-
భార్య తనతో రావడానికి నిరాకరించిందని.. మరదలితో కలిసి..
పాట్నా: భార్య తనతో రావడానికి నిరాకరించిందని ఓ వ్యక్తి తన మరదలితో కలిసి పారిపోయాడు. ఈ విచిత్ర ఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఛప్రా జిల్లాకు చెందిన కృష్ణ రామ్ అనే వ్యక్తికి 12 సంవత్సరాల కిత్రం సంకటి దేవితో వివాహం జరిగింది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లు సవ్యంగా సాగిన వీరి కాపురంలో తరువాత గొడవలు తలెత్తాయి. దీంతో సకంటి దేవి తన తల్లిగారి ఇంటికి వెళ్లి నివసిస్తోంది. ఈ క్రమంలో తన భార్యను పుట్టింటి నుంచి తీసుకొచ్చేందుకు రామ్ అత్తవారింటికి వెళ్లాడు. అయితే భర్తతో పాటు వెళ్లడానికి ఆమె నిరాకరించంది. దీంతో కోపోద్రిక్తుడైన కృష్ణ రామ్.. మైనర్ అయిన తన మరదలికి మాయమాటలు చెప్పి ఆమెను తీసుకొని పారిపోయాడు. దీంతో మైనర్ తండ్రి తన కూతురిని కిడ్నాప్ చేశారంటూ రామ్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరి ఆచూకీ వెతికి పట్టుకున్నారు. అయితే అప్పటికే మైనర్ తనకు బాల్యం వివాహం చేస్తున్నారని సొంత కుటుంబానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇంతలో పోలీసులు ఇద్దరి ఆచూకి కనుగొన్నారు. మైనర్ని కిడ్నాప్ చేసినందుకు రామ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, బలవంతంగా పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్న తల్లిదండ్రుల నుంచి తప్పించుకునేందుకే రామ్తో కలిసి పారిపోతున్నట్లు మైనర్ పోలీసులకు చెప్పింది. ఈ కేసుపై పూర్తి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. చదవండి👉 బంజారాహిల్స్: వివాహితతో రెండేళ్లుగా సహజీవనం..దూరం పెడుతోందని.. -
ప్రియురాలితో పారిపోతూ.. కాల్వలో పడి గల్లంతు!
ప్రియురాలితో కలిసి పారిపోయే ప్రయత్నంలో పంటకాలువలో పడి గల్లంతయ్యాడు ఓ యువకుడు. ఈ ఘటన పశ్చిమగోదారి జిల్లా భీమవరంలో జరిగింది. హైదరాబాద్ అల్వాల్లో మెకానిక్గా పనిచేసే వినయ్కుమార్... భీమవరానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయం పెద్దవాళ్లకు తెలిసి అమ్మాయిని వాళ్ల వాళ్లు తీసుకెళ్లిపోయారు. దీంతో వినయ్ అమ్మాయి ఊరెళ్లి, వాళ్ల బంధువులతో గొడవ పడ్డాడు. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనుకున్నారు. అనుకున్న ప్రకారం ఇద్దరూ కలిసి పారిపోయే ప్రయత్నంలో వినయ్ తాడేరు పంటకాల్వలో దిగాడు. కాలువలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అతడు గల్లంతయ్యాడు. ప్రియురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలిసి వినయ్ తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement