-
AP: రాబడిని మించిన జీతాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర సొంత ఆదాయాన్ని మించి ఉద్యోగుల వేతనాల వ్యయం అవుతోందని, ఈ నేపథ్యంలో ఐదేళ్లకు ఒకసారి ఉద్యోగుల వేతన సవరణను రాష్ట్రం భరించే స్థితిలో లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని అధికారుల కమిటీ 11వ వేతన సవరణ కమిషన్ సిఫార్సులపై స్పష్టం చేసింది. ఇప్పటికే చాలా ఏళ్ల నుంచి అత్యధిక ఫిట్మెంట్ ఇస్తూ వస్తున్నారని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర 7వ వేతన సవరణ కమిషన్ను అనుసరించి 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని సీఎస్ నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 11వ వేతన సవరణ కమిషన్ నివేదికను అధ్యయనం చేసిన కమిటీ పలు సిఫార్సులతో సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్కు నివేదిక సమర్పించింది. కేంద్ర వేతన సంఘం సిఫార్సుల దిశగానే .. ► కొద్ది సంవత్సరాలుగా మంజూరైన ఫిట్మెంట్ ఎక్కువగా ఉందని గమనించాలి. రాష్ట్ర సొంత రాబడికి మించిన ఖర్చు హెచ్ఆర్ వ్యయం పెరగడానికి దారి తీసింది. ► 9వ పీఆర్సీలో 27 శాతం సిఫార్సు చేస్తే దాన్ని మించి 39% ఫిట్మెంట్ మంజూరు చేశారు. ► 10వ పీఆర్సీ 29 శాతం ఫిట్మెంట్ సిఫార్సు చేస్తే అంతకు మించి 43% మంజూరు చేశారు. ► ఇదే కాలంలో 7వ కేంద్ర వేతన సవరణ కమిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 14.29% ఫిట్మెంట్ మంజూరైంది ► 11వ రాష్ట్ర పీఆర్సీ కమిటీ ఐదేళ్లకు 27 శాతం ఫిట్మెంట్ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సు చాలా ఎక్కువగా ఉంది. ► తెలంగాణలో పీఆర్సి 7.5% ఫిట్మెంట్ సిఫారసు చేసింది. ► చాలా రాష్ట్రాలు కేంద్ర వేతన సంఘం సిఫార్సుల స్వీకరణ దిశగా అడుగులు వేస్తున్నాయి. ► ఈ పరిస్థితుల్లో రాష్ట్రం ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణలను కొనసాగించలేదు. పదేళ్లకు ఒకసారి 7వ కేంద్ర వేతన సవరణ ప్రకారం 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి. తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ ఏపీలోనే అత్యధికం ► 2018–19లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల వ్యయం రూ. 52,513 కోట్లు కాగా 2020–21 నాటికి ఏకంగా రూ.67,340 కోట్లకు చేరుకుంది. ► 2018–19లో రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయం (ఎస్ఓఆర్)లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల మొత్తం 84 శాతం కాగా 2020–21 నాటికి 111 శాతానికి చేరుకుంది. ► ప్రభుత్వ మొత్తం వ్యయంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం చేస్తున్న వ్యయం 2018–19లో 32 శాతం అయితే 2020–21 నాటికి 36 శాతానికి పెరిగింది. ► ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ వ్యయం ఏపీలోనే అధికం. 2020–21లో తెలంగాణాలో ఇది కేవలం 21 శాతమే. ఛత్తీస్గఢ్లో 32 శాతం, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో 31 శాతం, ఒడిశాలో 29 శాతం, మధ్యప్రదేశ్లో 28 శాతం, హర్యానాలో 23 శాతం ఉంది. బకాయిలు రాలేదు... కోవిడ్తో పెను భారం ► విభజన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై పెను ప్రభావం చూపింది ► తెలంగాణలో సగటు తలసరి ఆదాయం రూ.2,37,632 కాగా ఏపీలో అది కేవలం రూ. 