breaking news
ending ceremony
-
అశేష జన సందోహం నడుమ..ముగిసిన 'నాటా' మహాసభలు
(డాలస్, అమెరికా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) అంగరంగ వైభవంగా నాటా వేడుకలు నార్త్ అమెరికన్ తెలుగు అసొసియేషన్ నాటా మహాసభలు ఘనంగా ముగిసాయి. డల్లాస్ కన్వెన్షన్ సెంటరులో అశేష జనసందోహం నడుమ కోలాహలంగా విజయవంతంగా ముగిశాయి. ఒక్క ముగింపు రోజైన జూలై2 ఆదివారం నాడే 15వేల పైచిలుకు అతిథులతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. మూడురోజులకు కలిపి 25వేలకు పైగా అతిథులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. నాటా నాయకుల ఏర్పాట్లకు తగ్గట్టుగానే మొదటి రోజు బాంక్వెట్ డిన్నర్, రెండవరోజు తమన్ షో ఆహతులను ఆకట్టుకున్నాయి. అలాగే చివరి రోజైన జూలై2 ఆదివారం రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ తో నాటా కన్వెన్షన్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. వీటికి ధీటుగా వివిధ ఎక్సిబిట్ రూమ్ ల్లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలు వేటికవే సాటి అనేలా సాగాయి. అధ్యాత్మికం.. భక్తి పారవశ్యం జులై 2న ఉదయాన్నే తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీనివాస కల్యాణంతో ఆహ్వానితులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. తిరుపతి నుంచి వచ్చిన పండితులు శాస్త్రోక్తంగా శ్రీనివాస కల్యాణం పూర్తి చేశారు. అలాగే 108 మందితో అష్టోత్తరనామార్చన గావించారు. ప్రవాస భక్తులు, నాటా కార్యవర్గ సభ్యులు, పలువురు ప్రముఖులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు ఈ ఉత్సవంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. టీటీడీ ఛైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలు, APNRTS ఛైర్మన్ వెంకట్, టీటీడీ ఆగమ పండితులు, టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు. నేటి రాజకీయం.. నాటా తెలుగు మహాసభల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రపై సదస్సు వంటి పలు కార్యక్రమాలు నిర్వహించారు. నాటా తెలుగు మహాసభల్లో భాగంగా డాక్టర్ వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసగించారు. పెద్దసంఖ్యలో హాజరైన అభిమానులు, నేతలు వైఎస్సార్కు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ చిరకాలం అందరి గుండెల్లో నిలిచిపోయారని మహానేతకు ఘన నివాళులర్పించారు. ఆ మహానేత సేవలను, స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్ కొడుకుగా ఏపీ సీఎం జగన్ తన పాలనతో తండ్రిని తలపిస్తున్నారని కొనియాడారు. వైఎస్సార్ కు ఘన నివాళులు కాలేజీ రోజుల్లో తాను చూసిన వై.ఎస్.రాజశేఖరరెడ్డికి, పాదయాత్ర అనంతరం చూసిన వై.ఎస్కు మధ్య చాలా మార్పు వచ్చినట్లు తాను గమనించానని నాటా వ్యవస్థాపకులు డా.ప్రేమ్సాగర్ రెడ్డి అన్నారు. పాదయాత్ర తర్వాత వై.ఎస్కు ప్రజల పట్ల, వారి కష్టాల పట్ల పెరిగిన అవగాహన కారణంగా మనిషిలో ఆశావాహ దృక్పథం, పేదలకు సాయం చేయాలనే సంకల్పం బలపడిందని అన్నారు. టీటీడీ ఛైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి, డా.వై.ఎస్.ఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు రాఘవరెడ్డి గోశాల, ఆళ్ల రామిరెడ్డి, వెంకట్, రత్నాకర్, లకిరెడ్డి హనిమిరెడ్డి తదితరులు వై.