breaking news
eden garden pitch
-
సంతోషంగా ఉన్నాను.. మా ఓటమికి కారణం వారే: గంభీర్
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్టు ఫలితం కేవలం రెండున్నర రోజుల్లోనే తేలిపోయింది. ఈ మ్యాచ్లో 30 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. టీమిండియా 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక ఘోర పరభావాన్ని మూటకట్టుకుంది.పిచ్ పూర్తిగా బౌలర్లకు సహకరించడంతో భారత బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. ఒక్క వాషింగ్టన్ సుందర్(92 బంతుల్లో 31) మినహా మిగితా ఏ ప్లేయర్ కూడా క్రీజులో నిలదొక్కకోలేకపోయారు. తొలి రోజు మొదటి సెషన్ నుంచే పిచ్పై బౌన్స్ కనిపించింది. ఆ తర్వాత రెండో రోజు ఆటలో పిచ్పై పగుళ్లు ఏర్పడి, స్పిన్నర్లకు అనుకూలంగా మారింది. దీంతో స్పిన్నర్లు బంతి గింగిరాలు తప్పారు. సౌతాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ నాలుగు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు. అతడితో పాటు కేశవ్ మహారాజ్ రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు సఫారీల రెండో ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా సైతం నాలుగు వికెట్లు సాధించాడు. ఈ మొదటి టెస్టులో నాలుగు ఇన్నింగ్స్లు కలిపి 594 పరుగులు మాత్రమే నమోదయ్యాయి అంటే పిచ్ ఎలా ఉందో ఆర్ధం చేసుకోవచ్చు.ఈడెన్ గార్డెన్స్ పిచ్పై సర్వాత్ర విమర్శల వర్షం కురిపిస్తోంది. ఇటుంటి పిచ్ల వల్ల టెస్ట్ క్రికెట్ అంతరించిపోతుందని మాజీ భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ మండిపడ్డాడు. కాగా ఈ పిచ్ను భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూచన మేరకే ఈడెన్ గార్డెన్స్ క్యూరేటర్ తాయారు చేశాడు. దీంతో గంభీర్ను కూడా నెటిజన్లు టార్గెట్ చేశాడు. సోషల్ మీడియాలో గంభీర్ను ట్రోల్ చేస్తున్నారు. కోచ్గా అతడిని తీసేయండి కామెంట్స్ చేస్తున్నారు.బ్యాటర్లే కొంప ముంచారు..ఇక ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం గంభీర్ స్పందించాడు. తామే ఇటువంటి పిచ్ను కోరుకున్నట్లు గంభీర్ ధ్రువీకరించాడు. "మేము అడిగిన పిచ్ను తయారు చేసి ఇచ్చినందుకు సంతోషంగా ఉన్నాము. మేము ఎప్పటి నుంచో ఇటువంటి పిచ్ కోసమే ఎదురు చూస్తున్నాము. క్యూరేటర్ మాకు అన్ని విధాల సహకరించారు. అయితే ఈ వికెట్పై మేము మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన చేయలేకపోయాము. అందుకే ఓడిపోయాము. పిచ్లో ఎలాంటి భూతాలు లేవు. ఇదే వికెట్పై టెంబా బవుమా హాఫ్ సెంచరీ సాధించాడు. అక్షర్, వాషింగ్టన్ కూడా రన్స్ చేశారు. కాబట్టి ఇక్క పిచ్ సమస్య కాదు. ఎక్కువ వికెట్లు ఫాస్ట్ బౌలర్లకే వచ్చాయి. కాబట్టి ఇది బ్యాటింగ్కు మరి అంత కష్టమైన వికెట్ కాదు. ఇటువంటి పిచ్లు మీ టెక్నిక్, సహనాన్ని పరీక్షిస్తాయి. మంచి డిఫెన్స్ టెక్నిక్ ఉంటే, ఇలాంటి వికెట్పై కూడా పరుగులు సాధించవచ్చు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో గంభీర్ పేర్కొన్నాడు.సంక్షిప్త స్కోర్లుసౌతాఫ్రికా- 159 &153భారత్- 189 &93.చదవండి: వాళ్లిద్దరు అద్భుతం.. మా ఓటమికి కారణం అదే: పంత్ -
ఈడెన్ పిచ్ పై ధోని అసంతృప్తి
