breaking news
EC Rajesh lakhani
-
ఎన్నికల ఖర్చు రూ.210 కోట్లు
* ప్రచారానికి రూ.25 కోట్లు * అభ్యర్థుల ఖర్చులపై దృష్టి * 19 లోపు లెక్కల సమర్పణకు ఆదేశం * తిరుప్పర గుండ్రం స్థానం ఖాళీ * ఈసీ రాజేష్ లఖాని సాక్షి, చెన్నై: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఖర్చు రూ.210 కోట్లుగా ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖానీ ప్రకటించారు. అవగాహన కార్యక్రమాలు, ప్రచారాలకు రూ.25 కోట్లు ఖర్చు పెట్టినట్టు వివరించారు. ఇక ఎన్నికల బరిలో నిలబడ్డ అభ్యర్థులు తమ ఖర్చుల్ని జూన్ 19వ తేదీలోపు సమర్పించాలని ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కొత్త ప్రభుత్వంగా మళ్లీ అమ్మ జయలలిత అధికార పగ్గాలు చేపట్టారు. 234లో రెండు నియోజకవర్గాలకు మాత్రం ఎన్నికల పర్వం వాయిదాలతో సాగుతూ వస్తున్నది. ఈ పరిస్థితుల్లో ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే శీని వేల్ మరణంతో తిరుప్పర గుండ్రం ఖాళీ అయింది. దీంతో రాష్ర్టంలో ఎన్నికల కోసం మూడు నియోజకవర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల విజయవంతానికి, ఎన్నికలకు పెట్టిన ఖర్చుల వివరాలను మీడియా దృష్టికి రాజేష్ లఖానీ సోమవారం తీసుకొచ్చారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిశాయని వివరించారు. ఎన్నికల ఖర్చు రూ.210 కోట్లుగా ప్రకటించారు. ఇందులో రూ.25 కోట్లను ఓటింగ్ ప్రచార, అవగాహన కార్యక్రమాలకు వెచ్చించామని వివరించారు. ఓటింగ్ శాతం తగ్గుముఖంపై పరిశీలన జరుపుతున్నామని, పోలింగ్బూత్ల వారీగా, కేంద్రాల వారీగా ఈ ప్రక్రియ సాగుతున్నదని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో ఓటింగ్ తగ్గేందుకు గల కారణాలు, పరిస్థితులను సైతం అధ్యయనం చేస్తున్నామన్నారు. ఇప్పటికే తంజావూరు, అరవకురిచ్చి ఎన్నికల వాయిదాకు సంబంధించి ప్రభుత్వ గెజిట్లో స్పష్టంగా ప్రకటించి ఉన్నామని గుర్తు చేశారు. శీని వేల్ మరణంతో తిరుప్పర గుండ్రం ఖాళీ అయిందని పేర్కొంటూ, ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి ఉన్నామన్నారు. ఈ మూడు నియోజకవర్గాలకు ఒకే సారిగా ఎన్నికలు జరిపేందుకు తగ్గ చర్యలు కేంద్ర కమిషన్ త్వరలో చేపడుతుంద ని చెప్పారు. వంద శాతం ఓటింగ్ లక్ష్యంతో తాము ముందుకు వెళ్లామని, అయితే పరిస్థితులు అనుకూలించ లేదని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో వంద శాతం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా ఫ్లయింగ్ స్క్వాడ్ , నిఘా బృందాలు జరిపిన తనిఖీ ల్లో రూ.115 కోట్ల మేరకు పట్టుబడ్డాయని వివరించారు. ఇందులో లెక్కలు, ఆధారాలు చూపించడంతో రూ.47 కోట్లను వెనక్కు ఇచ్చామన్నారు. మిగిలిన సొమ్ము ట్రెజరీలో ఉన్నదని, ఈ సొమ్ము తమదేనని లెక్కలు చూపించి తీసుకె ళ్లేందుకు ఇంత వరకు ఎవ్వరూ రాలేదని తెలిపారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల మీద దృష్టి కేంద్రీకరించి ఉన్నామని పేర్కొన్నారు. ఇందుకు తగ్గ వివరాలు తమ వద్ద ఉన్నాయని, ఎన్నికల పర్యవేక్షకులు ఇచ్చిన వివరాలను, అభ్యర్థులు ఇచ్చే వివరాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయన్నారు. అభ్యర్థులు తమ ఖర్చుల వివరాలను జూన్ 19వ తేదీలోపు ఎన్నికల కమిషన్కు సమర్పించాలని ఆదేశించారు. ఇందుకు తగ్గ ఉత్తర్వులు ఎన్నికల బరిలో నిలబడ్డ అభ్యర్థులందరికీ పంపించి ఉన్నామని తెలిపారు. -
వాట్సాప్.. హ్యాట్సాప్!