ఎస్ చిత్రపటానికి నివాళి అర్పించారు. నాటా సర్వీస్ అవార్డ్ ని నాటా మాజీ అధ్యక్షులు రాఘవరెడ్డి గోసాల కి నాటా వ్యవస్థాపకులు డా. ప్రేమ్ సాగర్ రెడ్డి చేతులమీదుగా అందించారు. అనంతరం వైసీపీ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ సజ్జల భార్గవ్ ని వేదిక పైకి ఆహ్వానించారు. ప్రవాసాంధ్రులకు సీఎం జగన్ సందేశం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రికార్డెడ్ మెసేజ్ ని స్క్రీన్ పై ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 2023 నాటా కన్వెన్షన్కు హాజరైన ప్రతి ఒక్కరికీ బెస్ట్ విషెస్ తెలియజేశారు. నాటా కార్యవర్గానికి ముఖ్యంగా శ్రీధర్, అనిల్, ప్రేమసాగర్తో పాటు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నాలుగేళ్ళ కిందట తాను డాల్లస్ వచ్చిన సందర్భం ఇప్పటికీ గుర్తుందన్నారు. మీరంతా నా మీద చూపించిన ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. నాటా మహా సభల్లో ప్రదర్శించిన ముఖ్యమంత్రి సందేశం నాటా కన్వెన్షన్కి హైలెట్గా నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు కాలేజీల ఆలంనై మీట్స్ వివిధ రూమ్స్ లో నిర్వహించారు. ఎస్టేట్ ప్లానింగ్, టాక్స్ ప్లానింగ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, DRDO ఛైర్మన్ సతీష్ రెడ్డి తో ముఖాముఖీ, స్టార్ట్అప్స్, పొలిటికల్ డిబేట్స్, సదస్సులు సమాంతరంగా సాగాయి. నవరస భరితం.. సాంస్కృతిక సమ్మేళనం అలాగే టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తో రాముఇజం, తెలుగువారి సొంతమైన అవధానం కూడగలిపిన సాహితీ ప్రక్రియలు, షార్ట్ ఫిలిమ్స్, వివిధ నగరాలలో గెలిచిన నాటా బ్యూటీ పాజెంట్ విజేతలకు ఫైనల్స్ పోటీలు కొనసాగాయి. విజేతలకు మెయిన్ స్టేజ్ పై క్రౌన్ అందించారు. ఆర్ట్స్ ప్రదర్శన, సొగసు చూడతరమా అంటూ మహిళా సదస్సులు జరిగాయి. సాయంత్రం మెయిన్ స్టేజ్ పై సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం 50కే, 100కే మరియు ఆపైన సమర్పించిన స్పాన్సర్స్ ని, నాటా కార్యనిర్వాహక సభ్యులను, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను, కన్వెన్షన్ వివిధ కమిటీల ఛైర్స్, కో-ఛైర్స్ లను వేదికమీదకు పిలిచి అభినందించారు. పలు కార్యక్రమాలు వైవిధ్యంగా సందడిగా సాగాయి. పేరడీ, శాస్త్రీయ, సినిమా నృత్య ప్రదర్శనలు, గాన ప్రదర్శనలు, పూర్వ విద్యార్థుల సంఘాల సమావేశాలతో అతిథులు బిజీబిజీగా గడిపారు. మధ్యాహ్న కార్యక్రమాలకు ప్రధాన వేదికపై స్వర్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆకట్టుకున్న అందం నాటా బ్యూటీ పాజెంట్ ఫైనల్స్ విజేతలను ప్రకటించగా టీన్, మిస్, మిసెస్ కేటగిరీస్ లో విజేతలకు తెలుగు సినీ నటి తమన్నా క్రౌన్ అందించారు. సుమారు 30 మంది కలిసి చేసిన ఫ్యాషన్ షో అందరినీ ఆకట్టుకుంది. ఇక సినీ నిర్మాత దిల్ రాజు, దర్శకులు రామ్ గోపాల్ వర్మ, ఇండియా నుంచి విచ్చేసిన ఎంపీలు, మంత్రులకు సన్మానం గావించారు. నాటా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని నాటా వ్యవస్థాపకులు డా. ప్రేమ్ సాగర్ రెడ్డి కి ప్రజంట్ చేయడం విశేషం. అలాగే నాటా అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి కొర్సపాటిని సతీసమేతంగా సన్మానించారు. (చూడండి: నాటా మహాసభల చిత్రాలు ) అధ్యక్షుడి సందేశం తనకు, తన బృందానికి నాటా ద్వారా సేవ చేసే అవకాశాన్ని కల్పించి ఈ వేడుకలను విజయవంతం చేసిన వారికి డా.