1,70,215 మాత్రమే ఉంది. ► రూ.6,284 కోట్ల విద్యుత్ బకాయిలు తెలంగాణ నుంచి ఇంకా రావాల్సి ఉంది ► రెవిన్యూ లోటు కింద రూ.18,969.26 కోట్లు కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ► కోవిడ్ కారణంగా ఆర్థిక పరిస్థితి మరింత దిగజారి దాదాపు రూ.30 వేల కోట్ల అదనపు భారం పడింది. కష్టాలున్నా ప్రయోజనాలను కాపాడుతూ.. ► ఇన్ని కష్టాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాల కోసం పలు నిర్ణయాలు తీసుకుంది. ► ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే 2019 జూలై 1 నుంచి 27 శాతం ఐఆర్ ఇచ్చింది. ఐఆర్ రూపంలో ఉద్యోగులకు రూ.11,270.21 కోట్లు, పెన్షనర్లకు రూ.4,569.78 కోట్లు, మొత్తంగా రూ.15.839.99 కోట్లు చెల్లించింది. ► అంగన్వాడీ, ఆశావర్కర్లు సహా వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగులకు వేతనాలు పెంచింది. ► 3,01,021 మంది ఉద్యోగులకు ఈ ప్రభుత్వం జీతాలు పెంచింది. తద్వారా ఏడాదికి జీతాల రూపంలో ప్రభుత్వం చేస్తున్న ఖర్చు రూ.1,198 కోట్ల నుంచి రూ.3,187 కోట్లకు పెరిగింది. ► కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైం స్కేలు సహా ఇతర ప్రయోజనాలను ఈ ప్రభుత్వం అందించింది. ► ప్రభుత్వ విభాగాలు, యూనివర్శిటీలు, సొసైటీలు, కేజీవీబీ, మోడల్ స్కూళ్లు తదితర ఉద్యోగులకు వర్తింప చేసింది. ► ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5 లక్షలు, సహజ మరణానికి రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా అమలు చేస్తోంది. ► ఈ చర్యల వల్ల ప్రభుత్వంపై రూ.360 కోట్ల మేర ఏటా భారం పడుతోది. మధ్యవర్తులు లేకుండా నేరుగా జీతాలు ► అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రయోజనాల కోసం అప్కాస్ను ప్రారంభించింది. మధ్యవర్తులు లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే జీతాలను జమ చేస్తోంది. ఈపీఎఫ్ మరియు ఈఎస్ఐ వంటి సదుపాయాలను కల్పించింది. అప్కాస్ రూపంలో ఏడాదికి ప్రభుత్వంపై రూ. 2,040 కోట్ల భారం పడుతోంది. ► ఎంపీడీఓలకు ప్రమోషనల్ ఛానల్ అంశాన్ని ఈ ప్రభుత్వం పరిష్కరించింది. ► గ్రేడ్–1 వీఆర్వోలకు ప్రమోషన్ ఛానల్ను ఏర్పాటు చేసింది. ► రాష్ట్రవ్యాప్తంగా 3,795 వీఆర్వో, వీఆర్ఏ పోçస్టుల భర్తీకి ఆదేశాలు ఇచ్చింది. ► మహిళా ఉద్యోగులకు ఏటా అదనంగా ఐదు రోజుల పాటు ప్రత్యేకంగా సెలవులు మంజూరు చేసింది. ► హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చిన ఉద్యోగులకు 30శాతం హెచ్ఆర్ఐ చెల్లిస్తోంది. ► ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ కోవిడ్ను ఎదుర్కొంటూ డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ తదితర సిబ్బంది నియమకాలు పెద్ద ఎత్తున చేపట్టడంతో ఏటా అదనంగా రూ.820 కోట్ల భారం ఖజానాపై పడింది. ఆర్టీసీ విలీనం... పాలన సంస్కరణలు ► ఏపీఎస్ ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడంతో 2020 జనవరి నుంచి సంస్థ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. జనవరి 2020 నుంచి అక్టోబరు 2021 వరకూ రూ.5,380 కోట్ల భారం ప్రభుత్వంపై పడింది. ► పరిపాలనా సంస్కరణల్లో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రభుత్వం తెచ్చింది. ► 1.28 లక్షల మంది శాశ్వత ఉద్యోగులను తీసుకుంది. ఏడాదికి రూ. 2,300 కోట్ల భారం ప్రభుత్వంపై పడింది. అడగకుండానే ‘ఐఆర్’ రాష్ట్ర ప్రభుత్వం 2019లో అధికారంలోకి వస్తూనే ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఎవరూ అడగకుండానే 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించింది. దీనివల్ల ఏటా దాదాపు రూ.16 వేల కోట్ల అదనపు భారం పడినప్పటికీ వారి ప్రయోజనాలను కాపాడుతూ ముందుకు సాగింది. ఉద్యోగులకు జీతభత్యాలు, పెన్షన్ల చెల్లింపులు ఈ ఏడాది రూ.67,340 కోట్లకు చేరుకున్నాయి. ఐఆర్ ప్రకటించేనాటికి అంతా బాగున్నా కోవిడ్తో 2019–20లో రూ.8వేల కోట్లకు పైగా, 2020–21లో రూ.14వేల కోట్లకు పైగా ఆదాయం తగ్గిపోయింది. కోవిడ్ నియంత్రణ, వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు మరో రూ.8వేల కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. మొత్తంగా రూ.30 వేల కోట్ల భారం పడింది. వీటితో పాటు ఐఆర్తో ఇప్పటికే మోయలేని భారం ఉన్నా ఉద్యోగుల డిమాండ్లు, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఫిట్మెంట్ను భరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వివిధ అంశాలపై సిఫార్సులు ఇవీ.. పే స్కేల్స్ 11వ పీఆర్సీ సిఫార్సు: మాస్టర్ పే స్కేల్ను 32 గ్రేడ్లు, 83 (81 నుంచి 83కు పెంపు) స్టేజస్తో రూపొందించాలి. ఉద్యోగుల గ్రేడ్లు, స్టేజ్ల ఆధారంగా నెలకు కనీస వేతనం రూ.20 వేలు.. గరిష్ఠ వేతనం రూ.1.79 లక్షలు చెల్లించేలా మాస్టర్ పే స్కేల్ను అమలు చేయాలి. సెక్రటరీల కమిటీ: పదవీ విరమణ వయోపరిమితిని 58 నుంచి 60 ఏళ్లకు పెంచిన నేపథ్యంలో మాస్టర్ పే స్కేల్లో స్టేజ్లను 81 నుంచి 83కు పెంచడం సబబే. నెలకు కనీస వేతనం రూ.20 వేలు.. గరిష్ఠ వేతనం రూ.1.79 లక్షలు ఇవ్వాలని 11వ పీఆర్సీ చేసిన ప్రతిపాదన సహేతుకమైనదే. ఫిట్మెంట్ 11వ పీఆర్సీ: ఐఎల్వో ప్రమాణాల ప్రకారం ఉద్యోగులకు 23 శాతం ఫిట్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 27 శాతం ఐఆర్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో 27 శాతం ఫిట్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి. సెక్రటరీల కమిటీ: గత పదేళ్లలో 9వ పీఆర్సీ ఫిట్మెంట్ బెనిఫిట్ను 27 శాతం సిఫార్సు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 39 శాతం మంజూరు చేసింది. పదో పీఆర్సీ కమిటీ ఫిట్మెంట్ బెనిఫిట్ను 29 శాతం సిఫార్సు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 43 శాతం మంజూరు చేసింది. గత పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 82 శాతం ఫిట్మెంట్ బెనిఫిట్ ఇస్తే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 14.29 శాతం(ఏడో పీఆర్సీ) మాత్రమే ఇచ్చింది. తెలంగాణ పీఆర్సీ కమిటీ ఐదేళ్ల కాలానికి 7.5 శాతం ఫిట్మెంట్ బెనిఫిట్ను సిఫార్సు చేస్తే.. రాష్ట్రంలో 11వ పీఆర్సీ 27 శాతాన్ని సిఫార్సు చేసింది. దీని వల్లే రాష్ట్ర సొంత ఆదాయానికి మించి ఉద్యోగుల వేతనాలకు అధికంగా వ్యయమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఏడో వేతన సంఘం చేసిన సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 14.2 శాతం ఫిట్మెంట్ బెనిఫిట్ ఇస్తే సరిపోతుంది. కొత్త పే స్కేలు వర్తింపజేయాల్సిన తేదీ.. 11వ పీఆర్సీ: 1–7–2018 నుంచి కొత్త పే స్కేల్ను వర్తింపజేయాలి. మానిటరి బెనిఫిట్పై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. సెక్రటరీల కమిటీ: ఏపీఎస్ఆర్టీసీ(పీటీడీ) ఉద్యోగులకు 1–1–2020 నుంచి కొత్త పే స్కేల్ను వర్తింపజేయాలి. మానిటరి బెనిఫిట్ను 1–10–2022 నుంచి అమలు చేయాలి. అంటే 2022, నవంబర్లో మానిటరి బెనిఫిట్తో కూడిన వేతనాన్ని ఇవ్వాలి. -
ఖజానా ఖాళీ.. ఇక అప్పులే ఆసరా!
