breaking news
Ela Gandhi
-
గాంధీ మనవరాలికి దక్షిణాఫ్రికా అవార్డు
జోహెన్నెస్బర్గ్: భారత జాతిపిత మహాత్మ గాంధీ మనవరాలు ఇలా గాంధీకి దక్షిణాఫ్రికా పురస్కారం దక్కింది. 'అమాడెలాకూఫా' అవార్డుతో ఆమెను గౌరవించారు. భారత సంతతికి చెందిన సన్నీ సింగ్, మాక్ మహరాజ్లకు కూడా ఈ పురస్కారాన్ని ప్రకటించారు. దక్షిణాఫ్రికా మిలటరీ ఈ పురస్కారాన్ని నెలకొల్పింది. సైన్యంలో భాగం కానప్పటికి ఇలా గాంధీకి ఈ గౌరవం దక్కడం విశేషం. ఆమె చేసిన సామాజిక సేవకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. తనకు అమాడెలాకూఫా పురస్కారం దక్కడం పట్ల సన్నీ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. అవార్డులు, రివార్డులు ఆశించకుండానే 42 ఏళ్ల క్రితం స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నానని సన్నీ సింగ్ ఈ సందర్భంగా తెలిపారు. వివక్షపై విజయం సాధించడమే తాము సాధించిన గొప్ప గెలుపని ఆయన వ్యాఖ్యానించారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాకు అధికార ప్రతినిధిగా ఉన్న మహరాజ్ పురస్కార ప్రదానోత్సవానికి రాలేకపోయారు. -
13మందికి ‘ప్రవాసి భారతీయ సమ్మాన్’
న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో చేసిన సేవలకు గానూ 13 మంది ప్రవాస భారతీయులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ‘ప్రవాసి భారతీయ సమ్మాన్’ పురస్కారాలను ప్రదానం చేశారు. వారి వివరాలు.. ఇలా గాంధీ: మహాత్మాగాంధీ మునిమనవరాలు. దక్షిణాఫ్రికాలో 1994 నుంచి 2004 వరకు పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు. ఆ దేశంలో ఆమె చేసిన ప్రజాసేవకు గుర్తింపుగా ఈ అవార్డ్ను ప్రకటించారు. లీసా మేరియా సింగ్: భారతీయ సంతతికి చెందిన ఆస్ట్రేలియా సెనేటర్. లీసా ఆస్ట్రేలియాలో తొలి దక్షిణాసియా సెనేటర్. మంత్రిగానూ పనిచేశారు. ప్రజాసేవతో పాటు భారత్, ఆస్ట్రేలియాల మధ్య స్నేహ సంబంధాల వృద్ధికి కృషిచేసినందుకు ఆమెకు ఈ పురస్కారాన్ని ప్రకటించారు. రామకృష్ణ మిషన్: 1937 నుంచి ఫిజీలో సామాజిక సేవలందిస్తున్నందుకు.. కురియన్ వర్గీస్, వాసుదేవన్ చంచ్లానీ, వికాస్ చంద్ర సన్యాల్, సత్నారాయన్సింగ్ రాబిన్ బల్దేవ్సింగ్, శశింద్రన్ముత్తువేల్, శిబుద్దీన్ వావ కుంజు, షంషేర్ వాయలీల్ పరంబత్, శైలేశ్ లక్ష్మణ్ వర, పార్థసారధి చిరామెల్ పిళ్లై, రేణు ఖతోర్లకు పురస్కారాలు లభించాయి.