కొర్సపాటి శ్రీధర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నాటా కన్వెన్షన్ ని విజయవంతం చేసినందుకు ఆహూతులకు, స్పాన్సర్స్ కి ఇలా ప్రతి ఒక్కరికీ కృతఙ్ఞతలు తెలియజేశారు. 2025లో జరగనున్న నాటా మహాసభల గురించి ప్రెసిడెంట్ ఎలక్ట్ హరినాధ రెడ్డి వెల్కూరు తెలిపారు. నాటా తెలుగు మహాసభలు 2025లో జూన్ 27,28,29 తేదిలో న్యూజెర్సీలోని అట్లాంటిక్ సిటీలో నిర్వహించనున్నట్లు వివరించారు. చివరిగా మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కాన్సర్ట్ ప్రారంభించారు.దేవి శ్రీ ప్రసాద్ ట్రూప్ క్లాసికల్ పాటతో మొదలుపెట్టి మంచి బీట్ ఉన్న పాటలతో, అలాగే తన డాన్సులతో వేదిక ప్రాంగణాన్ని అదరగొట్టారు. దీంతో నాటా 3 రోజుల కన్వెన్షన్ కి ఘనమైన ముగింపు పలికినట్టైంది. (చదవండి: నాటా మహాసభల్లో ప్రసంగించిన శ్రీ రవిశంకర్ గురూజీ) -
చైనా కమ్యునిస్ట్ పార్టీ ముగింపు వేడుకలో అనూహ్య ఘటన... వీడియో వైరల్
చైనాలో అధికార కమ్యూనిస్ట్ కాంగ్రెస్ పార్టీ 20వ జాతీయ సదస్సు ఈనెల 16న అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈమేరకు శనివారం కాంగ్రెస్ పార్టీ ముగింపు వేడుకలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ఐతే అనుహ్యంగా చైనా మాజీ అధ్యక్షుడు హు జింటావో ముగింపు వేడుకుల నుంచి నిష్క్రమించి బయటకు వచ్చేశారు. అకస్మాత్తుగా హు జింటావో పైకి లేచి సెక్యూరిటీ సాయంతో బయటకు వెళ్లిపోవడంతో అక్కడున్నవారంతా షాక్తో అయోమయంగా చూస్తుండిపోయారు. అదీగాక ఆయన గత ఆదివారం కాంగ్రెస్ పార్టీ సదస్సు ప్రారంభ వేడుకలో కూడా కాస్త అస్వస్థతకు గురైనట్లు కనిపించారు. ఇదిలా ఉండగా..ఐదేళ్లకు ఒకసారి జరిగే కాంగ్రెస్ పార్టీ సదస్సు రాజ్యంగ సవరణలతో ముగిసింది. ఆ సదస్సులో తన పార్టీ రాజ్యంగ సవరణలో తైవాన్ స్వాతంత్య్రాన్ని అడ్డుకోవడం వ్యతిరేకించటంవంటి తీర్మానాన్ని ప్రధానంగా పొందుపరిచింది. అంతేగాదు ఆ సమావేశంలో ముచ్చటగా మూడోసారి జిన్పింగ్కి అధికారం కట్టబట్టేందుకు పార్టీ సిద్దమైంది కూడా. ఈ మేరకు పార్టీ సెంట్రల్ కమీటీ తోపాటు పార్టీ సభ్యులందరూ ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఐతే ఈ ముగింపు వేడుకలో మాజీ అధ్యక్షుడు హు జుంటావో నిష్క్రమించడం అందర్నీ షాక్కి గురి చేసింది Drama in China as former president Hu Jintao is escorted out of the closing ceremony pic.twitter.com/AzsqUJWuFx — Dan Banik (@danbanik) October 22, 2022 (చదవండి: జిన్పింగ్కు మూడోసారి పట్టం) -
ఢిల్లీలో ఘనంగా బీటింగ్ రిట్రీట్
-
'తొలి పుష్కరాలు ఘనంగా జరుపుకున్నాం'
కందకుర్తి : తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి నిజామాబాద్ జిల్లా కందకుర్తిలో గోదావరి పుష్కరాల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కందకుర్తిలో జరిగిన పుష్కర శోభాయాత్రను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్వహించిన తొలి పుష్కరాలను చాలా ఘనంగా జరుపుకున్నామని మంత్రి పోచారం అన్నారు. -
ఏపీలో ఒక్కరోజే 45 లక్షల మంది పుణ్యస్నానం
రాజమండ్రి : గోదావరి పుష్కరాల చివరి రోజైన శనివారం నాడు ఉభయగోదావరి జిల్లాల పుష్కర ఘాట్లు భక్తుల తాకిడితో పోటెత్తాయి. పన్నెండవ రోజు పుష్కరాలు ముగిసిపోతాయి కనుక కేవలం ఈ ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్లో 45.5 లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. ఏపీలో మొత్తంగా 4.5 కోట్లకు పైగా భక్తులు పుష్కరాలకు విచ్చేసి పుణ్యస్నానాలు ఆచరించినట్లు తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు సహా ఇతర ఘాట్లలో కూడా బాగా రద్దీ కనిపించింది. ఈ పుష్కరాలకు ఇతర రాష్ట్రాల భక్తులు కూడా అధిక సంఖ్యలో తరలిరావడం విశేషం. -
ధర్మపురిలో కన్నులపండువగా పుష్కర వేడుకలు
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా ధర్మపురిలో గోదావరి పుష్కరాలు కన్నుల పండువగా ముగిశాయి. ఇక్కడ జరిగిన ముగింపు వేడుకల కార్యక్రమంలో మంత్రి ఈటెల రాజేందర్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, స్వామి పరిపూర్ణానంద, తదితరులు పాల్గొన్నారు. చివరిరోజైన 12వ రోజు ధర్మపురిలో 6.8 లక్షలు, కాళేశ్వరంలో 6 లక్షలు, కోటిలింగాలలో లక్ష మంది, మంథనిలో 50 వేల మంది, గోదావరిఖనిలో 60 వేల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. మహిళలు గోదారమ్మకు పూజలు చేసి, పసుపుకుంకుమలు సమర్పించారు. మగవారు తమ పితృదేవతలకు పిండప్రదాన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని అన్ని పుష్కర ఘాట్లు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మారిపోయాయి. -
ఘనంగా ముగిసిన మహాపుష్కరాలు
రాజమండ్రి/బాసర: రెండు తెలుగు రాష్ట్రాల్లోను గోదావరి మహా పుష్కరాలు ఘనంగా ముగిశాయి. సాయంత్రం 6.38 గంటలకు పుష్కరుడి నిష్క్రమణతో గోదావరి పుష్కరాలు ముగిసినట్లు పండితులు తెలిపారు. ముగింపు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలోను, తెలంగాణలోని బాసరలోను భారీ స్థాయిలో ఉత్సవాలు జరిగాయి. రాజమండ్రిలో ప్రముఖ విద్వాంసుడు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణతో సాయంత్రం 6 గంటలకు కచేరీ నిర్వహించారు. అలాగే రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో వెయ్యిమంది కూచిపూడి కళాకారులతో నృత్యోత్సవం ఏర్పాటు చేశారు. చిట్టచివరి రోజు కావడంతో రాజమండ్రి సహా ఉభయ గోదావరి జిల్లాల్లోని అన్ని ఘాట్లకు భక్తులు పోటెత్తారు. శనివారం రాజమండ్రిలోని వీఐపీ ఘాట్లో ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా పుణ్య స్నానం చేయగా, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులోని గోష్పాదక్షేత్రం పుష్కరఘాట్లో బీజేపీ కార్యదర్శి రాంమాధవ్ పుష్కర స్నానం ఆచరించారు. ఇక తెలంగాణలోని బాసరలో కూడా పుష్కరాల ముగింపు వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. బాసర నుంచి గోదావరి తీరం వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. అలాగే గోదావరి నదీ తీరంలో భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు.బాసర సరస్వతీ ఆలయం నుంచి పుష్కర ఘాట్ కు శోభాయాత్ర తరలిరానుంది. పుష్కర జ్యోతి, ఆకాశ జ్యోతి కార్యక్రమాలను నిర్వహించింది.ఈ కార్యక్రమానికి మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్ రెడ్డిలు హాజరయ్యారు. పుష్కరాల్లో విధులు నిర్వర్తించిన సిబ్బంది అందరికీ సోమ, మంగళవారాలు రెండు రోజులు సెలవులు ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. నిర్విరామంగా 12 రోజుల పాటు విధులు నిర్వర్తించడంతో వాళ్లు శారీరకంగా, మానసికంగా అలసిపోయి ఉంటారని, ఒక్క ఆదివారం విశ్రాంతి సరిపోదన్న ఉద్దేశంతో ఈ సెలవు ఇచ్చారు.