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్ర ఖజానా దాదాపు ఖాళీ అయ్యింది. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, సామాజిక పింఛన్ల కోసం వేజ్ అండ్ మీన్స్(చేబదుళ్లు), ఓవర్ డ్రాఫ్ట్నకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. అప్పులు చేస్తే గానీ ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో ఓపెన్ మార్కెట్ ద్వారా రూ.8,000 కోట్ల అప్పులు చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతించింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం పోలింగ్ తేదీకి రెండు రోజుల ముందు అంటే ఏప్రిల్ 9వ తేదీన ఏకంగా రూ.5,000 కోట్ల అప్పులు చేసింది. ఈ అప్పులను 20 సంవత్సరాల్లోగా తిరిగి చెల్లించాల్సి ఉంది. ఒకే నెలలో ఏకంగా రూ.5,000 కోట్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏనాడూ తీసుకురాలేదు. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే భారీగా అప్పులు చేసిన ప్రభుత్వం మళ్లీ ఏప్రిల్ 16వ తేదీన మరో రూ.1,000 కోట్ల అప్పు చేసేందుకు సన్నద్ధమైంది. అయితే, ఆర్బీఐ ఇందుకు ఒప్పుకోలేదు. నాలుగు నెలల కోసం రూ.8,000 కోట్ల అప్పునకు అనుమతిస్తే, ఒకే నెలలో రూ.5,000 కోట్ల అప్పులు చేసి, వెంటనే మరో రూ.1,000 కోట్ల అప్పు ఎందుకు చేస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నెలకు రూ.2,000 చొప్పున మాత్రమే ఓపెన్ మార్కెట్లో అప్పునకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. దాంతో వచ్చే నెలలోనే రూ.2,000 కోట్ల అప్పు చేయడానికి అవకాశం వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వేజ్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు చెల్లించి, వచ్చే నెలలో అప్పు చేయడం ద్వారా ఓవర్ డ్రాఫ్ట్ను అధిగమించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. అత్యవసరాలకు సర్కారు మొండి చెయ్యి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఈ నెల 24వ తేదీన రూ.2,300 కోట్లు వచ్చాయి. ప్రాధాన్యతా క్రమంలోనే అత్యవసరాలకు మాత్రమే బిల్లులు చెల్లించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. కానీ, అత్యవసరాల ముసుగులో ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) సూచించిన బిల్లులను మాత్రమే ఆర్థిక శాఖ కార్యదర్శి సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్) ద్వారా అస్మదీయ కాంట్రాక్టర్లకు చెల్లించినట్లు సమాచారం. ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు, వేసవిలో తాగునీటి సరఫరా తదితర అవసరాల కోసం వెచ్చించాల్సిన రూ.2,300 కోట్లను ప్రభుత్వ పెద్దలకు బాగా కావాల్సిన కాంట్రాక్టర్లకు బిల్లులుగా చెల్లించినట్లు ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం నుంచి వచ్చిన మొత్తం నిధులను కాంట్రాక్టర్ల పరం చేయడంతో ప్రస్తుతం ఖజానా ఖాళీగా మారింది. ఉద్యోగుల వేతనాలు, పింఛన్ల కోసం ప్రభుత్వం ఇతరుల దగ్గర చేతులు చాచాల్సిన పరిస్థితి తలెత్తింది. సీఎం డ్యాష్బోర్డు నుంచి వివరాలు మాయం కోర్ డ్యాష్బోర్డు ద్వారా రాష్ట్రంలో ఎక్కడేం జరుతోందో క్షణాల్లో తనకు తెలిసిపోతుందని, పూర్తి పారదర్శకంగా పరిపాలన సాగిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ ఊదరగొడుతుంటారు. ఏ శాఖలో ఎలాంటి సమాచారం అయినా కోర్ డ్యాష్బోర్డులో ఉంటుందని చెబుతుంటారు. అయితే, సీఎం డ్యాష్బోర్డు నుంచి ఆర్థిక శాఖకు చెందిన ఆదాయ, వ్యయాల వివరాలను తాజాగా తొలగించడం గమనార్హం. ఆర్థిక శాఖ ఆదాయ, వ్యయాల సమాచారాన్ని కనిపించకుండా చేశారు. ఏ రంగం నుంచి ఎంత ఆదాయం వచ్చింది? ఏ రంగానికి ఎంత వ్యయం చేశారు? అనే వివరాలు సీఎం డ్యాష్బోర్డులో ఏడాదిన్నర క్రితం వరకూ ఉన్నాయి. తర్వాత ఆ వివరాలను మాయం చేశారు. ఆ సైట్ ఓపెన్ చేస్తే తాత్కాలికంగా మూసివేసినట్లు కనిపిస్తోంది. -
ఎన్ఆర్హెచ్ఎం ఖాతా ఖాళీ!
