breaking news
Dwarf stars
-
భారీ తారల... రుజువులు చిక్కాయి
భారీ తారలు. మన సూర్యుని కంటే ఏకంగా పది వేల రెట్లు పెద్దవి! పైగా నిన్నా మొన్నటికి కూడా కావవి! తొలి విస్ఫోటం (బిగ్ బ్యాంగ్) జరిగిన కొన్ని కోట్ల ఏళ్ల వ్యవధిలోనే పుట్టుకొచ్చాయి. అంటే అతి పురాతన నక్షత్రాలన్నమాట. ఇలాంటివి ఈ అనంత విశ్వంలో ఉన్నాయనింతకాలం సైంటిస్టులు అనడమే తప్పించి ఇదమిత్థంగా తేల్చిచెప్ దాఖలాలు మాత్రం లేవు. అలాంటి తొలినాళ్ల భారీ తారల ఉనికికి సంబంధించి పక్కా రుజువులను మానవాళి తాలూకు అతి పెద్ద అంతరిక్ష నేత్రం జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా ఒడిసిపట్టింది..!దొరికాయిలా...ఈ భారీ తారలను రాకాసి నక్షత్రాలుగా సైంటిస్టులు ముద్దు పిలుచుకుంటూ ఉంటారు. వాటి పరిమాణే అందుకు కారణం. సూర్యునితో పోలిస్తే అవి కనీసం 1,000 నుంచి 10,000 రెట్లు పెద్దవి మరి! జీఎస్ 3073 అనే అతి సుదూర నక్షత్ర మండలంలోని రసా యనిక అవశేషాలను జేమ్స్ వెబ్ తాజాగా పట్టించింది. వాటిని అనంతరం ఈ రాకాసి తారల ఉనికిని సైంటిస్టులు అసందిగ్ధంగా నిర్ధారించారు.పురాతన క్రిష్ణ బిలాలకూ మూలమివేసృష్టి ఆవిర్భావం జరిగిన కొన్ని కోట్ల ఏళ్లకే అతి భారీ కృష్ణ బిలాలు ఊపిరి పోసుకున్నాయి. ఇందుకు ఎన్నో రుజువు కూడా దొరికాయి. అదెలా సాధ్యపడిందీ అనే సందేహా లకు కూడా ఈ తొలినాళ్ల రాకాసి తారల ఉనికితో సమా దానం దొరికినట్టయింది.ఇలా అధ్యయనం..తొలి తరల ఉనికి కోసం సెంటర్ ఫర్ ఆస్ట్రో ఫిజిక్స్, హార్వర్డ్, స్మిత్సోని యన్, యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్ మౌత్ సంయుక్తంగా పరిశోధన చేపట్టాయి. ఇందుకో సం తొలుత జీఎస్ 3073 నక్షత్ర మండలంలోని నైట్రోజన్ – ఆక్సిజన్ నిష్పత్తిని అవి లెక్కగట్టి 0.46గా తేల్చాయి. సాధారణ తారలతో కూడిన గెలాక్సీల్లో ఇంతటి నిష్పత్తి అక్షరాలా అసాధ్యం. జీఎస్ 3073లో వందలాది కోట్ల ఏళ్ల క్రితమే భారీ, అంటే రాకాసి తారలు మనుగడ సాగించాయని దీన్నిబట్టి వర్సిటీల బృందం తేల్చింది. ‘తొలినాళ్ల రాకాసి తారలు నిజమేనా అని 20 ఏళ్లుగా నెలకొన్న సందిగ్ధానికి ఈ అధ్యయనం తెర దించింది. ఇందుకు సంబంధించిన తొలి పక్క రుజువులు జీఎస్ 3073లో చిక్కాయి‘ అని అధ్యయన బృంద సారథి డానియల్ వాలెన్ హర్షం వెలిబుచ్చారు. వీటిని తొలి తరం తారలుగా ఆయన అభివర్ణించారు. ఈ ఆసక్తికర అధ్యయన ఫలితాలను ఆస్ట్రో ఫిజికల్ జర్నల్ లెటర్స్ లో ప్రచురించారు.కొసమెరుపుజీఎస్ 3037 గెలాక్సీ కేంద్ర స్థానంలో ప్రస్తుతం సూపర్ నోవాలను కూడా తలదన్నే అతి భారీ కృష్ణబిలం ఉందట. అది బహుశా కచ్చితంగా తొలి తరం రాకాసి తార తాలూకు రూపాంతరమే అయి ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
సౌర వ్యవస్థ ఆవల మరో గ్రహం