తొలిరోజు 600 ఫిర్యాదులు పరిష్కారానికి చర్యలు ఓటింగ్ అవగాహనలో లఖాని ఈసీకి వ్యతిరేకంగా వర్తకుల నిరసన సాక్షి, చెన్నై: వాట్సాప్ ఫిర్యాదులకు ఈసీ శ్రీకారం చుట్టిన కొన్ని గంటల్లో వందలాది ఫిర్యాదులు వచ్చి చేరాయి. వీటిని పరిశీలించి, చర్యలు తీసుకునే పనిలో ఎన్నికల యంత్రాంగం మునిగింది. ఇక, ఓటింగ్ హక్కు కల్గిన విద్యార్థులకు అవగాహన తరగతులకు ఈసీ రాజేష్ లఖానీ మంగళవారం శ్రీకారం చుట్టారు. ఇక, ఎన్నికల పేరిట సాగుతున్న తనిఖీలు తమకు సంకటంగా మారాయంటూ వర్తకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెన్నై జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు నెలలు సమయం ఉన్నది. ఓ వైపు రాజకీయ పక్షాలు ఇంటర్వ్యూల పర్వాన్ని ముగించి అభ్యర్థుల ఎంపిక బిజీలో పడ్డాయి. పొత్తు, సీట్ల పందేరాల్ని వేగవంతం చేసి, ప్రచార బాటకు కార్యచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక, మరో వైపు రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేసింది. శిక్షణ తరగతులు, ఈవీఎంల పరిశీలన, కోడ్ కూయడంతో నిబంధనల ఉల్లంఘించే వారి భరతం పట్టే విధంగా ముందుకు సాగుతున్నది. ఈ పరిస్థితుల్లో ఫిర్యాదుల స్వీకరణకు వాట్సాప్ నంబర్ను ఈసీ రాజేష్ లఖానీ ప్రకటించడంతో కోడ్ ఉల్లంఘనలకు సంబంధించిన వ్యవహారాలతో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తొలి రోజు ఆరు వందల ఫిర్యాదులు రావడంతో, వాటిని పరిశీలించి, చర్యలు తీసుకునే పనిలో ఎన్నికల వర్గాలు నిమగ్నం అయ్యాయి. ఇక, ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్ల నేతృత్వంలో రాజకీయ పక్షాలతో సమావేశాలు సాగుతున్నాయి. చెన్నై కలెక్టర్ గోవిందరాజ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో నగరంలో గోడ ప్రచారాలకు అడ్డుకట్ట వేస్తూ రాజకీయ పక్షాలకు సూచనలు సలహాలు ఇచ్చారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్న హెచ్చరికలు ఇచ్చి ఉన్నారు. ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రజలకు ఇబ్బంది కల్గే విధంగా, అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తే తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇక, రాష్ట్రంలో కొత్త ఓటర్లకు అవగాహన కల్పించే విధంగా ప్రత్యేక శిక్షణా శిబిరాలకు ఈసీ రాజేష్ లఖాని శ్రీకారం చుట్టారు. 18 సంవత్సరాలు నిండి, ఓటు హక్కు కల్గి ఉన్న విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ఆవడిలోని ఓ విద్యా సంస్థలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా మీడియాతో రాజేష్ లఖాని మాట్లాడుతూ, కోడ్ ఉల్లంఘనలపై తీవ్రంగా స్పందిస్తున్నామని పేర్కొన్నారు.వాట్సాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల్ని పరిశీలించి, తక్షణం చర్యలకు ఆదేశించడం జరిగిందన్నారు. జిల్లాల్లో రాజకీయ పక్షాలతో సమావేశాలు సాగుతున్నాయని, కోడ్ ఉల్లంఘన,తనిఖీలు, భద్రతా పరంగా చర్యల్లో ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు ప్రత్యేక కార్యచరణతో ముందుకు సాగుతున్నారన్నారు. విద్యార్థులకు ఓటు విలువను తెలియజేస్తూ అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, ఈ సారి ఓటింగ్ శాతం పెంపు లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈసీకి వ్యతిరేకత : నగదు బట్వాడా అడ్డుకట్ట లక్ష్యంగా రాష్ట్రంలో తనిఖీలు ముమ్మరం చేసి ఉన్న విషయం తెలిసిందే.ఈ తనిఖీలు తమకు సంకటం సృష్టిస్తున్నాయని వర్తకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వస్తువుల కొనుగోళ్లకు నగదు తీసుకు వెళ్ల లేని పరిస్థితి ఉందని, వసూళ్లకు వెళ్లి వచ్చే సిబ్బందిని తనిఖీల పేరిట అడ్డుకుని, నగదు స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. తమకు తనిఖీల్లో మినహాయింపులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వర్తక సమాఖ్య నేత విక్రమ రాజ నేతృత్వంలో వర్తకులు చెన్నై కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.