పునరావాసమూ ఉంటుంది. ఇంకో ముఖ్య విషయం.. ఈ భరోసా సెంటర్కు రెండు ప్రవేశ ద్వారాలు ఉంటాయి. ఒక ద్వారం కేవలం జడ్జి, బాధిత పిల్లలకు మాత్రమే. మరో ద్వారం మిగిలిన అందరికోసం. అంటే ఎక్కడా పిల్లలు నిందితుల కంటపడరన్నమాట. ‘‘భరోసా సెంటర్లు తెలంగాణలో ప్రస్తుతం హైదరాబాద్, వికారాబాద్లో పెట్టాం. త్వరలోనే నల్గొండ, సూర్యాపేట్, వరంగల్, రాచకొండ కమిషనరేట్లలోనూ ఏర్పాటు చేస్తాం’’ అని చెప్పారు తెలంగాణ రాష్ట్ర విమెన్ సేఫ్టీ వింగ్ ఐజీ స్వాతి లక్రా. భరోసాకు ప్రేరణ.. అమెరికా, కాలిఫోర్నియాలోని శాండియాగోలో ఉన్నది రిహాబిలిటేషన్ సెంటర్. అక్కడ లైంగిక దాడి, అబ్యూస్కు గురైన పిల్లలను నేరుగా ఈ సెంటర్కే తీసుకొస్తారు. వాళ్లు శారీరకంగా, మానసికంగా పూర్తి ఆరోగ్యవంతులైన తర్వాతే ఇంటికి పంపిస్తారు. ఇక్కడైతే కోర్ట్ ప్రొసీడింగ్స్ కూడా పిల్లలకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. ఒక గ్లాస్ విండో ఉన్న హాలులో పిల్లలతో కౌన్సెలర్ ఆడుకుంటూ జరిగిన విషయాలు నెమ్మదిగా చెప్పిస్తూ ఉంటాడు. ఈ విండోకి ఆవల కోర్ట్ హాల్ ఉంటుంది. అది పిల్లలకు కనిపించదు, వినిపించదు. కాని ఆ కోర్ట్కు మాత్రం పిల్లలు, కౌన్సెలర్ సంభాషణ వినపడ్తూంటుంది. అలా ప్రొసీడింగ్స్ సాగి తీర్పు వెలువడుతుంది. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఇంటి నుంచే... ‘‘పిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడానికి కొత్త చట్టాలు వచ్చాయి. దురదృష్టమేమంటే అందులో పేర్కొన్న విధానాల్లో కూడా పిల్లల మీద అఘాయిత్యాలు జరగడం. అయినా పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్) దాదాపు అలాంటివన్నిటినీ కవర్ చేస్తోంది. చట్టాలు రావడం, అమలు చేయడం ఒకెత్తయితే.. పిల్లలను జాగ్రత్తగా పెంచడం మరో ఎత్తు. ఇది తల్లిదండ్రుల బాధ్యత. ముఖ్యంగా మగపిల్లల పెంపకంలో ఇంటినుంచే జాగ్రత్త మొదలైతే సమాజం, దేశం సురక్షితంగా ఉంటుంది. అలాగే ఈ చట్టం గురించి తల్లిదండ్రులతో పాటు ప్రతి స్కూల్లో, ప్రతి విద్యార్థికి, టీచర్కు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. భరోసాతోపాటు, తరుణి సంస్థ ద్వారా కూడా’’ – మమతా రఘువీర్, న్యాయవాది, తరుణి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు. ►కొన్ని రాష్ట్రాల్లో ని పేద తల్లిదండ్రులు తమకు తెలిసే తమ పిల్లలను పోర్న్కు టూల్స్గా మారుస్తున్నారట. గుడిసెల్లో కెమెరాలుంటాయిట. విదేశాల నుంచి క్లయింట్స్ ఎప్పుడు పింగ్ చేస్తే అప్పుడు ఆ కెమెరాల ముందుకు వచ్చి.. క్లయింట్స్ ఎలా కావాలంటే అలా యాక్ట్ చేస్తూంటారుట ఆ పిల్లలు. ►పద్దెనిమిది ఏళ్ల లోపు పిల్లల మీద అఘాయిత్యం జరిగినా, లేదా వాళ్లే ఏదైనా నేరం చేసినా.. వాళ్ల పేర్లు, వ్యక్తిగత వివరాలేవీ కూడా రికార్డుల్లో నమోదు చేయకూడదు. మూడేళ్ల వరకు మాత్రమే ఆ నేరం గురించి రికార్డుల్లో ఉండాలి. తర్వాత తీసేయాలి. ►ఎస్సీ, ఎస్టీ బాలికలకు లేదా దారుణమైన స్థితిలో ఉన్న బాలికలకు ఆయా పరిస్థితులను బట్టి ఈ నష్టపరిహారం 3 లక్షల నుంచి 8 లక్షల రూపాయల దాకా ఉండొచ్చు. ►బాధిత బాలికలకు నష్టపరిహారం ఉంటుంది. ఎఫ్ఐఆర్ నమోదు కాగానే 25 వేలు, చార్జిషీట్ వేశాక 50 వేలు, తీర్పు వెలువడ్డాక 25 వేలు .. ఇలా మొత్తం లక్ష రూపాయలదాకా ఆ నష్టపరిహారం ఉంటుంది. -
ఓటమి టీడీపీకి కొత్తేమీ కాదు: చంద్రబాబు
సాక్షి, ధర్మవరం: ఓటమి అనేది టీడీపీకి కొత్తేమి కాదని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం బుక్కరాయసముద్రంలో ఏర్పాటు చేసిన రోడ్డు షోలో ఆయన మాట్లాడారు. గతంలో కూడా టీడీపీ ఓటమి పాలై మళ్లీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. ఈ విషయంగా పార్టీ కార్యకర్తలు ఎవరూ అధైర్య పడకూడదని అన్నారు. కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు టీడీపీ కార్యకర్తలు మృతిచెందారని, మృతుల కుటుంబసభ్యులను పరామర్శించేందుకు భరోసా యాత్ర చేపట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శమంతకమణి, మాజీ ఎమ్మెల్యే యామినీబాల, బండారు శ్రావణి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రామలింగారెడ్డి పాల్గొన్నారు. అనంతరం తాడిపత్రి మండలం వీరాపురం గ్రామంలో చింతా భాస్కరరెడ్డి కుటుంబాన్ని పరామర్శించి, రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కార్యకర్తలకు అండగా ఉంటాం ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం పత్యాపురం గ్రామంలో అంగన్వాడీ భవన నిర్మాణ వివాదంలో మృతిచెందిన టీడీపీ కార్యకర్త రాజు కుటుంబాన్ని మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. మృతుడి భార్య వరలక్ష్మికి రూ. 5లక్షల చెక్కును అందించారు. పిల్లలు వినయ్, ఆనంద్, అవంతిను ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా చదివిస్తామన్నారు. ఇదే ఘర్షణలో గాయపడ్డ మరో ఆరుగురికి రూ.50వేలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. హత్యారాజకీయాలకు తాము భయపడమన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే పార్టీ మారడం దురదృష్టకరమన్నారు. త్వరలో ధర్మవరంలో టీడీపీ ఇన్చార్జ్ను ప్రకటిస్తామన్నారు. -
‘చేప’కు చేయూత...
చేప విత్తనాలు దొరకక.. ఎదిగిన చేపలు పట్టేందుకు వలలు లేక.. రవాణా, మార్కెటింగ్ సౌకర్యం లేక.. ధర గిట్టుబాటు కాక.. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న మత్స్యకారులు. చేసేది లేక కొందరు వృత్తినే మానుకుని బతుకు దెరువు కోసం మరో బాట పట్టారు. వారి కష్టాలను, ఇబ్బందులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పించడంతోపాటు మరింత ప్రోత్సాహం అందిస్తోంది. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు నాణ్యమైన చేప విత్తనాలను పంపిణీ చేస్తూ.. రాయితీపై వలలు, వాహనాలు, చేపలు నిల్వ చేసే బాక్సులను సమకూరుస్తోంది. మార్కెటింగ్కు చేయూతనందిస్తోంది. మత్స్య సహకార సంఘాల ద్వారా ప్రభుత్వ రాయితీలను, సహకారాన్ని సద్వినియోగం చేసుకున్న మత్స్యకారులు ఆర్థికంగా బలపడటంతోపాటు కుటుంబాలను పోషించుకుంటున్నారు. సాక్షి, ఖమ్మం: జిల్లావ్యాప్తంగా 662 చెరువులు ఉండగా.. 