breaking news
End of polling
-
మందకొడిగా మొదలై..
సాక్షి, సిద్దిపేట: ప్రజాస్వామ్యంలో ఓటు విలువ కీలమైనది. నాయకుడిని ఎన్నుకునేందుకు అత్యధిక సంఖ్యలో ఓటర్ల భాగస్వామ్యం ఉండాలని భావించిన జిల్లా అధికారులు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటరు అవగాహన కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. ఓటింగ్ శాతం పెంచేందుకు పడిన కష్టానికి ఫలితంగా జిల్లా వ్యాప్తంగా సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక నియోజకవర్గాల పరిధిలో వృద్ధులు, మహిళలకు అత్యధిక సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో గతం కన్నా ఈసారి జిల్లాలో పోలింగ్శాతం పెరిగింది. ఉదయం నుంచే బారులుదీరిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు జిల్లాలోని ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల వద్ద బారులుదీరారు. ఉదయం అయితే ఎవరూ ఉండరనే ఆలోచనతో కొందరు.., ఓటు వేసి తమ పనులకు వెళ్లేందుకు కొందరు పోలింగ్ స్టేషన్ల బాటపట్టారు. దీంతో దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాల్లో ఉదయం 9గంటల వరకే వేగంగా పోలింగ్ నమోదైంది. అయితే హుస్నాబాద్లో మాత్రం మందకొడిగా మొదలైంది. అదేవిధంగా ఉదయం 11గంటలకు మూడు నియోకవర్గాల్లో అదేవేగంతో పోలింగ్ సరళి నడవగా.. హుస్నాబాద్లో మాత్రం అంతంత మాత్రంగానే సాగింది. అయితే మధ్యాహ్నం వరకు మందకొడిగా సాగిన పోలింగ్ చివరికి 81 శాతం నమోదైంది. పోలింగ్ సరళి ఇలా.. (శాతంలో..) నియోజకవర్గం 9 గంటలకు 11గంటలకు 1గంటలకు 3 గంటలకు 5గంటలకు సిద్దిపేట 12 31 50 67.5 78.86 హుస్నాబాద్ 06 24 41 61 83.17 దుబ్బాక 11 30 49 65.85 85.92 గజ్వేల్ 14 26 42 61 88 సగటు 11 28 46 64 83.98 -
పోలింగ్ ప్రశాంతం
సాక్షి, సిద్దిపేట: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారంజిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్రావు, సీపీఐ రాష్ట్ర కార్యధర్శి చాడ వెంకట్రెడ్డి, అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డిలు పోటీ చేసే నియోజకవర్గాలు జిల్లాలోనే ఉండటంతో రాష్ట్రం చూపంతా జిల్లాపైనే పడింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈవీఎంలు, వీవీప్యాట్లు ప్రారంభంలో మొరాయించడంతో పలు ప్రాంతాల్లో పోలింగ్కు అంతరాయం కలిగింది. అదేవిధంగా చీకటి గదుల్లో ఓట్లు వేసేందుకు ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాల్లో కేసీఆర్, హరీశ్రావు, ఇతర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గం మొత్తం ఓటర్లు పోలైనవి శాతం సిద్దిపేట 2,09,345 1,65,075 78.86 హుస్నాబాద్ 2,22,431 1,85,003 83.17 దుబ్బాక 1,90,482 1,63,658 85.92 గజ్వేల్ 2,33,205 2,05,222 88 మొత్తం 8,55,453 7,18,958 83.98 జిల్లా వ్యాప్తంగా 84శాతం పోలింగ్ జిల్లా వ్యాప్తంగా 84 శాతం పోలింగ్ నమోదైంది. నాలుగు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 8,55,453 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 1102 పోలింగ్ కేంద్రాల ద్వారా 7,18,958 మంది ఓటర్లు (83.98 శాతం)తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో అత్యధికంగా గజ్వేల్ నియోకవర్గంలో మొత్తం 2,33,205 మంది ఓటర్లకు గాను 2.05,222 మంది (88 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా సిద్దిపేట నియోజకవర్గంలో మొత్తం 2,09,345 మంది ఓటర్లు ఉండగా ఇందులో 1,65,075 మంది (78.86శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా దుబ్బాక నియోజకవర్గంలో 1,90,482 మంది ఓటర్లకు గాను 1,63,658 మంది(85.92 శాతం) ఓటు వేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మొత్తం 2,22,431 మంది ఓటర్లకు గాను 1,85,003మంది(83.17శాతం) ఓట్లు వేశారు. మొరాయించిన ఈవీఎంలు జిల్లాలో ఉదయం 7గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్.. పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా ప్రారంభమైంది. మాక్ పోలింగ్ సమయంలోనే ఈవీఎంలు సక్రమంగా పనిచేయకపోవడంలో అప్పటికప్పుడు అధికారులు పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మార్పులు చేశారు. కొన్నింటిని సరిచేసి నడిపించారు. హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల, బెజ్జంకి మండలం రేగులపల్లె, జగదేవ్పూర్, వర్గల్ మండలంలోని