బోస్టన్: మన సౌర వ్యవస్థ ఆవల మరో కొత్త గ్రహాన్ని నాసా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ గ్రహం మనకు సుమారు 53 కాంతి సంవత్సరాల దూరంలో సూర్యుడి మాదిరి ప్రకాశవంతమైన ఓ మరుగుజ్జు నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు గుర్తించారు. మన సౌర వ్యవస్థ ఆవల ఉన్న గ్రహాల కోసం అన్వేషణ సాగిస్తున్న టెస్ (ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్) సాయంతో ఈ గ్రహాన్ని కనుగొన్నారు. గతేడాది ఏప్రిల్లో ఈ శాటిలైట్ లాంచ్ చేయగా.. ఇప్పటివరకు మన సౌర వ్యవస్థ ఆవల 3 గ్రహాలను కనుగొంది. తాజా గ్రహం పేరు హెచ్డీ 21749బీ కాగా.. పై మెన్సె బీ, ఎల్హెచ్ఎస్ 3844బీ ఇంతకుముందు కనుగొన్న మరో 2 గ్రహాలు. ఈ 3 గ్రహాల్లోకెల్లా ప్రస్తుత గ్రహమే అధిక కక్ష్య కాలాన్ని కలిగి ఉంది. ఈ గ్రహం మరుగుజ్జు నక్షత్రం చుట్టూ పరిభ్రమించడానికి 36 రోజుల సమయం తీసుకుంటుంది. సూపర్ ఎర్త్గా భావించే ‘పై మెన్సె’గ్రహం తన నక్షత్రం చుట్టూ పరిభ్రమించడానికి 6.3 రోజుల సమయం తీసుకుంటుండగా.. ఎల్హెచ్ఎస్ 3844బీ తన నక్షత్రం చుట్టూ పరిభ్రమించడానికి 11 గంటల సమయమే తీసుకుంటుంది. తాజా గ్రహంపై ఉష్ణోగ్రత 300 డిగ్రీల ఫారెన్హీట్ ఉన్నట్లు తెలిపారు. ప్రకాశవంతమైన నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాల్లోకెల్లా తక్కువ ఉష్ణోగ్రత కలిగిన గ్రహం ఇదేనని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పోస్ట్ డాక్టరోల్ డయానా చెప్పారు. భూమి కంటే ఈ గ్రహం సైజు 3 రెట్లు ఎక్కువ కాగా.. బరువులో 23 రెట్లు ఎక్కువగా ఉందని తెలిపారు. అయితే ఈ గ్రహం నివాసయోగ్యమైనది కాకపోవచ్చని అన్నారు. మరో గ్రహానికి సంబంధించిన ఆనవాళ్లనూ పరిశోధకులు కనుగొన్నారు. ఒకవేళ దీన్నీ ధ్రువీకరించినట్లయితే టెస్ కనుగొన్న భూమి ఆకారంలో ఉన్న మొదటి గ్రహం ఇదే కానుంది. -
సూర్యుడికి ఆవల నీటి మేఘాలు!
మన సౌరకుటుంబంలో నీటి మేఘాలు ఆవరించి ఉన్నది ఒక్క భూగోళంపై మాత్రమే. సౌరకుటుంబం ఆవల అచ్చం భూమిలాంటి గ్రహాలు మూడునాలుగు ఉన్నాయని కనుగొన్నా.. వాటిపై నీటిమేఘాలు ఆవరించి ఉన్నాయా? లేదా? అన్నది మాత్రం ఇప్పటిదాకా స్పష్టంగా తెలియలేదు. అయితే.. మన కు 7.3 కాంతి సంవత్సరాల దూరంలో గ్రహానికి ఎక్కువ.. నక్షత్రానికి తక్కువ అయిన ఓ మరుగుజ్జు నక్షత్రం(బ్రౌన్ డ్వార్ఫ్)పై మన భూమిలాగే నీటి మేఘాలు ఉన్నాయట. ఇలా సౌరకుటుంబం ఆవల నీటిమేఘాలను కనుగొనడం ఇదే తొలిసారని అమెరికాలోని వాషింగ్టన్కు చెందిన కార్నెగీ ఇన్స్టిట్యూషన్ ఫర్ సైన్స్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. సాధారణంగా బూడిదరంగు మరుగుజ్జు నక్షత్రాలు గురుగ్రహం కన్నా 15-75 రెట్లు పెద్దగా ఉంటాయని, ‘వైజ్ జే0855-0714’ అనే ఈ నక్షత్రం గురుగ్రహం కన్నా 10 రెట్లు పెద్దగా ఉందని వారు అంచనా వేశారు. ఇప్పటిదాకా కనుగొన్న అన్ని బ్రౌన్ డ్వార్ఫ్లలో అత్యంత చల్లనిది కూడా ఇదేనట. ఇలాంటి మరుగుజ్జు నక్షత్రాలకు అటు నక్షత్రం పోలికలు ఉన్నా.. కేంద్రభాగంలో కేంద్రక సంలీన చర్యలు జరగవు. ఇటు గ్రహం పోలికలు ఉన్నా.. గ్రహాల కన్నా ఎన్నో రెట్లు పెద్దగా ఉండటం వల్ల వీటిని విఫల నక్షత్రాలుగా పిలుస్తారు.