కోల్ కతా: గతంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా ఉన్న సమయంలో చాలాసార్లు ఈడెన్ గార్డెన్ పిచ్ తయారీని తప్పుబట్టిన మహేంద్ర సింగ్ ధోని.. తాజాగా మరోసారి ఆ పిచ్ పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. విజయ్ హజారే వన్డే టోర్నీలో భాగంగా బుధవారం సౌరాష్ట్ర-జార్ఖండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో స్వల్ప స్కోర్లు నమోదయ్యాయి. ఇరు జట్లు నమోదు చేసిన మొత్తం స్కోరు 208 పరుగులు కాగా, 52.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. దీనిపై పిచ్ క్యూరేటర్ సుజాన్ ముఖర్జీని ధోని ప్రశ్నించాడు. ఆ మ్యాచ్ లో జార్ఖండ్ 42 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ ఆట జరిగిన తీరుపై మాత్రం ధోని తీవ్ర అసృంతప్తిగా ఉన్నాడు. మ్యాచ్ ముగిసిన తరువాత ఇరు జట్ల ఆటగాళ్ల కరాచలనం కార్యక్రమం తరువాత ధోని నేరుగా క్యూరేటర్ ముఖర్జీ దగ్గరకు వెళ్లాడు. దీనిలో భాగంగా అతనితో ఐదు నిమిషాలు సమావేశమైన ధోని.. పిచ్ చాలా పేలవంగా తయారు చేశారంటూ ప్రశ్నించాడు. ప్రధానంగా 53 ఓవర్లలోపే 20 వికెట్లు పడిపోవడాన్ని క్యూరేటర్ దృష్టికి ధోని తెచ్చాడు.మరొకవైపు జార్ఖండ్ కోచ్ రాజీవ్ కుమార్ కూడా పిచ్ తయారు చేసిన తీరును తీవ్రంగా తప్పుబట్టాడు. ఇదొక పూర్ పిచ్ అంటూ బాహాబాటంగా విమర్శించాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ 27.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ కాగా, ఆ తరువాత సౌరాష్ట్ర 25.1 ఓవర్లలో 83 పరుగులకే చాపచుట్టేసింది. ఇదిలా ఉంచితే, పిచ్ పై వస్తున్న విమర్శలపై క్యూరేటర్ ముఖర్జీ స్పందించాడు. 'ఇక్కడ సీమింగ్ ట్రాక్ ను తయారు చేయమని అడిగారు. దాంతో పిచ్ ను ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలించే విధంగా తయారు చేయాల్సి వచ్చింది. మా గ్రౌండ్ మెన్ పిచ్ ను పూర్తిగా పొడిగా తయారు చేసిన తరువాత నీటితో తడిపి కవర్లతో కప్పి ఉంచారు. ఇలా చేస్తే బంతి బాగా స్వింగ్ అవుతుంది. ఆ క్రమంలోనే తక్కువ స్కోర్ల మ్యాచ్ ను చూడాల్సి వచ్చింది. ఈ పిచ్ తో నేను కూడా సంతృప్తిగా లేను. చాలా ఎక్కువగా సీమ్ కావడంతో పిచ్ పేలవమైనదిగా మారిపోయింది. గతంలో ధోని నుంచి ఎప్పుడూ నాకు ఫిర్యాదు అందలేదు పిచ్ లో తేమ లేకపోవడంతోనే బంతి విపరీతంగా స్వింగ్ అయ్యింది. తదుపరి మ్యాచ్ కు పిచ్ బాగుంటుంది' అని ముఖర్జీ సమర్ధించుకునే యత్నం చేశాడు. -
'ఈడెన్ గార్డెన్ పిచ్ ను తవ్వేస్తాం'
కోల్కతా: వరల్డ్ టీ 20లో భాగంగా ఈనెల 19వ తేదీన భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్పై ఇంకా నిరసనల పర్వం కొనసాగుతూనే ఉంది. మ్యాచ్ వేదిక ధర్మశాల నుంచి కోల్ కతాకు మారినా మరోసారి పాత కథే పునరావృతం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారత్తో పాకిస్తాన్ మ్యాచ్ ను కోల్ కతాలో జరిగితే పిచ్ ను తవ్వేస్తామంటూ యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(ఏటీఎఫ్ఐ)హెచ్చరించింది. భారత్ పై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆ జట్టు వరల్డ్ టీ 20లో పాల్గొనడం ఎంతవరకూ సబబని ఏటీఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు విరేష్ షాండిల్యా ప్రశ్నించారు. 'పాకిస్తాన్ జట్టు భారత్ కు వస్తే ఇక్కడి సాహస సైనికులను అవమానపరిచనట్లే. ఈడెన్లో మ్యాచ్ను వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ మ్యాచ్ను జరపాలని తలిస్తే పిచ్ను తవ్వేస్తాం'అని విరేష్ షాండియ్యా హెచ్చరించారు. దాదాపు పది రోజుల పాటు అనేక మలుపులు తిరిగిన అనంతరం వేదిక మార్పు అంశం బుధవారం ఓ కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే. ధర్మశాలలో అయితే తాము ఆడటానికి సిద్ధంగా లేమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆ వేదికను ధర్మశాల నుంచి కోల్ కతా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. మరి ప్రస్తుతం ఏటీఎఫ్ఐ నుంచి తీవ్ర నిరసన గళం వినిపిస్తుండటంతో పాకిస్తాన్ జట్టు వరల్డ్ టీ 20లో పాల్గొనడంపై మరోసారి చర్చనీయాంశంగా మారింది.