183 మత్స్య సహకార సంఘాలు, 14,494 మంది సభ్యులుగా ఉన్నారు. వీరంతా చెరువులపై ఆధారపడి జీవిస్తుండగా.. మునుపెన్నడూ లేని విధంగా ప్రభుత్వం చేయూతనందిస్తుండటంతో వారు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. గతంలో చేప విత్తనాలు కొనుగోలు చేసేందుకు సంఘ సభ్యులందరూ తలాకొంత వేసుకుని చేప పిల్లలు కొనుగోలు చేసి చెరువుల్లో పోసేవారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ పిల్లలు నాణ్యతగా లేకపోవడం.. మరో ప్రాంతం నుంచి కొనుగోలు చేసి తీసుకొస్తున్న క్రమంలో కొన్ని చనిపోవడం.. చెరువులో వదిలిన తర్వాత మరికొన్ని ప్రాణాలు విడవడం.. వర్షాలు పూర్తిస్థాయిలో కురవక.. చెరువుల్లో నీరులేక చేప ఎదగకపోవడం.. ఇలా మత్స్యకారులు తీరొక్క సమస్యలు ఎదుర్కొన్నారు. ఎలాగోలా ఎదిగి ఎంతో కొంత చేతికొచ్చిన సరుకుకు మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం.. దళారుల వల్ల కొంత నష్టపోవడం జరుగుతుండేది. ఈ క్రమంలో చాలా మంది మత్స్యకారులు ఎన్నేళ్లయినా మన బతుకులు బాగుపడవనే ఉద్దేశంతో ఆ వృత్తికి దూరం కావడం.. మరో వృత్తిని ఎంచుకున్న సందర్భాలున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో మత్స్యకారుల పరిస్థితి మారింది. వారి జీవన స్థితిగతులపై అధ్యయనం చేసిన ప్రభుత్వం వారికి ఆర్థికంగా భరోసా కల్పించేందుకు పూనుకుంది. ఉచితంగా చేప పిల్లలు.. జిల్లాలో ఇప్పటివరకు 2.25 కోట్ల చేప పిల్లలను ప్రభుత్వం ఉచితంగా అందించింది. వాటిని జిల్లాలో ఎంపిక చేసిన చెరువులు, రిజర్వాయర్లలో పోసుకుని మత్స్యకారులు అభివృద్ధి చేస్తున్నారు. అయితే గత పాలకులు మత్స్యకారుల పట్ల చిన్నచూపు చూడడంతో చాలా మంది మత్స్యకారులు ఇతర వృత్తులు, పనుల్లో నిమగ్నమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం మత్స్య పరిశ్రమకు తగిన ప్రోత్సాహం అందించడంతో పలువురు మత్స్యకారులు మళ్లీ పాత వృత్తిని స్వీకరించారు. జిల్లాలోని వైరా, పాలేరు, చెరువు మధారం, లంకపల్లి వంటి పెద్ద చెరువులపై వందలాది మత్స్యకార కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రభుత్వం అందించే రాయితీలను సద్వినియోగం చేసుకుంటూ బలోపేతం అవుతున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు.. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోంది. చేపలు పట్టేందుకు వలలు, వాటిని మార్కెటింగ్ చేసేందుకు వాహనాలు 75 శాతం సబ్సిడీపై అందించింది. జిల్లాలో 2.25 కోట్ల చేప పిల్లలు.. రవ్వు, బొచ్చె, బంగారు తీగ, గ్యాస్కట్ తదితర రకాలను 662 చెరువుల్లో విడుదల చేసింది. చేపలను మార్కెటింగ్ చేసేందుకు మోపెడ్లు, ప్లాస్టిక్ బాక్స్లు, ట్రేలు, బొలెరో వాహనాలు, వలలు, రవాణాకు ఉపయోగించే యంత్ర పరికరాలను ప్రభుత్వం మత్స్యకారులకు అందించింది. దీంతో మత్స్యకారులు చెరువుల్లో వలలతో పట్టిన చేపలను అమ్ముకునేందుకు సులభతరంగా మారింది. వ్యాపారం బాగుంది.. ప్రభుత్వం పంపిణీ చేసిన చేప పిల్లలను చెరువుల్లో విడుదల చేశాం. అవి ఎదిగిన తర్వాత చేపల వేటతో మత్స్యకారులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. మార్కెట్లో చేపలకు మంచి డిమాండ్ ఉంది. ప్రతి రోజు వివిధ ప్రాంతాల చెరువుల నుంచి చేపలు తెచ్చి విక్రయిస్తున్నాం. విక్రయించేందుకు ప్రభుత్వం వాహనాలు కూడా అందించింది. – చెరకు వెంకటేశ్వర్లు, సొసైటీ కార్యదర్శి, నేలకొండపల్లి ప్రభుత్వం సహకరిస్తోంది.. మత్స్యకారులకు కేసీఆర్ ప్రభుత్వం చేయూతనిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మత్స్యకారులు ఆర్థికంగా లాభపడుతున్నారు. ప్రతి మత్స్యకారుడి కుటుంబానికి లబ్ధి చేకూరుతుంది. చేప పిల్లలతోపాటు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తోంది. సీఎం కేసీఆర్కు మత్స్యకారుల కుటుంబాలు రుణపడి ఉంటాయి. – యడవల్లి చంద్రయ్య, మత్స్య సొసైటీ జిల్లా అధ్యక్షుడు -
సేవాభావం వర్ధిల్లాలి
ఒకరు తెలిసీ తెలియని వయస్సులో సమాజ మార్పు కోసం తుపాకీ పట్టారు. అడవుల్లో తిరిగారు. పాటలతో ప్రభావితమైన సాయుధ సమరంలో భాగస్వామ్యమయ్యారు. మరొకరు తల్లిదండ్రుల వారసత్వంతో విప్లవోద్యం వైపు అడుగులు వేశారు. అడవి తల్లి ఒడిలో కలిసి ప్రయాణిస్తూ జీవితాన్ని పంచుకున్నారు. అనుకోని సందర్భంలో పోలీసుల చేతికి చిక్కి జైలు జీవితాన్ని అనుభవించారు. ఇప్పుడు అనాథలకు అమ్మనాన్నలుగా మారారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు అన్నీ తామై సాకుతున్నారు. పోరుబాటను వదిలి నేడు అనాథలకు తమ జీవితాన్ని ధారపోస్తున్నారు. సొంత ఖర్చులతో అనాథల జీవితాల్లో వెలుగులు నింపడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. వారే.. మాజీ నక్సలైట్ దంపతులు కత్తుల లక్ష్మి, రవీందర్.బాల్యంలోనే పోరుబాట వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం రాంపేట గ్రామానికి చెందిన కత్తుల కట్టయ్య, ఉపేంద్ర దంపతుల కుమారుడు కత్తుల రవీందర్. రాంపేట గ్రామం నాడు పీపుల్స్ వార్ ఉద్యమానికి కంచుకోటగా ఉంది. ఉద్యమ నేపథ్యం కలిగిన గ్రామం కావడంతో రవీందర్పై ఆ ప్రభావం పడింది. దీనితో పదో తరగతి పూర్తి చేసిన వెంటనే 1992లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన ఆకిటి నర్సిరెడ్డి, అనసూర్య దంపతుల కుమార్తె లక్ష్మి. నర్సిరెడ్డి, అనసూర్య దంపతులు అప్పటికే పార్టీ కంట్రోల్లో పని చేస్తున్నారు. లక్ష్మి రామన్నగూడెంలో 7వ తరగతి చదువుతోంది. మీ తల్లిదండ్రుల జాడ చెప్పమని పోలీసులు వేధించారు. దీనితో లక్ష్మి చదువును ఆపేసి 1996లోనే పోరుబాట పట్టింది. రవీందర్, లక్ష్మిలు ఇద్దరూ పాలకుర్తి ఏరియాలోనే పనిచేయడంతో పార్టీ అనుమతిలో 2000 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. అరెస్టుతో ఉద్యమానికి స్వస్తి ఉద్యమంలోనే దంపతులుగా మారిన లక్ష్మి, రవీందర్లు అరెస్టు కావడంతో పోరుబాటకు స్వస్తి చెప్పారు. పార్టీ విస్తరణలో భాగంగా లక్ష్మి, రవీందర్లను మహారాష్ట్రకు పంపించారు. అనారోగ్యానికి గురికావడంతో వైద్యం కోసం హైదరాబాద్కు వచ్చారు. పోలీసులు అరెస్టు చేశారు. దీనితో 2000 నుంచి 2002 వరకు వరంగల్ సెంట్రల్ జైలులో శిక్షను అనుభవించారు. విడుదలైన తరువాత మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు. లక్ష్మి తీవ్రంగా అనారోగ్యానికి గురి కావడంతో 2004లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. భార్య లొంగిపోయిన 6 నెలల తరువాత భర్త రవీందర్ను పోలీసులు అరెస్టు చేశారు. కొద్ది రోజులు జైలు జీవితం అనుభవించి ఉద్యమ పంథాకు స్వస్తి చెప్పి సాధారణ జీవితాన్ని ఎంచుకున్నారు. మనసు చలించి..! ఉద్యమం బాట నుంచి బయటకు వచ్చిన లక్ష్మీ రవీందర్ దంపతులు చిరు వ్యాపారం చేసుకుంటూ జీవితంలో ఎదిగేందుకు అష్టకష్టాలు పడ్డారు. చేతిలో డబ్బులు లేకపోవడంతో లక్ష్మి ఆత్మహత్య చేసుకుందామని కాజీపేట రైల్వే స్టేషన్కు వెళ్లారు. అక్కడ అనాథ పిల్లలు పైసలు అడుక్కుంటూ కన్పించారు. ఈ దృశ్యాన్ని చూసిన లక్ష్మి మనస్సు మార్చుకుని తిరిగి ఇంటికి వచ్చారు. ఆలోచనను మార్చిన అనాథల కోసం ఏమైనా చేయాలనే నిర్ణయించుకున్న ఆమె భర్త రవీందర్ సహకారంతో ముందు చీరెల అమ్మకం ప్రారంభించారు.. 15 ఏళ్లపాటు చీరెల అమ్మకం చేసి ఆర్థికంగా స్థిరపడ్డారు. దృష్టి సారించి.. ఆర్థికంగా నిలబడిన తరువాత లక్ష్మి, రవీందర్ దంపతులు సామాజిక కార్యక్రమాలపై దృష్టి సారించారు. 2013 లోనే కుమారుడు జన్మించారు. కుమారుడి పేరు మీద ‘వర్ధన్ స్వచ్ఛంద సంస్థ’ను ప్రారంభించారు. ఏజెన్సీ ఏరియాలో ఇల్లు కాలిపోయిన బాధితులకు బియ్యం, బట్టలు, నిత్యావసర వస్తువులను అందించారు. నిరుపేద మహిళలకు చీరెలు దానం చేయడం, అనాథ ఆశ్రమాల్లో అన్నదానాలు నిర్వహించారు. వికలాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ చేశారు. .. అనాథలకు చేయూత సామాజిక కార్యక్రమాల్లో నిమగ్నం అయిన లక్ష్మి రవీందర్ దంపతులు 2017 అక్టోబర్లో జనగామ జిల్లా కేంద్రంలో ‘వర్ధన్ అనాథ ఆశ్రమం’ ప్రారంభించారు. రెడ్డి సంక్షేమ భవనాన్ని అద్దెకు తీసుకుని ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆశ్రమంలో 30మంది అనాథ పిల్లలు ఆశ్రయంపొందుతున్నారు. పిల్లలను పోషిస్తూనే విద్యను చెప్పిస్తున్నారు. అలనాపాలన మొత్తం దగ్గరుండి చూసుకుంటున్నారు. ‘అమ్మ’కు కర్మకాండ ఆరు మాసాల కింద గుర్తు తెలియని అనాథ వృద్ధురాలు నర్సమ్మ ఆశ్రమంలో చేరింది. అయితే నర్సమ్మ ఆగస్టు 1వ తేదీన మృతి చెందింది. దీనితో నర్సమ్మకు లక్ష్మి రవీందర్ దంపతులు అంత్యక్రియలు నిర్వహించారు. లక్ష్మి కర్మకాండ చేయడం పలువురిని కదిలించింది. బంగారు భవిష్యత్తు ఇవ్వడమే ధ్యేయం కొత్త జీవితాన్ని ప్రారంభించిన సమయంలో ఎన్నో కష్టాలను అనుభవించాం. కనీసం తినడానికి అన్నం లేదు. ఉండటానికి ఇల్లు లేదు. బయటకు వచ్చిన తరువాత ఎవరూ తెలియదు. ఎలా బతకాలో తెలియదు. వరంగల్లో చిరు వ్యాపారం చేసి ఈ స్థాయికి వచ్చాం. అనాథలకు బంగారు భవిష్యత్ ఇవ్వడమే ధ్యేయంగా ఆశ్రమాన్ని నిర్వహించాం. ఆశ్రమానికి వచ్చే పిల్లలకు తల్లిదండ్రుల్లా సేవ చేస్తాం. దాతలు అందిస్తున్న తోడ్పాటు మరువలేనిది. ఆడపిల్లలను బతికించుకుందామనే కార్యక్రమంతో ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించబోతున్నాం. అనాథలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో సేవలను మరింతగా విస్తరిస్తాం. మాకు చేయూతగా మానవత్వవాదులు ముందుకు రావాలని కోరుతున్నాం. – కత్తుల లక్ష్మి – ఇల్లందుల వెంకటేశ్వర్లు, సాక్షి, జనగామ
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
ప్రజలకు భరోసా కల్పించడమే లక్ష్యం
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
నక్సలైట్లమని నకిలీ పిస్టల్తో బెదిరింపులు
సకుటుంబ సపరివార సమేతం
పలకరించిన వరుణుడు
ఉన్న పెన్షన్లు తీసేస్తారు
‘బాబు కుయుక్తుల్లో చిక్కుకున్న ఎన్నికల కమిషన్’
ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని మీ కేశవ్ మెచ్చుకోలేదా బాబూ?
బాగా పనిచేస్తున్నారు.. ఇదే స్ఫూర్తి కొనసాగాలి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement