breaking news
enroll ment
-
14న ప్రధాని మోదీ నామినేషన్?
దేశంలో ప్రస్తుతం ఏడు దశల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మే 14న తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. అభిజిత్ ముహూర్తంలో ప్రధాని తన నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందించనున్నారు. అయోధ్య రామ మందిర శంకుస్థాపనకు ముహూర్తాన్ని అందించిన పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ తాజాగా ప్రధాని మోదీ నామినేషన్ దాఖలుకు ముహూర్తాన్ని నిర్ణయించారు.మే 14న గంగా సప్తమి. ఆరోజు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఆ రోజున నామినేషన్ దాఖలు చేయడం శ్రేయస్కరమని పండితులు ప్రధాని మోదీకి సూచించారు. గంగా సప్తమి రోజున బ్రహ్మదేవుని కమండలంలో నుంచి గంగ జన్మించిందని చెబుతారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం మే 13న ప్రధాని మోదీ వారణాసిలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఆ మర్నాడు అంటే మే 14న ప్రధాని నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి ముందు మోదీ గంగామాతకు పూజలు నిర్వహించనున్నారు. అయితే ఈ కార్యక్రమాలను సంబంధించిన షెడ్యూల్ ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. -
ఈఎస్ఐ కిందకు 18.88 లక్షల మంది కొత్త సభ్యులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) నిర్వహించే ఈఎస్ఐ పథకం కిందకు సెప్టెంబర్ నెలలో కొత్తగా 18.88 లక్షల మంది సభ్యులు భాగస్వాములు అయ్యారు. 22,544 సంస్థలు మొదటిసారి ఈఎస్ఐసీ కింద నమోదయ్యాయి. దీంతో ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఈఎస్ఐ కవరేజీ వర్తించనుంది. కేంద్ర కార్మిక శాఖ ఈ వివరాలను విడుదల చేసింది. సెప్టెంబర్లో కొత్త సభ్యుల్లో 9.06 లక్షల మంది 25 ఏళ్లలోపు వారే ఉన్నారు. మొత్తం కొత్త సభ్యుల్లో 47.98 శాతానికి ఇది సమానం. కొత్త సభ్యుల్లో మహిళలు 3.51 లక్షల మంది ఉన్నారు. అలాగే 61 మంది ట్రాన్స్జెండర్ విభాగానికి చెందిన వారు కూడా ఉన్నారు. -
అయ్యా.. పింఛన్
వృద్ధులు, వికలాంగులకు నెలనెలా వచ్చే పింఛన్ డబ్బులే ఆసరా. మందుగోళీలకు, తిండికి ఎంతోకొంత వెసులుబాటు కలుగు తోంది. అలాంటిది రెండునెలలుగా కొందరికి పింఛన్ అందడం లేదు. సాంకేతిక కారణాల సాకుతో పంపిణీ నిలిపివేశారు. డబ్బుల కోసం లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. మానకొండూర్, న్యూస్లైన్ : పలువురికి ఆసరా కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం నెలనెలా పింఛన్లు పంపిణీ చేస్తోంది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత, కల్లుగీతకార్మిక, అభయహస్తం తదితర పథకాల కింద పింఛన్లు అందిస్తున్నారు. విభాగాన్ని బట్టి డబ్బులు ఇస్తున్నారు. ఎన్రోల్మెంట్(నమోదు) లేని లబ్ధిదారులకు డబ్బుల పంపిణీని అధికారులు ఏప్రిల్ నుంచి నిలిపేశారు. జిల్లా వ్యాప్తంగా రూ.