breaking news
Employee pension
-
ఏప్రిల్లోనే బదిలీలు నిర్వహించాలి
టీఎన్జీవోస్ గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ నాగారం (నిజామాబాద్ అర్బన్): ఉద్యోగుల బదిలీలు సాధ్యమైనంత త్వరగా ఈ ఏప్రిల్లో నిర్వహించాలని టీఎన్జీవోస్ కేంద్ర సంఘం గౌరవ అధ్యక్షులు దేవీప్రసాద్ కోరారు. అలాగే, ఉద్యోగులకు పెన్షన్ సాధించే వరకు పోరాటాలు చేద్దామ ని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం నిజామాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఉద్యోగుల ప్రమేయం లేకుండా పోస్టిం గులు ఇచ్చారని, అవి తాత్కాలిక కేటాయింపులని చెప్పినా ఇంకా బదిలీలు చేయకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే ఉద్యోగుల బదిలీలు నిర్వహించాలని కోరారు. ఉద్యోగుల పెన్షన్ విధానం కోసం త్వర లోనే ఈ ఏప్రిల్లో 28, 29న జాతీయ సమ్మేళ నాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పెన్షన్ విధానం కోసం రాష్ట్ర, జాతీయస్థాయిలో రాజీలేని పోరాటాలు చేయాల్సిందే అన్నారు. ఉద్యోగుల పెన్షన్ విధానానికి ఎంపీ కవిత కేంద్రానికి లేఖ రాశారన్నారు. -
ఆర్టీసీ ఇచ్చే పరిహారం పెంపు
సర్వీసులో ఉండగా మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.6 లక్షలు సాక్షి, అమరావతి: ఆర్టీసీలో విధి నిర్వహణలో ఉండగా మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని పెంచేందుకు యాజమాన్యం అంగీకరించింది. ప్రస్తుతం ఎంప్లాయ్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఈడీఎల్ఐఎఫ్) ద్వారా చెల్లిస్తున్న రూ.3.60 లక్షల పరిమితిని రూ.6 లక్షల వరకు పెంచారు. ఈ ఏడాది జనవరి 31వ తేదీ తర్వాత మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. 2014 సెప్టెంబర్ 1 నుంచి ఉద్యోగుల పింఛన్ రికవరీ వాటాను రూ.6,500 నుంచి రూ.15వేలకు పెంచే విధంగా చట్ట సవరణ జరిగిన సంగతి తెలిసిందే.