మీనాజీపేటలో ఈవీఎంలు మొరాయించాయి. అదేవిధంగా తొగుట మండలం కేంద్రంలోని 134, లింగారెడ్డిపల్లి 115 పోలింగ్ బూత్ల్లో ఈవీఎం పనిచేయకపోవడంతో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభించారు. అదేవిధంగా దుబ్బాక మండలం నిజాంపేటలో ఈవీఎం మొరాయించడంతో కొంతసేపు పోలింగ్ను నిలిపి వేశారు. అదేవిధంగా చేర్యాల మండలంలోని చుంచన కోటలో ఈవీఎంలు మొరాయించడం, సక్రమంగా ఓటు పడకపోవడంతో రాత్రి 8గంటల వరకు, తొగుట మండలం లింగారెడ్డి పల్లి, గజ్వేల్ నియోజకవర్గంలోపలు పోలింగ్ స్టేషన్లలో రాత్రి వరకు పోలింగ్ నిర్వహించారు. ఓటర్లు రాత్రి వరకు అక్కడే ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా లైట్లు ఉంటే వీవీ ప్యాట్లు పనిచేయవనే కారణంతో ఈవీఎంలను చీకటిలో ఉంచారు. అయితే ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధులు చీకటిలో గుర్తులు కనింపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. చేసేదిలేక ఏదో ఒక గుర్తుకు ఓటేశామని చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు మండలంలో లాఠీచార్జీ ఎన్నికల్లో భాగంగా జరిగిన పలు సంఘటనలతో జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో ములుగు మండలంలోని పలు గ్రామాల్లో పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ములుగు మండలంలోని బండ్ల మైలారంలో కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్రెడ్డి పోలింగ్ బూత్ వద్దకు రాగానే అక్కడే ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రతిగా మరోవైపు నుంచి కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలను చెదరగొట్టేందుకు లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది. అదేవిధంగా ములుగు మండలంలోని సింగన్నగూడ, కొక్కండ గ్రామాల్లో కూడా కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో పోలీసులు జోక్యంతో సద్దుమణిగింది. రిమ్మనగూడెం గ్రామంలో కూడా కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలు గొడవ పడ్డారు. అదేవిధంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలంలోని చెంచాన్పల్లిలో ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు వచ్చిన అధికారులు స్థానిక టీఆర్ఎస్ నాయకుడి ఇంట్లో బస చేశారని కూటమికి చెందిన నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల అధికారి ఆ ఇద్దరిని ఎన్నికల విధుల నుండి తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమించారు. -
ముగిసిన తొలివిడత జడ్పిటిసి, ఎంపిటిసి పోలింగ్
-
ముగిసిన తొలివిడత జడ్పిటిసి, ఎంపిటిసి పోలింగ్
హైదరాబాద్: జడ్పిటిసి, ఎంపిటిసి తొలిదశ పోలింగ్ ముగిసింది. బ్యాలెట్ పద్దతిలో ఈ పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం 5గంటల వరకు లైన్లో ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం ఇస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 67శాతం పోలింగ్ నమోదైనట్లు అంచనా. కొన్ని జిల్లాలలో 80శాతం వరకు పోలింగ్ జరిగినట్లు అధికారులు చెప్పారు. అక్కడక్కడా చదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎండలు మండుతున్నా లెక్కచేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్నిచోట్ల ఓటర్ల జాబితా తారుమారయ్యాయి. ఓటర్లు ఆందోళనకు దిగారు. కొన్నిచోట్ల పోలీసులు ఓవరాక్షన్ చేశారు. వారివల్లే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం మోరంపల్లిబంజరలో ఎస్ఐ దౌర్జన్యానికి దిగిందిగాక గాలిలోకి కాల్పులు జరిపాడు. మహబూబ్నగర్ జిల్లా మల్దకల్ మండలం శేషంపల్లి గ్రామంలో జయన్న అనే ఓటర్ను పోలీసులు కొట్టడంతో మనఃస్తాపంతో అతను ఆత్మహత్య చేసుకున్నారు. పోలింగ్ చివరి దశలో చిత్తూరు జిల్లా పీలేరులో రిగ్గింగ్ జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుచరులు అక్రమాలకు పాల్పడినట్లు ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు. తునిలో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలపై టిడిపి కార్యకర్తలు దాడి చేశారు. పలువురు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు గాయపడ్డారు. అనంతపురం జిల్లా చెరువుదొడ్డి గ్రామంలో ఓటర్లు అసలు ఓట్లు వేయలేదు. ఆ గ్రామంలో మొత్తం 362 ఓట్లు ఉన్నాయి. ఒక్కరు కూడా ఓటు వేయలేదు. అక్కడ రీపోలింగ్ జరిగే అవకాశం ఉంది.