కోటికిపైగా డబ్బులు పంపిణీ కాలేదు. ఉదాహరణకు మానకొండూర్ మండలంలో మార్చి నెలలో 8,973 మందికి వివిధ రకాల పింఛన్లు పంపిణీ చేయగా ఏప్రిల్లో 7,930 మందికి మాత్రమే పంపిణీ చేశారు. ఎన్రోల్మెంట్ కాని 1043 మందికి నిలిపివేశారు. బెజ్జంకి మండలంలోనూ ఏప్రిల్ నెలలో 400 మందికి పింఛన్ అందలేదు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ప్రతీ నెల ఒకటో తేదీ నుంచి పదో తేదీలోగా అందే డబ్బులు అందకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ డబ్బులే వారి జీవనోపాధికి ఊరటనిస్తుండగా, డబ్బుల నిలిపివేతతో కొన్ని కుటుంబాల్లో పూటగడవని పరిస్థితులు ఉన్నాయి. ఫొటో దిగని కారణంగా ఎన్రోల్మెంట్ కాలేదని, జాబితాలో పేరున్నా... ప్రభుత్వం నుంచి డబ్బు రాలేదని ఫినో సిబ్బంది చెబుతుండడంతో లబ్ధిదారుల్లో ఆందోళన ఎక్కువవుతోంది. కొన్ని చోట్ల ఫినో సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. కొనసాగుతున్న ఎన్రోల్మెంట్ జిల్లాలో పింఛన్ల పంపిణీని వేర్వేరు సంస్థలకు అప్పగించారు. ఫినో ప్రైవేట్ సంస్థ 814 గ్రామాల్లో పింఛన్లు పంచుతుండగా, మణిపాల్ టెక్నాలజీ సంస్థ 280 గ్రామాల్లో పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా నెలకు రూ.8 కోట్ల మేర పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారు. పింఛన్ల పంపిణీకి ఎన్రోల్మెంట్ తప్పనిసరి కావడంతో ఎన్రోల్మెంట్ చేయించుకోనివారికి పింఛన్లు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో రూ.కోటికి పైగా డబ్బుల పంపిణీ నిలిచిపోయింది. పంపిణీ సంస్థలు సిబ్బందిని నియమించి గ్రామాల్లో లబ్ధిదారుల ఫొటోలు తీస్తూ ఎన్రోల్మెంట్ చేయిస్తున్నాయి. లబ్ధిదారులు సహకరించి త్వరగా ఫొటోలు దిగితే ఎన్రోల్మెంట్ పూర్తయి పంపిణీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక మొత్తం పింఛన్ డబ్బులు వస్తాయని పేర్కొంటున్నారు. అయినా లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఎన్రోల్మెంట్ లేక పింఛన్ డబ్బులు పొందినవారి పేర్లు జాబితాలో ఉండడం లేదని అన్నారం గ్రామానికి చెందిన తాటిపాముల వెంకటలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు త్వరగా ఎన్రోల్మెంట్ పూర్తి చేసి డబ్బులు అందించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. మూడు నెలలాయె.. ఎప్పుడు ఫస్ట్ తారీఖు తర్వాత డబ్బులు వచ్చేటియి. ఇప్పుడు మూడు నెలలైనా పింఛన్ డబ్బులు ఇస్తలేరు. లిస్టులో పేరుంది. కానీ, నువ్వు ఫొటో దిగలే, అందుకే పింఛన్ డబ్బులు ఇస్తలేం అన్నరు. ఆ డబ్బులు నాకు ఎంతో అక్కరకు వస్తుండే. డబ్బులు లేక ఇబ్బందిగా ఉంటోంది. డబ్బులు ఇచ్చుకుంట కూడా ఫొటోలు దించచ్చు కదా... ఆపుడెందుకు? మాలాంటోళ్లకు ఎంత గోసైతది. - బీమనపెల్లి వెంకటయ్య (అన్నారం) ఇబ్బందైతంది నా భర్త శివరాజం చచ్చిపోయిండు. నాకు వితంతు పింఛిన్ మంజూరైంది. నెలనెలా పింఛన్ డబ్బులు వచ్చినయ్. ఈ నెల డబ్బులు రాలేదు. సార్లను అడిగితే ఫొటో దిగాలె... అందుకే డబ్బులు రాలేదు అని చెప్పిండ్రు. ఫొటో దించేందుకు సార్లు ఇంతకుముందు వచ్చినప్పుడు నేను పొరుగూరికి వెళ్లిన. మళ్లీ ఫొటో దిగుతున్నరని తెలిస్తే వచ్చిన. పింఛన్ డబ్బులు రాకపోతే ఇబ్బంది అయితంది. -దాసరి ల క్ష్మి (అన్నారం)