breaking news
Engineering student Pradeep
-
పోలీసుల నిర్లక్ష్యమే బలిగొంది
చెట్టంత కొడుకు.. అందివస్తాడను కున్నంతలోనే గర్భశోకం.. ఆ తల్లిదండ్రుల కన్నీటికి అంతు లేదు.. మనసున్న మిత్రుడు..జీవితాంతం తోడుంటాడని నమ్మిన స్నేహితులకు తీరని దుఃఖం..ప్రేమిస్తే చంపేస్తారా.. ఇష్టం లేకుంటే మందలిస్తే సరిపోతుందిగా..ఎందుకంత రాక్షసత్వం.. ఇది బంధుమిత్రుల ఆవేదన..పోలీసుల నిర్లక్ష్యమే బలిగొంది.. సకాలంలో స్పందిస్తే ప్రాణాలతో మిగిలేవాడు.. రాజకీయ జోక్యంతో నిందితులుతప్పించుకుంటున్నారు.. న్యాయాన్ని ఖూనీ చేస్తున్నారు.. ఇది సర్వత్రా వినిపిస్తున్న విమర్శ బుధవారం కేజీహెచ్లో ఇంజినీరింగ్ విద్యార్థి ప్రదీప్ మృతదేహానికి పోస్టుమార్టం జరిగింది. అనంతరం అశ్రునయనాల మధ్య అగనంపూడిలో అంత్యక్రియలు జరిగారుు. అగనంపూడి : పోలీసుల నిర్లక్ష్యమే మా కుమారుడిని బలిగొంది.. వారు సకాలంలో స్పందించి ఉంటే మా కొడుకు బతికి ఉండేవాడు.. హంతకులకు పోలీసులు అండగా నిలవడం వల్లే ఇంత దారుణం జరిగిపోరుుంది.. అని ప్రదీప్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్న దానబాల ప్రదీప్ కంశికోటలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య విశాఖ నగరంతోపాటు జిల్లాలోనూ తీవ్ర సంచలనం రేపింది. నిర్వాసిత కాలనీల నుంచి పెద్ద సంఖ్యలో స్థానికులు మృతుని నివాసానికి తరలివచ్చారు. అంతిమ వీడ్కోలుకు భారీ ఎత్తున మృతుని బంధువులు, స్థానికులు, విద్యార్థులు తరలివచ్చారు. ప్రదీప్ను చివరిసారిగా చూసి కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో అగనంపూడి శోకసంద్రలో మునిగిపోరుుంది. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు పోలీసుల నిర్లక్ష్యం వల్లే ప్రదీప్ హత్యకు గురయ్యాడని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. బుదిరెడ్డి చిన్న, అతని అనుచరులు ప్రదీప్ని హింసించి అపహరించుకుపోయారని గత నెల 28న కశింకోట పోలీసులకు హతుని బంధువులు, స్నేహితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్లే దారుణం జరిగిపోరుుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదుదారులను స్టేషన్లోనే హంతకులు బెదిరిస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని మృతిని బంధువులు ఆరోపిస్తున్నారు. దీపావళి నాడు చిన్న, మరికొంత మంది ప్రదీప్మెడలోని బంగారు గొలుసు, సెల్ఫోన్ తెచ్చి ఎస్ఐకి ఇస్తే... అసలు వ్యక్తి లేకుండా గొలుసు, సెల్ఫోన్ ఎక్కడివని కనీసం అడగకుండా వారిని వదిలేయడం వెనుక ఎస్ఐ, పోలీసుల పాత్ర ఉందని బంధువులు, సహచర విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రదీప్ మృత దేహానికి నేడు పోస్ట్ మార్టం
-
శవమై తేలిన ఇంజినీరింగ్ విద్యార్థి
కిడ్నాప్ అరుునట్టు భావించిన యువకుడి మృతి హత్యేనంటున్న బంధువులు పోలీసుల అదుపులో ప్రదీప్పై దాడిచేసిన నిందితులు కశింకోట: కశింకోటలో కిడ్నాప్ అరుునట్టు భావిస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థి సోమవారం శవమై కనిపించడం సంచలనం కలకలంరేపింది.. ఇది హత్యా? లేక ఆత్మహత్య? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నారుు. మాకవరపాలెంలోని ఒక కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న అగనంపూడి దానబోరుునపాలెంకి చెందిన దానా ప్రదీప్(22) కనిపించకపోవడంతో గత శనివారం అతని తండ్రి రాము పోలీ సులకు ఫిర్యాదు చేయడంతో కిడ్నాప్ కేసుగా నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రదీప్ గత శుక్రవారం తన స్నేహితుడు తులసీకుమార్తో కలిసి కశింకోట వచ్చాడు. తనతో పాటు బీటెక్ 4వ సంత్సరం చదువుతున్న కశింకోటకు చెందిన సహా విద్యార్థినితో పరిచయం ఉన్న మేరకు మాట్లాడ సాగారు. ఈ విషయాన్ని గమనించిన ఆ విద్యార్థిని బంధువులు సారుు, సాకేత్ తదితరులు ప్రదీప్ను కొట్టి గాయపరిచారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోరాదని అతనితోపాటు వచ్చిన స్నేహితుడు తులసీకుమార్ను బెదిరించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అరుుతే ప్రదీప్ అప్పటి నుంచి ఇంటికి చేరకపోవడంతో తండ్రి రాము అనుమానంతో పోలీసులను ఆశ్రరుుంచి, కిడ్నాప్ చేసినట్టు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టగా, మునగపాక మండల పరిధిలోని ఉమ్మలాడ వద్ద శారదానదిలో శవమై ప్రదీప్ కనిపించాడు. సరిగ్గా గుర్తు పట్టని విధంగా ఉన్న అతని మృతదేహాన్ని పోలీసులు వెలికి తీసి అనకాపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అరుుతే కిడ్నాప్కు గురైన ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడా?లేక హత్య చేశారా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. మృతదేహం చేతులు కట్టి ఉండటాన్ని బట్టి హత్య చేసి ఉంటారని తండ్రి రాము, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో సుమారు 25 మంది ప్రమేయం ఉందని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరుుతే నది నుంచి మృతదేహాన్ని వెలికి తీయడానికి చేతులకు చీర కట్టినట్టు ఎస్ఐ బి.మధుసూదనరావు పేర్కొన్నారు. సంఘటన జరిగిన రోజు ప్రదీప్ను కొట్టిన నిందితులు సారుు,సాకేత్ తమ అదుపులో ఉన్నట్టు ఎస్ఐ తెలిపారు. శోక సంద్రంలో కుటుంబం : రాము,సత్యవతి దంపతులకు మృతుడు ప్రదీప్ ఒక్కడే కుమారుడు. కుమార్తెకు వివాహం అరుుంది. దర్జీగా పని చేస్తూ రాము తన కుమారుడు పదీప్ను చదివిస్తున్నాడు. చేతికి అంది వచ్చిన కుమారుడు మృతి చెందడం కుటుంబాన్ని కలచి వేచింది. శోక సముద్రంలో మునిగిపోయారు. శనివారం ఫిర్యాదు చేయగా, ఆదివారానికి కూడా పోలీసులు ప్రదీప్ ఆచూకీ తెలపకపోవడంపై కుటుంబ సభ్యులు కశింకోట పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన చేశారు న్యాయం చేయాలి : ప్రదీప్ వ్యవహారంలో అతని కుటుంబానికి పోలీసులు న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి జిలకర్ర నాగేంద్ర డిమాండ్ చేశారు. న్యాయం జరగకపోతే ఆందోళన చేపట్టాల్సి వస్తుందన్నారు. పోలీసులు ఫిర్యాదు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించారని విశాఖ జీవీఎంసీ 56వ వార్డు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు పూర్ణానంద శర్మ విమర్శించారు. బాధితుల ఆందోళన అనకాపల్లిటౌన్: కశింకోట పోలీసులకు వ్యతిరేకంగా గాజువాక మండలం అగనంపూడి దానబోరుునపాలెం గ్రామస్తులు, ప్రదీప్ కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి ఆందోళనకు దిగారు. తమ కుమారుడు ప్రదీప్ (22)ని కిడ్నాప్ చేశారంటూ ఫిర్యాదు చేసినా కశింకోట పోలీసులు పట్టించుకోలేదని, పోలీసులు వెంటనే స్పందించి ఉంటే ప్రదీప్ సజీవంగా ఉండేవాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ వైద్యాలయం వద్ద ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఘటనాస్థలికి చేరుకొని డీఎస్పీ పురుషోత్తంతో మాట్లాడారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన డీఎస్పీ పోస్టుమార్టం పరీక్షల అనంతరం నిందితులపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పల్లాకు చెప్పడంతో ఆందోళనకారులను ఎమ్మెల్యే పల్లా శాంతింపచేశారు.