ఆరు నెలలుగా నిధులు విదల్చని సర్కారు సిబ్బంది వేతనాలకూ కటకట వడ్డీ డబ్బులతో గత నెల వేతనాలు సరిపెట్టుకున్న వైనం ఆందోళనలో రెండువేల మంది ఉద్యోగులు సాక్షి, రంగారెడ్డి జిల్లా : జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) ఆరు నెలలుగా నిధులలేమితో సతమతమవుతోంది. బడ్జెట్ కేటాయింపులో సమస్య నెలకొనడంతో చివరకు ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యసేవలందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్హెచ్ఎం పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రతి పంచాయతీ పరిధిలో ఉపకేం ద్రాలు ఏర్పాటుచేసి అక్కడి ప్రజలకు వైద్యసేవలు అందించడంతోపాటు ప్రజారోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ఆశ వర్కర్లు, శిశు మరణాలు తగ్గించేందుకు ప్రత్యేకంగా క్లస్టర్ ఆస్పత్రుల్లో శిశు వైద్య యూనిట్లు ఏర్పాటుచేసి సేవలందిస్తున్నారు. వేతన వెతలు.. ప్రస్తుతం ఎన్ఆర్హెచ్ఎం పథకంలో భాగంగా పనిచేస్తున్న సిబ్బందికి కష్టాలు వచ్చాయి. ఎన్ఆర్హెచ్ఎం కింద జిల్లాలో రెండు వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందులో ఆశ, ఇతర వర్కర్లు 1,506 మంది కాగా, 483 మంది ఆరోగ్య కార్యకర్తలు, సహాయ ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు కూడా ఉన్నారు. తాజాగా ఈ పథకం కింద విడుదల చేయాల్సిన నిధులపై సర్కారు జాప్యం చేస్తోంది. కొత్తగా ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలవుతున్నా ఇప్పటికీ పైసా విదిల్చలేదు. గత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఎన్ఆర్హెచ్ఎం ఖాతాలో రూ.రెండు కోట్ల మిగులు డబ్బులున్నాయి. దీంతో ఏప్రిల్ నెలనుంచి ఆ నిధులనుంచి వేతనాలు తీసుకుంటూ వచ్చారు. తాజాగా ఈ ఖాతాలో నిధులు నిండుకోవడంతో సిబ్బందిలో ఆందోళన మొదలైంది.ఈ పథకం అమల్లో పనిచేస్తున్న సిబ్బందికి నెలవారీగా రూ.70లక్షలు వేతనాల రూపంలో చెల్లిస్తున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిధుల విడుదలలో కేంద్రం జాప్యం చేసింది. దీంతో మిగులు నిధులతో మూడు నెలలపాటు వేతనాల రూపంలో డ్రా చేశారు. ఫలితంగా నిధులు నిండుకున్నాయి. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన మూడు నెలల తర్వాత కూడా బడ్జెట్ రాకపోవడంతో మళ్లీ వేతనాల సమస్య తలెత్తింది. అయితే ఎన్ఆర్హెచ్ఎం ఖాతాలోని వడ్డీ నిధులను సైతం వాడుకుని రెండు నెలల వేతనాలు ఇచ్చారు. తాజాగా ఈ ఖాతా ఖాళీ కావడంతో సిబ్బందికి వేతనాలు అందడం కష్టంగా మారింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ఫిల్ సాల్ట్ విధ్వంసం.. ఢిల్లీను చిత్తు చేసిన కేకేఆర్
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement