-
భూ పంపిణీయే పరిష్కార మార్గం!
స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్ళు గడిచినా దేశంలో అసమానతల్లో పెద్దగా మార్పేమీ కనిపించడంలేదు. పేదల కోసం పోరాడే వారంతా ఒక గొడుగు కిందకు వచ్చి ఆర్థిక పోరాటాలు చేస్తే తప్ప పరిస్థితుల్లో మార్పు ఉండదు. ఇప్పుడు పీడిత వర్గాలకు దళితులు నాయకత్వం వహించాల్సిన సమయం వచ్చింది. వేలాది జిగ్నేష్ మేవానీలు, కన్హయ్య కుమార్లు, ఉమర్ ఖాలీద్లు పుట్టుకు రావాలి. అప్పుడే ఈ బహుజనుల మౌలిక సమస్యలు పరిష్కారమవుతాయి. నిజానికి ఈ ప్రజల మౌలిక సమస్య – భూమి సమస్య. అంబేడ్కర్ మేధావి, మానవతావాది, ఆర్థికవేత్త, తత్త్వవేత్త. ఆయన ఆర్థిక సంబంధాల ప్రాముఖ్యాన్ని గుర్తించారు. ఈ వర్గాల ప్రజల ఉన్నతికి రాజ్యాంగ రక్షణ కల్పించటం కోసం ఆయన ఎంతో తపన పడ్డారు. ప్రజలకు అన్నంపెట్టే కీలక రంగమైన వ్యవ సాయాన్ని పూర్తిగా ప్రభుత్వానికి చెందిన పరిశ్రమగా ప్రకటించాలని సూచించారు. భూమిని ఒక స్థిర ప్రమాణంలో విభజించి వ్యావసాయిక పరిశ్రమలను వ్యవస్థీకరించాలని అన్నారు. ఆ వ్యావసాయిక క్షేత్రాలను సమష్టి సహకార క్షేత్రాలుగా చేసి కుల, మత భేదాలు లేకుండా ఏర్పడిన గ్రామ సమూహాలు సాగు చేయాలనీ, ఉత్పత్తిని సమష్టిగా పంచుకోవాలనీ అన్నారు. భూస్వాములు, కౌలుదారులు, భూమిలేని కూలీలు ఉండరాదనీ, సమష్టి వ్యవసాయ క్షేత్రాలకు సంబంధించి పెట్టుబడి, ఇతర సౌకర్యాలు ప్రభుత్వమే సమకూర్చాలనీ; తద్వారా ఉత్పాదకతను పెంచాలనీ పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వ సోషలిజం తప్పనిసరి అని సూచించారు. లేకుంటే ఆర్థిక అసమానతలు పుడతాయని చెప్పారు. ఈయన సూచనలు సహజంగానే ఆనాటి జాతీయోద్యమానికి నాయకత్వం వహించిన బడా భూస్వామ్య వర్గాలు పక్కనపెట్టాయి. ఎప్పటికో, రాజ్యాంగం అమలులోకి వచ్చిన 26 ఏళ్ల తరువాత 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘సోషలిస్టు’ అనే పదం రాజ్యాంగ ప్రవేశికలో చేర్చి చేతులు దులుపుకొన్నారు. దారిద్య్ర నిర్మూలనకు అవసరమైన మౌలికమైన వ్యవసాయ సంస్కరణలు అమలు కాలేదు. గ్రామ సీమల్లో అణచివేతకు, వివక్షకు గురవుతున్న నిమ్న జాతుల ప్రజలకు దక్కాల్సిన భూమి వారికి దక్కలేదు. భూ సంస్కరణలు అమలు కాలేదు. ‘నేను ఏర్పరచిన రిజర్వేషన్లతో ఆర్థిక, సామాజిక సమానత్వం వస్తుందనుకున్నా, అయితే వాటివల్ల గుప్పెడుమంది గుమస్తాలు మాత్రమే తయారయ్యారు. కానీ మెజారిటీ ప్రజానీకం నేటికీ గ్రామాల్లో భూమి లేకుండా భూస్వాములకు దాస్యం చేస్తు న్నారు. వారి కోసం నేను ఏమీ చేయలేక పోయాను’ అంటూ ఆవేదన చెందారు అంబేడ్కర్. (క్లిక్: ఇవాళ మనకు కావాల్సింది ఇదీ!) అంటే భూ పంపిణీ జరగకుండా ఈ దేశంలో ఆర్థిక సామాజిక సమానత్వం జరగదు. వ్యవసాయా ధారిత దేశంలో భూమికీ, సామాజిక న్యాయానికీ ఉన్న సంబంధం ఇదే. ప్రజలకు దక్కాల్సిన భూములు గుంజుకొని దేశ, విదేశీ బహుళజాతి కంపెనీలకు, బడా బాబులకు కట్టబెడుతున్నాయి కార్పొరేట్ అనుకూల ప్రభుత్వాలు. వీరు భూమి సంబంధాలన్నింటినీ మార్కెట్ సంబంధాలుగా మార్చారు. మార్కెట్ ఎప్పుడూ లాభం కోసమే వెంపర్లాడుతుంది కానీ ప్రజా సంక్షేమం దానికి పట్టదు. అందుకే వ్యవసాయాన్ని దండగమారి వృత్తిగా చిత్రించి, రైతు వ్యతిరేక విధానాలతో దాన్ని కుప్ప కూల్చారు. దీంతో కార్పొరేట్లకు భూములను అమ్ము కొని రైతులు పట్టణాల్లో కార్మికులుగా, సెక్యూరిటీ గార్డులుగా మారిపోయారు. వ్యవసాయం మీదే ఆధారపడి కూలీలుగా బతికే బహుజనులదీ అదే దారయింది! (క్లిక్: ఇప్పటికీ నేర్వని ఆహార పాఠాలు) - షేక్ కరిముల్లా వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు -
'170 ఏళ్లయినా వారికది సాధ్యం కాదు'
మహిళలు, పురుషులతో సమానంగా పోటీపడుతున్నారు. అన్ని రంగాల్లో తమదైన శైలిలో దూసుకెళ్తున్నారు. ఆర్థిక సమానత్వం పొందడాన్ని కూడా మహిళలు ఛాలెంజింగ్గా తీసుకుంటున్నారని వార్తలొచ్చాయి. కానీ 170 ఏళ్లైనా పురుషులతో సమానంగా మహిళలు ఆర్థిక సమానత్వం సాధించలేరని డబ్ల్యూఈఎఫ్ తేల్చేసింది. యాన్యువల్ జెండర్ గ్యాంప్ ఇండెక్స్ పేరుతో మంగళవారం విడుదల చేసిన రిపోర్టులో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఈ విషయాలు వెల్లడించింది. ఉద్యోగాల్లో, సంపాదనల్లో స్త్రీ, పురుషుల మధ్య ఉన్న తేడాలు తగ్గడం గతేడాది నుంచి నెమ్మదించాయని డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది. 2186 ఏడాది వచ్చినా స్త్రీ, పురుషులు ఆర్థిక సమానత్వం పొందరని ఈ రిపోర్టు తేల్చింది. ఈ రిపోర్టు అంచనాలు, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ రిపోర్టు వెలువరించామని, ఆర్థిక సమానత్వం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని డబ్ల్యూఈఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ సాహిదా జాహిది తెలిపారు. 144 దేశాలతో రూపొందిన ఈ రిపోర్టులో ఐస్ల్యాండ్, ఫిన్ల్యాండ్లు ముందజంలో ఉన్నాయని పేర్కొన్నారు. యెమెన్, సిరియా, సౌదీ అరేబియా, ఇరాన్ దేశాలు ఈ ప్రొగ్రెస్లో కిందస్థానంలో ఉన్నట్టు డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. విద్య, ఆరోగ్యం, ఆర్థికావకాశాలు, రాజకీయ సాధికారిత, జీవానోపాధి వంటి అంశాలతో దేశాలు ఏ మేరకు అభివృద్ధి సాధించాయో లెక్కించామని వివరించారు. రాజకీయ సాధికారిత తేడాను ప్రస్తావించిన డబ్ల్యూఈఎఫ్, అమెరికాలో జరుగబోతున్న ఎన్నికల్లో మొదటి మహిళా అధ్యక్షురాలుగా హిల్లరీ క్లింటన్ విజయం సాధించబోతున్నారని తెలిపింది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటనే ముందజలో ఉన్నట్టు పేర్కొంది. రాజకీయ సాధికారితలో అమెరికా 73వ స్థానంలో నిలిచింది. రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో స్త్రీ, పురుషుల మధ్య ఉన్న తేడాను బట్టి ఈ గణాంకాలను వివరించింది. గ్లోబల్గా పొలిటికల్ జెండర్ గ్యాప్ నెమ్మదిగా తొలుగుతుందని, ఈ తేడా మెరుగుపడుతున్నట్టు తెలిపింది. మొత్తం 391 పేజీల రిపోర్టుతో డబ్ల్యూఈఎఫ్ ఈ రిపోర్టును రూపొందించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
హైదరాబాద్ లో బీర్లు కరువు
ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement